కర్తవ్యాచరణ
మనం ఈలోకంలో ఎందుకు జన్మించామో, ఎందుకు పరమాత్మను చేరుకోవాలో, ఎలా ఈప్రకృతిలో వివిధ అజ్ఞానభూమికలలో ఉన్నామో తెలుసుకున్న తర్వాత, మన జీవితలక్ష్యమైన పరమాత్మను చేరుకోవటానికి మార్గదర్శకులైన వారిని, అదే సద్గురువుని ఆశ్రయించాల్సిన అవుసరం గురించి తెలుస్తుంది. అప్పుడు యోగ్యుడైన సద్గురువునాశ్రయించి, ఉపదేశాదులుపొంది, అజ్ఞానాన్ని తొలగించు కొని, సప్తవిధభూమికలు కలిగిన జ్ఞానాన్నిపొంది, సద్గురువు పర్యవేక్షణలో పరబ్రహ్మస్వరూపాన్ని అనుభవములోనికి తీసుకోనివచ్చే యోగాన్నిప్రారంభించి, జ్ఞానాన్ని, యోగాన్ని, అనుభవాన్ని అను సంధానించుకొనుచూ, ఆత్మసాక్షాత్కారాన్ని పొంది సమాధ్యవస్థను పొందుతాము. ఈవిషయమై మహానుభావులు, సనాతనులు చెప్పిన విషయాలను తెలుసుకుందాము. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇవ్వడమైనది.
సద్గురునాశ్రయము:
అద్వయతారకోపనిషత్:
9. గురురేవ పరబ్రహ్మ, గురురేవ పరాగతిః, గురురేవ పరావిద్యా, గురురేవ పరాయణం, గురురేవ పరాకాష్ఠా, గురురేవ పరంధనం, యస్మాత్తదుపదేష్ఠా, సౌ తస్మాత్ గురుతరో గురుః||
గురువే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమును చేరుత్రోవ గురువే. ఆ చేరుటకు కావలిసిన జ్ఞానము గురువే. ఆ చేరుట అనే ప్రక్రియకూడ గురువే. దానికి కావలసిన సాధనసంపత్తి కూడ గురువే. ఈ విధముగా ఉపదేశికులైన మీరు గురువులలోకెల్ల సద్గురువులు.
ముండకో పనిషత్:ప్రధమ ముండకం:ద్వితీయఖండం:
12, 13: బ్రహ్మజ్ఞాని కర్మచే ప్రాప్తించు లోకముల యొక్క తారతమ్యములను పరీక్షించి తెలుసుకొని, మోక్షము కర్మలచేత లభించదని గ్రహించి, వైరాగ్యమును పొంది, బ్రహ్మము నెరుంగుటకై, సమిధలు హస్తమునందు గలవాడై, శ్రోత్రీయుడును, బ్రహ్మనిష్ఠుడునునగు గురువును నాశ్రయింపవలెను. ఆ ప్రకారముగా గురువును చేరినట్టి శాంతశమదమాదిసద్గుణములు కల శిష్యునకు ఆగురువు అక్షరము ను, సత్యమును అగు పరమాత్మను తెలిసికొనుటకు సాధన రూపమగు బ్రహ్మవిద్యను యుపదేశించ వలెను. (ఇక్కడ మొదట శిష్యుడు ఎలా తన్ను తాను తయారుచేసుకోవాలో, ఎటువంటి గుణములు, ఆలోచనలు, భావాలు కలిగియుండాలో విశదీకరీంచారు. మొదట ఎవరికివారు, నేను ఏమిచేస్తున్నాను? నేను చేసే వాటికి ఫలితమేమిటి? నేను చేసేది నాకు కావలిసినది ఇస్తుందా? అని ప్రశ్నించుకోవాలి. ఇంకా నాకు నిజంగా కావాల్సినదేమిటి? అందుకు నేను త్రికరణశుద్ధిగా ప్రయత్నంచేస్తున్నానా? అనికూడా ప్రశ్నించుకోవాలి. అప్పుడు నిజంగా బ్రహ్మజ్ఞానులవ్వాలి అనే కోరిక వుంటే, మనం చేసే భౌతికకర్మలు, జప, దాన, యజ్ఞ, వాపీకూపతటాకాది నిర్మాణాలు, ఫలితాన్నిఆశించి చేసే కర్మలు, పనులు ద్వారా పరబ్రహ్మాన్ని తెలుసుకోలేము, అవి మోక్షాన్ని ఇవ్వలేవు అని తెలుస్తుంది. అప్పుడు మనకు నిజంగా ఈ ప్రపంచంపట్ల, అందులో మనం చేసే పనులపట్ల విరక్తి, వైరాగ్యం వస్తుంది. సరిగ్గా ఈవిషయాన్నే శ్రీ ఆది శంకరాచార్యులవారు బ్రహ్మసూత్రాలలొని మొదటిసూత్రములోనే మనకుచెప్పారు. "అథాతోబ్రహ్మ జిజ్ఞాసా" అంటే "పిమ్మట, కాబట్టి, బ్రహ్మమును తెలిసికోనుటకు కోరిక". వెంటనే మనకు ప్రశ్నలు రావాలి. దేని పిమ్మట? ఎందుక్కాబట్టి? సమాధానం ఏమిటంటే, వివేకాదిసాధనసంపత్తి సిద్ధించిన 'పిమ్మట', కర్మఫలం అనిత్యమైనదని, జ్ఞానఫలమైన 'మోక్షం' శాశ్వతమైనదని తెలిసినది 'కాబట్టి' ముముక్షువైన వాడు బ్రహ్మమును తెలుసుకొనుటకు కోరాలి. దీనివల్ల మనకు తెలిసే దేమిటంటే, మనం పరబ్రహ్మను తెలుసుకొని, మోక్షాన్ని పొందుటకు సద్గురువు దగ్గరకు వెళ్ళేముందే, మనల్ని మనం సంస్కరించుకోవాలి, సన్నద్ధపరచుకోవాలి, పవిత్రీకరించుకోవాలి, శుద్ధమనస్కులవ్వాలి, మనం దేన్ని కోరుకుంటున్నామో నిర్దుష్టంగా తెలుసుకోవాలి, (ఇప్పటి భాషలో చెప్పాలంటే, clear goal fix చేసుకోవాలి), దానికోసం, నీళ్ళల్లో మునిగిపోయినవాడు ఊపిరికోసం ఎలా కొట్టుకుంటాడో. ఒడ్డున పడ్డ చేప నీళ్ళ కోసం ఎలా కొట్టుకుంటుందో, అల్లా పరితపించాలి. (ఇప్పుడు మనకి మనం ప్రశ్నించుకుందాం. మనం ఎప్పుడైనా అల్లా పరమాత్మకోసం పరితపించామా?) ఇటువంటి అవస్థను అనుభవిస్తే, అప్పుడు మనకి సద్గురువు అవుసరం కనపడుతుంది. అప్పుడు మనం సద్గురువు కోసం వెతకాలి. అంతేగాని, ఏదైనా క్షణకాలబాధ కలిగినప్పుడో, ఏదైనా పుస్తకంలోని రెండువాక్యాలు చదివినప్పుడో, ఎవరిదైనా ఉపన్యాసంలో రెండువాక్యాలు విన్నప్పుడో, క్షణికోద్రేకానికిలోనయి, నాకు అర్జెంటుగామోక్షంవచ్చెయ్యాలి, అర్జెంటుగా సమాధి వచ్చెయ్యాలి, గురువుకావాలి, గురువు, గురువు అంటూ పరుగులు పెడితే సద్గురువులు దొరకరు. ఒకవేళ దగ్గరలోవున్నా, నిర్మలమనస్సులేని మనకు తెలియరు. కాబట్టి నిజంగా పరబ్రహ్మను తెలుసుకోవాలని కోరిక వున్నప్పుడు, దానికి తగిన విధంగా మనలను మనం సన్నద్ధ పరచుకొని, సద్గురువు కోసం వెతికితే, తప్పని సరిగా లభిస్తారు. ఇంకా చెప్పాలంటే, 'ఒక యోగి ఆత్మకధ' లో లాగా, శ్రీపరమహంస యోగానందగారికోసం శ్రీయుక్తేశ్వరగిరిగారు వచ్చినట్లు ఆసద్గురువే శిష్యుని వెతుక్కుంటూ వస్తారు. ఏ మాత్రము అధైర్యపడనవుసరం లేదు. శ్రీగురుమండలి అలా కల్పించగలదు.)
పైంగలోపనిషత్:పంచమాధ్యాయము:
మొట్టమొదట శమదమాది సద్గుణములతో, సద్గురువు తన శిష్యుని పరిశుద్ధునిగా చేయవలెను. ఆపిమ్మట, ఈసర్వము బ్రహ్మమనియు,శిష్యుని నీవుపరిశుద్ధుడవనియు బోధనచేయవలెను. అజ్ఞునకు (అధికారములేనివానికి) సర్వముబ్రహ్మమే అని ఎవడుచెప్పునో, అతడు ఆయజ్ఞుని వలన మహానరకము లోనికి త్రోయబడును. (ఇక్కడ మనం ఒకవిషయాన్ని బాగా అర్థం చేసు కోవాలి. అసలు గురువుదగ్గరకు వెళ్ళేటప్పటికే, మనలని మనం సంస్కరించుకొని వుండాలి. అలాచేసుకొని ఉన్నప్పటికీ, ఏమాత్రంగా నైనా సందేహాలు గాని, సంశయాలుగాని, అజ్ఞానముగాని ఉన్నచో, గురువు వాటిని పోగొట్టి శిష్యుని పరిశుద్ధుణ్ణిచేయాలి. ఎందుకంటే, విత్తనం మొలకెత్తాలంటే, భూమిని బాగాదున్ని, రాళ్ళురప్పలు ఏరివేసి చదును చేయాలికదా! అలా పరిశుద్దుడుకాని శిష్యుని మనస్సులో గురువు ప్రభోధించే పరబ్రహ్మ విషయాలు లోతుగా నాటుకోవు. తర్వాత అనుభవానికిరావు. అలాలేని శిష్యుడు బయట ఏదైనా తప్పుగా చెపితే, ఆదోషం గురువుకి వెడుతుంది. ఎవరైనా ఏదైనాతప్పుగా చెపితే, వెంటనేమనం, ఈవిషయం ఎవడు చెప్పాడురా? అంటాము. తత్ఫలితంగా గురువు తనస్థానంనుండి దిగజారి అధోగతి పాలవుతాడు. అందు వల్ల అధికారం ఆంటే అర్హతవున్న శిష్యునికే పరబ్రహ్మవిషయాలు ప్రభోదించాలి. అలాకాని పక్షంలో మొదట శిష్యునికి అర్హత వచ్చేలా చేసి ఆ తర్వాతే మిగతా విధానం లోనికి వెళ్ళాలి. లేకపోతే శిష్యుడు పైకి వెళ్ళడం అటువుంచి, గురువు అధోగతి పాలవుతాడు.)
కావున ఎవనిబుద్ధి ప్రబుద్ధమైనదో, ఎవనికి భోగేచ్చ నశించియున్నదో, ఎవనికి ఆశలుపోయినవో, అట్టివానికి ప్రాజ్ఞుడగు గురువు, అవిద్య, మాయ, లేనతనికి, వేదాంతబోధ చేయవలెను. దీపమున్నప్పుడే ప్రకాశమునకు ఉనికి కలదు. సూర్యుడున్నప్పుడే దీపమునకు సత్తయుండును. చిత్ సత్తయే జగత్తునకు సత్త అయివున్నది. జ్ఞానదృష్టి కలిగినప్పుడు, జ్ఞానోదయమైనపుడు, స్వస్థచిత్తుడవై నాయొక్క వాక్ దృష్టి (బోధ) యొక్క బలాబలములను నీవు గ్రహించగలవు. ఆ విద్య వలననే, సర్వదోషాప హారిణియగు విద్య (ఆత్మజ్ఞానము)ప్రాప్తించును. జ్ఞానోదయముతో నేను, నాది అను స్వార్థబుద్ధి నశించి ఉత్తమ పురుషార్థము లభించును. శుద్దాంతః కరణ యందే ఆత్మకార వృత్తినశించును.
యోగవాశిష్ఠము:నిర్వాణప్రకరణము:ఉత్తరభాగము: ఆఖరిసర్గ:
22, 23: పరమపురుషార్థ (మోక్ష) ప్రదమగు ఆత్మజ్ఞానమునుపదేశించిన గురువుయొక్క యట్టి మహోపకారమునకు దగిన ప్రత్యుపకారము నేకర్మచే శిష్యులు చేయగలరు? కాబట్టి మనోవాక్కాయ కర్మలచే శిష్యులు గురువునకు ఆత్మనివేదనము (తనను తాను గురుచరణములందు సమర్పించు కొనుట) గావింపవలెను. అదియే గురువులకు దగిన ప్రత్యుపకారము. అంతేకాని, మరియే ఇతర కర్మచేతను ప్రత్యుపకారము కానేరదు.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము.)
మనం ఈలోకంలో ఎందుకు జన్మించామో, ఎందుకు పరమాత్మను చేరుకోవాలో, ఎలా ఈప్రకృతిలో వివిధ అజ్ఞానభూమికలలో ఉన్నామో తెలుసుకున్న తర్వాత, మన జీవితలక్ష్యమైన పరమాత్మను చేరుకోవటానికి మార్గదర్శకులైన వారిని, అదే సద్గురువుని ఆశ్రయించాల్సిన అవుసరం గురించి తెలుస్తుంది. అప్పుడు యోగ్యుడైన సద్గురువునాశ్రయించి, ఉపదేశాదులుపొంది, అజ్ఞానాన్ని తొలగించు కొని, సప్తవిధభూమికలు కలిగిన జ్ఞానాన్నిపొంది, సద్గురువు పర్యవేక్షణలో పరబ్రహ్మస్వరూపాన్ని అనుభవములోనికి తీసుకోనివచ్చే యోగాన్నిప్రారంభించి, జ్ఞానాన్ని, యోగాన్ని, అనుభవాన్ని అను సంధానించుకొనుచూ, ఆత్మసాక్షాత్కారాన్ని పొంది సమాధ్యవస్థను పొందుతాము. ఈవిషయమై మహానుభావులు, సనాతనులు చెప్పిన విషయాలను తెలుసుకుందాము. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇవ్వడమైనది.
సద్గురునాశ్రయము:
అద్వయతారకోపనిషత్:
9. గురురేవ పరబ్రహ్మ, గురురేవ పరాగతిః, గురురేవ పరావిద్యా, గురురేవ పరాయణం, గురురేవ పరాకాష్ఠా, గురురేవ పరంధనం, యస్మాత్తదుపదేష్ఠా, సౌ తస్మాత్ గురుతరో గురుః||
గురువే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమును చేరుత్రోవ గురువే. ఆ చేరుటకు కావలిసిన జ్ఞానము గురువే. ఆ చేరుట అనే ప్రక్రియకూడ గురువే. దానికి కావలసిన సాధనసంపత్తి కూడ గురువే. ఈ విధముగా ఉపదేశికులైన మీరు గురువులలోకెల్ల సద్గురువులు.
ముండకో పనిషత్:ప్రధమ ముండకం:ద్వితీయఖండం:
12, 13: బ్రహ్మజ్ఞాని కర్మచే ప్రాప్తించు లోకముల యొక్క తారతమ్యములను పరీక్షించి తెలుసుకొని, మోక్షము కర్మలచేత లభించదని గ్రహించి, వైరాగ్యమును పొంది, బ్రహ్మము నెరుంగుటకై, సమిధలు హస్తమునందు గలవాడై, శ్రోత్రీయుడును, బ్రహ్మనిష్ఠుడునునగు గురువును నాశ్రయింపవలెను. ఆ ప్రకారముగా గురువును చేరినట్టి శాంతశమదమాదిసద్గుణములు కల శిష్యునకు ఆగురువు అక్షరము ను, సత్యమును అగు పరమాత్మను తెలిసికొనుటకు సాధన రూపమగు బ్రహ్మవిద్యను యుపదేశించ వలెను. (ఇక్కడ మొదట శిష్యుడు ఎలా తన్ను తాను తయారుచేసుకోవాలో, ఎటువంటి గుణములు, ఆలోచనలు, భావాలు కలిగియుండాలో విశదీకరీంచారు. మొదట ఎవరికివారు, నేను ఏమిచేస్తున్నాను? నేను చేసే వాటికి ఫలితమేమిటి? నేను చేసేది నాకు కావలిసినది ఇస్తుందా? అని ప్రశ్నించుకోవాలి. ఇంకా నాకు నిజంగా కావాల్సినదేమిటి? అందుకు నేను త్రికరణశుద్ధిగా ప్రయత్నంచేస్తున్నానా? అనికూడా ప్రశ్నించుకోవాలి. అప్పుడు నిజంగా బ్రహ్మజ్ఞానులవ్వాలి అనే కోరిక వుంటే, మనం చేసే భౌతికకర్మలు, జప, దాన, యజ్ఞ, వాపీకూపతటాకాది నిర్మాణాలు, ఫలితాన్నిఆశించి చేసే కర్మలు, పనులు ద్వారా పరబ్రహ్మాన్ని తెలుసుకోలేము, అవి మోక్షాన్ని ఇవ్వలేవు అని తెలుస్తుంది. అప్పుడు మనకు నిజంగా ఈ ప్రపంచంపట్ల, అందులో మనం చేసే పనులపట్ల విరక్తి, వైరాగ్యం వస్తుంది. సరిగ్గా ఈవిషయాన్నే శ్రీ ఆది శంకరాచార్యులవారు బ్రహ్మసూత్రాలలొని మొదటిసూత్రములోనే మనకుచెప్పారు. "అథాతోబ్రహ్మ జిజ్ఞాసా" అంటే "పిమ్మట, కాబట్టి, బ్రహ్మమును తెలిసికోనుటకు కోరిక". వెంటనే మనకు ప్రశ్నలు రావాలి. దేని పిమ్మట? ఎందుక్కాబట్టి? సమాధానం ఏమిటంటే, వివేకాదిసాధనసంపత్తి సిద్ధించిన 'పిమ్మట', కర్మఫలం అనిత్యమైనదని, జ్ఞానఫలమైన 'మోక్షం' శాశ్వతమైనదని తెలిసినది 'కాబట్టి' ముముక్షువైన వాడు బ్రహ్మమును తెలుసుకొనుటకు కోరాలి. దీనివల్ల మనకు తెలిసే దేమిటంటే, మనం పరబ్రహ్మను తెలుసుకొని, మోక్షాన్ని పొందుటకు సద్గురువు దగ్గరకు వెళ్ళేముందే, మనల్ని మనం సంస్కరించుకోవాలి, సన్నద్ధపరచుకోవాలి, పవిత్రీకరించుకోవాలి, శుద్ధమనస్కులవ్వాలి, మనం దేన్ని కోరుకుంటున్నామో నిర్దుష్టంగా తెలుసుకోవాలి, (ఇప్పటి భాషలో చెప్పాలంటే, clear goal fix చేసుకోవాలి), దానికోసం, నీళ్ళల్లో మునిగిపోయినవాడు ఊపిరికోసం ఎలా కొట్టుకుంటాడో. ఒడ్డున పడ్డ చేప నీళ్ళ కోసం ఎలా కొట్టుకుంటుందో, అల్లా పరితపించాలి. (ఇప్పుడు మనకి మనం ప్రశ్నించుకుందాం. మనం ఎప్పుడైనా అల్లా పరమాత్మకోసం పరితపించామా?) ఇటువంటి అవస్థను అనుభవిస్తే, అప్పుడు మనకి సద్గురువు అవుసరం కనపడుతుంది. అప్పుడు మనం సద్గురువు కోసం వెతకాలి. అంతేగాని, ఏదైనా క్షణకాలబాధ కలిగినప్పుడో, ఏదైనా పుస్తకంలోని రెండువాక్యాలు చదివినప్పుడో, ఎవరిదైనా ఉపన్యాసంలో రెండువాక్యాలు విన్నప్పుడో, క్షణికోద్రేకానికిలోనయి, నాకు అర్జెంటుగామోక్షంవచ్చెయ్యాలి, అర్జెంటుగా సమాధి వచ్చెయ్యాలి, గురువుకావాలి, గురువు, గురువు అంటూ పరుగులు పెడితే సద్గురువులు దొరకరు. ఒకవేళ దగ్గరలోవున్నా, నిర్మలమనస్సులేని మనకు తెలియరు. కాబట్టి నిజంగా పరబ్రహ్మను తెలుసుకోవాలని కోరిక వున్నప్పుడు, దానికి తగిన విధంగా మనలను మనం సన్నద్ధ పరచుకొని, సద్గురువు కోసం వెతికితే, తప్పని సరిగా లభిస్తారు. ఇంకా చెప్పాలంటే, 'ఒక యోగి ఆత్మకధ' లో లాగా, శ్రీపరమహంస యోగానందగారికోసం శ్రీయుక్తేశ్వరగిరిగారు వచ్చినట్లు ఆసద్గురువే శిష్యుని వెతుక్కుంటూ వస్తారు. ఏ మాత్రము అధైర్యపడనవుసరం లేదు. శ్రీగురుమండలి అలా కల్పించగలదు.)
పైంగలోపనిషత్:పంచమాధ్యాయము:
మొట్టమొదట శమదమాది సద్గుణములతో, సద్గురువు తన శిష్యుని పరిశుద్ధునిగా చేయవలెను. ఆపిమ్మట, ఈసర్వము బ్రహ్మమనియు,శిష్యుని నీవుపరిశుద్ధుడవనియు బోధనచేయవలెను. అజ్ఞునకు (అధికారములేనివానికి) సర్వముబ్రహ్మమే అని ఎవడుచెప్పునో, అతడు ఆయజ్ఞుని వలన మహానరకము లోనికి త్రోయబడును. (ఇక్కడ మనం ఒకవిషయాన్ని బాగా అర్థం చేసు కోవాలి. అసలు గురువుదగ్గరకు వెళ్ళేటప్పటికే, మనలని మనం సంస్కరించుకొని వుండాలి. అలాచేసుకొని ఉన్నప్పటికీ, ఏమాత్రంగా నైనా సందేహాలు గాని, సంశయాలుగాని, అజ్ఞానముగాని ఉన్నచో, గురువు వాటిని పోగొట్టి శిష్యుని పరిశుద్ధుణ్ణిచేయాలి. ఎందుకంటే, విత్తనం మొలకెత్తాలంటే, భూమిని బాగాదున్ని, రాళ్ళురప్పలు ఏరివేసి చదును చేయాలికదా! అలా పరిశుద్దుడుకాని శిష్యుని మనస్సులో గురువు ప్రభోధించే పరబ్రహ్మ విషయాలు లోతుగా నాటుకోవు. తర్వాత అనుభవానికిరావు. అలాలేని శిష్యుడు బయట ఏదైనా తప్పుగా చెపితే, ఆదోషం గురువుకి వెడుతుంది. ఎవరైనా ఏదైనాతప్పుగా చెపితే, వెంటనేమనం, ఈవిషయం ఎవడు చెప్పాడురా? అంటాము. తత్ఫలితంగా గురువు తనస్థానంనుండి దిగజారి అధోగతి పాలవుతాడు. అందు వల్ల అధికారం ఆంటే అర్హతవున్న శిష్యునికే పరబ్రహ్మవిషయాలు ప్రభోదించాలి. అలాకాని పక్షంలో మొదట శిష్యునికి అర్హత వచ్చేలా చేసి ఆ తర్వాతే మిగతా విధానం లోనికి వెళ్ళాలి. లేకపోతే శిష్యుడు పైకి వెళ్ళడం అటువుంచి, గురువు అధోగతి పాలవుతాడు.)
కావున ఎవనిబుద్ధి ప్రబుద్ధమైనదో, ఎవనికి భోగేచ్చ నశించియున్నదో, ఎవనికి ఆశలుపోయినవో, అట్టివానికి ప్రాజ్ఞుడగు గురువు, అవిద్య, మాయ, లేనతనికి, వేదాంతబోధ చేయవలెను. దీపమున్నప్పుడే ప్రకాశమునకు ఉనికి కలదు. సూర్యుడున్నప్పుడే దీపమునకు సత్తయుండును. చిత్ సత్తయే జగత్తునకు సత్త అయివున్నది. జ్ఞానదృష్టి కలిగినప్పుడు, జ్ఞానోదయమైనపుడు, స్వస్థచిత్తుడవై నాయొక్క వాక్ దృష్టి (బోధ) యొక్క బలాబలములను నీవు గ్రహించగలవు. ఆ విద్య వలననే, సర్వదోషాప హారిణియగు విద్య (ఆత్మజ్ఞానము)ప్రాప్తించును. జ్ఞానోదయముతో నేను, నాది అను స్వార్థబుద్ధి నశించి ఉత్తమ పురుషార్థము లభించును. శుద్దాంతః కరణ యందే ఆత్మకార వృత్తినశించును.
యోగవాశిష్ఠము:నిర్వాణప్రకరణము:ఉత్తరభాగము: ఆఖరిసర్గ:
22, 23: పరమపురుషార్థ (మోక్ష) ప్రదమగు ఆత్మజ్ఞానమునుపదేశించిన గురువుయొక్క యట్టి మహోపకారమునకు దగిన ప్రత్యుపకారము నేకర్మచే శిష్యులు చేయగలరు? కాబట్టి మనోవాక్కాయ కర్మలచే శిష్యులు గురువునకు ఆత్మనివేదనము (తనను తాను గురుచరణములందు సమర్పించు కొనుట) గావింపవలెను. అదియే గురువులకు దగిన ప్రత్యుపకారము. అంతేకాని, మరియే ఇతర కర్మచేతను ప్రత్యుపకారము కానేరదు.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము.)