చైతన్యము
చైతన్యము ఆవస్థలలో చివరిది. సర్వప్రాణులలోను, పదార్ధములలోను స్థావరజంగమాత్మకమైన ఈ ప్రకృతిలోనూ నిండివున్నది చైతన్యమే. మనలోనున్న ఈప్రాణచైతన్యమును విశ్వము ఆవిర్భవించుటకు మూలకారణమైన ఆపరాచైతన్యముతో అనుసంధానింపవలెను. చైతన్యము గురించి సర్వసారోపనిషత్ ఈ ప్రకారముగా చెప్తోంది.
"అవస్థాత్రయ భావాభావ సాక్షి, స్వయం భావాభావరహితం, నిరంతర చైతన్యమాత్రం యథా తత్తురీయమ్. అవస్థాత్రయోపహిత మవస్తాప లక్షితంచ నిరవస్తం విశుద్ధమేవ చైతన్యం." "జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థల యొక్క భావాభావములను సాక్షిగాను, భావాభావములు తనకు లేకనుండు నిరంతర చైతన్యముగానుండు స్థితి ఏదియో అదితురీయము. అవస్థాత్రయముతో సంబంధపడినదిగాను, అవస్తా త్రయములచేత ఊహింపదగినదిగాను, అవస్తాత్రయము లేనిదిగను, శుద్ధమైనదిగను, నుండు నది ఏదియో, అదే చైతన్యము."
మానవునికి గల మూడు అవస్థల యొక్క భావాభావములకు, అనుభవములకు సాక్షిగాను, ఇవి తనకు లేకుండు స్థితి ఏదియో అదితురీయము. అనగా చిట్టచివరిది. ఇది ప్రాణసంబంధమైన చైతన్యము. ఈ అవస్తాత్రయములతో సంబంధము వున్నట్లు గాను, వీటిచే ఊహించుటకు వీలుగాను, మరియు వీటికి ఏవిధమైన సంబంధము లేనట్టిదైన శుద్ధమైనది అనంతచైతన్యము. ఇది అలౌకికము, పారలౌకికము.
మండలబ్రాహ్మణోపనిషత్ ధ్యానము గురించి ఈవిధంగా చెప్తోంది. "సర్వ శరీరేషు చైతన్యేకతా ధ్యానం" "సర్వశరీరములందునూ వుండు చైతన్యమొక్కటియేయని భావించియుండుటయే ధ్యానము." పైన చెప్పినటువంటి చైతన్యము అన్నింటియందు వుండునని భావించుటయే (అనుభవించుటయే) ధ్యానమని చెప్పబడుచున్నది. ధ్యానయోగములో చిట్టచివరి భావన ఇదియే. ఇచట కేవల చైతన్యభావన తప్ప ఇతర భావనలుండవు. దీనికి చాలా చక్కటిఉదాహరణలు "శ్రీ ఆదిపాండురంగ భక్తవిజయము" లో వున్నాయి. అందులో ఒకటి చూద్దాము. ఒకసారి నామదేవుడు రొట్టెలు చేస్తూ వుండగా, ఒక కుక్క వచ్చి రొట్టెలను నోటితో కరచి పట్టుకొని పారిపొతుంది. అప్పుడు నామదేవుడు నేతిగిన్నెను చేతితో పట్టుకొని దాని వెనుక పరిగెడతాడు. ఆకుక్క పండరీపురమంతా తిప్పి చివరికి నామదేవుడికి దొరుకుతుంది. అప్పుడు నామదేవుడు ఆకుక్కను జాగ్రత్తగా వొళ్ళో కూర్చోపెట్టుకొని, పాండురంగా! గట్టిగావున్న ఈ రొట్టెలను తింటే, నీనోటికి గుచ్చుకోవా? ఈనేతిలో ముంచిపెడతాను, అప్పుడు మెత్తగా వుంటాయి, అని ఆ రొట్టెలను నేతిలోముంచి ఆకుక్కకు పెడుతూవుంటాడు. కొంతమంది ఇదిచూసి ఆయనను వెక్కిరిస్తే, కొంతమంది ఆయన ఆకుక్కలో పాండురంగడిని చూడగలుగుతున్నాడని తెలుసుకొన్నారు. ఈస్థాయిలో శారీరిక, మానసిక అంతరాలు నశిస్తాయి. సర్వప్రాపంచిక కోరికలు, భావనలు నశిస్తాయి. చివరికి కర్మలు వేదనిర్దిష్టధర్మములు కూడా త్యజింపబడతాయి. నారద భక్తి సూత్రాలలొ 48, 49 సూత్రాలు ఈ విధంగా వున్నాయి.
48. "యః కర్మఫలం త్యజతి, కర్మాణి సంన్యస్యతి, తతో నిర్ద్వందోవాభవతి" "ఎవడు కర్మఫలములను వదలునో, ఎవడు స్వార్థమైన కర్మంబులను సన్యసించునో, వాడు సుఖదుఃఖాది ద్వంద్వంబులకు అతీతుడు."
49. "(యో)వేదానపి సంన్యస్యతి, కేవల మవిచ్ఛిన్నానురాగం భవతి" "ఎవడు వేదనిర్ధిష్ఠ ధర్మములను కూడ సన్యసించునో, అతడు నిర్మలమైనట్టి, ఎడలేనట్టి ననురాగంబును భగవంతునియెడల కలుగును."
పై వాక్యములను బట్టి విచారించినచో, చైతన్యస్వరూపభావన అర్థమగును. ఆతురీయమైన అవస్థలో దేనికీ తావు లేదు. ఆ చైతన్యస్వరూపముతొ భావైక్యము తప్ప దేనితొనూ పనిలేదు. మనము ఏరు దాట వలెను. పడవఎక్కి ఏరు దాటుతాము. అవతలిగట్టు ఎక్కిన తర్వాత పడవను ఏటిలోనే వదులుతాము తప్ప పడవను మోసుకొనిపోముకదా! అలాగే భోజనము చేయడానికి శుభ్రమైన ఆకును తెస్తాము. దానిని కడిగి భద్రపరుస్తాము. భోజనము చేసిన పిదప, ఆఆకును చెత్తకుండీలో పడవేస్తాము. అంటే, ఏరు దాటిన తర్వాత పడవ, భోజనము అయిన తర్వాత ఆకుయొక్క అవుసరము లేదు. వాటిని విడచి పెట్టవలసినదే. అలాగే, చైతన్యభావనకు వచ్చిన తర్వాత, ఆ మార్గమునకు ఉపయుక్తమైన వాటి యొక్క, అనగా పుణ్యకర్మలు, వాటి ఫలితాలు, భక్తి మొదలైన సాకారసంబంధమైన విషయాలు, జ్ఞాన, తపోనిష్టలు యొక్క అవుసరము లేదు. సాధకుని మనస్సు ఎల్లప్పుడూ ఆనిరంతర చైతన్యభావనలో, ఆపరమాత్మతో అనుసంధానింపబడి వుండాలి. అమృతనాదోపనిషత్ ఇలా చెప్తోంది. "శాస్త్రాణ్యధీత మేధావీ, అభ్యస్యచ పునఃపునః, పరమంబ్రహ్మవిజ్ఞాయ ఉల్కావత్తాన్యధోత్సృజేత్" "మేధాసంపన్నుడు శాస్త్రముల నధ్యయనముచేసి, అట్లధ్యయనము చేసినదానిని శ్రవణమననాదులచే మరలమరల నభ్య సించి, పరబ్రహ్మము నెరింగి, పిదప సాధనామాత్రములగు నాశాస్త్రములను విడచిపెట్టవలెను." ఈ స్థితిలో విశ్వచైతన్యభావన అంకురిస్తుంది. యోగవాశిష్టం ఉత్పత్తిప్రకరణములో ఈవిషయం చెప్పబడింది. "చిదిహస్తిహి చిన్మాత్రమిదం చిన్నయ మేవచ, చిత్వం చిదహమేతేచ లోకాశ్చిదితి సంగ్రహః" "ఈ ప్రపంచ మున చైతన్యమే కలదు. ఈప్రపంచమంతయూ చైతన్యమే అయివున్నది. ఇది అంతయూ చైతన్య మయమే అగును. "చిచ్చేత కల్పనా బంధస్యన్ముక్తిర్ముక్తిరుచ్యతే, చిదచేత్యాఖలాత్మేతి సర్వ సిద్దాంత సంగ్రహః" "చైతన్యము యొక్క విషయాకారకల్పనయే బంధము. అట్టి కల్పనలేకుండుటయే ముక్తి. విషయాకారరహితమగు చైతన్యమే పూర్ణాత్మ. ఇదియే సమస్త సిద్దాంతముల యొక్క సారంశము."
మొదటిశ్లోకములో సర్వము చైతన్యమయమని ప్రతిపాదింపబడినది. రెండవశ్లోకములో చైతన్యము కలిగించు భావాభావముల గురించి చక్కగా వివరింపబడినది. అవస్థాత్రయముతో కూడిన చైతన్యభావన లౌకికమైనట్టిది. అది విషయకారకమగును. తద్వారా అధోగతి కల్గును. కాని దానికతీతమైన విశ్వ చైతన్యమే నేను అన్న భావన ద్వారా ఆవిషయముల ప్రభావము నశించి పూర్ణాత్మ ప్రకాశించును. సమస్త సిద్దాంతముల యొక్క సారమిదియే యని గ్రహించవలెను.
ఈ చైతన్యము గురించి మాండూక్యోపనిషత్ మనకు ఈ విధంగా సరియైన అవగాహన కల్పిస్తోంది. "నాంతః ప్రజ్ఞం, నబహిప్రజ్ఞం, నోభయతః ప్రజ్ఞం, నప్రజ్ఞానఘనం,నప్రజ్ఞం, నాప్రజ్ఞం, అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణమచింత్య మవ్యపదేశ్య మేకాత్మప్రత్యయసారం, ప్రపంచోపశమం, శాంతం, శివమద్వైతం, చతుర్థం, మన్యంతే స ఆత్మా, స విజ్ఞేయః" "అంతరమైన చేతనకాదు. బహిరమైన చేతన కాదు. ఈరెండు అయిన చేతనకాదు. కరడుకట్టిన చేత కాదు. అచేతనకాదు. కనిపించనిది. వ్యవహారములకు అతీతమైనది. గ్రహించుటకు ఆశక్యమైనది. లక్షణములకు అతీతమైనది. చింతింప నలవి కానిది. నిర్దేశింపలేనిది. అన్ని పరిస్థితులలోను ఆత్మఒక్కటే అనే తత్త్వపుసారం. ప్రపంచము లన్నింటినీ ఉపశమింపచేసేదీ, శాంతమూ, ఆనందము, ద్వైతముకానిది, నాలుగవదీ అని భావిస్తారు. అతడే ఆత్మ. అతడే తెలుసుకోనవలసిన వాడు."
ఇందులో పరాచైతన్యము గురించి చెప్పబడినది. ఇది శరీరము లోపలనున్న చైతన్యముకాదు. ప్రాణుల చలనమువలన కలిగిన బాహ్యమైన చైతన్యముకాదు. ఈరెండు కలసి ఏర్పడినదికాదు. అచేతన మసలేకాదు. ఒకచోట ఘనీభవించిన చైతన్యముకాదు. ఈపాంచభౌతిక శరీరమునకు కనిపించనిదీ, అన్ని వ్యవహారములకు, ఉపాసనలకు అతీతమైనది, ఆలోచనల ద్వారా గోచరము కానిది, ఏవిధము గాను సూచింపనలవి కానిది, ఏవిధముగానైనను ఒక్కటే అను తత్త్వపుసారం. ఈవిశ్వము నంతటనూ నిండియుండి దానియొక్క సృష్టి, స్థితి, లయములకు మూలకారణమైనది. పరమశాంతము, అఖండైక నిర్మలానందము నొసంగునది. ద్వైతముకానిది. ఏవిధముగా నైననూ విభజించి చూడలేనిది. నీవు, నేను అను బేధము లేనిది, నాలుగవదీ, అనగా అవస్థాత్రయమునకు అతీతమైనది, అదియే ఆత్మ ద్వారా పొంద వలసిన మూలకారణము అని భావించాలి.
ఈ చైతన్యభావనలో పూర్తిగా మమైక్యమయిన తర్వాత, తురీయస్థితిని అనుభవించుటకు యోగ్యమైన జీవన్ముక్త స్థితి వస్తుంది. దాని గురించి మళ్లీ కలుసుకున్నప్పుడు తెలుసుకుందాము.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము)
చైతన్యము ఆవస్థలలో చివరిది. సర్వప్రాణులలోను, పదార్ధములలోను స్థావరజంగమాత్మకమైన ఈ ప్రకృతిలోనూ నిండివున్నది చైతన్యమే. మనలోనున్న ఈప్రాణచైతన్యమును విశ్వము ఆవిర్భవించుటకు మూలకారణమైన ఆపరాచైతన్యముతో అనుసంధానింపవలెను. చైతన్యము గురించి సర్వసారోపనిషత్ ఈ ప్రకారముగా చెప్తోంది.
"అవస్థాత్రయ భావాభావ సాక్షి, స్వయం భావాభావరహితం, నిరంతర చైతన్యమాత్రం యథా తత్తురీయమ్. అవస్థాత్రయోపహిత మవస్తాప లక్షితంచ నిరవస్తం విశుద్ధమేవ చైతన్యం." "జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థల యొక్క భావాభావములను సాక్షిగాను, భావాభావములు తనకు లేకనుండు నిరంతర చైతన్యముగానుండు స్థితి ఏదియో అదితురీయము. అవస్థాత్రయముతో సంబంధపడినదిగాను, అవస్తా త్రయములచేత ఊహింపదగినదిగాను, అవస్తాత్రయము లేనిదిగను, శుద్ధమైనదిగను, నుండు నది ఏదియో, అదే చైతన్యము."
మానవునికి గల మూడు అవస్థల యొక్క భావాభావములకు, అనుభవములకు సాక్షిగాను, ఇవి తనకు లేకుండు స్థితి ఏదియో అదితురీయము. అనగా చిట్టచివరిది. ఇది ప్రాణసంబంధమైన చైతన్యము. ఈ అవస్తాత్రయములతో సంబంధము వున్నట్లు గాను, వీటిచే ఊహించుటకు వీలుగాను, మరియు వీటికి ఏవిధమైన సంబంధము లేనట్టిదైన శుద్ధమైనది అనంతచైతన్యము. ఇది అలౌకికము, పారలౌకికము.
మండలబ్రాహ్మణోపనిషత్ ధ్యానము గురించి ఈవిధంగా చెప్తోంది. "సర్వ శరీరేషు చైతన్యేకతా ధ్యానం" "సర్వశరీరములందునూ వుండు చైతన్యమొక్కటియేయని భావించియుండుటయే ధ్యానము." పైన చెప్పినటువంటి చైతన్యము అన్నింటియందు వుండునని భావించుటయే (అనుభవించుటయే) ధ్యానమని చెప్పబడుచున్నది. ధ్యానయోగములో చిట్టచివరి భావన ఇదియే. ఇచట కేవల చైతన్యభావన తప్ప ఇతర భావనలుండవు. దీనికి చాలా చక్కటిఉదాహరణలు "శ్రీ ఆదిపాండురంగ భక్తవిజయము" లో వున్నాయి. అందులో ఒకటి చూద్దాము. ఒకసారి నామదేవుడు రొట్టెలు చేస్తూ వుండగా, ఒక కుక్క వచ్చి రొట్టెలను నోటితో కరచి పట్టుకొని పారిపొతుంది. అప్పుడు నామదేవుడు నేతిగిన్నెను చేతితో పట్టుకొని దాని వెనుక పరిగెడతాడు. ఆకుక్క పండరీపురమంతా తిప్పి చివరికి నామదేవుడికి దొరుకుతుంది. అప్పుడు నామదేవుడు ఆకుక్కను జాగ్రత్తగా వొళ్ళో కూర్చోపెట్టుకొని, పాండురంగా! గట్టిగావున్న ఈ రొట్టెలను తింటే, నీనోటికి గుచ్చుకోవా? ఈనేతిలో ముంచిపెడతాను, అప్పుడు మెత్తగా వుంటాయి, అని ఆ రొట్టెలను నేతిలోముంచి ఆకుక్కకు పెడుతూవుంటాడు. కొంతమంది ఇదిచూసి ఆయనను వెక్కిరిస్తే, కొంతమంది ఆయన ఆకుక్కలో పాండురంగడిని చూడగలుగుతున్నాడని తెలుసుకొన్నారు. ఈస్థాయిలో శారీరిక, మానసిక అంతరాలు నశిస్తాయి. సర్వప్రాపంచిక కోరికలు, భావనలు నశిస్తాయి. చివరికి కర్మలు వేదనిర్దిష్టధర్మములు కూడా త్యజింపబడతాయి. నారద భక్తి సూత్రాలలొ 48, 49 సూత్రాలు ఈ విధంగా వున్నాయి.
48. "యః కర్మఫలం త్యజతి, కర్మాణి సంన్యస్యతి, తతో నిర్ద్వందోవాభవతి" "ఎవడు కర్మఫలములను వదలునో, ఎవడు స్వార్థమైన కర్మంబులను సన్యసించునో, వాడు సుఖదుఃఖాది ద్వంద్వంబులకు అతీతుడు."
49. "(యో)వేదానపి సంన్యస్యతి, కేవల మవిచ్ఛిన్నానురాగం భవతి" "ఎవడు వేదనిర్ధిష్ఠ ధర్మములను కూడ సన్యసించునో, అతడు నిర్మలమైనట్టి, ఎడలేనట్టి ననురాగంబును భగవంతునియెడల కలుగును."
పై వాక్యములను బట్టి విచారించినచో, చైతన్యస్వరూపభావన అర్థమగును. ఆతురీయమైన అవస్థలో దేనికీ తావు లేదు. ఆ చైతన్యస్వరూపముతొ భావైక్యము తప్ప దేనితొనూ పనిలేదు. మనము ఏరు దాట వలెను. పడవఎక్కి ఏరు దాటుతాము. అవతలిగట్టు ఎక్కిన తర్వాత పడవను ఏటిలోనే వదులుతాము తప్ప పడవను మోసుకొనిపోముకదా! అలాగే భోజనము చేయడానికి శుభ్రమైన ఆకును తెస్తాము. దానిని కడిగి భద్రపరుస్తాము. భోజనము చేసిన పిదప, ఆఆకును చెత్తకుండీలో పడవేస్తాము. అంటే, ఏరు దాటిన తర్వాత పడవ, భోజనము అయిన తర్వాత ఆకుయొక్క అవుసరము లేదు. వాటిని విడచి పెట్టవలసినదే. అలాగే, చైతన్యభావనకు వచ్చిన తర్వాత, ఆ మార్గమునకు ఉపయుక్తమైన వాటి యొక్క, అనగా పుణ్యకర్మలు, వాటి ఫలితాలు, భక్తి మొదలైన సాకారసంబంధమైన విషయాలు, జ్ఞాన, తపోనిష్టలు యొక్క అవుసరము లేదు. సాధకుని మనస్సు ఎల్లప్పుడూ ఆనిరంతర చైతన్యభావనలో, ఆపరమాత్మతో అనుసంధానింపబడి వుండాలి. అమృతనాదోపనిషత్ ఇలా చెప్తోంది. "శాస్త్రాణ్యధీత మేధావీ, అభ్యస్యచ పునఃపునః, పరమంబ్రహ్మవిజ్ఞాయ ఉల్కావత్తాన్యధోత్సృజేత్" "మేధాసంపన్నుడు శాస్త్రముల నధ్యయనముచేసి, అట్లధ్యయనము చేసినదానిని శ్రవణమననాదులచే మరలమరల నభ్య సించి, పరబ్రహ్మము నెరింగి, పిదప సాధనామాత్రములగు నాశాస్త్రములను విడచిపెట్టవలెను." ఈ స్థితిలో విశ్వచైతన్యభావన అంకురిస్తుంది. యోగవాశిష్టం ఉత్పత్తిప్రకరణములో ఈవిషయం చెప్పబడింది. "చిదిహస్తిహి చిన్మాత్రమిదం చిన్నయ మేవచ, చిత్వం చిదహమేతేచ లోకాశ్చిదితి సంగ్రహః" "ఈ ప్రపంచ మున చైతన్యమే కలదు. ఈప్రపంచమంతయూ చైతన్యమే అయివున్నది. ఇది అంతయూ చైతన్య మయమే అగును. "చిచ్చేత కల్పనా బంధస్యన్ముక్తిర్ముక్తిరుచ్యతే, చిదచేత్యాఖలాత్మేతి సర్వ సిద్దాంత సంగ్రహః" "చైతన్యము యొక్క విషయాకారకల్పనయే బంధము. అట్టి కల్పనలేకుండుటయే ముక్తి. విషయాకారరహితమగు చైతన్యమే పూర్ణాత్మ. ఇదియే సమస్త సిద్దాంతముల యొక్క సారంశము."
మొదటిశ్లోకములో సర్వము చైతన్యమయమని ప్రతిపాదింపబడినది. రెండవశ్లోకములో చైతన్యము కలిగించు భావాభావముల గురించి చక్కగా వివరింపబడినది. అవస్థాత్రయముతో కూడిన చైతన్యభావన లౌకికమైనట్టిది. అది విషయకారకమగును. తద్వారా అధోగతి కల్గును. కాని దానికతీతమైన విశ్వ చైతన్యమే నేను అన్న భావన ద్వారా ఆవిషయముల ప్రభావము నశించి పూర్ణాత్మ ప్రకాశించును. సమస్త సిద్దాంతముల యొక్క సారమిదియే యని గ్రహించవలెను.
ఈ చైతన్యము గురించి మాండూక్యోపనిషత్ మనకు ఈ విధంగా సరియైన అవగాహన కల్పిస్తోంది. "నాంతః ప్రజ్ఞం, నబహిప్రజ్ఞం, నోభయతః ప్రజ్ఞం, నప్రజ్ఞానఘనం,నప్రజ్ఞం, నాప్రజ్ఞం, అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణమచింత్య మవ్యపదేశ్య మేకాత్మప్రత్యయసారం, ప్రపంచోపశమం, శాంతం, శివమద్వైతం, చతుర్థం, మన్యంతే స ఆత్మా, స విజ్ఞేయః" "అంతరమైన చేతనకాదు. బహిరమైన చేతన కాదు. ఈరెండు అయిన చేతనకాదు. కరడుకట్టిన చేత కాదు. అచేతనకాదు. కనిపించనిది. వ్యవహారములకు అతీతమైనది. గ్రహించుటకు ఆశక్యమైనది. లక్షణములకు అతీతమైనది. చింతింప నలవి కానిది. నిర్దేశింపలేనిది. అన్ని పరిస్థితులలోను ఆత్మఒక్కటే అనే తత్త్వపుసారం. ప్రపంచము లన్నింటినీ ఉపశమింపచేసేదీ, శాంతమూ, ఆనందము, ద్వైతముకానిది, నాలుగవదీ అని భావిస్తారు. అతడే ఆత్మ. అతడే తెలుసుకోనవలసిన వాడు."
ఇందులో పరాచైతన్యము గురించి చెప్పబడినది. ఇది శరీరము లోపలనున్న చైతన్యముకాదు. ప్రాణుల చలనమువలన కలిగిన బాహ్యమైన చైతన్యముకాదు. ఈరెండు కలసి ఏర్పడినదికాదు. అచేతన మసలేకాదు. ఒకచోట ఘనీభవించిన చైతన్యముకాదు. ఈపాంచభౌతిక శరీరమునకు కనిపించనిదీ, అన్ని వ్యవహారములకు, ఉపాసనలకు అతీతమైనది, ఆలోచనల ద్వారా గోచరము కానిది, ఏవిధము గాను సూచింపనలవి కానిది, ఏవిధముగానైనను ఒక్కటే అను తత్త్వపుసారం. ఈవిశ్వము నంతటనూ నిండియుండి దానియొక్క సృష్టి, స్థితి, లయములకు మూలకారణమైనది. పరమశాంతము, అఖండైక నిర్మలానందము నొసంగునది. ద్వైతముకానిది. ఏవిధముగా నైననూ విభజించి చూడలేనిది. నీవు, నేను అను బేధము లేనిది, నాలుగవదీ, అనగా అవస్థాత్రయమునకు అతీతమైనది, అదియే ఆత్మ ద్వారా పొంద వలసిన మూలకారణము అని భావించాలి.
ఈ చైతన్యభావనలో పూర్తిగా మమైక్యమయిన తర్వాత, తురీయస్థితిని అనుభవించుటకు యోగ్యమైన జీవన్ముక్త స్థితి వస్తుంది. దాని గురించి మళ్లీ కలుసుకున్నప్పుడు తెలుసుకుందాము.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము)