మన స్థితి
పరమాత్మ సృజించిన సృష్టిలో ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నామో, అంటే ఎలా భ్రమల్లో, అజ్ఞానంతో ఆయా ఆవస్థలలో ఉన్నామో తెలుసుకుందాం. మనం గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో, ఉన్న, ఉండబోతున్న భ్రమలు, అవస్థలు, అజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే, అజ్ఞానాన్ని తెలుసుకుంటే, దానినుండి బయటపడి, సమ్యక్ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము కాబట్టి. భ్రమలనుండి బ్రహ్మాన్ని చేరే విధానం తెలుసుకుంటాము కాబట్టి. ఈ విషయంలో సనాతనులు, పెద్దలు, తత్త్వవేత్తలు ఏమి చెప్పారో తెలుసుకుందాం. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇచ్చాము.
భ్రమలు :
అన్నపూర్ణోపనిషత్:ప్రధమాధ్యాయము:
భ్రమలు 5విధములు. జీవుడు ఈశ్వరుడు భిన్నరూపులు అనునది మొదటిభ్రమ. (మనం సాధారణంగా చేసే మొదటిపొరపాటు ఇదే. మనలో ఉన్న ఆత్మ, పరమాత్మ వేరే అనుకోవడం. పైంగలో పనిషత్ ప్రకారం, "సృష్టి అంతా ఏర్పాటు అయినతర్వాత ఆసృష్టి అంతా జడముగా, ఎటువంటి స్పందన లేకుండావున్నది. అప్పుడు పరబ్రహ్మ ఈపరిస్థితిని గమనించి, ఈసృష్టిలో చైతన్యము అనగా తాను లేనందున ఇదిఅంతా జడముగాఉన్నదని, బ్రహ్మండములను, సమస్తవ్యష్టిశరీరములయొక్క మస్తకము లను బ్రద్దలుచేసి, ఆ(బ్రహ్మ)రంధ్రముల గుండా వాటన్నింటియందు చైతన్యరూపములో ప్రవేశించెను. ఆ శరీరములు మొదట జడములుగానున్ననూ, ఈశ్వరచైతన్యము ప్రవేశింపగనే చైతన్యవంతము లైనవి. ఈశ్వరుడు దేహత్రయతాదాత్మ్యము వలన కర్తృత్వమును భోక్తృత్వమును కలవాడయ్యెను. జీవుడుగా నున్న ఈశ్వరుడు స్థూలసూక్ష్మకారణదేహములను తానుగా అంటే దేహమేతానను భ్రాంతిగా భావించు ట వలన, మేలుకొనుట, స్వప్నములను గాంచుట, నిద్రపోవుట, మూర్ఛిల్లుట, మరణము పొందుట మొదలగు ధర్మములను కలిగినవాడై కులాలచక్రము, కుమ్మరిసారెవలె, పరిభ్రమించుచున్నాడు." చూసారా! సృష్ట్యాదిలో ఆ పరమాత్మే మనశరీరాల్లొ చైతన్యరూపంలో ప్రవేశిస్తే గాని మనకు వున్న జడత్వము పోలేదు. కాబట్టి మనలోనున్నది అంటే ఆత్మ ఆపరమాత్మ యొక్క అంశమే! ఈవిషయము లొ ఏమాత్రము తేడాగాని, పొరబాటు గాని లేదు.) ఆత్మనిష్టమైన కర్తృగుణము వాస్తవమనునది(నేను అంటే అర్థము దేహము అనే భావము) రెండవ భ్రమ. శరీరత్రయముతో గూడిన జీవుడు సంగము కలవాడన్నది (స్థూలసూక్ష్మకారణదేహములతో కూడిన పరమాత్మ ఈపాంచభౌతిక దేహముతో సంగము కలవాడనే భావము) మూడవ భ్రమ. జగత్కారణ రూపమునకు వికారిత్వము (పరమాత్మ వేరే, ప్రకృతి వేరే అనే భావము) నాల్గవ భ్రమ. కారణము కన్న భిన్నమైన జగత్తు సత్యమన్నది (మన కంటికి కనబడే ఈప్రకృతి శాశ్వతమైనదనే భావము) పంచమ భ్రమ.
పంచభ్రమ నివృత్తియు అప్పుడు చిత్తమున స్పురించెను. బింబ ప్రతిబింబ దర్శనముచే భేద భ్రమ తొలగిపోయెను. (అద్దములో మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటే, బింబము వేరు, ప్రతిబింబము వేరు కాదు. అలాగే మన శరీరములో ప్రతిబింబించిన ఆత్మ పరమాత్మ రూపమే. వేరుకాదు.) స్పటిక లోహితదర్శనముచే పారమార్ధికభ్రమ పోయినది. (స్పటికము అంటే ఏదైనా రత్నముమీద బయటినుండి కాంతి పడినప్పుడు ఆకాంతి ఆరత్నం లోపలనున్న వివిధకోణాలలో నున్న తలాలలో ప్రతిఫలించి ఇంకా కాంతివంతముగా కనపడుతుంది. అప్పుడు మనం ఆకాంతి ఆరత్నానిదే అను కొంటాము. కాని నిజానికి ఆకాంతి వేరే చోటునుండి వచ్చినది. కాని మనం ఈప్రతిఫలించడం అనే భ్రమలో పడిపోయి ఆకాంతి రత్నానిదే అనుకొంటాము. అలాగే నేను అన్న దానికి మనకు భౌతికంగా ప్రత్యక్షంగా కనపడే ఈ శరీరం కాదు. ఇప్పుడు మనకి మనం కొన్ని ప్రశ్నలు వేసుకొందాము. నేను తొడుక్కున్న చొక్కా ఎవరిది? జవాబు 'నాది'. నేను పెట్టుకున్న వాచీ ఎవరిది? జవాబు 'నాది'. ఈశరీరం ఎవరిది? జవాబు 'నాది'. ఈ మూడో జవాబులో వున్న 'నాది' అన్నది ఎవరూ? ఆలోచించండి. ఈశరీరం కాక ఇంకోటేదో ఈశరీరాన్ని 'నాది' అంటోంది. అదే ఆత్మ. 'నేను' అనే పదానికి నిజమైన కర్త ఆత్మే.) ఘటమఠాకాశ దర్శనముచే సంగి అన్న భ్రమ తొలగిపోయెను. (మన ఇంటిలో ఒక కుండను చూడండి. ఆ కుండలో ఏమి లేకపోయినా శూన్యప్రదేశము అంటే ఆకాశము వుంటుంది. అలా చూస్తూవుంటే మనం ఆఆకాశము నకు కుండతో వున్న సంబంధం వల్లే అలా వుందని, లేకపోతే దానికి ఉనికి లేదని అనుకుంటాము. మనం ఆకుండను బ్రద్దలుకొట్టామనుకోండి. అప్పుడు ఆకుండలో వున్న ఆకాశము, కుండ బయట వున్న మహాకాశముతో కలసి పోతుంది. కుండ లేకపోతే ఆకాశము యొక్క ఉనికికి ఏమాత్రం భంగము వాటిల్లదు. అల్లాగే ఈశరీరంలో వున్న ఆత్మ ఈశరీరముతో వున్నట్లు కనిపించినా, నిజానికి లేదు. ఈ శరీరము లేకపోతే ఆపరమాత్మలో వుంటుంది. అందువల్ల ఆత్మకు ఈశరీరముతో ఎంతమాత్రము సంగము అంటే సంభందము లేదు.) కనకరుచిక దర్శనముచే వికారిత్వ భ్రమ పోయినది. (మన ఇంట్లో వున్న ఉంగరము, నెక్లేసు, పాపిడిచేరు, గాజులు, వడ్డాణము, అరవంకీలు వంటి బంగారు ఆభరణాలు పరిశీలించండి. వాటికన్నింటికీ వేరువేరు ఆకారాలు, రూపాలు, పేర్లు వున్నాయి. దేనికదే విడివిడిగా దాని ప్రత్యేకత దానికుంటుంది. ఇప్పుడు మరల వాటి నన్నింటినీ వాటికి మూలవస్తువైన బంగారంలా చూడండి. ఇప్పుడవన్నీ ఒక్కటే! ఒకే మూలవస్తువైన బంగారం రకరకాలైన రూపాలుగా మార్చుకుని, రకరకాలైన వస్తువులుగా, రకరకాల పేర్లతో పిలువబడుతోంది. అదే ఒక్క బంగారమే. అలాగే ప్రకృతిలో ఎన్ని రకాలుగా మారి కనిపించినా, వాటికన్నింటికి మూలకారణమైన పరబ్రహ్మఒక్కటే!) రజ్జుసర్ప దర్శనముచే కారణభిన్నజగత్తుకు సత్యత్వ భ్రమ పోయినది. (చీకటిలో మనం తాడును చూసి పాములా భ్రమ చెందుతాము. ఆపాముని నిజమనుకొని చంపడానికి కర్ర తెస్తాము. ఈలోగా ఎవరో దీపం తెస్తారు. ఆవెలుతురులో తాడుని చూసి అయ్యో నేను పాము అనుకొన్నది నిజంగా తాడా! అనుకొంటాము. ఇప్పుడు చూడండి. దీపం వెలుతురు లేనంతవరకు పాము సత్యము. వెలుతురు పడినతర్వాత తాడు సత్యము. అలాగే మనం చూసేటటువంటి, అనుభవానికి వచ్చేటటువంటి ఈప్రకృతినే నిత్యమని, సత్యమని, శాశ్వతమని తలుస్తాము. నమ్ముతాము. కాని తత్వవిచారమనే దీపాన్నితెచ్చి, జ్ఞానమనే వెలుతురులో చూస్తే, నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది ప్రకృతి కాదని, దానికి మూలకారణమైన పరమాత్మని తెలుస్తుంది.) అప్పుడు భ్రమల్లో నున్న నా చిత్తము బ్రహ్మాకారమైనది.
అహంకారము:
యోగవాసిష్ఠము:ఉపశమ ప్రకరణము:74వ సర్గ:
4, 5: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వాసన, యింద్రియములు, మున్నగు కల్పిత నామరూపచిహ్నములను జలములతోగూడి ఆత్మయను సముద్రము స్ఫురించుచున్నది. పదార్ధముల గూర్చి మననము చేయుటచే మనస్సు, స్మరించుటచే చిత్తము, నిశ్చయించుటచే బుద్ధి, అభిమానించు టచే అహంకారము ఏర్పడుచున్నవి. ఇవి యన్నియు నొక్క అంతఃకరణము యొక్క వివిధ నామములే గాన చిత్తాహంకారము భేదము వాఙ్మాత్రమేగాని, యదార్ధముకాదు. ఏదిచిత్తమో అదియేఅహంకారము. ఏదిఅహంకారమో, అదియేచిత్తము. (ఈవిషయంలో చాలామందికి చాలాఅనుమానాలున్నాయి. చాలా మంది పొరపాటు పడుతుంటారుకూడా. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటన్నింటనీ కలిపి అంతఃకరణము లేదా అంతఃకరణలు అంటారు. ఇవి విడివిడిగా నాలుగుగా కనపడుతున్నా నిజానికి ఒక్కటే. చేసే పనినిబట్టి వాటిపేర్లు మారుతుంటాయి. ఉదాహరణకి ఒకేవ్యక్తి అనేకమందికి అనేక సంభందాలతో పిలువబడతాడు. ఒకరికి భర్త. కొందరికి తండ్రి. కొందరికి సోదరుడు.కొందరికి మేనమామ. అతనే పెదతండ్రి, బాబాయి, బావ, బావమరిది, అల్లుడు, మామ, మనుమడు, తాత, స్నేహితుడు, మొదలైన వాటితో పిలువబడతాడు. కాని వ్యక్తిఒకడే. అలాగే అంతఃకరణ ఒక్కటే అయినా అది చేసేపనిని బట్టి ఆయాపేర్లతో పిలువబడుతోంది. మననము అంటే తిరిగి తిరిగి అదే జ్ఞాపకము తెచ్చుకొనుటవలన మనస్సు, ఆలోచనచేయుటవలన చిత్తము, నిశ్చయించుటవలన బుద్ధి, అభిమానము అంటే నేను, నాది, నేనే చేస్తున్నాను అనే భావన వచ్చినపుడు అహంకారము, అని ఒకే దానిని పిలుస్తాము. ఇవి ఒక అంతఃకరణ యొక్క నాలుగు పార్శ్వాలు అంటే నాలుగు ముఖాలు. గమ్మత్తు ఏమిటంటే ప్రాపంచిక వాసనలకు, విషయాలకులోబడి ఆత్మే వీటిచేత ఈపనులు చేయిస్తుంది. కాబట్టి మనం పురుషప్రయత్నం చేత వీటిని మన ఆధీనం లోనికి తెచుకోవాలి.)
అవస్థలు:
పైంగలోపనిషత్:ద్వితీయాధ్యాయము:
అవిద్యలో ప్రతిబింబించిన చైతన్యమునకు (జీవునకు) మాత్రమే అవస్థాత్రయము చెప్పబడినవి. ఆ జీవుడే జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలను అనుభవించి, ఘటీయంత్రము వలె ఉద్వేగమును పొంది, జన్మించిన వానివలెను, మరణించిన వానివలెను, ఇచట నున్నవాడగుచున్నాడు. (ఇక్కడ తెలుసుకొన వలసిన విషయం ఏమిటంటే, ఆత్మ తానంతట తానున్నప్పుడు చైతన్య రూపములో శుద్ధసత్వతత్త్వముతో వుంటుంది. అది కర్మపాశముతో బంధింపబడి జన్మను పొంది, ఈ పంచభౌతికదేహములో ఇరుక్కొని, అజ్ఞానములో పడిందో, ఆఆత్మనే జీవుడు అంటారు. జ్ఞానస్వరూపములో వున్నది ఆత్మ. అజ్ఞానములో ఇరుక్కొన్నది జీవుడు. అలా ఇరుక్కొన్న జీవునికె అవస్థాత్రయమువుంటుంది. జ్ఞానముతో వున్న ఆత్మ కు ఈఅవస్థాత్రయముతో సంబంధములేకుండా వీటికతీతమైన సమాధ్యవస్థలో వుంటుంది.) పిమ్మట ఈ జీవునికి జాగ్రత్తు, స్వప్నము, సుషుప్తి, మూర్ఛ, మరణము అను అవస్థలు కలుగుచున్నవి. ఆయా దేవతలయొక్క అనుగ్రహముతో శ్రోతాదిజ్ఞానేంద్రియములతో శబ్దాదివిషయగ్రహణజ్ఞానము జాగ్రదావస్థ యగుచున్నది. ఆజాగ్రదావస్థలో భ్రూమధ్యమునందు జేరిన జీవుడు ఆపాదమస్తకపర్యంతము వ్యాపించి కృషిశ్రవణాదులగు సమస్తక్రియలకు కర్తయగుచున్నాడు. ఆయా కర్మలయొక్క ఫలముల ననుభవించు చున్నాడు. కర్తయగు నాజీవుడే శరీరమును విడిచిన పిమ్మట లోకాంతరమునకు పోయి అక్కడ కర్మా ర్జిత ఫలములు అనుభవించుచున్నాడు. అతడు సార్వభౌమునివలె వ్యవహారములలో నలిసిపోయి నిద్రపోవునిమిత్తమై శయనించుచున్నాడు. (అంతర్భవనమును ప్రవేశించుటకు మార్గము నాశ్రయించు చున్నాడు.)వాగాదికరణములు ఉపరమించియున్నప్పుడు గ్రాహ్యవ్యవహారములు లోపించి యున్నం దున, విశ్వుడుగా నున్న ఆ జీవుడే నాడీమండలము మధ్యలో సంచరించుచూ, తైజసభావము పొంది, వాసనారూపములోనున్న జగత్వైచిత్రమును స్వకీయభాసతో ప్రకాశింపచేయుచూ, స్వేచ్ఛానుసారము గా స్వయముగా విషయములను అనుభవించుచున్నాడు. చిత్తమను ఒకేసాధనము కలదిసుషుప్త్యవస్థ. ఆహారసంచారము నుండి తిరిగివచ్చిన పక్షి, పక్షములను పొట్టలోనికి ముడుచుకొని, గూటిలోనికి పోవు రీతిగా, ఈజీవుడు జాగ్రత్స్వప్న ప్రపంచవిషయముల ననుభవించి, అలసిపోయి, వాటన్నిటినుండి విరమించి, అజ్ఞానభూమికలో చేరి, స్వాత్మానందము ననుభవించుచున్నాడు.
ఆకస్మికముగా ఇనుపగుదియతోను, దండముతోను, ఇంకనూ ఇతర వస్తువులతోను కొట్టబడినవాని వలె భయజ్ఞానసహితుడై, సర్వేంద్రియములతో కంపము చెందుచున్నదో, అట్టివాని అవస్థను మరణ సన్నిభమగు మూర్ఛావస్థ అనెదరు. జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థల కంటె వేరుగానున్నదై, (చతుర్ముఖ) బ్రహ్మ మొదలు స్తంభమువరకూ నున్న సమస్తప్రాణికోటికి భయప్రదమైనదై, స్థూలదేహమును విడిపించు నదై యుండు నట్టి స్థితి మరణావస్థ యగుచున్నది. కర్మేంద్రియములును, జ్ఞానేంద్రియములును, వాని వృత్తులగు విషయములను, ప్రాణపంచకములను విసర్జించి, కామ్యకర్మలతోనూ, అజ్ఞానముతోను, పంచభూతములతొను కలిసియున్న జీవుడు పునర్జన్మపొంది లోకాంతరమునకు పోవుచున్నాడు. పూర్వకర్మల పరిపాకముచే నాతడు సుడిగుండమునందలి కీటకమువలె విశ్రాంతిలేక తిరుగు చుండును.
అజ్ఞాన భూమికలు:
వాసుదేవ మననము:
"దుఃఖస్యజన్మ, జన్మనః కర్మ, కర్మణః రాగద్వేషాది దోషః, దోషాణామ్ అభిమానః, అభిమానస్యః అవివేకః, అవివేకస్య అజ్ఞానం కారణాని భవంతి"
(అజ్ఞానానికి కారణాలు ఇలా చెప్పారు. నాకు లేదే అనే దుఃఖం వల్ల జన్మ వస్తుందట. ఆజన్మ వల్ల కర్మలు చేయాల్సివస్తుందట. ఆకర్మలవల్ల ఒకరిపట్ల ప్రేమ, ఒకరిపట్ల ద్వేషము మొదలైన దోషాలు వస్తాయిట. ఆదోషాల వల్ల అభిమానం వస్తుందంట. ఆవల్లమాలిన అభిమానంవల్ల విచక్షణా జ్ఞానం నశించి అవివేకం పుడుతుందంట. అలా వచ్చిన అవివేకం వల్ల అజ్ఞానం వస్తుందంట.)
మహోపనిషత్:పంచమోధ్యాయము:
అజ్ఞానము 7 అవస్థలుగా పరిణామము చెందుచున్నది. 1.బీజజాగ్రదావస్థ, 2.జాగ్రదావస్థ, 3.మహాజాగ్రదావస్థ, 4.జాగ్రత్ స్వప్నావస్థ, 5.స్వప్నావస్థ, 6.స్వప్నజాగ్రదావస్థ, 7.సుషుప్త్యవస్థ. ఈ ఏడు అవస్థలు ఒకటొకటి మరొకదానితో కలసి అనేక రూపములుగా అగుచున్నవి. వివిధరూపములలొ నున్న దీని లక్షణములను వినుము. మొట్టమొదటి సృష్టికి పూర్వము చేతనమే పుట్టకముందు, నామ రహితమును, నిర్మలమగు ఏ చైతన్యమున్నదో, ఆ చైతన్యమే భవిష్యత్తులో కల్పింపబడు చిత్త జీవాది శబ్దములకు, అర్ధములకు, విషయములకు, ఆశ్రయమగుచున్నది. బీజరుపములో నున్న జాగ్రదావస్థ ఏదికలదో, అదే బీజజాగ్రత్తు అని చెప్పబడును. ఇయ్యదియే జ్ఞప్తికి, భావమునకు, అహంకారమునకును క్రొత్త అవస్థ అయి వున్నది. దీనినే అవ్యక్తమందురు.
మొట్టమొదట లేదా ఆ పిమ్మట ఈ బీజజాగ్రత్తు నుండి క్రొత్తగా(సూక్ష్మముగా) లేచివచ్చిన నేను, నాది, యితడు, అతడు, అది, ఇది అనునట్టి వృత్తిజ్ఞానమే జాగ్రత్తు అని చెప్పబడును. జాగ్రత్తు అని చెప్పుచున్న జన్మాంతరసంబంధమగు నేను, నాది, అతడు, యితడు, అది, ఇది అనునట్టి వృత్తి పరము గా స్ఫుటముగా దర్శనమిచ్చుచున్న స్థూలజ్ఞానమే మహాజాగ్రత్తు అని చెప్పబడును. రూఢి గలవి, రూఢి లేనివి, జాగ్రదవస్థకు సంబంధించినవి. జాగ్రద్వికారమైనవి, సర్వప్రకారమైనవి, మనస్సుతో కల్పింప బడినవి, ఇట్టి వీనితో కూడిన సృష్టి జాగ్రత్స్వప్నమనబడును. ఒకేచంద్రుడు ఇద్దరుచంద్రులుగను, ముత్యపుచిప్ప వెండిగను, మరుభూములు జలవాహినులుగను కనిపించుట, ఇటువంటి బేధభ్రాంతి మనకు అనుభవములోనున్నది. అదేరీతిగా ఆత్మయందు వివిధభంగిమలతో దృశ్యజగత్తు కనిపించు చున్నది. దీనినే జాగ్రత్స్వప్నమని చెప్పెదరు. ఈదృశ్యము నాకు అల్పకాలము కన్పించినది, ఇయ్యది సత్యముగా పుట్టినది కాదు, అని ఈవిధముగా నిద్రనుండి మేల్కొనినవాడు దృశ్యమును గురించి చెప్పు చుండుట మనము చూచుచున్నాము. దీనినే స్వప్నమని చెప్పుదురు. అందువలన ఇచ్చట ఆత్మ యందు ఈ దృశ్యజగత్సంకల్పమే స్వప్నముగా నున్నది. చాలాకాలము వేదాంతవిజ్ఞానము వినియు, ఆత్మసాక్షాత్కారము కానందున, పెద్దల బోధలు అర్థముకానివిగా నున్నవి. అందువలన ప్రయత్నము చేసి, బహుకాలము మహాత్ములను అనుసరించుట స్వప్న జాగ్రత్తు.
అంతేగాక, జాగ్రదావస్థలో కూడ స్ఫురించునట్టి స్వప్నావస్థను, స్వప్నజాగ్రత్తని చెప్పెదరు. ఈ 6 అవస్థల యొక్క త్యాగరూపమైన జీవుని జడస్థితిని భవిష్యత్తులో దుఃఖానుభవముతో నున్న స్థితిని సుషుప్త్యవస్థ అందురు. తమో రూపములో నున్న ఈ సుషుప్త్యవస్థలో సర్వజగత్తు లీనమై యుండును. ఈ 7 అజ్ఞాన భూమికలు ఒక్కొక్కటి మరియొక్క భూమికతొ కలిసి వందలాది అజ్ఞానఅవస్థాభూమికలుగా ఏర్పడుచున్నవి.
మీ స్పందనలకోసం ఎదురు చూస్తూ వుంటాము.
పరమాత్మ సృజించిన సృష్టిలో ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నామో, అంటే ఎలా భ్రమల్లో, అజ్ఞానంతో ఆయా ఆవస్థలలో ఉన్నామో తెలుసుకుందాం. మనం గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో, ఉన్న, ఉండబోతున్న భ్రమలు, అవస్థలు, అజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే, అజ్ఞానాన్ని తెలుసుకుంటే, దానినుండి బయటపడి, సమ్యక్ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము కాబట్టి. భ్రమలనుండి బ్రహ్మాన్ని చేరే విధానం తెలుసుకుంటాము కాబట్టి. ఈ విషయంలో సనాతనులు, పెద్దలు, తత్త్వవేత్తలు ఏమి చెప్పారో తెలుసుకుందాం. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇచ్చాము.
భ్రమలు :
అన్నపూర్ణోపనిషత్:ప్రధమాధ్యాయము:
భ్రమలు 5విధములు. జీవుడు ఈశ్వరుడు భిన్నరూపులు అనునది మొదటిభ్రమ. (మనం సాధారణంగా చేసే మొదటిపొరపాటు ఇదే. మనలో ఉన్న ఆత్మ, పరమాత్మ వేరే అనుకోవడం. పైంగలో పనిషత్ ప్రకారం, "సృష్టి అంతా ఏర్పాటు అయినతర్వాత ఆసృష్టి అంతా జడముగా, ఎటువంటి స్పందన లేకుండావున్నది. అప్పుడు పరబ్రహ్మ ఈపరిస్థితిని గమనించి, ఈసృష్టిలో చైతన్యము అనగా తాను లేనందున ఇదిఅంతా జడముగాఉన్నదని, బ్రహ్మండములను, సమస్తవ్యష్టిశరీరములయొక్క మస్తకము లను బ్రద్దలుచేసి, ఆ(బ్రహ్మ)రంధ్రముల గుండా వాటన్నింటియందు చైతన్యరూపములో ప్రవేశించెను. ఆ శరీరములు మొదట జడములుగానున్ననూ, ఈశ్వరచైతన్యము ప్రవేశింపగనే చైతన్యవంతము లైనవి. ఈశ్వరుడు దేహత్రయతాదాత్మ్యము వలన కర్తృత్వమును భోక్తృత్వమును కలవాడయ్యెను. జీవుడుగా నున్న ఈశ్వరుడు స్థూలసూక్ష్మకారణదేహములను తానుగా అంటే దేహమేతానను భ్రాంతిగా భావించు ట వలన, మేలుకొనుట, స్వప్నములను గాంచుట, నిద్రపోవుట, మూర్ఛిల్లుట, మరణము పొందుట మొదలగు ధర్మములను కలిగినవాడై కులాలచక్రము, కుమ్మరిసారెవలె, పరిభ్రమించుచున్నాడు." చూసారా! సృష్ట్యాదిలో ఆ పరమాత్మే మనశరీరాల్లొ చైతన్యరూపంలో ప్రవేశిస్తే గాని మనకు వున్న జడత్వము పోలేదు. కాబట్టి మనలోనున్నది అంటే ఆత్మ ఆపరమాత్మ యొక్క అంశమే! ఈవిషయము లొ ఏమాత్రము తేడాగాని, పొరబాటు గాని లేదు.) ఆత్మనిష్టమైన కర్తృగుణము వాస్తవమనునది(నేను అంటే అర్థము దేహము అనే భావము) రెండవ భ్రమ. శరీరత్రయముతో గూడిన జీవుడు సంగము కలవాడన్నది (స్థూలసూక్ష్మకారణదేహములతో కూడిన పరమాత్మ ఈపాంచభౌతిక దేహముతో సంగము కలవాడనే భావము) మూడవ భ్రమ. జగత్కారణ రూపమునకు వికారిత్వము (పరమాత్మ వేరే, ప్రకృతి వేరే అనే భావము) నాల్గవ భ్రమ. కారణము కన్న భిన్నమైన జగత్తు సత్యమన్నది (మన కంటికి కనబడే ఈప్రకృతి శాశ్వతమైనదనే భావము) పంచమ భ్రమ.
పంచభ్రమ నివృత్తియు అప్పుడు చిత్తమున స్పురించెను. బింబ ప్రతిబింబ దర్శనముచే భేద భ్రమ తొలగిపోయెను. (అద్దములో మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటే, బింబము వేరు, ప్రతిబింబము వేరు కాదు. అలాగే మన శరీరములో ప్రతిబింబించిన ఆత్మ పరమాత్మ రూపమే. వేరుకాదు.) స్పటిక లోహితదర్శనముచే పారమార్ధికభ్రమ పోయినది. (స్పటికము అంటే ఏదైనా రత్నముమీద బయటినుండి కాంతి పడినప్పుడు ఆకాంతి ఆరత్నం లోపలనున్న వివిధకోణాలలో నున్న తలాలలో ప్రతిఫలించి ఇంకా కాంతివంతముగా కనపడుతుంది. అప్పుడు మనం ఆకాంతి ఆరత్నానిదే అను కొంటాము. కాని నిజానికి ఆకాంతి వేరే చోటునుండి వచ్చినది. కాని మనం ఈప్రతిఫలించడం అనే భ్రమలో పడిపోయి ఆకాంతి రత్నానిదే అనుకొంటాము. అలాగే నేను అన్న దానికి మనకు భౌతికంగా ప్రత్యక్షంగా కనపడే ఈ శరీరం కాదు. ఇప్పుడు మనకి మనం కొన్ని ప్రశ్నలు వేసుకొందాము. నేను తొడుక్కున్న చొక్కా ఎవరిది? జవాబు 'నాది'. నేను పెట్టుకున్న వాచీ ఎవరిది? జవాబు 'నాది'. ఈశరీరం ఎవరిది? జవాబు 'నాది'. ఈ మూడో జవాబులో వున్న 'నాది' అన్నది ఎవరూ? ఆలోచించండి. ఈశరీరం కాక ఇంకోటేదో ఈశరీరాన్ని 'నాది' అంటోంది. అదే ఆత్మ. 'నేను' అనే పదానికి నిజమైన కర్త ఆత్మే.) ఘటమఠాకాశ దర్శనముచే సంగి అన్న భ్రమ తొలగిపోయెను. (మన ఇంటిలో ఒక కుండను చూడండి. ఆ కుండలో ఏమి లేకపోయినా శూన్యప్రదేశము అంటే ఆకాశము వుంటుంది. అలా చూస్తూవుంటే మనం ఆఆకాశము నకు కుండతో వున్న సంబంధం వల్లే అలా వుందని, లేకపోతే దానికి ఉనికి లేదని అనుకుంటాము. మనం ఆకుండను బ్రద్దలుకొట్టామనుకోండి. అప్పుడు ఆకుండలో వున్న ఆకాశము, కుండ బయట వున్న మహాకాశముతో కలసి పోతుంది. కుండ లేకపోతే ఆకాశము యొక్క ఉనికికి ఏమాత్రం భంగము వాటిల్లదు. అల్లాగే ఈశరీరంలో వున్న ఆత్మ ఈశరీరముతో వున్నట్లు కనిపించినా, నిజానికి లేదు. ఈ శరీరము లేకపోతే ఆపరమాత్మలో వుంటుంది. అందువల్ల ఆత్మకు ఈశరీరముతో ఎంతమాత్రము సంగము అంటే సంభందము లేదు.) కనకరుచిక దర్శనముచే వికారిత్వ భ్రమ పోయినది. (మన ఇంట్లో వున్న ఉంగరము, నెక్లేసు, పాపిడిచేరు, గాజులు, వడ్డాణము, అరవంకీలు వంటి బంగారు ఆభరణాలు పరిశీలించండి. వాటికన్నింటికీ వేరువేరు ఆకారాలు, రూపాలు, పేర్లు వున్నాయి. దేనికదే విడివిడిగా దాని ప్రత్యేకత దానికుంటుంది. ఇప్పుడు మరల వాటి నన్నింటినీ వాటికి మూలవస్తువైన బంగారంలా చూడండి. ఇప్పుడవన్నీ ఒక్కటే! ఒకే మూలవస్తువైన బంగారం రకరకాలైన రూపాలుగా మార్చుకుని, రకరకాలైన వస్తువులుగా, రకరకాల పేర్లతో పిలువబడుతోంది. అదే ఒక్క బంగారమే. అలాగే ప్రకృతిలో ఎన్ని రకాలుగా మారి కనిపించినా, వాటికన్నింటికి మూలకారణమైన పరబ్రహ్మఒక్కటే!) రజ్జుసర్ప దర్శనముచే కారణభిన్నజగత్తుకు సత్యత్వ భ్రమ పోయినది. (చీకటిలో మనం తాడును చూసి పాములా భ్రమ చెందుతాము. ఆపాముని నిజమనుకొని చంపడానికి కర్ర తెస్తాము. ఈలోగా ఎవరో దీపం తెస్తారు. ఆవెలుతురులో తాడుని చూసి అయ్యో నేను పాము అనుకొన్నది నిజంగా తాడా! అనుకొంటాము. ఇప్పుడు చూడండి. దీపం వెలుతురు లేనంతవరకు పాము సత్యము. వెలుతురు పడినతర్వాత తాడు సత్యము. అలాగే మనం చూసేటటువంటి, అనుభవానికి వచ్చేటటువంటి ఈప్రకృతినే నిత్యమని, సత్యమని, శాశ్వతమని తలుస్తాము. నమ్ముతాము. కాని తత్వవిచారమనే దీపాన్నితెచ్చి, జ్ఞానమనే వెలుతురులో చూస్తే, నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది ప్రకృతి కాదని, దానికి మూలకారణమైన పరమాత్మని తెలుస్తుంది.) అప్పుడు భ్రమల్లో నున్న నా చిత్తము బ్రహ్మాకారమైనది.
అహంకారము:
యోగవాసిష్ఠము:ఉపశమ ప్రకరణము:74వ సర్గ:
4, 5: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వాసన, యింద్రియములు, మున్నగు కల్పిత నామరూపచిహ్నములను జలములతోగూడి ఆత్మయను సముద్రము స్ఫురించుచున్నది. పదార్ధముల గూర్చి మననము చేయుటచే మనస్సు, స్మరించుటచే చిత్తము, నిశ్చయించుటచే బుద్ధి, అభిమానించు టచే అహంకారము ఏర్పడుచున్నవి. ఇవి యన్నియు నొక్క అంతఃకరణము యొక్క వివిధ నామములే గాన చిత్తాహంకారము భేదము వాఙ్మాత్రమేగాని, యదార్ధముకాదు. ఏదిచిత్తమో అదియేఅహంకారము. ఏదిఅహంకారమో, అదియేచిత్తము. (ఈవిషయంలో చాలామందికి చాలాఅనుమానాలున్నాయి. చాలా మంది పొరపాటు పడుతుంటారుకూడా. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటన్నింటనీ కలిపి అంతఃకరణము లేదా అంతఃకరణలు అంటారు. ఇవి విడివిడిగా నాలుగుగా కనపడుతున్నా నిజానికి ఒక్కటే. చేసే పనినిబట్టి వాటిపేర్లు మారుతుంటాయి. ఉదాహరణకి ఒకేవ్యక్తి అనేకమందికి అనేక సంభందాలతో పిలువబడతాడు. ఒకరికి భర్త. కొందరికి తండ్రి. కొందరికి సోదరుడు.కొందరికి మేనమామ. అతనే పెదతండ్రి, బాబాయి, బావ, బావమరిది, అల్లుడు, మామ, మనుమడు, తాత, స్నేహితుడు, మొదలైన వాటితో పిలువబడతాడు. కాని వ్యక్తిఒకడే. అలాగే అంతఃకరణ ఒక్కటే అయినా అది చేసేపనిని బట్టి ఆయాపేర్లతో పిలువబడుతోంది. మననము అంటే తిరిగి తిరిగి అదే జ్ఞాపకము తెచ్చుకొనుటవలన మనస్సు, ఆలోచనచేయుటవలన చిత్తము, నిశ్చయించుటవలన బుద్ధి, అభిమానము అంటే నేను, నాది, నేనే చేస్తున్నాను అనే భావన వచ్చినపుడు అహంకారము, అని ఒకే దానిని పిలుస్తాము. ఇవి ఒక అంతఃకరణ యొక్క నాలుగు పార్శ్వాలు అంటే నాలుగు ముఖాలు. గమ్మత్తు ఏమిటంటే ప్రాపంచిక వాసనలకు, విషయాలకులోబడి ఆత్మే వీటిచేత ఈపనులు చేయిస్తుంది. కాబట్టి మనం పురుషప్రయత్నం చేత వీటిని మన ఆధీనం లోనికి తెచుకోవాలి.)
అవస్థలు:
పైంగలోపనిషత్:ద్వితీయాధ్యాయము:
అవిద్యలో ప్రతిబింబించిన చైతన్యమునకు (జీవునకు) మాత్రమే అవస్థాత్రయము చెప్పబడినవి. ఆ జీవుడే జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలను అనుభవించి, ఘటీయంత్రము వలె ఉద్వేగమును పొంది, జన్మించిన వానివలెను, మరణించిన వానివలెను, ఇచట నున్నవాడగుచున్నాడు. (ఇక్కడ తెలుసుకొన వలసిన విషయం ఏమిటంటే, ఆత్మ తానంతట తానున్నప్పుడు చైతన్య రూపములో శుద్ధసత్వతత్త్వముతో వుంటుంది. అది కర్మపాశముతో బంధింపబడి జన్మను పొంది, ఈ పంచభౌతికదేహములో ఇరుక్కొని, అజ్ఞానములో పడిందో, ఆఆత్మనే జీవుడు అంటారు. జ్ఞానస్వరూపములో వున్నది ఆత్మ. అజ్ఞానములో ఇరుక్కొన్నది జీవుడు. అలా ఇరుక్కొన్న జీవునికె అవస్థాత్రయమువుంటుంది. జ్ఞానముతో వున్న ఆత్మ కు ఈఅవస్థాత్రయముతో సంబంధములేకుండా వీటికతీతమైన సమాధ్యవస్థలో వుంటుంది.) పిమ్మట ఈ జీవునికి జాగ్రత్తు, స్వప్నము, సుషుప్తి, మూర్ఛ, మరణము అను అవస్థలు కలుగుచున్నవి. ఆయా దేవతలయొక్క అనుగ్రహముతో శ్రోతాదిజ్ఞానేంద్రియములతో శబ్దాదివిషయగ్రహణజ్ఞానము జాగ్రదావస్థ యగుచున్నది. ఆజాగ్రదావస్థలో భ్రూమధ్యమునందు జేరిన జీవుడు ఆపాదమస్తకపర్యంతము వ్యాపించి కృషిశ్రవణాదులగు సమస్తక్రియలకు కర్తయగుచున్నాడు. ఆయా కర్మలయొక్క ఫలముల ననుభవించు చున్నాడు. కర్తయగు నాజీవుడే శరీరమును విడిచిన పిమ్మట లోకాంతరమునకు పోయి అక్కడ కర్మా ర్జిత ఫలములు అనుభవించుచున్నాడు. అతడు సార్వభౌమునివలె వ్యవహారములలో నలిసిపోయి నిద్రపోవునిమిత్తమై శయనించుచున్నాడు. (అంతర్భవనమును ప్రవేశించుటకు మార్గము నాశ్రయించు చున్నాడు.)వాగాదికరణములు ఉపరమించియున్నప్పుడు గ్రాహ్యవ్యవహారములు లోపించి యున్నం దున, విశ్వుడుగా నున్న ఆ జీవుడే నాడీమండలము మధ్యలో సంచరించుచూ, తైజసభావము పొంది, వాసనారూపములోనున్న జగత్వైచిత్రమును స్వకీయభాసతో ప్రకాశింపచేయుచూ, స్వేచ్ఛానుసారము గా స్వయముగా విషయములను అనుభవించుచున్నాడు. చిత్తమను ఒకేసాధనము కలదిసుషుప్త్యవస్థ. ఆహారసంచారము నుండి తిరిగివచ్చిన పక్షి, పక్షములను పొట్టలోనికి ముడుచుకొని, గూటిలోనికి పోవు రీతిగా, ఈజీవుడు జాగ్రత్స్వప్న ప్రపంచవిషయముల ననుభవించి, అలసిపోయి, వాటన్నిటినుండి విరమించి, అజ్ఞానభూమికలో చేరి, స్వాత్మానందము ననుభవించుచున్నాడు.
ఆకస్మికముగా ఇనుపగుదియతోను, దండముతోను, ఇంకనూ ఇతర వస్తువులతోను కొట్టబడినవాని వలె భయజ్ఞానసహితుడై, సర్వేంద్రియములతో కంపము చెందుచున్నదో, అట్టివాని అవస్థను మరణ సన్నిభమగు మూర్ఛావస్థ అనెదరు. జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థల కంటె వేరుగానున్నదై, (చతుర్ముఖ) బ్రహ్మ మొదలు స్తంభమువరకూ నున్న సమస్తప్రాణికోటికి భయప్రదమైనదై, స్థూలదేహమును విడిపించు నదై యుండు నట్టి స్థితి మరణావస్థ యగుచున్నది. కర్మేంద్రియములును, జ్ఞానేంద్రియములును, వాని వృత్తులగు విషయములను, ప్రాణపంచకములను విసర్జించి, కామ్యకర్మలతోనూ, అజ్ఞానముతోను, పంచభూతములతొను కలిసియున్న జీవుడు పునర్జన్మపొంది లోకాంతరమునకు పోవుచున్నాడు. పూర్వకర్మల పరిపాకముచే నాతడు సుడిగుండమునందలి కీటకమువలె విశ్రాంతిలేక తిరుగు చుండును.
అజ్ఞాన భూమికలు:
వాసుదేవ మననము:
"దుఃఖస్యజన్మ, జన్మనః కర్మ, కర్మణః రాగద్వేషాది దోషః, దోషాణామ్ అభిమానః, అభిమానస్యః అవివేకః, అవివేకస్య అజ్ఞానం కారణాని భవంతి"
(అజ్ఞానానికి కారణాలు ఇలా చెప్పారు. నాకు లేదే అనే దుఃఖం వల్ల జన్మ వస్తుందట. ఆజన్మ వల్ల కర్మలు చేయాల్సివస్తుందట. ఆకర్మలవల్ల ఒకరిపట్ల ప్రేమ, ఒకరిపట్ల ద్వేషము మొదలైన దోషాలు వస్తాయిట. ఆదోషాల వల్ల అభిమానం వస్తుందంట. ఆవల్లమాలిన అభిమానంవల్ల విచక్షణా జ్ఞానం నశించి అవివేకం పుడుతుందంట. అలా వచ్చిన అవివేకం వల్ల అజ్ఞానం వస్తుందంట.)
మహోపనిషత్:పంచమోధ్యాయము:
అజ్ఞానము 7 అవస్థలుగా పరిణామము చెందుచున్నది. 1.బీజజాగ్రదావస్థ, 2.జాగ్రదావస్థ, 3.మహాజాగ్రదావస్థ, 4.జాగ్రత్ స్వప్నావస్థ, 5.స్వప్నావస్థ, 6.స్వప్నజాగ్రదావస్థ, 7.సుషుప్త్యవస్థ. ఈ ఏడు అవస్థలు ఒకటొకటి మరొకదానితో కలసి అనేక రూపములుగా అగుచున్నవి. వివిధరూపములలొ నున్న దీని లక్షణములను వినుము. మొట్టమొదటి సృష్టికి పూర్వము చేతనమే పుట్టకముందు, నామ రహితమును, నిర్మలమగు ఏ చైతన్యమున్నదో, ఆ చైతన్యమే భవిష్యత్తులో కల్పింపబడు చిత్త జీవాది శబ్దములకు, అర్ధములకు, విషయములకు, ఆశ్రయమగుచున్నది. బీజరుపములో నున్న జాగ్రదావస్థ ఏదికలదో, అదే బీజజాగ్రత్తు అని చెప్పబడును. ఇయ్యదియే జ్ఞప్తికి, భావమునకు, అహంకారమునకును క్రొత్త అవస్థ అయి వున్నది. దీనినే అవ్యక్తమందురు.
మొట్టమొదట లేదా ఆ పిమ్మట ఈ బీజజాగ్రత్తు నుండి క్రొత్తగా(సూక్ష్మముగా) లేచివచ్చిన నేను, నాది, యితడు, అతడు, అది, ఇది అనునట్టి వృత్తిజ్ఞానమే జాగ్రత్తు అని చెప్పబడును. జాగ్రత్తు అని చెప్పుచున్న జన్మాంతరసంబంధమగు నేను, నాది, అతడు, యితడు, అది, ఇది అనునట్టి వృత్తి పరము గా స్ఫుటముగా దర్శనమిచ్చుచున్న స్థూలజ్ఞానమే మహాజాగ్రత్తు అని చెప్పబడును. రూఢి గలవి, రూఢి లేనివి, జాగ్రదవస్థకు సంబంధించినవి. జాగ్రద్వికారమైనవి, సర్వప్రకారమైనవి, మనస్సుతో కల్పింప బడినవి, ఇట్టి వీనితో కూడిన సృష్టి జాగ్రత్స్వప్నమనబడును. ఒకేచంద్రుడు ఇద్దరుచంద్రులుగను, ముత్యపుచిప్ప వెండిగను, మరుభూములు జలవాహినులుగను కనిపించుట, ఇటువంటి బేధభ్రాంతి మనకు అనుభవములోనున్నది. అదేరీతిగా ఆత్మయందు వివిధభంగిమలతో దృశ్యజగత్తు కనిపించు చున్నది. దీనినే జాగ్రత్స్వప్నమని చెప్పెదరు. ఈదృశ్యము నాకు అల్పకాలము కన్పించినది, ఇయ్యది సత్యముగా పుట్టినది కాదు, అని ఈవిధముగా నిద్రనుండి మేల్కొనినవాడు దృశ్యమును గురించి చెప్పు చుండుట మనము చూచుచున్నాము. దీనినే స్వప్నమని చెప్పుదురు. అందువలన ఇచ్చట ఆత్మ యందు ఈ దృశ్యజగత్సంకల్పమే స్వప్నముగా నున్నది. చాలాకాలము వేదాంతవిజ్ఞానము వినియు, ఆత్మసాక్షాత్కారము కానందున, పెద్దల బోధలు అర్థముకానివిగా నున్నవి. అందువలన ప్రయత్నము చేసి, బహుకాలము మహాత్ములను అనుసరించుట స్వప్న జాగ్రత్తు.
అంతేగాక, జాగ్రదావస్థలో కూడ స్ఫురించునట్టి స్వప్నావస్థను, స్వప్నజాగ్రత్తని చెప్పెదరు. ఈ 6 అవస్థల యొక్క త్యాగరూపమైన జీవుని జడస్థితిని భవిష్యత్తులో దుఃఖానుభవముతో నున్న స్థితిని సుషుప్త్యవస్థ అందురు. తమో రూపములో నున్న ఈ సుషుప్త్యవస్థలో సర్వజగత్తు లీనమై యుండును. ఈ 7 అజ్ఞాన భూమికలు ఒక్కొక్కటి మరియొక్క భూమికతొ కలిసి వందలాది అజ్ఞానఅవస్థాభూమికలుగా ఏర్పడుచున్నవి.
మీ స్పందనలకోసం ఎదురు చూస్తూ వుంటాము.