శుద్ధగంభీర నిరాకారపరమాత్మ స్వరూపాన్ని భావించుటకు, తెలుసుకొనుటకు, జన్మజరా మృత్యు చక్రమునుండి బయటపడి ఆపరమాత్మ స్వరూపముతో మమైక్యముచెంది మహాపరి నిర్వాణము పొందుటకు చేసే ప్రయాణములో "తత్వ విచారణ" అత్యంత ప్రముఖమైనది. మనం తెలుసుకొన గోరే దానిని సందేహముతో మొదలుపెట్టి జవాబును తెలుసుకొని దానిని పొందుటకు ప్రయత్నించాలి. మనకు కావలసిన దానియొక్క ఆవిర్భావాన్ని, మూలాన్ని, ఆధారాన్ని, సూటిగా ప్రశ్నించాలి. గజేంద్రుడు అడిగినట్లు,"ఎవ్వనిచే జనించు? జగమెవ్వని లోపలనుండు? లీనమై ఎవ్వని యందుడిందు? పరమేశ్వరుడెవ్వడు? మూలకారణంబెవ్వడు? అనాదిమధ్యలయుండెవ్వడు? సర్వము తానైన వాడెవ్వడు?" అని ప్రశ్నించుకొని వాటికి జవాబులు రాబట్టు కోవడానికి ప్రయత్నించాలి. యోగ వాషిష్టం ఉత్పత్తి ప్రకరణం లో ఇలా చెప్పారు:
"యత్నో యత్నేన కర్తవ్యో మోక్షార్ద్ధం యుక్తి పూర్వకమ్,యత్నయుక్తి విహీనస్య గోష్పదం దుస్తరం భవేత్"
"మోక్షము కొరకై యుక్తిపూర్వక ప్రయత్నముచే పుర్వపూర్వ సాధనలుసిద్ధింప, ఉతరోత్తర సాధనల యందు మరల యుక్తి పూర్వకముగ ప్రయత్నమాచరింప వలెను. ప్రయత్నమూ, యుక్తి లేని వారికి గోవుపాదమంత స్థలమున్ను దాటనశక్తమైయుండును." దీనిని నిశితముగా పరిశీలించినచో, మోక్షము కొరకై మొదట చేసిన ప్రయత్నములు సిద్ధించిన తర్వాత దానితో తృప్తి చెందక తదుపరి సాధనకై ప్రయత్నము చేయవలెను. దానిని యుక్తిపూర్వకముగా చేయవలెను. అట్లు చేయలేనిచో గోవుపాద మంత స్థలముకూడా దాటనశక్తుడై యుండును. ఈవిధంగా మనము ప్రతి స్థాయిలో తత్వవిచారాన్ని యుక్తి పూర్వకముగా కొనసాగించాలి. అదే యోగవాశిష్టం నిర్వాణప్రకరణంలో శ్రీవశిష్టులవారు ఈవిధంగా తెలియజేసారు:
"స్వయమేవ విచారేణ, విచార్యాత్మానమాత్మనా, యావన్నాధిగతం జ్ఞేయం, నతావధి గమ్యతే"
"ఎంతవరకు మనుజుడు విచారణ ద్వారా జ్ఞేయవస్తువగు ఆత్మను తాను స్వయముగా విచారించి ఎరుగకుండునో, అంతవరకు నద్దాని నాతడు పొందజాలకయే యుండును." దీనిని బట్టి మానవుడు తనంత తానే విచారణ చేసి, తెలిసికొనదగిన వస్తువును తెలుసుకొనవలెను గాని, యితర మార్గములు లేవు యని రుజువగుచున్నది. మరియు అదే ప్రకరణములో:
"అస్మిన్సంసార సంరంభే జాతానం దేహ ధారిణం, అపవర్గ క్షమౌ రామ ద్వావిమా ఉత్తమౌ క్రమౌ
ఎకస్థావద్గురుప్రోక్తాదనుష్టానా చ్చనై శనై, జన్మనాజన్మభిర్వాపి సిద్ధిదః సముదాహృతః
ద్వితీయ స్త్వాత్మ నైవాశు కించి ద్వ్యుత్పన్న చేతసా, భవతి జ్ఞానసంప్రాప్తి రాకాస ఫల పాతవత్"
"ఓ రామచంద్రా! ఈ ప్రపంచసంరంభమున జనించు జీవులకు చెప్పబోవు రెండు క్రమములున్నూ మోక్షమును కలుగజేయు సమర్ద్ధములై యున్నవి. అందొకటి గురూపదిష్టమగు అనుష్టానమును మెల్ల మెల్లగా సాధించుచూరాగా, ఈజన్మలోనో లేక కొన్నిజన్మలందు గాని మోక్షమును కలుగజేయునదియని చెప్పబడినది. ఒకింత పరిపక్వమైన చిత్తము కలవారికి తానుగావించు తత్త్వవిచారణచే ఆకాశము నుండి ఫలము పడు చందమున శీఘ్రముగా జ్ఞానము సంప్రాప్తించుట రెండవ క్రమమై యున్నదని," శ్రీ వశిష్టులవారు ఉపదేశించినారు.
దీనిని నిశితముగా పరిశీలించగా, శాస్త్ర ప్రోక్తములైన గురూపదేశ సంప్రాప్త అనుష్టానముల కన్నా, స్వయముగా చేయు తత్త్వవిచారణకే అధిక ప్రాధాన్యత నీయబడినది. తాను స్వయముగా విచారించి తెలుసుకొన్నదే బలీయంగా నాటుకొంటుంది. దానిపైనే ధృఢమైన ఏకాగ్రత కుదురుతుంది. ఒకవేళ యిట్టి అవగాహనకు రాలేకపోతే గురువు భాధ్యతవహించి ఈఆలోచనకు శిష్యుని ప్రేరేపించాలి. తత్త్వవిచారాన్ని రేకెత్తించాలి. ఎప్పుడో పురాణాల్లో వున్న, అమృతం కోసం జరిగిన 'క్షీరసాగర మధనాన్ని' మన మనస్సుల్లో జరపాలి. ఆ మధనంలోంచే అమృతతుల్యమైన "నిరాకార స్వరూపాన్ని" భావించ గలుగుతాము.
తత్త్వ విచారమనేది ఆధ్యాత్మిక విద్యకు మూలస్తంభం. ఇది పరమాత్మ అన్వేషణలో గల అన్ని స్థాయిలలోను అవుసరపడుతుంది. బీజగణితంలో మూల సూత్రమైన + మరియు - ల యొక్క సంబంధం ప్రతిచోట అవుసరమైనట్లు, ఈ తత్త్వవిచారణ కూడా ప్రతి స్థాయిలోనూ అవుసరమౌతుంది. పైపై స్థాయిలకు వెళ్ళేకొద్దీ తత్త్వవిచారణ అత్యంత సునిశితము, సూక్ష్మమూ అవుతూ, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మనలను అపప్రధలవైపు, అజ్ఞానంవైపు పడవేస్తూ, అసలైన త్రోవనుండి తప్పించి వేస్తూ ఉంటుంది. దీనియొక్క ప్రాధాన్యత గమనించి బుధులు, ద్రష్టలు అవుసరం ఉన్నా లేకపోయినా చాలచోట్ల దీనిగురించి చెప్పారు.
ఇంకా చెపాలంటే "ఉత్తమం తత్త్వచింతనం" అన్నారు. ఈ తత్త్వవిచారణ మనలను చాలా దగ్గర దారిలో పరమాత్మ వద్దకు తీసుకొని పోతుంది. ఈ తత్త్వవిచారాన్ని ఉపయోగించి గజేంద్రుడు 'ఎవ్వనిచే జనించు' అని మొదలుపెట్టి, 'లోకంబులు లోకేశులు, లోకస్థులు తెగినతుది' అని తెలుసుకొని, 'జిత్రచారునికి, సాక్షికి, నాత్మరుచికిని' అని విచారము చేసి 'నిఖిల కారణునకు, నిష్కారుణునకు నమస్కరింతు' అని, 'విశ్వకరు, విశ్వదూరిని', 'శాశ్వతు, నజు భజయింతున్' అని 'నీవె తప్ప ఇతః పరం బెరుంగ' అని స్వాత్మసమర్పణ చేసుకొని, ఆపరమాత్మని పొందాడు. అలా తత్త్వవిచారణ చేసిన గజేన్ద్రుడుని కాపాడటానికి వెంటనే పరుగుపరుగున 'సిరికిన్ చెప్పక, శంఖు చక్రమున్ చేదోయి సంధింపక' ఆపరమాత్మ వచ్చాడు. తత్వావిచారణయొక్క సద్యోఫలితమిదే. యోగవాషిష్టంలో కర్కటికో పాఖ్యనంలో కర్కటి రాక్షసి మొదట పదివేల ఏళ్ళు తపస్సు చేసి బ్రహ్మని ప్రత్యక్షం చేసుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ బ్రహ్మ అవుసరం పడి, ఒక నిమేషమాత్రం తత్త్వవిచారణ చేసి ఆ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం పొందుతుంది. ఇదే తత్త్వవిచారణలో ఉన్న గమ్మత్తు. మదానికి, తమస్సుకి, అజ్ఞాన పరాకాష్టకి ప్రతినిధి అయిన ఒక జంతువు, ఏనుగు, తత్వవిచారాన్ని చేసి, పరమాత్మని పొందగా, మనస్సు, బుద్ధి, చైతన్యము, యుక్తాయుక్త విచక్షణాజ్ఞానము గల మనం ఆ పరమాత్మని పొందలేమా? ఎవరికీ వారే ఈ ప్రశ్నని వేసుకోండి! ఇంతటి మహోన్నతమైన ఫలితాలని అందించే తత్త్వ విచారణ గురించి ఆలోచించి, తెలుసుకోండి.
దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయ ప్రార్ధన.
"హరి: ఓం"
"యత్నో యత్నేన కర్తవ్యో మోక్షార్ద్ధం యుక్తి పూర్వకమ్,యత్నయుక్తి విహీనస్య గోష్పదం దుస్తరం భవేత్"
"మోక్షము కొరకై యుక్తిపూర్వక ప్రయత్నముచే పుర్వపూర్వ సాధనలుసిద్ధింప, ఉతరోత్తర సాధనల యందు మరల యుక్తి పూర్వకముగ ప్రయత్నమాచరింప వలెను. ప్రయత్నమూ, యుక్తి లేని వారికి గోవుపాదమంత స్థలమున్ను దాటనశక్తమైయుండును." దీనిని నిశితముగా పరిశీలించినచో, మోక్షము కొరకై మొదట చేసిన ప్రయత్నములు సిద్ధించిన తర్వాత దానితో తృప్తి చెందక తదుపరి సాధనకై ప్రయత్నము చేయవలెను. దానిని యుక్తిపూర్వకముగా చేయవలెను. అట్లు చేయలేనిచో గోవుపాద మంత స్థలముకూడా దాటనశక్తుడై యుండును. ఈవిధంగా మనము ప్రతి స్థాయిలో తత్వవిచారాన్ని యుక్తి పూర్వకముగా కొనసాగించాలి. అదే యోగవాశిష్టం నిర్వాణప్రకరణంలో శ్రీవశిష్టులవారు ఈవిధంగా తెలియజేసారు:
"స్వయమేవ విచారేణ, విచార్యాత్మానమాత్మనా, యావన్నాధిగతం జ్ఞేయం, నతావధి గమ్యతే"
"ఎంతవరకు మనుజుడు విచారణ ద్వారా జ్ఞేయవస్తువగు ఆత్మను తాను స్వయముగా విచారించి ఎరుగకుండునో, అంతవరకు నద్దాని నాతడు పొందజాలకయే యుండును." దీనిని బట్టి మానవుడు తనంత తానే విచారణ చేసి, తెలిసికొనదగిన వస్తువును తెలుసుకొనవలెను గాని, యితర మార్గములు లేవు యని రుజువగుచున్నది. మరియు అదే ప్రకరణములో:
"అస్మిన్సంసార సంరంభే జాతానం దేహ ధారిణం, అపవర్గ క్షమౌ రామ ద్వావిమా ఉత్తమౌ క్రమౌ
ఎకస్థావద్గురుప్రోక్తాదనుష్టానా చ్చనై శనై, జన్మనాజన్మభిర్వాపి సిద్ధిదః సముదాహృతః
ద్వితీయ స్త్వాత్మ నైవాశు కించి ద్వ్యుత్పన్న చేతసా, భవతి జ్ఞానసంప్రాప్తి రాకాస ఫల పాతవత్"
"ఓ రామచంద్రా! ఈ ప్రపంచసంరంభమున జనించు జీవులకు చెప్పబోవు రెండు క్రమములున్నూ మోక్షమును కలుగజేయు సమర్ద్ధములై యున్నవి. అందొకటి గురూపదిష్టమగు అనుష్టానమును మెల్ల మెల్లగా సాధించుచూరాగా, ఈజన్మలోనో లేక కొన్నిజన్మలందు గాని మోక్షమును కలుగజేయునదియని చెప్పబడినది. ఒకింత పరిపక్వమైన చిత్తము కలవారికి తానుగావించు తత్త్వవిచారణచే ఆకాశము నుండి ఫలము పడు చందమున శీఘ్రముగా జ్ఞానము సంప్రాప్తించుట రెండవ క్రమమై యున్నదని," శ్రీ వశిష్టులవారు ఉపదేశించినారు.
దీనిని నిశితముగా పరిశీలించగా, శాస్త్ర ప్రోక్తములైన గురూపదేశ సంప్రాప్త అనుష్టానముల కన్నా, స్వయముగా చేయు తత్త్వవిచారణకే అధిక ప్రాధాన్యత నీయబడినది. తాను స్వయముగా విచారించి తెలుసుకొన్నదే బలీయంగా నాటుకొంటుంది. దానిపైనే ధృఢమైన ఏకాగ్రత కుదురుతుంది. ఒకవేళ యిట్టి అవగాహనకు రాలేకపోతే గురువు భాధ్యతవహించి ఈఆలోచనకు శిష్యుని ప్రేరేపించాలి. తత్త్వవిచారాన్ని రేకెత్తించాలి. ఎప్పుడో పురాణాల్లో వున్న, అమృతం కోసం జరిగిన 'క్షీరసాగర మధనాన్ని' మన మనస్సుల్లో జరపాలి. ఆ మధనంలోంచే అమృతతుల్యమైన "నిరాకార స్వరూపాన్ని" భావించ గలుగుతాము.
తత్త్వ విచారమనేది ఆధ్యాత్మిక విద్యకు మూలస్తంభం. ఇది పరమాత్మ అన్వేషణలో గల అన్ని స్థాయిలలోను అవుసరపడుతుంది. బీజగణితంలో మూల సూత్రమైన + మరియు - ల యొక్క సంబంధం ప్రతిచోట అవుసరమైనట్లు, ఈ తత్త్వవిచారణ కూడా ప్రతి స్థాయిలోనూ అవుసరమౌతుంది. పైపై స్థాయిలకు వెళ్ళేకొద్దీ తత్త్వవిచారణ అత్యంత సునిశితము, సూక్ష్మమూ అవుతూ, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మనలను అపప్రధలవైపు, అజ్ఞానంవైపు పడవేస్తూ, అసలైన త్రోవనుండి తప్పించి వేస్తూ ఉంటుంది. దీనియొక్క ప్రాధాన్యత గమనించి బుధులు, ద్రష్టలు అవుసరం ఉన్నా లేకపోయినా చాలచోట్ల దీనిగురించి చెప్పారు.
ఇంకా చెపాలంటే "ఉత్తమం తత్త్వచింతనం" అన్నారు. ఈ తత్త్వవిచారణ మనలను చాలా దగ్గర దారిలో పరమాత్మ వద్దకు తీసుకొని పోతుంది. ఈ తత్త్వవిచారాన్ని ఉపయోగించి గజేంద్రుడు 'ఎవ్వనిచే జనించు' అని మొదలుపెట్టి, 'లోకంబులు లోకేశులు, లోకస్థులు తెగినతుది' అని తెలుసుకొని, 'జిత్రచారునికి, సాక్షికి, నాత్మరుచికిని' అని విచారము చేసి 'నిఖిల కారణునకు, నిష్కారుణునకు నమస్కరింతు' అని, 'విశ్వకరు, విశ్వదూరిని', 'శాశ్వతు, నజు భజయింతున్' అని 'నీవె తప్ప ఇతః పరం బెరుంగ' అని స్వాత్మసమర్పణ చేసుకొని, ఆపరమాత్మని పొందాడు. అలా తత్త్వవిచారణ చేసిన గజేన్ద్రుడుని కాపాడటానికి వెంటనే పరుగుపరుగున 'సిరికిన్ చెప్పక, శంఖు చక్రమున్ చేదోయి సంధింపక' ఆపరమాత్మ వచ్చాడు. తత్వావిచారణయొక్క సద్యోఫలితమిదే. యోగవాషిష్టంలో కర్కటికో పాఖ్యనంలో కర్కటి రాక్షసి మొదట పదివేల ఏళ్ళు తపస్సు చేసి బ్రహ్మని ప్రత్యక్షం చేసుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ బ్రహ్మ అవుసరం పడి, ఒక నిమేషమాత్రం తత్త్వవిచారణ చేసి ఆ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం పొందుతుంది. ఇదే తత్త్వవిచారణలో ఉన్న గమ్మత్తు. మదానికి, తమస్సుకి, అజ్ఞాన పరాకాష్టకి ప్రతినిధి అయిన ఒక జంతువు, ఏనుగు, తత్వవిచారాన్ని చేసి, పరమాత్మని పొందగా, మనస్సు, బుద్ధి, చైతన్యము, యుక్తాయుక్త విచక్షణాజ్ఞానము గల మనం ఆ పరమాత్మని పొందలేమా? ఎవరికీ వారే ఈ ప్రశ్నని వేసుకోండి! ఇంతటి మహోన్నతమైన ఫలితాలని అందించే తత్త్వ విచారణ గురించి ఆలోచించి, తెలుసుకోండి.
దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయ ప్రార్ధన.
"హరి: ఓం"