జీవన్ముక్త స్థితి
ఎప్పుడైతే సద్గురువు పర్యవేక్షణలో సమాధినిష్టుడై, ఆత్మ సాక్షాత్కారము పొంది, చైతన్యభావాన్ని అనుభవిస్తూవుంటారో, అక్కడ నుండి అనుభవాలే తప్ప నిర్వచనాలు వుండవు. ఆస్థితిలో కొనసాగడం తప్ప వేరేయిక ఏవిధమైన ప్రక్రియ, ఉపాసన, జీవిక, వుండవు. జీవితమున్నంతకాలము జీవన్ముక్తస్థితి లో గడుపుచూ, ప్రాణావసరసమయములో ఉర్థ్వంగా ఉత్క్రమించి, ఈప్రాణాన్ని తృణప్రాయంగా విసర్జించి, జన్మజరామృత్యుచక్రం నుండి తప్పించుకొని, నేరుగా విదేహముక్తియుక్తంగా, పరబ్రహ్మస్వరూపంలో మమైక్యమగుట తప్ప ఇంకేమియు లేదు. దీనిగురించి చాలా తక్కువ సమాచారం దొరికింది. ఎందుకంటే పరబ్రహ్మ అయినవారు చెప్పడానికి క్రిందికి దిగిరారు కాబట్టి. కాని కొంతమంది మహాత్ములు, ఋషులు మనలాటి వారికోసం కొంత విషయాన్ని చెప్పారు. దానిని తెలుసుకుందాము.
బృహదారణ్యకోపనిషత్ ముక్తులు మూడు విధాలుగా చెప్పింది. 1.క్రమముక్తి: ఉపాసకుడు చని పోయిన పిమ్మట తన ఉపాసనాఫలంగా దేవయానమార్గాన బ్రహ్మలోకాన్ని చేరి, అచట కల్పాంతము వరకూ వుంటూ, కల్పాంతంలో ఆకార్యబ్రహ్మ(చతుర్ముఖ బ్రహ్మ)తో పాటు పరమాత్మయందు లీన మగుట. ఈదశ సాధారణంగా సాకారస్వరూపాన్ని అర్చించేవారికి, ఆసాకార స్వరూపముతొ సారూప్య, సామీప్యసాయుజ్యాలు పొందేవారికి వస్తుంది. ఆవిధానంలో కూడ ఒక విధమైన తాదాత్మ్యస్థితినిపొంది, ఆసాకారస్వరూపముతో అభేదస్థితిని సాధించినవారుమాత్రమే, ఆసాకారస్వరూపముతొపాటు పర బ్రహ్మలో లీనమవుతారు. అలా లేనివారు, కల్పాంతంలో అణుస్వరూపములో ఉండి, మళ్ళా సృష్టి ఏర్పడిన తర్వాత అర్హతనుబట్టి తగుజన్మను పొందుతారు. 2.జీవన్ముక్తి: బ్రహ్మజ్ఞానం కలిగినప్పటికీ, ప్రారబ్దకర్మవశాన లోకనుసారంగా వర్తిస్తూ అసంగుడై ఉండటం. (ఇక్కడ ఒకప్రశ్న వచ్చితీరాలి. కర్మఫలం దగ్దమైతేనేగాని బ్రహ్మజ్ఞానంరాదు కదా, ఇంకా ప్రారబ్దకర్మ ఏమిటి? అని. నిజానికి కర్మపాశవిముక్తి అయితేనే తప్ప బ్రహ్మజ్ఞానం రాదు. అప్పుడు కర్మలు, కర్మ ఫలితాలు పోతాయేగాని, ప్రారబ్దం వల్ల వచ్చిన జీవితంఅంతమవదు. అది మనచేతిలో లేదు. దానిని పూర్తిగా అనుభవించవలసినదే! కాబట్టి అది పూర్తి అయ్యేవరకు ఈప్రపంచంలోనే వుంటూ, దీనిపట్ల అసంగుడై, దీన్ని అంటుకోకుండా వుంటారు. వారు నిజంగాముక్తులే. కాని ఆప్రక్రియ దేహానంతరంకలుగుతుంది. అంతవరకూ వారు వేచి యుండాల్సిందే! దానినే జీవన్ముక్త దశ అంటారు.) 3.విదేహముక్తి: దేహపాతానంతరం కలిగే నిర్విశేష బ్రహ్మైక్యస్థితి. ఇప్పుడు మనం జీవన్ముక్తదశ గురించి, జీవన్ముక్తుల లక్షణముల గురించి పెద్దలు, మహానుభావులు ఏమి చెప్పారో తెలుసుకుందాము.
పైఙ్గలోపనిషత్: తృతీయాధ్యాయము:
'తత్త్వమసి', 'అహం బ్రహ్మస్మి' అను మహావాక్యముల అర్థమును విచారణచేయుట శ్రవణము. ఏకాంతములో పరమార్థమును(శ్రవణార్థమును)అనుసంధానము చేయుటమననము. శ్రవణమననము ల వలన సంశయరహితార్థమునందు ఏకాగ్రముగా మనస్సునిలిపి యుండుట నిధిధ్యాసనము. ధ్యాతృ ధ్యానములను త్యజించి, నివాసితదీపము రీతిగా ద్యేయైకగోచరమగు చిత్తమును కలిగియుండుటే సమాధి. అట్టి సమాధి సమయములో అనాదిసంసార సంచితములైయున్న కర్మరాసులన్నియు లయించిపోవును. పిమ్మట అభ్యాసబలమున సహస్రములుగా అమృతధారలు వర్షించును. అందు వలన యోగవేత్తలు సమాధిని 'ధర్మమేఘము' అని పలుకుదురు. (ఇక్కడ సద్గురువులు పోడూరి కృష్ణవేణుమాతాజీగారు చెప్పినటువంటి ఒక విషయం గుర్తుకువస్తోంది. గురువుగారు అప్పుడప్పుడు, అంగుడిలో పైనుండి ఏదో చుక్కలుగా పడుతోందిరా, నోరంతా తియ్యగా అవుతుందిరా, ఆరుచి చెప్ప లేమురా, అని చెప్పేవారు. దీనిని బట్టి శాస్త్రములలో చెప్పినటువంటి విషయాలు తప్పక అనుభవము లోనికి వస్తాయని తెలుస్తున్నది.) సమాధివలన సర్వవాసనలు నశించగా, కర్మసంచయము (పాప పుణ్యములు) సమూలముగా నశించిపోగా, వేదాంతవాక్యము కరతలామలకము రీతిగా, అపరోక్ష సాక్షాత్కారము సంభవించును. అప్పుడు ఆఆత్మజ్ఞాని జీవన్ముక్తుడగును.
మహోపనిషత్: ద్వితీయాధ్యాయము:జనకుడు శుకునితో చెప్పుచున్నాడు:
జ్ఞానవిస్తారమును, సారాంశములను విపులముగా చెప్పుచున్నాను. ఈవిషయములను అర్థము చేసికోన్నచో, జీవుడు వెంటనే జీవన్ముక్తదశను పొందుచున్నాడు. దృశ్యము లేనేలేదు అనెడు అత్మ జ్ఞానముతో మనస్సులో నున్న దృశ్యభావములను తుడిచివేసినచో తక్షణమే మహోన్నతమగు నిర్వాణసుఖము నుత్పన్నమగును. వాసనలను, రాగద్వేషాదులను సంపూర్ణముగ పరిత్యజించుటయే ఉత్తమమోక్షమని సజ్జనులు వచించుచున్నారు. మోక్షమునకు ఇదియే సరియైన మార్గము. ఎవరైతే పరిశుద్ధవాసనలతో నిండియున్నారో వారు తిరిగి జననమరణాదిగాగల అనర్థమును పొందరు. అట్టివారే యదార్థమును తెలిసికొనినవారు. అట్టివారే జీవన్ముక్తులు, మహాత్ములు అని చెప్పబడెదరు. ధృఢమగు విషయచింతనయే బంధమని చెప్పబడును. వాసనాక్షయమే మోక్షమని చెప్పబడును. (దేహ, లోక, శాస్త్రవాసనలే సర్వవాసనలు) తపస్సు మున్నగు సాధనలు చేయకయే సహజముగా ఎవరికి భోగములు రుచింపవో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. హర్షము, అమర్షము, భయము, క్రోధము, కామము, కార్పణ్యము, ఈసంకల్పవృత్తులు ఎవని అంతఃకరణమును స్పృశింపజాలవో, అతడే జీవన్ముక్తుడని చెప్పబడును. అహంకారవాసనను అవలీలగా త్యజించి ఎవడు దృశ్యమును త్యాగముచేయునో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవని అంతర్ముఖదృష్టిలో ఇష్టానిష్టములు లేకయుండునో, ఎవడు సుషు ప్తావస్థలో నున్నవానివలె సంచరించునో అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవడు సర్వదా ఆత్మా నందమును పొందునో, ఎవని మనస్సు పూర్ణముగా పావనముగా నుండునో, ఎవడు సర్వోత్తమ విశ్రాంతిని పొంది, ఏవిషయమును వాంఛింపక, గతస్నేహుడై జీవించునో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవనియొక్క హృదయము ఆకాశము రీతిగా దృశ్యవిషయములందు కొంచెము కూడా సంగముపెట్టుకొనక యుండునో, అతడే జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవడు రాగద్వేషములను, సుఖ దుఃఖములను, ధర్మాధర్మములను, ఫలాఫలములను లక్ష్యముచేయక, ఆపేక్షారహితుడై, నిష్కామ భావముతో సత్కర్మలను చేయుచుండునో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవడు మౌనదీక్ష కల వాడై అహంభావరహితుడై, మానములేనివాడై, ముక్తమత్సరుడై, ఉద్వేగరహితుడై, నిస్సంకల్పుడై, కర్తవ్యకర్మలను చేయుచుండునో, అతడు జీవన్ముక్తుడు.
ఎవడు సర్వత్ర విగతస్నేహితుడై సాక్షిభావముతో ఉండునో, ఇచ్ఛారహితుడై సత్కర్మలు చేయు చుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు తనమనస్సులో ధర్మాధర్మములను, సకల సంకల్పములను, ఇష్టమును, సర్వమును పరిత్యజించియున్నాడో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు కన్పించుచున్న ఈ సమస్తదృశ్యములను సమ్యక్దృష్టితో పరిత్యజించియుండునో, అతడు జీవన్ముక్తుడు. కారము, పులుపు, ఉప్పు, చేదు, రుచి, అరుచి వీటన్నింటినీ సమభావముతో ఎవడు భుజించుచున్నాడో, అతడు జీవన్ము క్తుడు. వృద్ధాప్యము, మరణము, ఆపద, రాజ్యము, దరిద్రము, వీటన్నింటినీ సమభావముతో ప్రీతిగ నెవడు అనుభవించునో, అతడు జీవన్ముక్తుడు. ధర్మాధర్మములు, సుఖదుఃఖములు, జననమరణ ములు ఇవన్నియు ఎవడు బుద్ధితో పూర్ణముగ త్యాగముచేయుచున్నాడో అతడు జీవన్ముక్తుడు. ఉద్వేగానందరహితుడై స్వచ్చమగు సమత్వబుద్ధితో పొంగిపోవుట, క్రుంగిపోవుట లేకయుండునో, అతడు జీవన్ముక్తుడు. సర్వేచ్చలను, సకలసంశయములను, సర్వప్రయత్నములను, సర్వనిశ్చయము లను ఎవడు జ్ఞానబుద్ధితో పరిత్యజించియున్నాడో, అతడు జీవన్ముక్తుడు. సృష్టిస్థితిలయములందు, ఉదయాస్తమయములందు, భావాభావములయందు ఎవనిమనస్సు సమభావముతో నుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు కొంచెముకూడ ద్వేషింపడో, కాంక్షింపడో, రాగద్వేషరహితుడో, ఎవడు ప్రారబ్ద భోగములను అనుభవించుచుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు సంసారసంకులములో శాంతుడై యుండునో, కళాయుక్తుడైకూడ నిష్కళుడైయుండునో, మనస్సు ఉండి కూడ, అమనస్కుడై యుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు సమస్త సంపదలయందుండియు, సమస్త వ్యవహారములందుండియు, స్పృహ లేనివాడై యుండునో, పూర్ణ బోధాస్వరూపుడై నుండునో, అతడు జీవన్ముక్తుడు.
వివేకచూడామణి:
228. తనకంటే(ఆత్మకంటే) నితరవస్తువు గోచరింపకుండు స్థితియే పరమాద్వైతము. అట్టి పర తత్త్వబోధకలిగిన శుభావస్థయందు బ్రహ్మాతిరిక్తమగు వస్తువెద్దియూ గోచరింపక సర్వమును బ్రహ్మము గనే స్ఫురించుచుండును. ఏమనగా సృష్టికి పూర్వమందును, పరమందును కల్పితప్రపంచము లేనిది. పరతత్త్వముమాత్రమే సత్యము, నిత్యము. కనుక పరతత్త్వబోధకలిగిన దశయందు బ్రహ్మేతరమెద్ది యునూ స్పురింపదు. ఇదియే జీవన్ముక్తస్థితి.
అష్టావక్రగీత: 12వ ప్రకరణము:(ఎవమేవాష్టకము): [శిష్యుడు(నిజ)ఆత్మతత్త్వస్థితిని అనుభవించి సద్గురువునకు వివరించుచున్నాడు]:
1,2. ఓ సద్గురూ! మొదట శరీరసంబంధక్రియను విడచిపెట్టితిని. పిదప వాక్కర్మములను విడచి పెట్టితిని. పిదప మానసికకర్మలను విడచిపెట్టితిని. ఆవిధముగా అన్నకర్మలను సంపూర్ణముగా విడచి పెట్టి ఏకాకినైయున్నాను. శబ్దాదులయొక్క ప్రీతి లేకపోవుటవలననూ, ఆత్మఅదృశ్య మగుటచేతనూ (పరబ్రహ్మముతప్ప ఇంకేమియూ స్ఫురణకు రాని ఆస్థితిలో ఆత్మకూడా అనుభవము లోనికిరాదు, అనగా అదృశ్యమగును), విక్షేపముల నుండి ఏకాగ్రమగు హృదయముకలవాడనై నేను యున్నాను.
4. త్యజించుటకుగాని, గ్రహించుటకుగాని, యోగ్యమైన వస్తువులేని కారణమున, అనగా ఆత్మ జ్ఞానము కలిగిన పిదప కించిత్తైనా హేయము, ఉపాదేయము అను భావమేలేని కారణమున, నేను నా స్వరూపస్థితియందే యున్నాను.
7,8. చింతించుటకు శాక్యముగాని బ్రహ్మమును చింతించుచున్నవాడైనప్పటికినీ, ఈ పురుషుడు చింతారూపమును పొందుచున్నాడు. ఆకారణమువలన ఆచింతారూపభావమును విడచి పెట్టి నేను భావనారహితుడనై ఉంటున్నాను. ఈవిధముగా సంపూర్ణ క్రియారహితుడగువాడు తన నిజస్వరూపమును తెలిసికొని, కృతార్థుడగుచున్నాడు. అనగా జీవన్ముక్తుడగుచున్నాడు.
యోగవాసిష్టము:వైరాగ్య ప్రకరణము:11 వ సర్గ:
24. నిర్నిమిత్తముగా వైరాగ్యమునందుండువారే గొప్పవారు. మహాప్రాజ్ఞులు. వారి మనస్సు నిర్మలము.
47. ఎవడు ప్రశ్నింపకమున్నే వక్తయొక్క జ్ఞానాజ్ఞానములను నిర్ణయించుకొని వ్యవహారరీత్యా ప్రశ్నించునో, అతడే మహామతి.
62. శాస్త్రము, జ్ఞానము, శృతి, తపస్సు, వీటికి వివేకియే యోగ్యుడగుచున్నాడు. సూర్యుడు తేజో పదార్థముల కెల్ల శ్రేష్ఠుడైనట్లు, వివేకియు జనులలో శ్రేష్ఠుడు.
72. ఎవని బుద్ధి పూర్వాపర విచారమును సల్పి అర్థజ్ఞానమును గ్రహింపజాలునో, అతడే పురుషుడని చెప్పబడుచున్నాడు.
12 వ సర్గ: 21: రాఘవా! చైతన్యమాత్రమగు ఆత్మప్రసన్నమైన, పరమశాంతి లభించును. బుద్ధి వృత్తులన్నియూ శాంతిరసమునమునుగును.అప్పుడు బ్రహ్మరసాస్వాదనమున అంతఃకరణవ్యాపారము సమభావాసంపన్నయగును. ఈస్థితియందు జ్ఞానులకు జగద్భ్రమణము క్రీడగనే తోచును.
13 వ సర్గ: 9: జీవన్ముక్తస్థితి ఆత్మదర్శనము వలననే లభించును. అన్యోపాయము వలన లభింపదు.
11. అభ్యాసమువలన ననుభవమును సంపాదించి, శాస్త్రానుశీలనమొనర్చి, గురువు యొక్క ఉపదేశమును గ్రహింపయత్నించువాడే, ఆత్మదర్శనము పొందగలడు. (ఇక్కడ శ్రీవశిష్టులవారు చాలా ముఖ్యమైన విషయముచెప్పారు. మనలో చాలామంది, గురువుదగ్గరకు పోయి, వారికాళ్ళకు నమ స్కారం చేసి, ఎంతో కొంత దక్షిణ ఇచ్చేస్తే చాలు, మిగిలినదంతా గురువే చూసుకుంటాడు, మనకు పనేమీ లేదు అనుకుంటారు. అటువంటివారికి వశిష్టులవారు కర్తవ్యము చెపుతున్నారు. గురువు బోధించిన దానిని మొదట ఆచరణలోపెట్టి, చక్కగా అభ్యసించాలి. ఆఅభ్యాసము వలన అనుభవము వస్తుంది. ఇటు వంటి అనుభవాలు శాస్త్రాలలోను, శ్రుతులలోను, స్మృతులలోను, ఉపనిషత్తులలోను చెప్పిన వాటితో పోల్చిచూసుకోవాలి. అప్పుడు మాత్రమే గురువు బోధించిన విషయాలు పూర్తిగ్రహింపుకు వస్తాయి. ఇదేమిలేకుండా, ఏదో ఆయనచెప్పారు, మనంవిన్నాము, కాని మాకు మనస్సు నిలకడలేదు, ఏమి తెలియుటలేదు అనుకుంటే, ఏమాత్రము ఉపయోగం లేదు.)
72. ఏ వ్యక్తి శుభాశుభ, దర్శనస్పర్శన, శ్రవణస్నానముల నొనర్చియు, హర్షవిషాదముల నొందకుండునో, అతడే శాంతుడని చెప్పబడు చున్నాడు.
14 వ సర్గ: 1: కారణజ్ఞుడగు వ్యక్తి శాస్త్రజ్ఞానము ననుసరించిన నిర్మల పవిత్రబుద్ధితో నిరంతర మాత్మవిచార మొనర్చుచుండవలెను.
6. విచారము వలననే బుద్ధిమంతునకు బలము, బుద్ధి, తేజము, సమయోచితమగు స్ఫురణ, క్రియానుష్ఠానము, తత్ఫలము లభించుచుండును.
31-36: చిత్తము బ్రహ్మభావమునాశ్రయించిన, వాసనలన్నియు నశించును. బ్రహ్మభావము విస్తరింప ఆకసమువలె ఉదయాస్తమయము, తెలివియులేకుండ నుండును. అప్పుడు ఈవిశాలజగత్తు ను కేవలము సాక్షివలె గమనించుచుండును. దేనిని గ్రహింపడు, భోగింపడు. శాంతుడైయుండును. అప్పుడాతడు లోపలగాని, వెలుపలగానివసింపడు. ఏవిధమైన దుఃఖమునుపొందడు.కర్మలనాచరింపడు నైష్కర్మసిద్ధికై యత్నించడు. పోయినదానికై చింతింపడు. వచ్చినదానిని అనుసరించును. దుఃఖించడు. సంతసించడు. నిండుసముద్రుని వలె తణుకుబెణుకులు లేకుండా నుండును. ఇట్లు మహాత్ములు మహా శయులునగు యోగులు నిండుమనంబున జీవన్ముక్తులై ఈజగత్తున సంచరించుచుందురు. ధీరులగు ఈజీవన్ముక్త పురుషులు ఇచ్ఛానుసారము వసించి, పిదప ఉపాదిలేశమును గూడ పరిత్యజించి అపరి ఛిన్నమగు విదేహముక్తి నందుదురు.
39. రాత్రివేళ దీపసహాయమున నేలను గాంచగలిగినట్లు, విచారమువలననే పురుషుడు కర్మకాండ, జ్ఞానకాండలందు నిర్ణయింపబడిన ధర్మ, కర్మ, బ్రహ్మతత్త్వములు నెరయగల్గును.
16 వ సర్గ: 11, 19: రాగ శూన్యులును, గ్రంథిహీనులును, సందేహపురుషులును వెలయుచో, తీర్థయాత్రలతోడను, తపస్సుతోడను అవుసరమేమి? సంతోషమే పరమలాభము. సత్సంగమే పరమగతి. విచారమే పరమజ్ఞానము. శమమే పరమసుఖము.
17వసర్గ:50:మహాత్ముడగు జీవన్ముక్తుని హృదయము పరమాత్మ. కోటికోటి హరిహర బ్రహ్మాదులు కలిసిననూ యీతనిబోలరు. ఏలయన, సత్తయొక్కయు, ఆనందముయొక్కయు విస్తారమున నితడు సర్వోత్తముడు. ఆత్మయొక్క సర్వోత్కృష్ట విస్తృతి యీతని హృదయమున నున్నది.
ఉత్పత్తి ప్రకరణము:9 వ సర్గ:
శాస్త్రవిధి ననుసరించుచూ, ఈవిశ్వమును ఆకాశామువలె శూన్యముగ జూచువాడు, పనిపాటల నొనర్చుచున్ననూ, జ్ఞానపరతంత్రుడై, జాగ్రదావస్థయందు గూడ నిద్రతోని మాడ్కి, నిర్వికారుడై మెలగు వాడు, మేల్కొనియు నిర్వికారాత్మతత్త్వమున సుషుప్తునివోలె నుండువాడు, సుషుప్తుడయ్యు అవిద్య యను నిద్ర నశించుటవలన ఆత్మయందు జాగరిల్లినవాడును, దేహెంద్రియములకు సాధారణజాగ్రదవస్థ లేనివాడును, జాగ్రదవస్థవలన స్వప్నస్థితి నశించినవాడును, 'అహం ' జ్ఞానమువలన ఎట్టి అభావమును బొందనివాడును, (ఇక్కడ యోగి, జీవన్ముక్తదశలో, ఒకేకాలములో, ఒక్కక్కవిషయములో ఒక్కొక్క అవస్థలో ఎలావుంటాడో, చివరికి యీఅవస్థలేమియు లేకుండా ఎలావుంటాడో వివరించారు) కార్యముల నొనర్చుచున్ననూ, ఒనర్చకపోయినను, కర్తృత్వాభిమానములు, పాపపుణ్యములు అంటకుండువాడు ను, ఎవ్వని చిదాత్మ ఆవరణముతొలగిన ప్రళయమును, ఆవరణముపడిన సృష్టిని గలవాడు, జగద్వ్యాపారము నాచరించుచున్ననూ, కామాదులవేగమునకు లొంగనివాడును, పదార్థములన్నింట ఆత్మ యొక్క పూర్ణత్వమును(చైతన్యమును) గాంచువాడు, జీవన్ముక్తుడు.
స్థితి ప్రకరణము: 19వ సర్గ:
22. ఎపుడు మనోవాక్కాయకర్మలచే శరీరము క్షోభ చెందకయుండునో, ఎపుడు జీవచైతన్యము శాంతముగను, స్వస్థముగనుండునో, సమత్వము చెందిన ప్రాణవాయువుతో గూడి హృదయాకాశమున జీవచైతన్యము అక్షుభితమైయుండి, నిర్వాతస్థానమందలి దీపమువలె కేవలము ప్రకాశమాత్రకార్య మొనర్చుచుండునో, అపుడవయవమందలి నాడులందు జీవప్రసారముండదు. గాన జీవచైతన్యము క్షోభ చెందకయే నేత్రాదిచిధ్రములగుండా బాహ్యాభ్యంతరముల జనకయుండును. (కొంతమంది దృష్టిలో సమాధి అనగా తాత్కాలికమరణము అనిభావన. కాని ఇక్కడ వశిష్టులవారు ప్రాణచైతన్యము అవయ ముల నాడులనుండి ఉపసంహరింపబడి, హృదయాకాశములో ఏకాగ్రమైవుండి, ఆఅఖండానందైకరసా నందము అనుభవించుచూ యుండుటవలన, చైతన్యములేని అవయవముల గుండా బయటకుపోదు, అంటే సమాధిలో మరణము సంభవించదు అని స్పష్టముచేస్తున్నారు. ఆధ్యాత్మికముగా ప్రాణోత్క్ర మణము, అంటే మరణము ఎలాసంభవిస్తుంది, అది ఎవరెవరికి ఎలావుంటుంది అన్నవిషయాలు ఇంకొకసారి తెలుసుకుందాము.)
25. చిత్తము సమస్తవ్యవహారముల నుండి ఉపరతి నెప్పుడు పొందునో, (ఆధ్యాత్మికముగా ఉపరతి అనగా విరమించుట, కలసియుండక పోవుట, అనిష్టముగా వుండుట) అప్పుడు శాస్త్రములద్వారా చైతన్యముయొక్క పరత్వమునెరిగి, ఏకాగ్రత విచారరూపములగు స్వప్నప్రయత్నములచే, బ్రహ్మ సాక్షాత్కారమొందు యోగి పైనతెల్పిన జాగ్రత్స్వప్నసుషుప్తువులను భిన్నభూమికల వ్యవహరించు చుండిననూ, లేక సమాధినిష్టుడైయున్ననూ, ధృఢబోధ గల్గియున్నందున నాతడెల్లప్పుడూ తురీయావస్ఠ యందున్నవాడనియే చెప్పబడును.
22వ సర్గ:24-28: దేశకాలాదులవశమున నుత్పన్నమైన అధ్యాత్మికాదితాపత్రయమును, సమస్త దుఃఖములు శరీరమునకేగాని, పూర్ణానందరూపమైనఆత్మస్వరూపుడగు నాకుగాదని నిశ్చయించుచూ, ఇవ్విధంబున భ్రమరహితుడై యుండువాడే, సత్యము నెరసినవాడగును. అనంతమగు దిక్కలాదులతో కూడినదియును, పరిచ్ఛిన్నమును, ఉత్పత్తిచలనాది క్రియాసహితమునునగు యీప్రపంచము నందంతటనూ నేనే వ్యాపించియున్నానను అనుభవముకలవాడే నిజమగుజ్ఞాని. సర్వవ్యాపకుడైననూ, తాను రోమాగ్రభాగమందలి కోటియవభాగము యొక్క లక్షవభాగము కంటెనూ ఇంకనూ సూక్ష్మమైన వాడని యెరుంగువాడే సత్యమును జూచువాడగును. జీవాత్మయు తద్భిన్నమగు యీజగత్తంతయూ చైతన్యజ్యోతి మాత్రమేయనియెరింగి, యివ్విధమున జగత్తును పరమాత్మకభిన్నముగా గాంచువాడే ఆత్మజ్ఞుడగును. సర్వశక్తిమంతుడును, అనంతుడును, అద్వితీయుడునునగు చిదాత్మాయే సమస్త పదార్థములందునూ యున్నట్లు జూచువాడే నిజముగా జూచువాడగును.
32. అహంకారముగాని, యీ దృశ్యముగాని యొకింతయూలేదు. అంతయు నిరామయమగు బ్రహ్మము మాత్రమేయని నిశ్చయించుచూ, భూతభవిష్యత్ వర్తమానముల యందును, వ్యక్తావ్యక్తముల మధ్యమస్థితి గల్గియున్న తన రూపమునెవడు గాంచునో అతడే సమ్యగ్దర్శి.
39-42. తర్కముచే నగమ్యమును, విక్షేపరహితమునునగు సన్మాత్రరూపమే ఈజగత్తను సమ్యక్ జ్ఞానము గలిగియుండుటచే, ఎవనికి త్యాజ్యగ్రాహ్యములకల్పన నశించిన, యతడే పురుషుడనబడును. ఆకాశమువలె ఏకాత్మస్వరూపుడై పదార్థరూపములయందు పూర్ణభావమున వ్యాపించియున్ననూ, ఆయా పదార్థరూపముల బొందక వాటియందనురక్తుడు గాకయుండు మహాత్ముడే నిరతిశయానంద మనుభవింప సమర్థుడగును. జాగ్రత్స్వప్నసుషుప్తువుల నుండి వినిర్ముక్తుడును, మృత్యువునకు ప్రేమస్పదుడును, సౌమ్యుడును, సర్వత్రసమబుద్ధి గలవాడును, తురీయావస్థయను ఉత్తమపదమున సుప్రతిష్ఠుడునునగు మహాత్మునకు నేను నమస్కరించుచున్నాను. బ్రహ్మండమందంతటనూ యొకే బ్రహ్మము వ్యాప్తమైయున్నదను నిశ్చయము గలవాడును, విచిత్రమును రమణీయమును నగు విభావములతో గూడిన ఈజగత్తు యొక్క సృష్టిస్థితిలయముల కల్పన యందెవనికి అపరిచ్ఛిన్నమగు బ్రహ్మవృత్తికలదో, అట్టి ఉత్తమజ్ఞానవంతుడగు జీవన్ముక్తునికి నేను నమస్కరించుచున్నాను.
ఉపశమ ప్రకరణము: 70వ సర్గ:
16-18: సుషుప్తిబుద్ధి గల జీవుడు పూర్వసాధనదశ నుండియే నిరహంకృత చిత్తముచే కర్మల గావించుచు, వాటిచే బంధింపబడక యుండుము. సుషుప్తివృత్తి నవలంభించి, ప్రారబ్దపరిపాకముచే సంప్రాప్తించిన వర్ణాశ్రమోపేతకర్మలను ఆచరింపుము, లేక ఆచరింపకుండుము. జ్ఞానికి కర్మగ్రహణము గాని, కర్మత్యాగము గాని రుచింపదు. కాని నిరాత్మజ్ఞులై ప్రారబ్దానుసారము వర్తించుచుందురు.
జీవన్ముక్తుని అవస్థలు: యోగవాసిష్ఠము: నిర్వాణ ప్రకరణము: పూర్వభాగము: 34వ సర్గ:
6-25: ఈతడు విషయవస్తువుల గురించి చిత్తచాపల్యము బొందుచున్ననూ, జీవన్ముక్తస్థితి యందు అది తొలగిపోవుచున్నది. అతడు సంసారమునందుండి జీవద్దశయందే ఉత్తీర్ణుడై, నిఖిల పదార్థముల సత్తయగు కేవలచైతన్యరూపము బొందును. అప్పుడాతడు పునర్జన్మరహితమగు సౌషుప్త పద (నిరతిశయానందస్వరూప)పాండిత్యము నపరిమితముగబొంది, గొప్పదగు బ్రహ్మపదమున విశ్రమించును. నీకింతవరకు మనోక్షయమున చైతన్యమునుబొందు స్థితిని చెప్పితిని. ఇప్పుడు పవిత్రమగు ద్వితీయావస్థను చెప్పుచున్నాను.
మనోదశనుండి విడివడిన ఈచైతన్యమే సూర్యచంద్రాది జ్యోతిష్పదార్థములనుండియు, అజ్ఞానాది అంధకారమునుండియు విడివడినకాంతిమయమై విశాలమగుఆకాశమువోలె స్వచ్ఛభాగమున వెల యును. అనంతరమియ్యది కాలక్రమమున గాఢసుషుప్త్యనుభవమువలెను, పాషాణకాఠిన్యము వలెను, సైంధవమునందలి రసమువలెను, వాయువునందలి స్పందన శక్తివలెను, ఎప్పుడెచ్చట కేవలచిన్మాత్ర రూపముగాపర్యవసించునో, అప్పుడు ఆకాశమందలి శూన్యతవలె పరమాకాశముతో గూడి బాహ్యవిషయ ఔత్సుక్యమును విడచి, వాయువువలన గదల్పబడని నీటివలె నిశ్చలభావమున వెలయును. అప్పు డయ్యది వాతలేఖ(వాతకణము) స్పందమును త్యజించునట్లును, పుష్పము సౌరభమును వీడు నట్లును, దేశాకాలములు త్యజించి, సమస్తవస్తువుల అనుభవము నుండి విడివడును. అనంతరము జడాజడ భావములనుండి విముక్తి బొంది, అపరిఛిన్నత్వముబొంది, ఒకానొక అనిర్వచనీయ సత్తను బొందును. ఈమహాసత్త దిక్కాలాద్యనవచ్ఛిన్నము. ఆస్థితి తురీయము, అకలంకము, అనామయము. ఆస్థితియందలి ఆనందము అన్నివస్తువులనుండి, అన్నికాలముల లభించు ఆనందముకంటే మహత్తర మైనది. ఈఆనందమును గాంచుచు, విశాలాక్షునివలె జీవన్ముక్తపురుషుడు వెలయుచుండును. నీకిప్పుడు చైతన్యము యొక్క ద్వితీయావస్థను చెప్పితిని. ఇక తృతీయస్థితిని చెప్పుచున్నాను.
ఈ చైతన్యము బ్రహ్మాకార అఖండచిత్తవృత్తిని, దానిననుసరించియుండు బ్రహ్మైక్యభావము నొందుట వలన నామరూపాతీతమగు బ్రహ్మము, ఆత్మమున్నగు సంజ్ఞల నతిక్రమించి కేవలస్వరూపమున వెల యును. అప్పుడయ్యది షడ్విధభావవికారములనుండి విడివడి, కాలముకంటే శాశ్వతమై, తమస్సునకు పరముననున్న స్వస్వరూపమున నిష్కలంకమై తురీయాతీతాదినామములకు అతీతమై పరమ పురుషార్థరూపమును బొందును. ఇదియే సుఖములన్నిటి యొక్క పరమావధి. శుభములన్నిటిలోను ప్రధానము, వినాశములేని ఈపవిత్రస్థితియే చైతన్యముయొక్క తృతీయావస్థ. ఈభూమికయందు వసించుట చాలాకష్టము. ఇది అన్నిమార్గములకును, అందరి పథికులకును దూరమై వెలయుచున్నది. నావాక్కులకుకూడ అతీతమై అభివర్ణింప శక్యముగాకయున్నది. ఈచెప్పబడిన చైతన్యము జాగ్రత్స్వప్న సుషుప్తువుల కతీతము. ఇందు నీవు నిత్యమధివసింపుము. ఇదియే సనాతనమగు పరమ దైవము.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము)
ఎప్పుడైతే సద్గురువు పర్యవేక్షణలో సమాధినిష్టుడై, ఆత్మ సాక్షాత్కారము పొంది, చైతన్యభావాన్ని అనుభవిస్తూవుంటారో, అక్కడ నుండి అనుభవాలే తప్ప నిర్వచనాలు వుండవు. ఆస్థితిలో కొనసాగడం తప్ప వేరేయిక ఏవిధమైన ప్రక్రియ, ఉపాసన, జీవిక, వుండవు. జీవితమున్నంతకాలము జీవన్ముక్తస్థితి లో గడుపుచూ, ప్రాణావసరసమయములో ఉర్థ్వంగా ఉత్క్రమించి, ఈప్రాణాన్ని తృణప్రాయంగా విసర్జించి, జన్మజరామృత్యుచక్రం నుండి తప్పించుకొని, నేరుగా విదేహముక్తియుక్తంగా, పరబ్రహ్మస్వరూపంలో మమైక్యమగుట తప్ప ఇంకేమియు లేదు. దీనిగురించి చాలా తక్కువ సమాచారం దొరికింది. ఎందుకంటే పరబ్రహ్మ అయినవారు చెప్పడానికి క్రిందికి దిగిరారు కాబట్టి. కాని కొంతమంది మహాత్ములు, ఋషులు మనలాటి వారికోసం కొంత విషయాన్ని చెప్పారు. దానిని తెలుసుకుందాము.
బృహదారణ్యకోపనిషత్ ముక్తులు మూడు విధాలుగా చెప్పింది. 1.క్రమముక్తి: ఉపాసకుడు చని పోయిన పిమ్మట తన ఉపాసనాఫలంగా దేవయానమార్గాన బ్రహ్మలోకాన్ని చేరి, అచట కల్పాంతము వరకూ వుంటూ, కల్పాంతంలో ఆకార్యబ్రహ్మ(చతుర్ముఖ బ్రహ్మ)తో పాటు పరమాత్మయందు లీన మగుట. ఈదశ సాధారణంగా సాకారస్వరూపాన్ని అర్చించేవారికి, ఆసాకార స్వరూపముతొ సారూప్య, సామీప్యసాయుజ్యాలు పొందేవారికి వస్తుంది. ఆవిధానంలో కూడ ఒక విధమైన తాదాత్మ్యస్థితినిపొంది, ఆసాకారస్వరూపముతో అభేదస్థితిని సాధించినవారుమాత్రమే, ఆసాకారస్వరూపముతొపాటు పర బ్రహ్మలో లీనమవుతారు. అలా లేనివారు, కల్పాంతంలో అణుస్వరూపములో ఉండి, మళ్ళా సృష్టి ఏర్పడిన తర్వాత అర్హతనుబట్టి తగుజన్మను పొందుతారు. 2.జీవన్ముక్తి: బ్రహ్మజ్ఞానం కలిగినప్పటికీ, ప్రారబ్దకర్మవశాన లోకనుసారంగా వర్తిస్తూ అసంగుడై ఉండటం. (ఇక్కడ ఒకప్రశ్న వచ్చితీరాలి. కర్మఫలం దగ్దమైతేనేగాని బ్రహ్మజ్ఞానంరాదు కదా, ఇంకా ప్రారబ్దకర్మ ఏమిటి? అని. నిజానికి కర్మపాశవిముక్తి అయితేనే తప్ప బ్రహ్మజ్ఞానం రాదు. అప్పుడు కర్మలు, కర్మ ఫలితాలు పోతాయేగాని, ప్రారబ్దం వల్ల వచ్చిన జీవితంఅంతమవదు. అది మనచేతిలో లేదు. దానిని పూర్తిగా అనుభవించవలసినదే! కాబట్టి అది పూర్తి అయ్యేవరకు ఈప్రపంచంలోనే వుంటూ, దీనిపట్ల అసంగుడై, దీన్ని అంటుకోకుండా వుంటారు. వారు నిజంగాముక్తులే. కాని ఆప్రక్రియ దేహానంతరంకలుగుతుంది. అంతవరకూ వారు వేచి యుండాల్సిందే! దానినే జీవన్ముక్త దశ అంటారు.) 3.విదేహముక్తి: దేహపాతానంతరం కలిగే నిర్విశేష బ్రహ్మైక్యస్థితి. ఇప్పుడు మనం జీవన్ముక్తదశ గురించి, జీవన్ముక్తుల లక్షణముల గురించి పెద్దలు, మహానుభావులు ఏమి చెప్పారో తెలుసుకుందాము.
పైఙ్గలోపనిషత్: తృతీయాధ్యాయము:
'తత్త్వమసి', 'అహం బ్రహ్మస్మి' అను మహావాక్యముల అర్థమును విచారణచేయుట శ్రవణము. ఏకాంతములో పరమార్థమును(శ్రవణార్థమును)అనుసంధానము చేయుటమననము. శ్రవణమననము ల వలన సంశయరహితార్థమునందు ఏకాగ్రముగా మనస్సునిలిపి యుండుట నిధిధ్యాసనము. ధ్యాతృ ధ్యానములను త్యజించి, నివాసితదీపము రీతిగా ద్యేయైకగోచరమగు చిత్తమును కలిగియుండుటే సమాధి. అట్టి సమాధి సమయములో అనాదిసంసార సంచితములైయున్న కర్మరాసులన్నియు లయించిపోవును. పిమ్మట అభ్యాసబలమున సహస్రములుగా అమృతధారలు వర్షించును. అందు వలన యోగవేత్తలు సమాధిని 'ధర్మమేఘము' అని పలుకుదురు. (ఇక్కడ సద్గురువులు పోడూరి కృష్ణవేణుమాతాజీగారు చెప్పినటువంటి ఒక విషయం గుర్తుకువస్తోంది. గురువుగారు అప్పుడప్పుడు, అంగుడిలో పైనుండి ఏదో చుక్కలుగా పడుతోందిరా, నోరంతా తియ్యగా అవుతుందిరా, ఆరుచి చెప్ప లేమురా, అని చెప్పేవారు. దీనిని బట్టి శాస్త్రములలో చెప్పినటువంటి విషయాలు తప్పక అనుభవము లోనికి వస్తాయని తెలుస్తున్నది.) సమాధివలన సర్వవాసనలు నశించగా, కర్మసంచయము (పాప పుణ్యములు) సమూలముగా నశించిపోగా, వేదాంతవాక్యము కరతలామలకము రీతిగా, అపరోక్ష సాక్షాత్కారము సంభవించును. అప్పుడు ఆఆత్మజ్ఞాని జీవన్ముక్తుడగును.
మహోపనిషత్: ద్వితీయాధ్యాయము:జనకుడు శుకునితో చెప్పుచున్నాడు:
జ్ఞానవిస్తారమును, సారాంశములను విపులముగా చెప్పుచున్నాను. ఈవిషయములను అర్థము చేసికోన్నచో, జీవుడు వెంటనే జీవన్ముక్తదశను పొందుచున్నాడు. దృశ్యము లేనేలేదు అనెడు అత్మ జ్ఞానముతో మనస్సులో నున్న దృశ్యభావములను తుడిచివేసినచో తక్షణమే మహోన్నతమగు నిర్వాణసుఖము నుత్పన్నమగును. వాసనలను, రాగద్వేషాదులను సంపూర్ణముగ పరిత్యజించుటయే ఉత్తమమోక్షమని సజ్జనులు వచించుచున్నారు. మోక్షమునకు ఇదియే సరియైన మార్గము. ఎవరైతే పరిశుద్ధవాసనలతో నిండియున్నారో వారు తిరిగి జననమరణాదిగాగల అనర్థమును పొందరు. అట్టివారే యదార్థమును తెలిసికొనినవారు. అట్టివారే జీవన్ముక్తులు, మహాత్ములు అని చెప్పబడెదరు. ధృఢమగు విషయచింతనయే బంధమని చెప్పబడును. వాసనాక్షయమే మోక్షమని చెప్పబడును. (దేహ, లోక, శాస్త్రవాసనలే సర్వవాసనలు) తపస్సు మున్నగు సాధనలు చేయకయే సహజముగా ఎవరికి భోగములు రుచింపవో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. హర్షము, అమర్షము, భయము, క్రోధము, కామము, కార్పణ్యము, ఈసంకల్పవృత్తులు ఎవని అంతఃకరణమును స్పృశింపజాలవో, అతడే జీవన్ముక్తుడని చెప్పబడును. అహంకారవాసనను అవలీలగా త్యజించి ఎవడు దృశ్యమును త్యాగముచేయునో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవని అంతర్ముఖదృష్టిలో ఇష్టానిష్టములు లేకయుండునో, ఎవడు సుషు ప్తావస్థలో నున్నవానివలె సంచరించునో అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవడు సర్వదా ఆత్మా నందమును పొందునో, ఎవని మనస్సు పూర్ణముగా పావనముగా నుండునో, ఎవడు సర్వోత్తమ విశ్రాంతిని పొంది, ఏవిషయమును వాంఛింపక, గతస్నేహుడై జీవించునో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవనియొక్క హృదయము ఆకాశము రీతిగా దృశ్యవిషయములందు కొంచెము కూడా సంగముపెట్టుకొనక యుండునో, అతడే జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవడు రాగద్వేషములను, సుఖ దుఃఖములను, ధర్మాధర్మములను, ఫలాఫలములను లక్ష్యముచేయక, ఆపేక్షారహితుడై, నిష్కామ భావముతో సత్కర్మలను చేయుచుండునో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవడు మౌనదీక్ష కల వాడై అహంభావరహితుడై, మానములేనివాడై, ముక్తమత్సరుడై, ఉద్వేగరహితుడై, నిస్సంకల్పుడై, కర్తవ్యకర్మలను చేయుచుండునో, అతడు జీవన్ముక్తుడు.
ఎవడు సర్వత్ర విగతస్నేహితుడై సాక్షిభావముతో ఉండునో, ఇచ్ఛారహితుడై సత్కర్మలు చేయు చుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు తనమనస్సులో ధర్మాధర్మములను, సకల సంకల్పములను, ఇష్టమును, సర్వమును పరిత్యజించియున్నాడో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు కన్పించుచున్న ఈ సమస్తదృశ్యములను సమ్యక్దృష్టితో పరిత్యజించియుండునో, అతడు జీవన్ముక్తుడు. కారము, పులుపు, ఉప్పు, చేదు, రుచి, అరుచి వీటన్నింటినీ సమభావముతో ఎవడు భుజించుచున్నాడో, అతడు జీవన్ము క్తుడు. వృద్ధాప్యము, మరణము, ఆపద, రాజ్యము, దరిద్రము, వీటన్నింటినీ సమభావముతో ప్రీతిగ నెవడు అనుభవించునో, అతడు జీవన్ముక్తుడు. ధర్మాధర్మములు, సుఖదుఃఖములు, జననమరణ ములు ఇవన్నియు ఎవడు బుద్ధితో పూర్ణముగ త్యాగముచేయుచున్నాడో అతడు జీవన్ముక్తుడు. ఉద్వేగానందరహితుడై స్వచ్చమగు సమత్వబుద్ధితో పొంగిపోవుట, క్రుంగిపోవుట లేకయుండునో, అతడు జీవన్ముక్తుడు. సర్వేచ్చలను, సకలసంశయములను, సర్వప్రయత్నములను, సర్వనిశ్చయము లను ఎవడు జ్ఞానబుద్ధితో పరిత్యజించియున్నాడో, అతడు జీవన్ముక్తుడు. సృష్టిస్థితిలయములందు, ఉదయాస్తమయములందు, భావాభావములయందు ఎవనిమనస్సు సమభావముతో నుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు కొంచెముకూడ ద్వేషింపడో, కాంక్షింపడో, రాగద్వేషరహితుడో, ఎవడు ప్రారబ్ద భోగములను అనుభవించుచుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు సంసారసంకులములో శాంతుడై యుండునో, కళాయుక్తుడైకూడ నిష్కళుడైయుండునో, మనస్సు ఉండి కూడ, అమనస్కుడై యుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు సమస్త సంపదలయందుండియు, సమస్త వ్యవహారములందుండియు, స్పృహ లేనివాడై యుండునో, పూర్ణ బోధాస్వరూపుడై నుండునో, అతడు జీవన్ముక్తుడు.
వివేకచూడామణి:
228. తనకంటే(ఆత్మకంటే) నితరవస్తువు గోచరింపకుండు స్థితియే పరమాద్వైతము. అట్టి పర తత్త్వబోధకలిగిన శుభావస్థయందు బ్రహ్మాతిరిక్తమగు వస్తువెద్దియూ గోచరింపక సర్వమును బ్రహ్మము గనే స్ఫురించుచుండును. ఏమనగా సృష్టికి పూర్వమందును, పరమందును కల్పితప్రపంచము లేనిది. పరతత్త్వముమాత్రమే సత్యము, నిత్యము. కనుక పరతత్త్వబోధకలిగిన దశయందు బ్రహ్మేతరమెద్ది యునూ స్పురింపదు. ఇదియే జీవన్ముక్తస్థితి.
అష్టావక్రగీత: 12వ ప్రకరణము:(ఎవమేవాష్టకము): [శిష్యుడు(నిజ)ఆత్మతత్త్వస్థితిని అనుభవించి సద్గురువునకు వివరించుచున్నాడు]:
1,2. ఓ సద్గురూ! మొదట శరీరసంబంధక్రియను విడచిపెట్టితిని. పిదప వాక్కర్మములను విడచి పెట్టితిని. పిదప మానసికకర్మలను విడచిపెట్టితిని. ఆవిధముగా అన్నకర్మలను సంపూర్ణముగా విడచి పెట్టి ఏకాకినైయున్నాను. శబ్దాదులయొక్క ప్రీతి లేకపోవుటవలననూ, ఆత్మఅదృశ్య మగుటచేతనూ (పరబ్రహ్మముతప్ప ఇంకేమియూ స్ఫురణకు రాని ఆస్థితిలో ఆత్మకూడా అనుభవము లోనికిరాదు, అనగా అదృశ్యమగును), విక్షేపముల నుండి ఏకాగ్రమగు హృదయముకలవాడనై నేను యున్నాను.
4. త్యజించుటకుగాని, గ్రహించుటకుగాని, యోగ్యమైన వస్తువులేని కారణమున, అనగా ఆత్మ జ్ఞానము కలిగిన పిదప కించిత్తైనా హేయము, ఉపాదేయము అను భావమేలేని కారణమున, నేను నా స్వరూపస్థితియందే యున్నాను.
7,8. చింతించుటకు శాక్యముగాని బ్రహ్మమును చింతించుచున్నవాడైనప్పటికినీ, ఈ పురుషుడు చింతారూపమును పొందుచున్నాడు. ఆకారణమువలన ఆచింతారూపభావమును విడచి పెట్టి నేను భావనారహితుడనై ఉంటున్నాను. ఈవిధముగా సంపూర్ణ క్రియారహితుడగువాడు తన నిజస్వరూపమును తెలిసికొని, కృతార్థుడగుచున్నాడు. అనగా జీవన్ముక్తుడగుచున్నాడు.
యోగవాసిష్టము:వైరాగ్య ప్రకరణము:11 వ సర్గ:
24. నిర్నిమిత్తముగా వైరాగ్యమునందుండువారే గొప్పవారు. మహాప్రాజ్ఞులు. వారి మనస్సు నిర్మలము.
47. ఎవడు ప్రశ్నింపకమున్నే వక్తయొక్క జ్ఞానాజ్ఞానములను నిర్ణయించుకొని వ్యవహారరీత్యా ప్రశ్నించునో, అతడే మహామతి.
62. శాస్త్రము, జ్ఞానము, శృతి, తపస్సు, వీటికి వివేకియే యోగ్యుడగుచున్నాడు. సూర్యుడు తేజో పదార్థముల కెల్ల శ్రేష్ఠుడైనట్లు, వివేకియు జనులలో శ్రేష్ఠుడు.
72. ఎవని బుద్ధి పూర్వాపర విచారమును సల్పి అర్థజ్ఞానమును గ్రహింపజాలునో, అతడే పురుషుడని చెప్పబడుచున్నాడు.
12 వ సర్గ: 21: రాఘవా! చైతన్యమాత్రమగు ఆత్మప్రసన్నమైన, పరమశాంతి లభించును. బుద్ధి వృత్తులన్నియూ శాంతిరసమునమునుగును.అప్పుడు బ్రహ్మరసాస్వాదనమున అంతఃకరణవ్యాపారము సమభావాసంపన్నయగును. ఈస్థితియందు జ్ఞానులకు జగద్భ్రమణము క్రీడగనే తోచును.
13 వ సర్గ: 9: జీవన్ముక్తస్థితి ఆత్మదర్శనము వలననే లభించును. అన్యోపాయము వలన లభింపదు.
11. అభ్యాసమువలన ననుభవమును సంపాదించి, శాస్త్రానుశీలనమొనర్చి, గురువు యొక్క ఉపదేశమును గ్రహింపయత్నించువాడే, ఆత్మదర్శనము పొందగలడు. (ఇక్కడ శ్రీవశిష్టులవారు చాలా ముఖ్యమైన విషయముచెప్పారు. మనలో చాలామంది, గురువుదగ్గరకు పోయి, వారికాళ్ళకు నమ స్కారం చేసి, ఎంతో కొంత దక్షిణ ఇచ్చేస్తే చాలు, మిగిలినదంతా గురువే చూసుకుంటాడు, మనకు పనేమీ లేదు అనుకుంటారు. అటువంటివారికి వశిష్టులవారు కర్తవ్యము చెపుతున్నారు. గురువు బోధించిన దానిని మొదట ఆచరణలోపెట్టి, చక్కగా అభ్యసించాలి. ఆఅభ్యాసము వలన అనుభవము వస్తుంది. ఇటు వంటి అనుభవాలు శాస్త్రాలలోను, శ్రుతులలోను, స్మృతులలోను, ఉపనిషత్తులలోను చెప్పిన వాటితో పోల్చిచూసుకోవాలి. అప్పుడు మాత్రమే గురువు బోధించిన విషయాలు పూర్తిగ్రహింపుకు వస్తాయి. ఇదేమిలేకుండా, ఏదో ఆయనచెప్పారు, మనంవిన్నాము, కాని మాకు మనస్సు నిలకడలేదు, ఏమి తెలియుటలేదు అనుకుంటే, ఏమాత్రము ఉపయోగం లేదు.)
72. ఏ వ్యక్తి శుభాశుభ, దర్శనస్పర్శన, శ్రవణస్నానముల నొనర్చియు, హర్షవిషాదముల నొందకుండునో, అతడే శాంతుడని చెప్పబడు చున్నాడు.
14 వ సర్గ: 1: కారణజ్ఞుడగు వ్యక్తి శాస్త్రజ్ఞానము ననుసరించిన నిర్మల పవిత్రబుద్ధితో నిరంతర మాత్మవిచార మొనర్చుచుండవలెను.
6. విచారము వలననే బుద్ధిమంతునకు బలము, బుద్ధి, తేజము, సమయోచితమగు స్ఫురణ, క్రియానుష్ఠానము, తత్ఫలము లభించుచుండును.
31-36: చిత్తము బ్రహ్మభావమునాశ్రయించిన, వాసనలన్నియు నశించును. బ్రహ్మభావము విస్తరింప ఆకసమువలె ఉదయాస్తమయము, తెలివియులేకుండ నుండును. అప్పుడు ఈవిశాలజగత్తు ను కేవలము సాక్షివలె గమనించుచుండును. దేనిని గ్రహింపడు, భోగింపడు. శాంతుడైయుండును. అప్పుడాతడు లోపలగాని, వెలుపలగానివసింపడు. ఏవిధమైన దుఃఖమునుపొందడు.కర్మలనాచరింపడు నైష్కర్మసిద్ధికై యత్నించడు. పోయినదానికై చింతింపడు. వచ్చినదానిని అనుసరించును. దుఃఖించడు. సంతసించడు. నిండుసముద్రుని వలె తణుకుబెణుకులు లేకుండా నుండును. ఇట్లు మహాత్ములు మహా శయులునగు యోగులు నిండుమనంబున జీవన్ముక్తులై ఈజగత్తున సంచరించుచుందురు. ధీరులగు ఈజీవన్ముక్త పురుషులు ఇచ్ఛానుసారము వసించి, పిదప ఉపాదిలేశమును గూడ పరిత్యజించి అపరి ఛిన్నమగు విదేహముక్తి నందుదురు.
39. రాత్రివేళ దీపసహాయమున నేలను గాంచగలిగినట్లు, విచారమువలననే పురుషుడు కర్మకాండ, జ్ఞానకాండలందు నిర్ణయింపబడిన ధర్మ, కర్మ, బ్రహ్మతత్త్వములు నెరయగల్గును.
16 వ సర్గ: 11, 19: రాగ శూన్యులును, గ్రంథిహీనులును, సందేహపురుషులును వెలయుచో, తీర్థయాత్రలతోడను, తపస్సుతోడను అవుసరమేమి? సంతోషమే పరమలాభము. సత్సంగమే పరమగతి. విచారమే పరమజ్ఞానము. శమమే పరమసుఖము.
17వసర్గ:50:మహాత్ముడగు జీవన్ముక్తుని హృదయము పరమాత్మ. కోటికోటి హరిహర బ్రహ్మాదులు కలిసిననూ యీతనిబోలరు. ఏలయన, సత్తయొక్కయు, ఆనందముయొక్కయు విస్తారమున నితడు సర్వోత్తముడు. ఆత్మయొక్క సర్వోత్కృష్ట విస్తృతి యీతని హృదయమున నున్నది.
ఉత్పత్తి ప్రకరణము:9 వ సర్గ:
శాస్త్రవిధి ననుసరించుచూ, ఈవిశ్వమును ఆకాశామువలె శూన్యముగ జూచువాడు, పనిపాటల నొనర్చుచున్ననూ, జ్ఞానపరతంత్రుడై, జాగ్రదావస్థయందు గూడ నిద్రతోని మాడ్కి, నిర్వికారుడై మెలగు వాడు, మేల్కొనియు నిర్వికారాత్మతత్త్వమున సుషుప్తునివోలె నుండువాడు, సుషుప్తుడయ్యు అవిద్య యను నిద్ర నశించుటవలన ఆత్మయందు జాగరిల్లినవాడును, దేహెంద్రియములకు సాధారణజాగ్రదవస్థ లేనివాడును, జాగ్రదవస్థవలన స్వప్నస్థితి నశించినవాడును, 'అహం ' జ్ఞానమువలన ఎట్టి అభావమును బొందనివాడును, (ఇక్కడ యోగి, జీవన్ముక్తదశలో, ఒకేకాలములో, ఒక్కక్కవిషయములో ఒక్కొక్క అవస్థలో ఎలావుంటాడో, చివరికి యీఅవస్థలేమియు లేకుండా ఎలావుంటాడో వివరించారు) కార్యముల నొనర్చుచున్ననూ, ఒనర్చకపోయినను, కర్తృత్వాభిమానములు, పాపపుణ్యములు అంటకుండువాడు ను, ఎవ్వని చిదాత్మ ఆవరణముతొలగిన ప్రళయమును, ఆవరణముపడిన సృష్టిని గలవాడు, జగద్వ్యాపారము నాచరించుచున్ననూ, కామాదులవేగమునకు లొంగనివాడును, పదార్థములన్నింట ఆత్మ యొక్క పూర్ణత్వమును(చైతన్యమును) గాంచువాడు, జీవన్ముక్తుడు.
స్థితి ప్రకరణము: 19వ సర్గ:
22. ఎపుడు మనోవాక్కాయకర్మలచే శరీరము క్షోభ చెందకయుండునో, ఎపుడు జీవచైతన్యము శాంతముగను, స్వస్థముగనుండునో, సమత్వము చెందిన ప్రాణవాయువుతో గూడి హృదయాకాశమున జీవచైతన్యము అక్షుభితమైయుండి, నిర్వాతస్థానమందలి దీపమువలె కేవలము ప్రకాశమాత్రకార్య మొనర్చుచుండునో, అపుడవయవమందలి నాడులందు జీవప్రసారముండదు. గాన జీవచైతన్యము క్షోభ చెందకయే నేత్రాదిచిధ్రములగుండా బాహ్యాభ్యంతరముల జనకయుండును. (కొంతమంది దృష్టిలో సమాధి అనగా తాత్కాలికమరణము అనిభావన. కాని ఇక్కడ వశిష్టులవారు ప్రాణచైతన్యము అవయ ముల నాడులనుండి ఉపసంహరింపబడి, హృదయాకాశములో ఏకాగ్రమైవుండి, ఆఅఖండానందైకరసా నందము అనుభవించుచూ యుండుటవలన, చైతన్యములేని అవయవముల గుండా బయటకుపోదు, అంటే సమాధిలో మరణము సంభవించదు అని స్పష్టముచేస్తున్నారు. ఆధ్యాత్మికముగా ప్రాణోత్క్ర మణము, అంటే మరణము ఎలాసంభవిస్తుంది, అది ఎవరెవరికి ఎలావుంటుంది అన్నవిషయాలు ఇంకొకసారి తెలుసుకుందాము.)
25. చిత్తము సమస్తవ్యవహారముల నుండి ఉపరతి నెప్పుడు పొందునో, (ఆధ్యాత్మికముగా ఉపరతి అనగా విరమించుట, కలసియుండక పోవుట, అనిష్టముగా వుండుట) అప్పుడు శాస్త్రములద్వారా చైతన్యముయొక్క పరత్వమునెరిగి, ఏకాగ్రత విచారరూపములగు స్వప్నప్రయత్నములచే, బ్రహ్మ సాక్షాత్కారమొందు యోగి పైనతెల్పిన జాగ్రత్స్వప్నసుషుప్తువులను భిన్నభూమికల వ్యవహరించు చుండిననూ, లేక సమాధినిష్టుడైయున్ననూ, ధృఢబోధ గల్గియున్నందున నాతడెల్లప్పుడూ తురీయావస్ఠ యందున్నవాడనియే చెప్పబడును.
22వ సర్గ:24-28: దేశకాలాదులవశమున నుత్పన్నమైన అధ్యాత్మికాదితాపత్రయమును, సమస్త దుఃఖములు శరీరమునకేగాని, పూర్ణానందరూపమైనఆత్మస్వరూపుడగు నాకుగాదని నిశ్చయించుచూ, ఇవ్విధంబున భ్రమరహితుడై యుండువాడే, సత్యము నెరసినవాడగును. అనంతమగు దిక్కలాదులతో కూడినదియును, పరిచ్ఛిన్నమును, ఉత్పత్తిచలనాది క్రియాసహితమునునగు యీప్రపంచము నందంతటనూ నేనే వ్యాపించియున్నానను అనుభవముకలవాడే నిజమగుజ్ఞాని. సర్వవ్యాపకుడైననూ, తాను రోమాగ్రభాగమందలి కోటియవభాగము యొక్క లక్షవభాగము కంటెనూ ఇంకనూ సూక్ష్మమైన వాడని యెరుంగువాడే సత్యమును జూచువాడగును. జీవాత్మయు తద్భిన్నమగు యీజగత్తంతయూ చైతన్యజ్యోతి మాత్రమేయనియెరింగి, యివ్విధమున జగత్తును పరమాత్మకభిన్నముగా గాంచువాడే ఆత్మజ్ఞుడగును. సర్వశక్తిమంతుడును, అనంతుడును, అద్వితీయుడునునగు చిదాత్మాయే సమస్త పదార్థములందునూ యున్నట్లు జూచువాడే నిజముగా జూచువాడగును.
32. అహంకారముగాని, యీ దృశ్యముగాని యొకింతయూలేదు. అంతయు నిరామయమగు బ్రహ్మము మాత్రమేయని నిశ్చయించుచూ, భూతభవిష్యత్ వర్తమానముల యందును, వ్యక్తావ్యక్తముల మధ్యమస్థితి గల్గియున్న తన రూపమునెవడు గాంచునో అతడే సమ్యగ్దర్శి.
39-42. తర్కముచే నగమ్యమును, విక్షేపరహితమునునగు సన్మాత్రరూపమే ఈజగత్తను సమ్యక్ జ్ఞానము గలిగియుండుటచే, ఎవనికి త్యాజ్యగ్రాహ్యములకల్పన నశించిన, యతడే పురుషుడనబడును. ఆకాశమువలె ఏకాత్మస్వరూపుడై పదార్థరూపములయందు పూర్ణభావమున వ్యాపించియున్ననూ, ఆయా పదార్థరూపముల బొందక వాటియందనురక్తుడు గాకయుండు మహాత్ముడే నిరతిశయానంద మనుభవింప సమర్థుడగును. జాగ్రత్స్వప్నసుషుప్తువుల నుండి వినిర్ముక్తుడును, మృత్యువునకు ప్రేమస్పదుడును, సౌమ్యుడును, సర్వత్రసమబుద్ధి గలవాడును, తురీయావస్థయను ఉత్తమపదమున సుప్రతిష్ఠుడునునగు మహాత్మునకు నేను నమస్కరించుచున్నాను. బ్రహ్మండమందంతటనూ యొకే బ్రహ్మము వ్యాప్తమైయున్నదను నిశ్చయము గలవాడును, విచిత్రమును రమణీయమును నగు విభావములతో గూడిన ఈజగత్తు యొక్క సృష్టిస్థితిలయముల కల్పన యందెవనికి అపరిచ్ఛిన్నమగు బ్రహ్మవృత్తికలదో, అట్టి ఉత్తమజ్ఞానవంతుడగు జీవన్ముక్తునికి నేను నమస్కరించుచున్నాను.
ఉపశమ ప్రకరణము: 70వ సర్గ:
16-18: సుషుప్తిబుద్ధి గల జీవుడు పూర్వసాధనదశ నుండియే నిరహంకృత చిత్తముచే కర్మల గావించుచు, వాటిచే బంధింపబడక యుండుము. సుషుప్తివృత్తి నవలంభించి, ప్రారబ్దపరిపాకముచే సంప్రాప్తించిన వర్ణాశ్రమోపేతకర్మలను ఆచరింపుము, లేక ఆచరింపకుండుము. జ్ఞానికి కర్మగ్రహణము గాని, కర్మత్యాగము గాని రుచింపదు. కాని నిరాత్మజ్ఞులై ప్రారబ్దానుసారము వర్తించుచుందురు.
జీవన్ముక్తుని అవస్థలు: యోగవాసిష్ఠము: నిర్వాణ ప్రకరణము: పూర్వభాగము: 34వ సర్గ:
6-25: ఈతడు విషయవస్తువుల గురించి చిత్తచాపల్యము బొందుచున్ననూ, జీవన్ముక్తస్థితి యందు అది తొలగిపోవుచున్నది. అతడు సంసారమునందుండి జీవద్దశయందే ఉత్తీర్ణుడై, నిఖిల పదార్థముల సత్తయగు కేవలచైతన్యరూపము బొందును. అప్పుడాతడు పునర్జన్మరహితమగు సౌషుప్త పద (నిరతిశయానందస్వరూప)పాండిత్యము నపరిమితముగబొంది, గొప్పదగు బ్రహ్మపదమున విశ్రమించును. నీకింతవరకు మనోక్షయమున చైతన్యమునుబొందు స్థితిని చెప్పితిని. ఇప్పుడు పవిత్రమగు ద్వితీయావస్థను చెప్పుచున్నాను.
మనోదశనుండి విడివడిన ఈచైతన్యమే సూర్యచంద్రాది జ్యోతిష్పదార్థములనుండియు, అజ్ఞానాది అంధకారమునుండియు విడివడినకాంతిమయమై విశాలమగుఆకాశమువోలె స్వచ్ఛభాగమున వెల యును. అనంతరమియ్యది కాలక్రమమున గాఢసుషుప్త్యనుభవమువలెను, పాషాణకాఠిన్యము వలెను, సైంధవమునందలి రసమువలెను, వాయువునందలి స్పందన శక్తివలెను, ఎప్పుడెచ్చట కేవలచిన్మాత్ర రూపముగాపర్యవసించునో, అప్పుడు ఆకాశమందలి శూన్యతవలె పరమాకాశముతో గూడి బాహ్యవిషయ ఔత్సుక్యమును విడచి, వాయువువలన గదల్పబడని నీటివలె నిశ్చలభావమున వెలయును. అప్పు డయ్యది వాతలేఖ(వాతకణము) స్పందమును త్యజించునట్లును, పుష్పము సౌరభమును వీడు నట్లును, దేశాకాలములు త్యజించి, సమస్తవస్తువుల అనుభవము నుండి విడివడును. అనంతరము జడాజడ భావములనుండి విముక్తి బొంది, అపరిఛిన్నత్వముబొంది, ఒకానొక అనిర్వచనీయ సత్తను బొందును. ఈమహాసత్త దిక్కాలాద్యనవచ్ఛిన్నము. ఆస్థితి తురీయము, అకలంకము, అనామయము. ఆస్థితియందలి ఆనందము అన్నివస్తువులనుండి, అన్నికాలముల లభించు ఆనందముకంటే మహత్తర మైనది. ఈఆనందమును గాంచుచు, విశాలాక్షునివలె జీవన్ముక్తపురుషుడు వెలయుచుండును. నీకిప్పుడు చైతన్యము యొక్క ద్వితీయావస్థను చెప్పితిని. ఇక తృతీయస్థితిని చెప్పుచున్నాను.
ఈ చైతన్యము బ్రహ్మాకార అఖండచిత్తవృత్తిని, దానిననుసరించియుండు బ్రహ్మైక్యభావము నొందుట వలన నామరూపాతీతమగు బ్రహ్మము, ఆత్మమున్నగు సంజ్ఞల నతిక్రమించి కేవలస్వరూపమున వెల యును. అప్పుడయ్యది షడ్విధభావవికారములనుండి విడివడి, కాలముకంటే శాశ్వతమై, తమస్సునకు పరముననున్న స్వస్వరూపమున నిష్కలంకమై తురీయాతీతాదినామములకు అతీతమై పరమ పురుషార్థరూపమును బొందును. ఇదియే సుఖములన్నిటి యొక్క పరమావధి. శుభములన్నిటిలోను ప్రధానము, వినాశములేని ఈపవిత్రస్థితియే చైతన్యముయొక్క తృతీయావస్థ. ఈభూమికయందు వసించుట చాలాకష్టము. ఇది అన్నిమార్గములకును, అందరి పథికులకును దూరమై వెలయుచున్నది. నావాక్కులకుకూడ అతీతమై అభివర్ణింప శక్యముగాకయున్నది. ఈచెప్పబడిన చైతన్యము జాగ్రత్స్వప్న సుషుప్తువుల కతీతము. ఇందు నీవు నిత్యమధివసింపుము. ఇదియే సనాతనమగు పరమ దైవము.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము)