పరబ్రహ్మ స్వరూపమేమి?
మనం పరబ్రహ్మ స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవాలో విచారించిన పిమ్మట అదేమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది మహనీయులు, బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడు బ్రహ్మమే అవుతాడని స్వానుభవంతో తెలియజేసారు. కొందరు బ్రహ్మాన్ని తెలుసుకొన్నాననుకొంటే అజ్ఞానమని, తెలుసుకోలేక పోయానని తెలుసుకొంటే, దాని గురించి తెలియటం మొదలవుతుందని చెప్పారు. ఎంతచెప్పినా అది పూర్తిఅవదని, దానికి నిర్వచనాలు లేవని, కేవలము అనుభవపూర్వకమని కొందరు తెలియజేసారు. మనం గతంలో అనుకున్నట్లు నిజంగా పరబ్రహ్మను పొందినవాడు ఈలోకంలో ఉండడు. కాని కొంతమంది మహానుభావులు ఆస్థితిలో చివరి వరకూ వెళ్లి, మళ్లీ వెనక్కు వచ్చి, మనలాంటి వారికోసం కొంతవిషయాన్ని అక్కడక్కడ చెప్పారు. ఒకమాట మాత్రం నిజం. మనం మనుష్యులం కాబట్టి, మాయామయమైన శరీరంతోటి, అంతఃకరణాలతోటి జీవిస్తున్నాం కాబట్టి, ఈఅజ్ఞానం తొలగేవరకూ (పూర్తిగా పనికి రానప్పటికీ)కొంచెం ప్రాపంచకమైన జ్ఞానంతోటి, మన బుద్ధికి, మనస్సుకు అందే విషయాలతోటి దాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిద్దాం.అంతవరకూ దోషమేమీ లేదు. దానిసంగతి తెలిసిన పిమ్మట, దానికోసం ఉపయో గించిన ప్రాపంచిక విషయాలను వదలివేసి, పూర్ణమైన జ్ఞానాన్ని మాత్రమే ఆశ్రయిద్దాం. ఎందుకంటే "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" కాబట్టి.
ఈ విషయమై అనుభవం పొందిన మహాత్ములు, అనన్యచింతనులు, ఋషులు, యోగులు ఏ విధంగా తెలియజేశారో పరిశీలిద్దాం. (కొన్ని వివరణలు బ్రాకెట్లలో యివ్వడమైనది).
ఈశావాశ్యోపనిషత్:
4. పరమాత్మ ఒక్కటే చలనరహితమైనది. అయినా మనస్సుకంటే మహావేగము కలది. మనసుకంటే ముందే వెళ్ళుటవలన, అది యింద్రయములకు చిక్కదు. నిత్యమైనది. స్థిరమైనది అయినప్పటికీ, పరిగెత్తే అన్నింటిని అది దాటిపోవుచున్నది. ఆత్మసాన్నిధ్య మున్నందు వలననే జీవకోటులు తమ కార్య కలాపములను సాగించుటకు సమర్థవంతములగుచున్నవి. (ఇక్కడ పరమాత్మ యొక్క వైవిధ్యలక్షణాలను చెపుతున్నారు. పరమాత్మ అన్ని చోట్ల ఉన్నందున మనం ఎంత వేగంగా వెళ్ళినా, అక్కడ మనకన్నా ముందరే వెళ్లి ఉన్నట్లు తోస్తుంది. అందువలన అది ఎక్కడికి వెళ్ళనప్పటికీ అత్యంత వేగంగా ఉన్నట్లు తోస్తుంది. మనం గజేంద్రమోక్షంలో తెలుసుకున్నట్లు ఆ పరమాత్మ ప్రవేశించినందు వల్లనే ఈజీవులన్నియూ చైతన్యవంతములై తమతమ కార్యకలాపములను చేయు సమర్థములైయున్నవి.)
5. ఆ ఆత్మ చలింపదు. దూరములో నున్నది. దగ్గరగా నున్నది. అదియే సర్వవ్యాపకముగా నున్నది. ఈ అంతటి వెలుపల, లోపల గూడ నున్నది. (పైన చెప్పినట్లు ఆ పరమాత్మ అన్నిచోట్ల ఒకేసారి ఉన్నందున ఈవిధంగా తోస్తుంది. ఒకసారి చర్చలలో, ఒకేసారి దూరంగానూ, దగ్గరగాను ఎలా వుంటుంది? అన్న ప్రశ్న వచ్చింది. మనం ఎదురెదురుగా (face to face) కూర్చుంటే ఎలావున్నాము? చాలా దగ్గరగా వున్నాము. అలా ఉన్నచోటనే ఒకరికొకరు వ్యతిరేకదిశలో కూర్చుంటే ఎలావున్నట్లు? ఎంత దూరంలో వున్నట్లు? ఒక్కసారి ఆలోచించండి! అలాగే మనం పరమాత్మవైపు తిరిగితే మనకు ఆయన చాలా దగ్గరగా ఉంటాడు. ఆయనకేసి తిరగకపోతే చాలా దూరంగా ఉంటాడు. ఇక్కడ చెప్పిన ఆయన సర్వవ్యాపకత్వాన్నే మనం ప్రతిరోజూ చదువుకొనే మంత్ర పుష్పంలో "యచ్ఛకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపివా, అంతర్ బహిశ్చతత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః" అంటే 'ఏదయితే మనకు కనపడుతూ, వినపడుతూ వుండే ప్రకృతి వుందో, దాని లోపలా బయటా అంతా ఆపరమాత్మే నిండివున్నాడు' అని శృతి చెప్పింది.)
8. స్వయంభువు, సర్వవ్యాపి, అశరీరి, అస్నాయువు, పాప కళంక రహితుడు, ఉజ్జ్వలుడు, పరిపూర్ణుడు, స్వచ్ఛమైనవాడు, సర్వదర్శి, సర్వవిదుడు, సర్వ పరిఛ్చేదకుడు, అయిన పరమాత్మ శాశ్వతులైన ప్రజాపతులకు వారివారి కర్తవ్యములను నిర్ణయించి యిచ్చినాడు.
కేనోపనిషత్: ప్రధమ ఖండం:
౩. పరబ్రహ్మమును నేత్రముతో చూచుటకు వీలుకాదు. వాక్కుతో చెప్పుటకు వీలుకాదు. మనస్సుతో చింతించుటకు వీలుకాదు. అట్టి ఆత్మను బోధించుట ఎట్లు? మాకు తెలియదు. అది తెలియువాటికి, తెలియబడని వాటికి, అతీతముగా నున్నది. మా గురుదేవులు (సనాతనులు) ఈ రీతిగా చెప్పు చుండుట వినియుంటిమి.
4-8. ఏ ఆత్మ వాగింద్రియముచేత గ్రహించబడదో, దేని శక్తిచేత వాగింద్రియము పనిచేయుచున్నదో, దీనిని చక్షుస్సు చూడలేదో, దేనిచే అంతఃకరణవృత్తులను చూచునో, దేనిని చెవితో వినుటలేదో, దేనిచేత ఈశ్రవణేన్ద్రియము పనిచేయుచున్నదో, ఏది మనసుచేత భావించుటకు అశక్యమగునో, దేనిచేత మనస్సు పనిచేయుచున్నదో, అద్దానినే పరబ్రహ్మమని తెలియుము. అన్యమేదియు బ్రహ్మము కాదు. ఏది ఉచ్చ్వాసనిశ్వాసాత్మకమగు ప్రాణక్రియతో తెలియ బడజాలదో, దేనిచే ప్రాణము నిజకర్మమున నడుపబడుచున్నదో, అదియే బ్రహ్మమని ఎరుంగుము. అన్యమైన దేమియు బ్రహ్మము కాదు. (ఇక్కడ మన శరీరము భౌతికవిషయ పరిజ్ఞానాన్ని గ్రహించే అవయవాల ద్వారాగాని, శరీరభౌతికకర్మల ద్వారాగాని, పరబ్రహ్మమును తెలిసికోలేమని, ఈ అవయవాలని, వాటిని నడిపించే మనస్సుని కూడా పనిచేయించేది పరబ్రహ్మమని మనకు తెలియజేస్తున్నారు.)
చతుర్థఖడం:
4. విద్యుత్తు యొక్క ప్రకాశమువలె కన్ను తెరచినప్పుడు వస్తువులు చూడనగును. అది మూయగానే వస్తువులు కనిపింపవు. క్షణమాత్రము మెరుపు మెరసినపుడు కన్నులు మిరుమిట్లు గొలుపును. విద్యుత్తు క్షణ మాత్రమే ప్రకాశించును. అట్లే బ్రహ్మము యొక్క దర్శనము కూడా! (ఇక్కడ బ్రహ్మదర్శనం లేదా ఆత్మదర్శనం గురించి చెపుతున్నారు. మొట్టమొదట్లో ధ్యానంలో ఏకాగ్రత కుదిరినప్పుడు ఎలా ఆత్మ దర్శనం అవుతుందో ఒకసారి గురువుగారు చెప్పారు. చీకటిలో మిణుగురుపురుగు వెలిగినట్లు కనపడుతుందట. వెంటనే మాయమైపోతుందట. తర్వాత ఏకాగ్రత కుదిరిన కొద్దీ కదలకుండా ఉంటుందట. ఈవిషయాన్నే ఉపనిషద్రష్ట తెలియజేస్తున్నారు.)
6. పూర్వము వర్ణింపబడిన బ్రహ్మమే 'తద్వనం' అనబడును. ఆబ్రహ్మమును సర్వభూతాత్మగా ఉపాసించవలెను. బ్రహ్మను 'తద్వనం' అని ధ్యానించవలెను. సర్వప్రాణులు అతనిని ఆ విధముగానే కోరును.
కఠోపనిషత్:ప్రథమాధ్యాయము: 6వ వల్లి:
17. అంగుష్ఠమాత్ర పరిమాణము గల హృదయపద్మ పురుషుడు అంగుష్ఠమాత్రుడనబడును. అట్టి అంగుష్ఠ మాత్ర పురుషుని, ముంజ యను తృణవిశేషము నుండి తదంతర్గతయగు ఇషీక, పరకను వెలుపలకు లాగునటుల సర్వశరీరము నుండి జ్ఞానముచేత వేరుపరచవలెను. వేరుపరచిన చిన్మాత్రుడగు ఆయాత్మనే శుద్ధమైన బ్రహ్మము గా నెరుంగవలెను. (ముంజ అనేది ఒకరకమైన గడ్డి. దాని ఆకులలో ఈనె వుంటుంది. కొబ్బరిఆకుల లోంచి ఈనెను బయటకు లాగునటుల ఈముంజగడ్డి ఆకులలోంచి కూడా ఈనెను బయటకు లాగవచ్చును. ఆ ప్రకారంగా మన శరీరంలో ఆత్మచైతన్య రూపంలో వున్న పరమాత్మను జ్ఞానంతో వేరుపరచి దర్శింపవలెను.)
మున్డకోపనిషత్:ప్రధమమున్డకం:ప్రధమఖండం:
6. ఈపరబ్రహ్మ తత్త్వము దర్శించుటకుగాని గ్రహించుటకుగాని వీలుకానిది. సంబంధము లేనిది. రంగులు, రూపములుకాని, నేత్రములు శ్రోతములుగాని, హస్తములు పాదములుగాని లేనిది. నిత్యమైనది. సర్వవ్యాపక మైనది. సర్వగతము. అత్యంత సూక్ష్మము. అవ్యయము. సమస్త భూతముల యొక్క ఉత్పత్తి స్థానమై యున్నది. తెలిసిన బ్రహ్మజ్ఞానులు సర్వత్ర ఈఆత్మనే దర్శించుచుందురు. (ఇక్కడ ఒక విషయం, మన భారతీయ విద్యా విధానం ఎంత గొప్పదో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక భాష గురించి చెప్పే మొదటి పాఠం లోనే భాషతో పాటు పరమాత్మజ్ఞానం కూడా ఇచ్చారు. తెలుగు వ్యాకరణంలో మొదటి పాఠం భాషాభాగాలు. అవి, నామ వాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము, మొత్తం 5. వీటిలో అవ్యయము అంటే లింగ, వచన, విభక్తులు లేనిది. ఈగుణం పరమాత్మకు చెందినది. అంటే పరమాత్మకు చెందిన జ్ఞానం మనకు మొదటిపాఠం లోనే చెపుతున్నారు. కాని మనం దానిని పట్టించుకోకుండా పెరిగి మళ్లీ దాని కోసమే ఎక్కడెక్కడో వెతుకుతాము.)
ద్వితీయమున్డకం:ప్రథమఖండం:
2. ఆ అక్షరపరబ్రహ్మము జన్మలేనిదై, బాహ్యాభ్యంతరములలో నిండినదై. సమస్త రూపరహితమై, పరిపూర్ణమై, ప్రకాశించుచున్నది. అందువలననే ప్రాణములేనిదై ఆవ్యాకృతాది సర్వవికారముల కంటే భిన్నమై, నామరూపముల కంటే విలక్షణమై, ఉపాధి లేనిదై పరిపూర్ణముగా ప్రకాశించుచున్నది.
ద్వితీయఖండం:
1, 2. ప్రకాశము కలదై, అత్యంత సన్నిహితమై, హృదయగుహలో సంచరించుచున్నదై, మహత్తై, సమస్తము నకు అధారమై, సమస్త విశ్వము తనలో ధరించియున్నదై ప్రకాశించు నీబ్రహ్మమే చలనము కలిగి, ప్రాణవాయువు పీల్చి నిమేషములు కలిగియున్నది. ఈపరబ్రహ్మమును సత్తుగాను, అసత్తుగాను, సకల ప్రజలలోను ప్రతిష్టమై యున్నదిగాను, పరమైనదిగాను, ప్రాణుల జ్ఞానమునకు అతీతముగా నున్నదానిగాను తెలిసికొనుము. ఏది కాంతి కలదో, అణువుకంటెనూ అణువైనదో, దేనియందు పృథివ్యాది లోకములను, మనుష్యాదులను ఉంచబడినారో అదియే అక్షరబ్రహ్మము.అదియే ప్రాణము. అదియే వాక్కు, మనస్సు. ఆపరబ్రహ్మమే సత్యము. అదియే అమృతము, నాశరహితము. అదియే మనస్సునకు లక్ష్యముగా చేయ దగినది. అట్టి పరబ్రహ్మమును తెలిసికొనుము. (ఇక్కడ పరమాత్మ హృదయగుహలో ఉన్నాడని చెపుతున్నారు. ఆ హృదయము గురించి మంత్రపుష్పంలో "అనంత మవ్యయం కవిగ్ మ్ సముద్రేంతం విశ్వశంభువం| పద్మకోశ ప్రతీకాశగ్ మ్ హృదయంచాప్యథోముఖం|| అధో నిష్ట్యా వితస్త్యాన్తే నాభ్యాముపరి తిష్టతి| జ్వాలమాలాకులం భాతీ విశ్వస్వాయతనం మహత్||" అనంతుడు, అవ్యయుడు, సర్వజ్ఞుడు, సంసారసాగర అంతముననుండేవాడు, విశ్వ మంగళకారుడు, అయిన పరమాత్మ అధోముఖమైన తామరమొగ్గలా వున్న హృదయంలో వున్నాడు. ఈ హృదయం కంఠానికి క్రింద, నాభికి పైన జానెడు దూరంలోవుంది. ఇందులో విశ్వానికిఅంతటికి మూలమైన పరమాత్మ దీపశిఖలవరుసతో సమానమైన జాజ్వల్యమానమైన తేజస్సుతో ప్రకాశించు చున్నాడు అని శృతి చెప్పింది. ఇక్కడ చెప్పిన హృదయం మనకు కనపడే గుండె కాదు. మనకు రెండు రకాల శరీరాలున్నాయి. ఒకటి భౌతిక శరీరం (physical body). రెండవది శక్తిశరీరం (energetic body). ఈ రెండవశరీరంలోనే శక్తిస్థానాలైన షట్చక్రాలూ, హృదయం మొదలైన ఆధ్యాత్మిక పరిభాషలో వివరింపబడే అంగాలూ వుంటాయి. ఈ ఆధ్యాత్మికమైన శరీరం భౌతికమైన అనుభవానికి రాదు. ఈ శరీరం అనుభవం లోనికి రావాలంటే ధ్యానం లేదా తపస్సు ద్వారా తగిన శక్తి (power) సంపాదించు కోవాలి. లేదా ఆశక్తి ఇవ్వగలిగిన వారు ఇవ్వాలి. ఇక్కడ మనకు రెండు గట్టి దృష్టాంతరములు వున్నాయి. భగవద్గీతలో, విశ్వరూపదర్శనయోగములో 8వ శ్లోకంలో కృష్ణపరమాత్మ "నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా| దివ్యం దదామి తేచక్షుః పశ్యమే యోగమైశ్వరం|| ప్రాకృత చక్షువులతో నా రూపమును నీవు నిజముగా చూడజాలవు. కనుక నీకుదివ్య(అలౌకిక)దృష్టినిప్రసాదించుచున్నాను. ఆదివ్యదృష్టితో నాఈశ్వరీయయోగరూపమును చూడుము అని అర్జునునికి చెప్పి దివ్యదృష్టిని ప్రాసాదించాడు. ఒకసారి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు షట్చక్రాలూ, వాటి స్థానాలనూ వివరిస్తున్నప్పుడు 'కక్కడు' అనే కాటికాపరి విని ఇంటికివెళ్లి, నిద్రపోతున్న తన భార్యని కత్తితో కోసి, షట్చక్రాల కోసం వెతుకుతాడు. అవి కనపడవు కాని, భార్య చనిపోతుంది. దాంతో పట్టరాని కోపంతో వీరబ్రహ్మేంద్రస్వాములవార్ని చంపడానికి వస్తాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వాములవారు కక్కడి అమాయ కత్వానికి జాలిపడి అతని భార్యని బ్రతికించి అతని తలపై చేయిపెట్టి, షట్చక్రాలను చూపిస్తారు. ఈ రెండు దృష్టాంత రములు కూడా మనకు ఏమిచెపుతున్నాయి? ఆధ్యాత్మిక పరిజ్ఞానములొనూ, యోగమార్గము లొనూ వివరింప బడే అంగములు, స్థానములు, ప్రదేశములు, లోకములు వగైరాలు భౌతికపరిజ్ఞానము వలనగాని శాస్త్రములవలన గాని, తెలియబడవు. కేవలము, ధ్యానము, తపస్సు వలన గాని, లేదా మహానుభావుల, సద్గురువుల అనుగ్రహము వలన గాని పొందగలిగే అనుభవముల వల్ల మాత్రమే తెలుస్తాయి.)
10. నిష్కళంకుడై, విరాజమానుడై, అవిద్యాదోషములు లేనివాడై, హిరణ్మయకోశమందున్న పరబ్రహ్మ పరిశుద్దుడు. సకల జ్యోతులకు జ్యోతి, అని ఆత్మ తత్త్వ వేత్తలు తెలుసుకొనియున్నారు.
ఐతరేయోపనిషత్:తృతీయాధ్యాయం:
2,3:ఈ హృదయము, మనస్సు, చేతనత్వము, ఈస్వరత్వము, సమస్త వివేకము, సద్ జ్ఞానము, శాస్త్ర జ్ఞానము, సకలము నెరింగెడి జ్ఞానము, ధైర్యము, మననము, మనోధార్ఢ్యము,మనోవేదన,స్మరణము, రూపాదులను వికల్పముగా గాంచుట, నిశ్చయము, ప్రాణవృత్తి, ఆశ, స్వాధీనత, అనువన్నియూ, ప్రజ్ఞానముయొక్క నామములే యగుచున్నవి. అతడే బ్ర్రహ్మ. అతడే ఇంద్రుడు. అతడే ప్రజాపతి. ఈదేవతలెల్లరూ అతడే. పంచభూతములు, అల్పములగు జంతువులూ, విత్తనములు, మిగతా స్థావరజంగమములు, అండజములు, జరాయుజములు, స్వేదజములు, ఉద్భిజములు, గుఱ్ఱము, ఆవు, ఏనుగు, మనుష్యులు, ఇంకనూ జంగమములైన ప్రాణులేవి కలవో అవి, పక్షులు, మిగత స్థావరములు, అన్నియూ ఆ ప్రజ్ఞానేత్రమే. ప్రజ్ఞానము నందే నిలకడ బడసినవి. లోకములు ప్రజ్ఞానేత్రముగనే యున్నవి. ప్రజ్ఞానమునే ఆధారముగా బడసినవి. ప్రజ్ఞానమే బ్రహ్మము. (ఇక్కడ "ప్రజ్ఞానం బ్రహ్మ" అనే మహావాక్యానికి చాలా గొప్ప వివరణ ఇచ్చారు.)
బృహదారణ్యకోపనిషత్:చతుర్థాధ్యాయం: పంచమ బ్రాహ్మణం:
(మధువిద్య) ఈ పృధివి సమస్త భూతముల(జీవుల)యొక్క మధుస్వరూపమైనది. పృథివ్యాదిలక్షణమైన ఈ జత్తన్తయూ, పరస్పరము కార్యకారణమగుటవలన అదే ప్రకారమగుటకు తగియున్నది. (ఈఅర్థమే ఈ బ్రాహ్మణము నందు ప్రకాశింపుచున్నది.) ఈప్రసిద్ధమగు భూమి, బ్రహ్మ మొదలుకొని స్తంబపర్యన్తముండెడి సమస్తప్రాణుల యొక్క కార్యమైయున్నది. సమస్తభూతములును, ఈభూమియొక్క కార్యము.ఈ భూమియందలి తేజస్వరూపు డును అమృతస్వరూపుడును నగు ఈపురుషుడు దేహేన్ద్రియ సముదాయకర్త యగుచున్నాడు. ఈశరీరమందలి తేజస్వరూపుడును అమృతస్వరూపుడును నగు జీవుడు ఆ ఆత్మస్వరూపమే. ఆ ఆత్మస్వరూపమే మైత్రేయి కొరకు చెప్పబడిన అమృతత్వసాధన, ఆత్మ విజ్ఞానము. ఇదియే పరబ్రహ్మ స్వరూపము.
ఈ సుప్రసిద్ధమగు జలములు సమస్త ప్రాణుల యొక్క కార్యభూత సారాంశము. ఈజలముల యందలి తేజో మయుండును అమృత స్వరూపుడునగు పురుషుడే ఈదేహేంద్రియ సముదాయకర్తయందున్న రేతస్సంబంధుడు, తేజోమయుండును, అమృతస్వరూపుడునగు పురుషుడు. ఇతడే ఆత్మస్వరూపుడు. ఈ ఆత్మ స్వరూపమేదియో ఇదియే అమృత స్వరూపము(మధు స్వరూపము). ఇదియే పరబ్రహ్మస్వరూపము. ఇదియే సర్వముగా నున్నది. ఈరీతిగానే, జలములలోనున్న విధముగానే, మిగిలిన అగ్ని, వాయువు, సూర్యుడు, దిక్కులు, చంద్రుడు, విద్యుత్తు, మేఘ గర్జనము, ఆకాశము, ధర్మము, సత్యము, ఆత్మ స్వరూపము, మానుష జాతిలోనూ సర్వముగా పరబ్రహ్మమును మధుస్వరూపముగా నెరుంగవలెను. ఈవిజ్ఞానాత్మ సమస్త భూతములకునధిపతియును రాజు అగుచున్నది. అట్టి ఆత్మస్వరూపమునందు సర్వప్రాణులును, సమస్త లోకములును, సర్వ దేవతలును, సర్వ భూతములును, ఈ సమస్తఆత్మలును ఇవి అన్నియును రథచక్రమునందున్న ఆకులు వలెనే మధ్యలో అమర్చ బడియున్నవి.
(ఇక్కడ పరబ్రహ్మ యొక్క మధుస్వరూపము గురించి చాలా చక్కగా వివరించారు. ఇక్కడ మధువు అంటే మత్తుపానీయము కాదు. క్షరముకాని శాశ్వతము లేదా అమృతస్వరూపము. ఇది పరబ్రహ్మయొక్క, చైతన్యము యొక్క ముఖ్యలక్షణము. జాగ్రత్తగా గమనిస్తే ఈ లక్షణం మనకు కనపడుతున్న, వినపడుతున్న, అనుభవం పొందుతున్న అన్నింటిలోను కనపడుతుంది. ఇటువంటి అనుభవాన్నే శ్రీవల్లభాచార్యులవారు శ్రీకృష్ణపరంగా పొందారు. శ్రీకృష్ణునిలోను, ఆయనతో సంబంధమున్న ప్రతివస్తువు, ప్రదేశములోను మధుస్వరూపాన్ని అంటే అమృతతత్వాన్ని దర్శించి, అనుభవించారు. ఆఅనుభవాన్ని ఆయన ఎంతో అందముగా 'మధురాష్టకం'గా రచించారు. అందులో ఆయన ప్రతి శ్లోకములోను 'మధురాధిపతేరఖిలం మధురం' అంటే మధురమునకు, అమృతతత్త్వానికి అధిపతియైన ఓకృష్ణా నీకు సంబంధించినదంతయు మధురమే అంటే అమృతమే అన్నారు. ఒక్కసారి ఈ భావనతో 'మధురాష్టకం' చదవండి. ఈభావన మీకుకూడా అనుభవానికి వస్తుంది. అలాగే ఈ సృష్టిలోని ప్రతీదీ ఆపరబ్రహ్మకు, ఇరుసుతో అనుసంధానించబడిన ఆకులవలె, అనుసంధానించబడి యున్నవని తెలియ జేశారు.
పంచమాధ్యాయం:అష్టమ బ్రాహ్మణం:(అక్షర పరబ్రహ్మ స్వరూపం):
యాజ్నవల్క్యమహర్షి గార్గితో చెప్పుచున్నాడు. బ్రహ్మజ్ఞానులు దానిని అక్షరమని చెప్పుదురు. నాశరహిత మైన దానియందు ఓతప్రోతమై యున్నదని పలికెదరు. (ఓతప్రోతమంటే వస్త్రములోని నిలువు అడ్డ దారములు. వస్త్రములో దారములు ఎలావున్నవో అలా పరబ్రహ్మ వ్యాపించివున్నాడు.) అది స్థూలము కాదు. సూక్ష్మము కాదు. అణువును కాదు. పొట్టిదియు కాదు. పొడుగైనది కాదు. అలోహితము (రక్తము లేనిది). అతమము (తమస్సు, అజ్ఞానము, చీకటిలేనిది). అవాయువు. అనాకాశము. అసంగము, అరసము, అగంధము, ఆచక్షువు, అశ్రోతము, అవాక్కు, అమనస్సు, అతేజస్కము, అప్రనము, ఆముఖము, ఆమాత్రము (పరిమాణము, పరి ణామము కూడా లేనిది). లోపల వెలుపల లేనిది, అదే వున్నది, భోక్త కాదు, భోజ్యము కాదు, ఈ అక్షరుని యొక్క ఆజ్ఞతో సూర్యచంద్రులు సంచరించుచున్నారు. ఈఅక్షరుని యొక్క ఆజ్ఞవలననే భూమ్యంతరిక్షములు శక్తిగలవిగా నున్నవి. ఈఅక్షరుని యొక్క ఆజ్ఞయందు నిమేషములును (కనురెప్పపాటు కాలము), ముహూర్తములును, అహోరాత్రములును, పక్షములును, మాసములును, ఋతువులును, సంవత్సరములును, అన్నియును ధరింప బడినవై, శక్తిగా నిండియున్నవి. ఈఅక్షరుని యొక్క శాసనముతో హిమవంతము మొదలైన పర్వతముల నుండి గంగాదినదులు ప్రాఙ్ముఖముగాను, ఇతరములైన సింధునది మొదలైన నదులు పశ్చిమాభిముఖములుగాను ప్రవహించుచున్నవి. (తూర్పుగా ప్రవహించే వాటిని నదులని, పడమరగా ప్రవహించే వాటిని నదములని అంటారు.) ఈఅక్షరుని యొక్క ఆజ్ఞతో దానార్హములైన బంగారము మొదలైన వాటిని మనుష్యులు శ్లాఘించుచున్నారు. ఈఅక్షరము తానెవ్వరికీ కనిపించక అన్దరినీ చూచుచూ, వినబడకుండి వినుచూ, ఆలోచనార్హము కాకపొయిననూ, విచారార్హమై యున్నది. తెలియబడదు, తెలిసికొనును. ఇదితప్ప మరెవ్వరూ చూచువారు లేరు. ఈసత్యవస్తువు తప్ప యింకెవ్వరూ వినువారులేరు.
షష్ఠాధ్యాయము:చతుర్థ బ్రాహ్మణం:
5.విజ్ఞానస్వరూపమగు ఈఆత్మ పరబ్రహ్మము, మనోస్వరూపుడు, ప్రాణస్వరూపుడు, శ్రోత్రస్వరూపుడు, భూ, ఉదక, వాయు, ఆకాశ, తేజో, తెజోరహిత, కామ, అకామ, క్రోధ, క్రోధరహిత, ధర్మ, అధర్మ, సర్వస్వరూపుడును అయివున్నాడు. ఆఆత్మ ప్రత్యక్షమగు ఇంద్రియగోచర శబ్దాదివిషయ స్వరూపమైనాడు. మరియు అప్రత్యక్షముగా అంతఃకరణము నందుండెడి శబ్దాదివిషయరూపమైనది. ఈఆత్మయే జీవరూపుడుగా నుండి పుణ్యకర్మము చేయు వాడై పుణ్యాత్ముడుగాను, పాపకర్మము చేయువాడై పాపాత్ముడు గాను అగుచున్నాడు. మరియు కొందరు ఈ జీవుడు ఆకారస్వరూపుడు యని చెప్పుచున్నారు. ఆకారరూపుడగు పురుషుడు తన వాంఛప్రకారము ఏకర్మ చేయునో, ఆకర్మ ఫలమును పొందుచున్నాడు.
20. ఈ బ్రహ్మమును ఏకముగా చూడవలెను. అది అప్రమేయమైనది. ధృవమైనది. నిత్యమైనది. మాలిన్య రహితమైనది. ఆకసము కంటె సూక్ష్మమైనది. జన్మము లేనిది. సర్వ శ్రేష్టమైనది. ఇది ధృవము.
మహోపనిషత్:ద్వితీయాధ్యాయము:
1-3.అనిర్వచమై యున్నందువలనను, అగమ్యముగా నున్నందువలనను, అణుమాత్రస్వరూపమగుట వలనను, చిన్మాత్రమగు నీపరమాత్మ అకాశాముకంటే అతిసూక్ష్మముగా నున్నది. పరమసూక్ష్మమగు నీచిద్వస్తువు నందు మాయాశక్తి యొక్క విషయగుణములతో అనంతకోటి బ్రహ్మాండరేణువులు ఉత్పత్తి, స్థితి, లయములను పొందు చుండును. బాహ్యముగా శూన్యమువలె కన్పించుచున్నందు వలన పరబ్రహ్మము ఆకాశమని చెప్పబడుచున్నది. చిత్ స్వరూపముగా నున్నందువలన, ఆబ్రహ్మము విలక్షణముగా నున్నది. ఆబ్రహ్మము ఆకాశము కాదు. ఆకాశము లేనిది. ఇట్టిదని నిర్దేశించుటకు వీలుకానిది. అదియే సత్తు, చిత్తు. ఈఆత్మవస్తువు ప్రకాశ స్వరూపము, చేతనము, విజ్ఞానఘనమై, శిలాసదృశమై యున్నది. ఆకాశామువలె స్వస్వరూపముతో తదధిష్ఠానముగా అను భూతమైయున్నది. చిత్రవిచిత్రముగా నున్న జగత్తుయొక్క వికాసమును భేదించుచున్నది. ఈవిశ్వము తత్పద లక్ష్యముగా నున్న పరమాత్మ యొక్క ప్రకాశమాత్రము. అందువలన ఈవిశ్వము ఆత్మకంటె ప్రత్యేకముగా సత్త కలది కాదు. జగత్తు యొక్క భేదభావము కూడా ఆత్మ యందె భాసమగు చున్నది. అందువలన ఈ భేదమంతయూ ఆత్మమయమై యున్నది. అధిష్ఠానరూపములో ఆయాత్మ సర్వముతో సంబంధముకలదై యున్నది. సర్వ వ్యాపకమై గమనక్రియ లేకున్నది. జాతి గుణ క్రియాదులు ఈ ఆత్మకు లేవు. త్రికాలాబాధ్యమై సత్యమై యున్నది.
అయ్యదియే విజ్ఞానానంద స్వరూపమగు పరబ్రహ్మము. త్యాగమూర్తులకు అది పరమగతిగా నున్నది. సర్వ సంకల్ప సన్యాసపూర్వకముగా శుద్ధమనస్సుతో ఆబ్రహ్మమును గ్రహిమ్పవలయును. అయ్యది భావాతీతము,భావ రహితము. జాగ్రదవస్థలో నున్నప్పుడు ఎవరికి దృశ్యమాన జ్ఞానము నశించునో వానియొక్క స్థితినే జ్ఞానమని పెద్దలు చెప్పెదరు. వృత్తిజ్ఞాన శూన్యజ్ఞానమే జ్ఞానమని బుధులు చెప్పుదురు. జగదుత్పత్తి ప్రళయములు వృత్తిజ్ఞానము యొక్క వికాససంకోచములు. "వాక్కులకు అగోచరమైన సచ్చిదానంద పరబ్రహ్మమే నేను. తదితరము నేనుగాను" అను సిద్ధాంతమే వేదాంతవచనముల పర్యవసానము. (ఇచ్చట "నేనేవరను?" అన్న ప్రశ్నకు నిజమైన జవాబు ప్రతిపాదించారు. ఈ ప్రశ్నకు వేరొక జవాబు లేదు. అద్వైత సిద్ధాంతసార మిదియే.)
యోగశిఖోపనిషత్:ద్వితీయాధ్యాయము:
3. బ్రహ్మ యొక్క శరీరము స్థూలము, సూక్ష్మము, పరము అని 3 రకములు. పంచబ్రహ్మమయమైన రూపము స్థూలము,వైరాజమనబడును.(ఇదిపంచతన్మాత్ర,పంచభూతాత్మకమైనది) బీజత్రయాత్మకము నాదము నైనది సూక్ష్మరూపము. (ఇది ఒకవైపు అకార, ఉకార, మకార సమ్మిళితమైన ఓంకారము, ఇంకొకవైపు ఈ మూడు అక్షరములు లయించిన పిమ్మట శేషించి యుండే అక్షర రహిత శబ్దము. అదే నాదము లేదా నాద బిందువు. దీని గురించి ఇంకొకసారి ముచ్చటించుకుందాము.) హిరణ్యగర్భుడు, పరమైన బ్రహ్మము పరము. సత్యము, సచ్చిదా నంద లక్షణము, అప్రమేయము, అనిర్దేశ్యము, అవాఙ్మానసగోచరము, శుద్ధము, సూక్ష్మము, నిరాకారము, నిర్వి కారము, నిరంజనము, అనంతము, అపరిచ్ఛేదము, అనుపమేయము, అనామయము. ఆత్మమంత్రము (సోహం)ను సదా అభ్యసించినందున పరతత్వము ప్రకాశించును. (ఇదే పరబ్రహ్మము యొక్క అసలైన స్వరూపము. ఇదే శాశ్వతమైనది. సృష్టికి ముందర, ప్రళయమునకు తర్వాత మిగిలిఉండేది ఇదొక్కటే.)
తృతీయాధ్యాయము:
4, 5: పరబ్రహ్మ అక్షరము, నిర్విశేషము, నిరంజనము, అలక్షణము, అలక్ష్యము, అప్రతర్క్యము, అనువమము, అపారపారము, అచ్ఛేద్యము, అచిన్త్యము, అతినిర్మలము,సర్వ భూతములకు నాధారము, అనాధారము, అనా మయము, అప్రమాణము, అనిర్దేశ్యము, అప్రమేయము, అతీన్ద్రియము, అస్తూలము, అనణుహ్రస్వము, అదీర్ఘము, అజము, అవ్యయము, అశబ్దస్పర్శరూపము, ఆచక్షుశ్రోతము, సర్వజ్ఞము, సర్వగము, శాంతము, అందరికినీ హృదయముగ నున్నది. గురువు కలవారికి సుసంవేద్యము, మనస్సు లేనివారికి సుదుర్బోధము, (దానియందు మనస్సు లేనివారికి, అనగా నాస్తికులకు సులువుగా తెలియరానిది), నిష్కళము, నిర్గుణము, శాంతము, నిర్వి కారము, నిరాశ్రయము, నిర్లేపకము, నిరాపాయము, కూటస్థము, అచలము, ధృవము, జ్యోతిస్సుల కన్నా జ్యోతిస్సు కలది, తమఃపారమున నున్నది, (చీకటి కవతలనున్నది. దీనినే పోతనగారు "పెంజీకటి కవ్వల నేవ్వండేకాకృతి వెలుగు నతని నేసేవింతున్" ప్రళయకాలములో అన్నీ సమసి పోయిన తర్వాత మిగిలియున్న పెను చీకటి కవతల నుండేవాడు అన్నారు. అతడు మనం కళ్ళు మూసుకోనగానే కనిపించే చీకటి కవతల చూడగలిగితే కనపడతాడు.) భావాభావములు లేనిది, భావనామాత్రముగానే గోచరమగునది, భక్తి గమ్యము, అన్తర్లీనముగా చైతన్యమున నుండు పరతత్త్వము.
వివేకచూడామణి :
127. అహం ప్రత్యయముచే తెలియబడుచూ, నిత్యమై, జాగ్రదాద్యవస్థలకు సాక్షియై, అన్నమయాది పంచకోశములకు విలక్షుణుడై, సర్వప్రకాశకుడగు పరమాత్మ యొకడు కలడు.
192. పరమాత్మ స్వయముగా సర్వాత్మకుడును, సర్వస్వరూపుడై యుండియు, మిధ్యాత్మబుద్ధి వలన గలిగిన తాదాత్మ్యదోషము వలన కారణదేహమందు జీవభావము పొంది, మృత్తు వేరు, ఘటము వేరు యనుకొనినట్లు, తాను వేరు, దృశ్యము వేరు యనుకొనుచున్నాడు. నిజాము విచారించగా (జ్ఞానదృష్టిచే) ఆత్మేతరమెద్దియూ లేదు.
239-242. పరబ్రహ్మస్వరూపము సద్రూపము. ద్వితీయరహితము. శుద్ధజ్ఞానస్వరూపము. నిరంజనము, ప్రశాంతము, ఉత్పత్తినాశరహితము, అక్రియము, అవిద్యారూపాంతరశూన్యము, ఆనందరస స్వరూపమునై మాయా కృత జీవేశ్వరాది భేదరహితము, త్రికాలాబాధ్యము, అచలము, నిష్కలము, అప్రమేయము, రూపశూన్యము, అవ్యక్తము, నామరహితము, నాశరహితమునై, స్వయం జ్యొతిఃస్వరూపమున సర్వదా తేజరిల్లుచున్నది. ఆ పర తత్త్వము, జ్ఞాతృజ్ఞానజ్ఞేయములనెడి త్రిపుటి లేనిది. అనంతము, నిర్వికల్పము, కేవలము అఖండ చిన్మాత్ర స్వరూప మైనదియును, హేయోపాదేయములు (గ్రహింపదగినది, విడువతగినది)లేనిది. మనస్సునకును, వాక్కునకును గోచరము కానిది. అప్రమేయము, ఆద్యంత శూన్యమును, అట్టి సర్వవ్యాపక పరిపూర్ణబ్రహ్మమును 'అహం మమః' అనగా 'ఆ జ్యోతి స్వరూపమే నేను' అని జ్ఞానులు తెలిసికొందురు.
465-471. సర్వవ్యాపకమైనది, ఆద్యన్తములు లేనిది, జననమరణాది వికారములు లేనిది, సర్వదా సద్రూపము, ఏకరసచైతన్యరూపము, త్రికాలాబాధ్యమగు అనంత స్వరూపము, క్రియారహితము, ప్రత్యగ్రూపము, ఏకరసము, అనంతము, సర్వపరిపూర్ణము, సర్వమునకు అధిష్ఠానము, అత్యాజ్యము, అవాచ్యము, అగ్రాహ్యము, తనకు తానే ఆశ్రయమగుటచే నితరాశ్రయము లేనిది, నిర్గుణము,నిరవయవము, ప్రత్యక్షాగోచరము, భావాభావకల్పనా రూప రహితము, మాయావలరహితము, ఇదిఇట్టిదని వాక్కుచే నిరూపించుటకును, మనస్సుచే తెలియుటకును శక్యము గాని స్వసత్తు స్ఫూర్తులచేత జడములగు మనోవాక్కులను ప్రకాశింపచేయునది, స్వతఃసిద్ధమైనది, సర్వకల్పనా రహితమగు జ్ఞాన స్వరూపము, ఉపమాన రహితమునునగు ఇట్టి బ్రహ్మము ఏకము, అద్వితీయము, పరిపూర్ణము, నానాభేదవిశిష్టమగు దృశ్యమాన ప్రపంచము బ్రాహ్మాభిన్నము. బ్రహ్మేతరము లేనేలేదు.
అష్టావక్రగీత:మొదటి ప్రకరణం:
12. ఆత్మ సాక్షి, వ్యాపకము, పూర్ణము, ఏకము, ముక్తము, చైతన్య రూపము, క్రియా రహితము, సంగ రహితము, ఇచ్ఛా రహితము, శాంతమునై యున్నది. భ్రాంతి వలన సంసారము కలదివలె తోచుచున్నది.
బ్రహ్మసూత్రములు:
2. జన్మాదస్యయతః - ఈజగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయాదులు ఎవనివలన కలుగుతున్నాయో అతడే పరబ్రహ్మ. "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" - సత్యజ్ఞానస్వరూపుడు, అనంతుడు, దేశకాలవస్తుకృతమైన పరిచ్ఛేధం లేనివాడు పరబ్రహ్మ. (సత్య, జ్ఞాన, అనంతములనే గుణాలు ఒక్కొక్కసారి ప్రాపంచిక సంభంధమైన వాటిలో కూడా కనపడతాయి. అందువల్ల అవి పరబ్రహ్మస్వరూపాలైపోవు. ఆగుణాలు దేశ, కాల, వస్తు రూపాలను అధిగమించి కూడా శాశ్వతమై దేనియందు నిలబడి యుంటాయో, అదే పరబ్రహ్మస్వరూపము. అందువల్ల ఈగుణాలు దేని యందు అన్నివిధములా శాశ్వతమై యుంటాయో విచారించి తెలుసుకుంటే, పరబ్రహ్మస్వరూపం తెలుస్తుంది.)
3. శాస్త్రయోనిత్వాత్ - శాస్త్రములకు కారణమైన వాడగుట వలన. శాసించేది శాస్త్రము. శాస్త్రములకు కారణమైనవాడు కాబట్టి సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు - పరబ్రహ్మ. (బృ.దా.ఉ.-2.4.10. అపరిచ్ఛిన్నమైన సద్రూపము వల్లనే పురుషుని నుండి అనాయాసంగా వెలువడే నిశ్వాసం లాగా ఆ సర్వజ్ఞాని నుండి ఈ వేదాలు శాస్త్రాలు వగైరా వెలువడ్డాయి.)
12. ఆనంద మయో-భ్యాసాత్ - ఆనందమయుడంటే పరమాత్మే తప్ప జీవుడు కాదు. ఆనందమయుడంటే ఆనందము ప్రచురంగా (విస్తారంగా) కలవాడు.
16. నేతరోను-నుపపత్తే - పరబ్రహ్మ తప్ప ఇతరుడు (సంసారియైన జీవుడు) ఆనందమయుడనే శబ్దానికి అర్థం కాదు. (శరీరి - జీవుడు అనుభవించే ఆనందం శాశ్వతమైన ఆనందం కాదు. పరబ్రహ్మ అనుభవపూర్వక సచ్చిదానందమే అసలైన, శాశ్వతమైన ఆనందము. అందువల్లనే శ్రీత్యాగరాజువారు "రమించు వారెవరురా రఘూత్తమా నినువినా" అని ఆనందమయ స్వరూపుడైన ఆ శ్రీరామచంద్రుడిని కీర్తించారు.)
యోగవాశిష్ఠము: ముముక్షువ్యవహార ప్రకరణము:
10 వ సర్గ: 1, 11: బ్రహ్మతత్వము స్వయంప్రకాశము. ఇది సచ్చిదానంద స్వరూపమున సర్వత్ర వెలయుచున్నది. దీని సత్తవలననే ఇతరములన్నియూ వెలుగొందుచున్నవి. ఇదియే భవిష్యత్కాల వ్యవహారమున 'నియతి' యనబడుచున్నది. కార్యకారణ స్వరూపము గూడనిదియే. అనంత మాయావిలాసమునకు కారణమును, సర్వాంతర్యామియును, సర్వాధారమును, చిదాకాశమును, ప్రత్యక్ చిద్రూపమును, అవినశ్వరమునకు ఆత్మతత్త్వ మొక్కటున్నది.
ఉత్పత్తి ప్రకరణము: పంచమసర్గ: మూలకారణ దేవస్వరూపము:
మహాప్రళయ సమయమున ద్రుశ్యసృష్టి అంతయూ లయమగును. అప్పుదు ప్రశాంత బ్రహ్మవస్తువు ఒక్కటియే మిగిలియుండును. దీనికి జన్మగాని, ప్రకాశముగాని, లయముగాని లేవు. ఇది నిత్యము సర్వస్వరూపము. సర్వ శక్తిమంతము, పరమాత్మ. ఈపరమవస్తువును వాక్యమువలన గ్రహింపజాలము. ముక్తపురుషులే దీని నెరుంగు దురు. ఆత్మ, బ్రహ్మ ఇత్యాదినామములు దీనియందు కల్పింపబడినవి.స్వాభావికములు కావు. ఇద్దానిని సాంఖ్యులు పురుషుడందురు. వేదాంతవాదులుబ్రహ్మమనుదురు.విజ్ఞానవాదులు సునిర్మల విజ్ఞాన మను చున్నారు. శూన్యవాదులు శూన్యమందురు. ఇది సూర్యుడు మొదలుగాగల తేజోపదార్థములనుగూడ ప్రకాశింప జేయుచున్నది. ఇదియే వక్త, భోక్త, ద్రష్ట, కర్తల రూపమున ప్రకాశించుచున్నది.ఇది సత్తు అయిననూ అసత్తు. దేహమధ్యవర్తి అయిననూ దూరస్థమునూ అగుచున్నది. చిత్ప్రకాశము. సూర్యునినుండి కిరణములు వెలువడి నట్లు దీనినుండియే బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు వెలువడుచున్నారు. సముద్రము నుండి బుడగలు వచ్చునట్లు జగత్తులు దీనినుండియే వచ్చుచున్నవి. నదులు సముద్రాభిముఖములైనట్లు, దృశ్యము లన్నియూ దీనివైపునకే వచ్చుచున్నవి. ఇది దీపము వలె తన్ను ఇతర పదార్థములను ప్రకాశింపజేయుచున్నది. ఇదియే ఆకాశమున, మన శరీరమున, శిలలయందు, పర్వతముల, వాయువున, పాతాళమున వెలయుచున్నది. ఇదియే కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను తమతమ పనుల నొనర్చునట్లు జేయుచున్నది. దీనివలననే మూఢులు మూగలగుచున్నారు. ఇదియే శిలలను నిశ్చలములుగను, ఆకాశమును శూన్యముగను, పర్వతములను కఠినముగను, జలములను పలుచగాను నొనర్చినది. దీప్తుడగు రవి దీనివలననే ప్రకాశింపుచున్నాడు.
నిండు మేఘముల నుండి ఎడతెగని వర్షము కురియునట్లు అక్షయసుఖముతో నిండిన ఈ పరమవస్తువు నుండియే, సంసారమను ఈఅపారవృష్టి కురియుచున్నది. మరుభూములందు మరీచికలవోలె, త్రిభువన తరంగ ములు దీనినుండియే వెలువడుచూ పోవుచున్నది. ఇదియే సర్వభూతముల మధ్యనుండి శాశ్వతమయ్యు, అశాశ్వ తమువలె గన్పట్టుచున్నది. మహత్తరమయ్యు, అందరియందున సమానభావమున వెలయుచున్నది. ఇదియే వాయువువలె చిదాకాశమున ఇంద్రియదళముల తోడను, బ్రహ్మఫలముల తోడను, చిత్ మూల్యముల తోడను, గూడియున్న ప్రకృతి యను లతను నాత్యమాడింప జేయుచున్నది. ఇదియే దేహమను పెట్టెలలో చిన్మయమగు మనస్సునుంచినది. చంద్రుని నుండి కిరణములు వెలువడినట్లు దీని నుండియే సృష్టులు వెలువడుచున్నవి. ఈ చిదాకాశముననే సృష్టియను విద్యుత్ ప్రకాశించుచున్నది. ప్రాణమను వర్షము కురియుచున్నది. దీని ప్రభావము వలననే వస్తువులన్నియూ బ్రకాశించుచున్నవి. ఇదియే అసద్వస్తువులను గమించినది. దీని వలననే సద్వస్తువు లకు సత్త ఏర్పడినది. దీని సన్నిధినుండుట వలననే జదమగు శరీరము చలించుచున్నది. నియతి దేశకాలములు, చలన స్పందనాది క్రియలును, అన్ని సత్తలును దాటిపోవు దానిసత్త వలననే జరుగుచున్నవి. శుద్ధ చిన్మయమగు ఈ పరమవస్తువే ఆకాశమును, పదార్ధములను చింతించి, ఆయా రూపములను దాల్చుచున్నది. ఆ పరమవస్తువే ఈ విశాల బ్రహ్మాండమును సృష్టించియూ, ఏమియూ ఒనర్పనట్లగపడుచున్నది. (పరబ్రహ్మయొక్క ఈ తత్వాన్నే మనము బాగా గమనించాలి. దీన్నే పరమాత్మ 'భగవద్గీత'లో 'నిష్కామకర్మ' అని బోధించారు. పరమాత్మ యొక్క ఈ గుణాన్నే మనంకూడా అనుసరిస్తే ఆయనను చేరుకొంటాము.) ఇది నిర్వికల్పము. ఉదయాస్తమయములు, స్థితిగతులు దీనికి లేవు. ఇది అప్పుడు నిర్వికార ఆద్వైత ఆత్మయందు నిలిచియుండును. ఇదిగాక వేరొక సమయమున వేరొక వస్తువు లేకుండెను.
7 వసర్గ:
4. నేజెప్పునాతడెటనో దూరమున లేడు. అతడు చైతన్యరూపమున మన శరీరముల నివసించియున్నాడు. (మనం పరమాత్మ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ వుంటాము. కాని ఆయనను సరిగ్గా వెతకాల్సిన చోటు మన శరీరములోపలే. ఆయన మనశరీరములో చైతన్యరూపములో వున్నాడు. ఈభావనతో వెతికితే తప్పక దొరుకు తాడు.) ఈవిశ్వమే యతడు. కాని యితడు విశ్వము కాదు. ఏలయన, ఉన్నది అతడొకడే! విశ్వమనే వేరొక వస్తువే లేదు. (ఇది ఆపరబ్రహ్మ యొక్క మరొకకోణం. మనకు కనపడే వాటన్నింటిలో పరబ్రహ్మ వున్నాడు. కాని కనపడేదంతా పరబ్రహ్మ కాదు. మళ్లీ సర్వమూ పరబ్రహ్మమే! దీని విశ్లేషణ ఎలా? సర్వమూ ఆ పరబ్రహ్మ లోంచే వచ్చాయి. కాని అవి అన్నీ పరబ్రహ్మస్వరూపాలు కాదు. వాటిలో పరబ్రహ్మ, పైన చెప్పిన విధంగా, చైతన్యరూపము లో చూడగలిగితే, అంటే అనుభవము పొందగలిగితే, వాటిలో పరబ్రహ్మ కనపడతాడు. మొదట మనశరీరములోనూ, ఆ పిదప ఇతరులలోనూ, ఇతర జీవరాసుల లొనూ, ఇతర పదార్థములలోను, వున్న చైతన్యాన్ని చూడటము, అంటే, అనుభవములోనికి తెచ్చుకోవాలి. ఇది కేవలము ధ్యానముతో మాత్రమే సాధ్యము. ఎప్పుడైతే ఈ విధమైన అనుభవము ప్రారంభమైందో, అప్పుడు ఏదైతే మనకు "దృశ్యతే శ్రూయతే పివా", కనపడుతూ, వినపడుతూ వున్న ఈ ప్రపంచము, విశ్వము, ప్రకృతి, కొత్తరూపములో, పరమాత్మరూపములో కనపడటం మొదలవుతుంది. అప్పుడు మనకు ఇతరుల, ఇతర ప్రకృతి మీద వున్న అభిప్రాయము, అనుభవము మారిపోతాయి. అన్నింటిలోను వున్న చైతన్య రూపాన్ని, అదే పరబ్రహ్మాన్ని చూడటమే "విశ్వరూప సందర్శనము". దీనినే కృష్ణపరమాత్మ అర్జనునిచే అనుభవింప చేసాడు. సరిగ్గా ఈ భావాన్నే ఒక ఉపనిషత్తులో "సర్వ శరీరేషు చైతన్యేకతా ధ్యానం" అన్నారు. అంటే అన్నింటిలోను వున్న చైతన్యాన్ని చూడగలగటమే ధ్యానము.) ఈ చిన్మయబ్రహ్మమే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడని గ్రహింపుము.
19. ఏ జ్ఞానస్వరూపము నిముషములో ఒక చోటనుండి మరొక చోటునకు చనుచున్నదో, ఆ జ్ఞానమే పరమాత్మ యొక్క స్వరూపము. (ఇది ఆ పరమాత్మ యొక్క మరొక లక్షణము. మనము ఒకచోటు నుండి వేరొక చోటునకు వెళ్ళినప్పుడు బయలుదేరిన చోటులోను, అట్లాగే చేరిన చోటులోను పరమాత్మ వుంటాడు. అంటే పరమాత్మ మనతో పాటు ఎక్కడపడితే అక్కడికి వస్తాడా? రాడు. ఆయన అన్ని ప్రదేశములలోను వున్నాడు. కాబట్టే మనము ఎక్కడకి వెడితే అక్కడ మనకంటా ముందర వచ్చినట్లు, కుమారస్వామికి వినాయకుడు కనిపించినట్లు, కనపడతాడు.)
20 - 25. ఏ భోధరూపమున త్రైకాలిక మిధ్యయగు జగత్తు తేలియాడుచున్నదో, అదియే పరమాత్మ స్వరూపము. ఎద్దాని యందు ద్రష్టృ, దృశ్య, దర్శనములు లేకుండియు, ఉన్నట్లు కనపడుచున్నవో, ఎయ్యది ఆకాశము గాకుండియు, విపులత్వమున ఆకాశముతో బోల్పపడుచున్నదో, అయ్యదియే పరమాత్మ యొక్క స్వరూపము. ఈ ప్రపంచము అసత్తయ్యూ, దేనియందు సద్రూపమున నున్నదో, సృష్టి ప్రవాహము అనాదియయ్యు దేనియందు మిధ్యారూపమున అవభాసించుచున్నదో, అదియే పరమాత్మయొక్క స్వరూపము. ఎయ్యది చిన్మాత్ర మయ్యు, పెద్దరాతిబండవలె నిశ్చేష్టితమై యున్నదో, ఎయ్యది జడమయ్యు, జడము కాదో, అయ్యదియే పరమాత్మ యొక్క స్వరూపము. ప్రకాశక పదార్ధములకు వెలుతురును, ఆకాశమునకు శూన్యత్వమును రూపములైనట్లు, ఇయ్యది దేనియందు యుండునో అదియే దీని రూపమని గ్రహింపుము. (ఇక్కడ పరమాత్మ యొక్క విలక్షణమైన లక్షణాలను, వివిధత్వాన్ని తెలియజేశారు. ప్రకృతి మానవుని దృష్టిలో అనాది అయినప్పటికీ, దాని సృష్టికర్త అయిన పరమాత్మకోణంలోంచి మిధ్య యని, ఈ రకమైన విలక్షణాలను బోధపరచుకుంటేగాని పరమాత్మ స్వరూపము మనకు అర్థం కాదని తెలియజేశారు.)
9వ సర్గ:76: ఈ బ్రహ్మమునకుత్పత్తి లేదు. క్షయము లేదు. మొదలు లేదు. ఇది శాశ్వతము. నిత్యము. మంగళస్వరూపము. పవిత్రము. అమోఘము. వన్దనీయము. అనిన్ద్యము. ఆగంతుక ధర్మరహితము. కారణ కారణము. అజ్ఞేయము. స్వానుభవ సంవేద్యము. ఏకమాత్రజ్ఞేయమునై వెలయుచున్నది.
10వ సర్గ:32-36: ఆ బ్రహ్మము అణువు కంటె అణువు. ఆకాశము కంటె గొప్పది. శుద్ధము. సూక్ష్మము. ఆకాశ మధ్య ప్రదేశము కంటె ప్రశాంతము. దీనికెట్టి రూపమును లేదు. దిక్కాలాదుల వలన బంధింపబడని దగుట వలన అతి విస్తృతము. అనాది. స్వప్రకాశము. ఈ చిద్రూపము లేనిచోట, వాసనలు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు, జీవమును లేవు. ఇట్లు అపూర్వ, అజర, నిరాకార, ప్రశాంత పరమపదము మనకు గోచరమగు చున్నది.
39. చిత్తవృత్తులను నిరోధించి, మనస్సును గూడ లయమొనర్చిన మిగిలియుండు అవర్ణనీయ సాక్షి చైతన్యమే అది. (ఇక్కడ చాలా నిగూఢమైన, అత్యంత నిశితమైన, రహస్యమైన విషయం చెప్పారు. మొదట ధ్యానములో నిమగ్నమైపోయి, అంతఃకరణలను (మనస్సు, బుధ్ది, చిత్తము, అహంకారము లను) పనిచేయకుండా ఆపివేసి, అటుపిమ్మట ఎటువంటి ఆలోచనలు, భావములు లేకుండా మనస్సును సంపూర్ణముగా లయమొనర్చి, అంటే, మనస్సును అమనస్కము చేసి, సమాధి అవస్థను పొంది, తురీయస్థితికి వెళ్ళినపుడు, మిగిలియుండే నిర్మల, ప్రశాంత, అఖండానందైకరసస్థితే చైతన్యస్థితి. అక్కడ ఆఆనందమనుభవించే మనలను మనమే చూస్తాము, తెలుసుకొంటాము. అందువలన అది సాక్షి చైతన్యము.)
41. జీవచైతన్యము యొక్క చేత్యభావము లోపించిపోయిన, మిగులు ప్రశాంతచిన్మాత్రమే ఆ పరమాత్మ స్వరూపము. (చైతన్యము మరలా రెండు రకములు. జీవ(ప్రాణ)చైతన్యము, పరాచైతన్యము. ఇందులో మనం జీవ చైతన్యాన్ని నిరోధించిన యెడల, పరాచైతన్యాన్ని అనుభవించ గలుగుతాము. దీనినే పైన విశదీకరించారు. ఆ పరా చైతన్యమే పరమాత్మ లేదా పరబ్రహ్మ స్వరూపము.)
44. ఆకాశము యొక్కయు, వాయువు యొక్కయు, శిల యొక్కయు హృదయముల భావములు, ఆ చిన్మయ బ్రహ్మముయొక్క స్వరూపము. (ఆకాశముయొక్క హృదయము శూన్యత్వము. వాయువుయొక్క హృదయము పూర్ణత్వము. శిలయొక్క హృదయము ఘనత్వము. కనుక బ్రహ్మము నిర్ధర్మకము, పూర్ణము, సర్వ వ్యాపి అని తేలుచున్నది.)
54. బ్రహ్మ, సూర్య, విష్ణు, హర, శక్ర, శివాది దేవతలు లయమైన, పరమశివమగు ఆసద్వస్తువొక్కటియే మిగిలి యుండును. అప్పుడద్దానికెట్టి ఉపాధియు ఉండనందు వలన, నది నిర్వికల్పస్వరూపమగును.విశ్వసంజ్ఞను బరి త్యజించి, చైతన్యమయ బ్రహ్మమగును. (ఇక్కడ మనం ఇంకొక విషయము తెలుసుకోవాలి. మనకు తెలిసిన సాకార దేవతలు పరబ్రహ్మము కారు. వాళ్ళుకూడా ఒకరకమైన పదవులు అనుభవిస్తున్నవారే. అంటే ఒకరకంగా ఉద్యోగ స్తులే. భాగవతం ప్రకారం కాబోయే ఇంద్రుడు బలిచక్రవర్తి. హనుమ భవిష్యత్ చతుర్ముఖ బ్రహ్మ. అశ్వద్ధామ కాబోయే వ్యాసుడు. అందువలన ఈ దేవతాపదములన్ని అశాశ్వతాలే. కాబట్టి వీరినన్దరినీ అధిగమిస్తే వారికి మూలమైన ఆ పరబ్రహ్మ ఒక్కటే మిగులుతుంది. అప్పుడు దానికి ఎటువంటి ఉపాధి, అంటే మూలము లేకుండా దానంతట అదే ఎటువంటి వికల్పములు లేకుండా, ఈ కనపడే, వినపడే, అనుభవింపబడే విశ్వము, ప్రకృతితో సంబంధము లేకుండా కేవల సాక్షిచైతన్యముగా భాసిస్తూ వుంటుంది.)
14వ సర్గ:(బ్రహ్మ ప్రతిపాదనలు):సంకల్పవృత్తులు చైతన్యమున ప్రతిబింబించి, సాకారములును, నిర్వికారము లును నగు పదార్థములుగా ఆవిర్భవించుచున్నవి. ఇవి ఆబ్రహ్మమునే కనంబడుచున్నవి. ఈ కల్పనావృత్తుల ప్రకాశము వికసించు పూలతొ గూడిన లత వంటిది. లత మొగ్గ తొడిగి వికసించు నట్లు జగత్కల్పనా కౌశలము గూడ చైతన్యము యొక్క సంసర్గమున వికసించు చున్నది. దీనిని గాంచునది గూడ బ్రహ్మమే. జీవుడు, బుద్ధి, క్రియ, స్పందనము, మనస్సు, ద్వైతభావము, బ్రహ్మసత్త ఇవియే జ్ఞానగమ్యములగుచున్నవి. అస్తిత్వమేకమాత్రబ్రహ్మము ననే నున్నది. అన్యపదార్ధముల కస్తిత్వము బ్రహ్మమువలన నేర్పడుచున్నది. బ్రహ్మసత్తను తత్త్వతః తెలిసికొనక పోవుట వలననే, అది అన్యసత్తవలె భాసితమగుచున్నది. తత్త్వతః గ్రహించిన అదిగాక వేరొకటి అగుపడదు. బ్రహ్మ సత్తను ఆవరించియుండు అజ్ఞానమును ఆత్మవిజ్ఞానము వినాశమొనర్చుచున్నది. కాని అజ్ఞానమెట్టిదో చెప్పజాలము. దీపపువెల్తురు వలన చీకటి నశించును గాని, చీకటియననేమో చెప్పజాలము. అట్లే జ్ఞానము వలన అజ్ఞానము నశించును గాని అజ్ఞానముయొక్క తత్త్వము నెరుంగజాలము. అందువలన తేలునదేమన, బ్రహ్మే జీవాత్మయని, ఇయ్యది అపరిచ్చిన్నము, అఖండము, సర్వశక్తిమంతము, అనాది, అనంతము, సత్యము, చైతన్య స్వరూపము. ఈ బ్రహ్మము సర్వస్వరూపము. దీనియన్దు భేదకల్పన లేదు. ఈజగత్కౌశలము కూడా అపరోక్షాను భూతియందు బ్రహ్మముననే పర్యవసించుచున్నది.
62వసర్గ:8-15:స్పందరూపిణియును(ప్రాణుల అదృష్టము), అవస్యంభావియును(వస్తుశక్తి), చైతన్యశక్తియును (ఈశ్వరసంకల్పము)నగు మహానియతి ఒక్కటి యున్నది. నియతియొక్క బలముననే, తత్త్వజ్ఞుల శరీరము నిలబడి, లౌకిక వ్యవహారయోగ్యమగుచున్నది. ఈనియతియే సృష్ట్యాదియందు "ఇయ్యది అగ్ని, ఇయ్యదిట్లు, ఊర్ధ్వజ్వలన స్వభావసంపన్నమై సర్వదా వెలయుగాక" అను రూపమున పరబ్రహ్మమున సంకల్ప వృత్తిగ నుదయిన్చును. ఈ మహానియతియే మహాసత్త, మహాచితి, మహాశక్తి, మహాక్రియ, మహోద్భవము, మహా స్పందము, మహాత్మరూపము, అను నామముల వ్యవహరింప బడు చున్నది. ఈ నియతి యొక్క బలము వలననే చతుర్ముఖ బ్రహ్మ జగత్సముహములను గడ్డిపరకల వలె పరివర్తనమొనర్చు చున్నాడు. రాక్షసులు, దైత్యులు, నాగులు మొదలగువారు కల్పాంతము వరకు వ్యవస్థాపించ బడుచున్నారు. (ఇక్కడ విశ్వములోను, ప్రకృతి లోనూ వుండే సకల జీవులు, పదార్దములు, వాటికాధారములైన పంచ భూతాలు, అధి దేవతలు, సృష్టి, స్థితి, లయ కారకులు, సర్వం సహా అన్నీ ఆమూలకారణమైన పరమాత్మలోనే సంకల్పమాత్రముగా ఏర్పడ్డాయి. వారివారి కర్తవ్యాలన్ని పరబ్రహ్మ చేతే నియమింపబడ్డాయి కాబట్టి దానిని "నియతి" అన్నారు.)
బ్రహ్మసత్తయందు వ్యభిచారము అనుమానింప బడిననూ, అకాశాఫలకమున చిత్రము గాంచబడిననూ, గాంచబడుగాక, కాని ఈ నియతి ఎన్నటికినీ మారజాలదు. బ్రహ్మమును, నియతియును, సృష్టియును, నొక్కటియే. తత్త్వజ్ఞులగు బ్రహ్మాదులీ తీరుగనే గాంచుచున్నారు. అజ్ఞులకు తెలియబర్చుటకే విరిమ్చ్యాదులు బ్రహ్మ రూపియగు ఈనియతిని సృష్టియను నామమున బేర్కొనిరి. ఈసృష్టి ఆకాశము నందలి వృక్షమువలె ఆది మధ్యాంతరహితమగు ఈబ్రహ్మమున నిలిచియున్నది. (పరా చైతన్యము దేనిమీద ఆధారపడి యుండదు. అలాగే ఆకాశములో బొమ్మలు కనపడవు. ఇవి అసంభవాలు. ఒకవేళ ఇవి జరిగిననూ నియతి [పరబ్రహ్మ తత్త్వము] ఎన్నటికి మారదు. చైతన్య భావన కలిగిన వారికి అన్నీ పరబ్రహ్మస్వరూపాలే. అంతా పరబ్రహ్మమే. కాని ఆభావన లేని సామాన్యులకు తెలియడానికి వాటికి వేరు వేరు పేర్లతో చెప్పారు.)
18. ఈ మహా నియతినే దైవమందురు. ఇయ్యదియే సర్వకాల వ్యాపియును, సకల వస్తువ్యాపియును, సర్వమును విశుద్ధ చైతన్యమగు ఈశ్వర సంకల్పమునై యున్నది.
నిర్వాణ ప్రకరణము:ఉత్తర భాగము:101వ సర్గ:
57. సాక్షియగు ఆత్మనే చైతన్యము యొక్క స్పందాస్పందముల యేకరూపత్వముగా భావించినచో, ఆత్మ రూపమగు నిర్మలమైన పరబ్రహ్మమే శేషించును.
యోగశిఖోపనిషత్:చతుర్ధాధ్యాయం:1-5:
చైతన్యము ఒకే రూపమగుటవలన ఎప్పుడునూ భేదము యుక్తము కాదు. జీవత్వము కూడ త్రాటియందు సర్పజ్ఞానమువలె తెలియదగినది. రజ్జువునందు, తాను రజ్జువను జ్ఞానము లేనందువలన, క్షణములో రజ్జువు సర్పముగా నగును. అట్లే విశ్వాకారము కేవలయైన చిత్ యొక్క భావనము జరుగుచున్నది. ప్రపంచమునకు బ్రహ్మము కన్నా అన్యమైన ఉపాదానము లేదు. కావున ఈప్రపంచమంతయు బ్రహ్మమే గాని, ఇతరము గాదు. (దేనికైనా దాని స్వస్వరూప భావన లేనప్పుడు భ్రమచే అది ఇంకొకలా కనపడుతుంది. అలాగే ఆత్మ అజ్ఞానముచే కప్పబడి జీవుడని పిలువబడుతోంది. గతంలో చెప్పుకొన్న విధంగా ఈవిశ్వంలో చైతన్యభావన లోపించినపుడు ఈ అశాశ్వతమైన విశ్వమే, ప్రకృతే, శాశ్వతంగా భ్రమపెడుతుంది. కాని ఈవిశ్వంలో, ప్రకృతిలో ఎప్పుడైతే చైతన్యభావన వచ్చిందో, అప్పుడు దానికి ఉపాదానకారణమైన,మూలకారణమైన పరబ్రహ్మస్వరూపముగా అనుభవానికివస్తుంది.)
పైంగలో పనిషత్:పంచామోధ్యాయం:పరమ పదము:
నీవు, నేను, తాను, ఇతరుడు అను వృత్తులు ఎక్కడలేవో, సంకల్పరూప జ్ఞానము కొంచెము కూడా ఎక్కడలేదో, ఉన్నది, లేదు అను వృత్తులకు అగోచరమో, దృశ్యము, అదృశ్యము గాని లేదో, సర్వము శాంతించి నట్టిది, నిరాలంబమైనది, అనాభాసమైనది, అనామకమైనది, కారణము లేనిది, అదే ముక్తి. అదే మోక్షము. సత్తు, అసత్తు కానిది, ఆదిమధ్యాంతరహితమైనది, సర్వము కానిది, సర్వమూ అయినది, పూర్ణము కంటెను, పూర్ణమైనది, సుఖము కంటెనూ, సుఖమైనది, అసంవేదనము, అశాన్తము, ఆత్మవేదనము, అతతము, సర్వ పదార్ధములకు సత్త అయినది, అదే తప్ప అన్యమేమియూ లేనిది, ద్రష్ట, దృశ్యము ఆ మధ్యలో నున్న దృష్టి దేని స్వరూపమో, అదియే ద్రష్ట, దర్శనము, దృశ్యము ఇత్యాదులులేని పరమపదము. (మనం ఒక దృశ్యాన్నిగాని వస్తువునిగాని చూడట మనే ప్రక్రియ మొదలైనప్పుడు, ఆదృశ్యము లేదా వస్తువుయొక్క దృశ్యజ్ఞానము మనకు లభించేలోపు, ఆదృశ్యము, లేదా వస్తువునకు, చూచేవారికి, చూడటమనే ప్రక్రియకు సంబంధము ఏర్పడుతుంది. ఆసంబధము ఏర్పడేలోపు, మధ్యలో వచ్చే ఎడము, జాగాలో, మనదృష్టి ఎక్కడైతే వుంటుందో, అదే త్రిపుటి, అంటే ద్రష్ట, దృశ్యము, దర్శనము ఇత్యాదులు లేని పరమపదము. ఆజాగాలో ఉన్నదానిని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ధ్యానంలో సమాధి అవస్థ యొక్క విషయం కొంచెంగా నైనా తెలుస్తుంది.) చిత్తము ఒకచోటనుండి మరియొక చోటకు పరుగిడుచుండగా, ఏతన్మధ్యమున నుండు చిత్తమునకు ఏది స్వరూపమో, జడముగా నుండుటగాని, గ్రహించుటగాని, భావించుట గాని లేనిదో, అదియే పరమపదము. (దీనినే మనం ఇంకో రకంగా చెప్పుకొందాము. మనం ఏపనిలో వున్నా, ఏపని చేయకున్నా, మన మనస్సులో ఆలోచనలు భావాలు నిరంతరంగా ఒకదాని వెంట ఒకటి వస్తూ వుంటాయి. అల్లా వచ్చే ఆలోచనల, భావాల మధ్యలో అంటే ఒక భావం వెళ్ళిపోతూ ఇంకొక భావము వచ్చే మధ్యలో ఏదైతే ఎటువంటి ఆలోచన, భావము లేని స్థితి వుంటుందో దానిని బాగా గమనించండి. ఇంకా బాగా చెప్పాలంటే, మూవీ ఫిల్ము లో ఒక సెకనుకి 24 ఫ్రేములు వుంటాయి. రెండు ఫ్రేముల మధ్యలో దృశ్యము లేని భాగము ఒక సన్నని గీతలాగా వుంటుంది. దాన్ని గమనించండి. ఇప్పుడు బాగా అర్థమైనదని తలుస్తాను. ఇప్పుడు ఆ దృశ్యము లేని భాగాన్ని, ఆలోచన, భావము లేని భాగాన్ని మనం ధ్యానం ద్వారా పెంచుకోవాలి. వెళ్ళిపోతున్న ఆలోచనని, భావాన్ని వెళ్ళిపోనిచ్చి, వచ్చే ఆలోచనని, భావాన్ని రాకుండా ఆపాలి. ఆ ఏమిలేని స్థితిని ఎంతవరకూ వీలైతే అంతవరకూ పొడిగించుకోవాలి. మనస్సు చేసే పని ఆలోచన. ఎప్పుడైతే పైనచెప్పిన విధానంతో మనం ఆలోచనలను ఆపు చేశామో అప్పుడు మనస్సు పనిచేయడం మానేస్తుంది. అప్పుడు మనస్సు అమనస్సు అవుతుంది. ఇదే అమనస్క యోగం. ఈవిధంగా నిరంతరంగా సమాధి అవస్థలో ఉండటమే పరమపదం.) నిరంతరము తద్రూపుదవగుము. జాగ్రత్స్వప్నసుషుప్తి అవస్థలు లేని నీయొక్క సనాతనమైనట్టిదియూ, జడచేతనములు కానట్టియు ఏపరమాత్మ రూపము కలదో, ఆ రూపమునందే సదా తన్మయుడవై యుండుము. జడమగు స్థితిని వీడిన శిలాహృదయమే అది. (ఆత్మస్థితి) అట్టి అమనస్కాత్మస్వరూపములో సదా తన్మయుడవై యుండుము. చిత్తమును దూరముగా పరిత్యజించి, ఏది నీవై యున్నావో, అట్టి ఆత్మస్వరూపమునందు స్థిరుడవై యుండుము.
మహావాక్య విచారము:
పైంగలోపనిషత్:తృతీయాధ్యాయం:
ఆ బ్రహ్మము నీవే అయి వున్నావు. నీవే ఆ బ్రహ్మముగా నున్నావు. నీవు ఆ బ్రహ్మమువై యున్నావు. నేను గూడ బ్రహ్మమునై ఉన్నాను. అని ఈరీతిగా అనుసంధానము చేయవలెను. ఆ మహావాక్యము నందు పరోక్షశబలుడై యున్నవాడును, సర్వజ్ఞత్వాది లక్షణయుక్తుడును, మాయ(అవ్యక్తము)యే ఉపాధిగా కలవాడును, సచ్చిదానంద లక్షణుడును అగు జగత్కర్త 'తత్' పదవాచ్యుడగుచున్నాడు. ఆ ఈశ్వరుడే అంతఃకరణసహితుడై 'నేను' అను జ్ఞానమునకు విషయమైనవాడై 'నీవు' (త్వం') అను పదమునకు లక్ష్యమైయున్న 'ప్రత్యగాత్మ' బ్రహ్మమే అగుచున్నది.
యోగ వాసిష్ఠము:నిర్వాణ ప్రకరణము:పూర్వభాగము:51వ సర్గ:
45. మహావాక్యము వలన కలుగు బ్రహ్మ సాక్షాత్కారము, బ్రహ్మభావములు వాసనామయములగు స్వప్నములు గావు. ఏలయన, ఈ చిత్బ్రహ్మము శివము, అద్వైతము, చతుర్ధము మున్నగు స్వాభిదాన వాక్యముల వలన ప్రభోదింప బడుచున్నది. జాగ్రత్స్వప్నసుషుప్తులు ఆయనకు లేవు. జాగ్రదావస్థ యందు అనుభవగమ్యుడు కాడు. ఆయన వాసనా రహితుడు అగుట వలన వాసనామయ స్వరూపుడు కాజాలడు. ఆయన నిర్మలమును, నిరంజనమును నగు చైతన్యము.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తుంటాము)
మనం పరబ్రహ్మ స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవాలో విచారించిన పిమ్మట అదేమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది మహనీయులు, బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడు బ్రహ్మమే అవుతాడని స్వానుభవంతో తెలియజేసారు. కొందరు బ్రహ్మాన్ని తెలుసుకొన్నాననుకొంటే అజ్ఞానమని, తెలుసుకోలేక పోయానని తెలుసుకొంటే, దాని గురించి తెలియటం మొదలవుతుందని చెప్పారు. ఎంతచెప్పినా అది పూర్తిఅవదని, దానికి నిర్వచనాలు లేవని, కేవలము అనుభవపూర్వకమని కొందరు తెలియజేసారు. మనం గతంలో అనుకున్నట్లు నిజంగా పరబ్రహ్మను పొందినవాడు ఈలోకంలో ఉండడు. కాని కొంతమంది మహానుభావులు ఆస్థితిలో చివరి వరకూ వెళ్లి, మళ్లీ వెనక్కు వచ్చి, మనలాంటి వారికోసం కొంతవిషయాన్ని అక్కడక్కడ చెప్పారు. ఒకమాట మాత్రం నిజం. మనం మనుష్యులం కాబట్టి, మాయామయమైన శరీరంతోటి, అంతఃకరణాలతోటి జీవిస్తున్నాం కాబట్టి, ఈఅజ్ఞానం తొలగేవరకూ (పూర్తిగా పనికి రానప్పటికీ)కొంచెం ప్రాపంచకమైన జ్ఞానంతోటి, మన బుద్ధికి, మనస్సుకు అందే విషయాలతోటి దాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిద్దాం.అంతవరకూ దోషమేమీ లేదు. దానిసంగతి తెలిసిన పిమ్మట, దానికోసం ఉపయో గించిన ప్రాపంచిక విషయాలను వదలివేసి, పూర్ణమైన జ్ఞానాన్ని మాత్రమే ఆశ్రయిద్దాం. ఎందుకంటే "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" కాబట్టి.
ఈ విషయమై అనుభవం పొందిన మహాత్ములు, అనన్యచింతనులు, ఋషులు, యోగులు ఏ విధంగా తెలియజేశారో పరిశీలిద్దాం. (కొన్ని వివరణలు బ్రాకెట్లలో యివ్వడమైనది).
ఈశావాశ్యోపనిషత్:
4. పరమాత్మ ఒక్కటే చలనరహితమైనది. అయినా మనస్సుకంటే మహావేగము కలది. మనసుకంటే ముందే వెళ్ళుటవలన, అది యింద్రయములకు చిక్కదు. నిత్యమైనది. స్థిరమైనది అయినప్పటికీ, పరిగెత్తే అన్నింటిని అది దాటిపోవుచున్నది. ఆత్మసాన్నిధ్య మున్నందు వలననే జీవకోటులు తమ కార్య కలాపములను సాగించుటకు సమర్థవంతములగుచున్నవి. (ఇక్కడ పరమాత్మ యొక్క వైవిధ్యలక్షణాలను చెపుతున్నారు. పరమాత్మ అన్ని చోట్ల ఉన్నందున మనం ఎంత వేగంగా వెళ్ళినా, అక్కడ మనకన్నా ముందరే వెళ్లి ఉన్నట్లు తోస్తుంది. అందువలన అది ఎక్కడికి వెళ్ళనప్పటికీ అత్యంత వేగంగా ఉన్నట్లు తోస్తుంది. మనం గజేంద్రమోక్షంలో తెలుసుకున్నట్లు ఆ పరమాత్మ ప్రవేశించినందు వల్లనే ఈజీవులన్నియూ చైతన్యవంతములై తమతమ కార్యకలాపములను చేయు సమర్థములైయున్నవి.)
5. ఆ ఆత్మ చలింపదు. దూరములో నున్నది. దగ్గరగా నున్నది. అదియే సర్వవ్యాపకముగా నున్నది. ఈ అంతటి వెలుపల, లోపల గూడ నున్నది. (పైన చెప్పినట్లు ఆ పరమాత్మ అన్నిచోట్ల ఒకేసారి ఉన్నందున ఈవిధంగా తోస్తుంది. ఒకసారి చర్చలలో, ఒకేసారి దూరంగానూ, దగ్గరగాను ఎలా వుంటుంది? అన్న ప్రశ్న వచ్చింది. మనం ఎదురెదురుగా (face to face) కూర్చుంటే ఎలావున్నాము? చాలా దగ్గరగా వున్నాము. అలా ఉన్నచోటనే ఒకరికొకరు వ్యతిరేకదిశలో కూర్చుంటే ఎలావున్నట్లు? ఎంత దూరంలో వున్నట్లు? ఒక్కసారి ఆలోచించండి! అలాగే మనం పరమాత్మవైపు తిరిగితే మనకు ఆయన చాలా దగ్గరగా ఉంటాడు. ఆయనకేసి తిరగకపోతే చాలా దూరంగా ఉంటాడు. ఇక్కడ చెప్పిన ఆయన సర్వవ్యాపకత్వాన్నే మనం ప్రతిరోజూ చదువుకొనే మంత్ర పుష్పంలో "యచ్ఛకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపివా, అంతర్ బహిశ్చతత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః" అంటే 'ఏదయితే మనకు కనపడుతూ, వినపడుతూ వుండే ప్రకృతి వుందో, దాని లోపలా బయటా అంతా ఆపరమాత్మే నిండివున్నాడు' అని శృతి చెప్పింది.)
8. స్వయంభువు, సర్వవ్యాపి, అశరీరి, అస్నాయువు, పాప కళంక రహితుడు, ఉజ్జ్వలుడు, పరిపూర్ణుడు, స్వచ్ఛమైనవాడు, సర్వదర్శి, సర్వవిదుడు, సర్వ పరిఛ్చేదకుడు, అయిన పరమాత్మ శాశ్వతులైన ప్రజాపతులకు వారివారి కర్తవ్యములను నిర్ణయించి యిచ్చినాడు.
కేనోపనిషత్: ప్రధమ ఖండం:
౩. పరబ్రహ్మమును నేత్రముతో చూచుటకు వీలుకాదు. వాక్కుతో చెప్పుటకు వీలుకాదు. మనస్సుతో చింతించుటకు వీలుకాదు. అట్టి ఆత్మను బోధించుట ఎట్లు? మాకు తెలియదు. అది తెలియువాటికి, తెలియబడని వాటికి, అతీతముగా నున్నది. మా గురుదేవులు (సనాతనులు) ఈ రీతిగా చెప్పు చుండుట వినియుంటిమి.
4-8. ఏ ఆత్మ వాగింద్రియముచేత గ్రహించబడదో, దేని శక్తిచేత వాగింద్రియము పనిచేయుచున్నదో, దీనిని చక్షుస్సు చూడలేదో, దేనిచే అంతఃకరణవృత్తులను చూచునో, దేనిని చెవితో వినుటలేదో, దేనిచేత ఈశ్రవణేన్ద్రియము పనిచేయుచున్నదో, ఏది మనసుచేత భావించుటకు అశక్యమగునో, దేనిచేత మనస్సు పనిచేయుచున్నదో, అద్దానినే పరబ్రహ్మమని తెలియుము. అన్యమేదియు బ్రహ్మము కాదు. ఏది ఉచ్చ్వాసనిశ్వాసాత్మకమగు ప్రాణక్రియతో తెలియ బడజాలదో, దేనిచే ప్రాణము నిజకర్మమున నడుపబడుచున్నదో, అదియే బ్రహ్మమని ఎరుంగుము. అన్యమైన దేమియు బ్రహ్మము కాదు. (ఇక్కడ మన శరీరము భౌతికవిషయ పరిజ్ఞానాన్ని గ్రహించే అవయవాల ద్వారాగాని, శరీరభౌతికకర్మల ద్వారాగాని, పరబ్రహ్మమును తెలిసికోలేమని, ఈ అవయవాలని, వాటిని నడిపించే మనస్సుని కూడా పనిచేయించేది పరబ్రహ్మమని మనకు తెలియజేస్తున్నారు.)
చతుర్థఖడం:
4. విద్యుత్తు యొక్క ప్రకాశమువలె కన్ను తెరచినప్పుడు వస్తువులు చూడనగును. అది మూయగానే వస్తువులు కనిపింపవు. క్షణమాత్రము మెరుపు మెరసినపుడు కన్నులు మిరుమిట్లు గొలుపును. విద్యుత్తు క్షణ మాత్రమే ప్రకాశించును. అట్లే బ్రహ్మము యొక్క దర్శనము కూడా! (ఇక్కడ బ్రహ్మదర్శనం లేదా ఆత్మదర్శనం గురించి చెపుతున్నారు. మొట్టమొదట్లో ధ్యానంలో ఏకాగ్రత కుదిరినప్పుడు ఎలా ఆత్మ దర్శనం అవుతుందో ఒకసారి గురువుగారు చెప్పారు. చీకటిలో మిణుగురుపురుగు వెలిగినట్లు కనపడుతుందట. వెంటనే మాయమైపోతుందట. తర్వాత ఏకాగ్రత కుదిరిన కొద్దీ కదలకుండా ఉంటుందట. ఈవిషయాన్నే ఉపనిషద్రష్ట తెలియజేస్తున్నారు.)
6. పూర్వము వర్ణింపబడిన బ్రహ్మమే 'తద్వనం' అనబడును. ఆబ్రహ్మమును సర్వభూతాత్మగా ఉపాసించవలెను. బ్రహ్మను 'తద్వనం' అని ధ్యానించవలెను. సర్వప్రాణులు అతనిని ఆ విధముగానే కోరును.
కఠోపనిషత్:ప్రథమాధ్యాయము: 6వ వల్లి:
17. అంగుష్ఠమాత్ర పరిమాణము గల హృదయపద్మ పురుషుడు అంగుష్ఠమాత్రుడనబడును. అట్టి అంగుష్ఠ మాత్ర పురుషుని, ముంజ యను తృణవిశేషము నుండి తదంతర్గతయగు ఇషీక, పరకను వెలుపలకు లాగునటుల సర్వశరీరము నుండి జ్ఞానముచేత వేరుపరచవలెను. వేరుపరచిన చిన్మాత్రుడగు ఆయాత్మనే శుద్ధమైన బ్రహ్మము గా నెరుంగవలెను. (ముంజ అనేది ఒకరకమైన గడ్డి. దాని ఆకులలో ఈనె వుంటుంది. కొబ్బరిఆకుల లోంచి ఈనెను బయటకు లాగునటుల ఈముంజగడ్డి ఆకులలోంచి కూడా ఈనెను బయటకు లాగవచ్చును. ఆ ప్రకారంగా మన శరీరంలో ఆత్మచైతన్య రూపంలో వున్న పరమాత్మను జ్ఞానంతో వేరుపరచి దర్శింపవలెను.)
మున్డకోపనిషత్:ప్రధమమున్డకం:ప్రధమఖండం:
6. ఈపరబ్రహ్మ తత్త్వము దర్శించుటకుగాని గ్రహించుటకుగాని వీలుకానిది. సంబంధము లేనిది. రంగులు, రూపములుకాని, నేత్రములు శ్రోతములుగాని, హస్తములు పాదములుగాని లేనిది. నిత్యమైనది. సర్వవ్యాపక మైనది. సర్వగతము. అత్యంత సూక్ష్మము. అవ్యయము. సమస్త భూతముల యొక్క ఉత్పత్తి స్థానమై యున్నది. తెలిసిన బ్రహ్మజ్ఞానులు సర్వత్ర ఈఆత్మనే దర్శించుచుందురు. (ఇక్కడ ఒక విషయం, మన భారతీయ విద్యా విధానం ఎంత గొప్పదో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక భాష గురించి చెప్పే మొదటి పాఠం లోనే భాషతో పాటు పరమాత్మజ్ఞానం కూడా ఇచ్చారు. తెలుగు వ్యాకరణంలో మొదటి పాఠం భాషాభాగాలు. అవి, నామ వాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము, మొత్తం 5. వీటిలో అవ్యయము అంటే లింగ, వచన, విభక్తులు లేనిది. ఈగుణం పరమాత్మకు చెందినది. అంటే పరమాత్మకు చెందిన జ్ఞానం మనకు మొదటిపాఠం లోనే చెపుతున్నారు. కాని మనం దానిని పట్టించుకోకుండా పెరిగి మళ్లీ దాని కోసమే ఎక్కడెక్కడో వెతుకుతాము.)
ద్వితీయమున్డకం:ప్రథమఖండం:
2. ఆ అక్షరపరబ్రహ్మము జన్మలేనిదై, బాహ్యాభ్యంతరములలో నిండినదై. సమస్త రూపరహితమై, పరిపూర్ణమై, ప్రకాశించుచున్నది. అందువలననే ప్రాణములేనిదై ఆవ్యాకృతాది సర్వవికారముల కంటే భిన్నమై, నామరూపముల కంటే విలక్షణమై, ఉపాధి లేనిదై పరిపూర్ణముగా ప్రకాశించుచున్నది.
ద్వితీయఖండం:
1, 2. ప్రకాశము కలదై, అత్యంత సన్నిహితమై, హృదయగుహలో సంచరించుచున్నదై, మహత్తై, సమస్తము నకు అధారమై, సమస్త విశ్వము తనలో ధరించియున్నదై ప్రకాశించు నీబ్రహ్మమే చలనము కలిగి, ప్రాణవాయువు పీల్చి నిమేషములు కలిగియున్నది. ఈపరబ్రహ్మమును సత్తుగాను, అసత్తుగాను, సకల ప్రజలలోను ప్రతిష్టమై యున్నదిగాను, పరమైనదిగాను, ప్రాణుల జ్ఞానమునకు అతీతముగా నున్నదానిగాను తెలిసికొనుము. ఏది కాంతి కలదో, అణువుకంటెనూ అణువైనదో, దేనియందు పృథివ్యాది లోకములను, మనుష్యాదులను ఉంచబడినారో అదియే అక్షరబ్రహ్మము.అదియే ప్రాణము. అదియే వాక్కు, మనస్సు. ఆపరబ్రహ్మమే సత్యము. అదియే అమృతము, నాశరహితము. అదియే మనస్సునకు లక్ష్యముగా చేయ దగినది. అట్టి పరబ్రహ్మమును తెలిసికొనుము. (ఇక్కడ పరమాత్మ హృదయగుహలో ఉన్నాడని చెపుతున్నారు. ఆ హృదయము గురించి మంత్రపుష్పంలో "అనంత మవ్యయం కవిగ్ మ్ సముద్రేంతం విశ్వశంభువం| పద్మకోశ ప్రతీకాశగ్ మ్ హృదయంచాప్యథోముఖం|| అధో నిష్ట్యా వితస్త్యాన్తే నాభ్యాముపరి తిష్టతి| జ్వాలమాలాకులం భాతీ విశ్వస్వాయతనం మహత్||" అనంతుడు, అవ్యయుడు, సర్వజ్ఞుడు, సంసారసాగర అంతముననుండేవాడు, విశ్వ మంగళకారుడు, అయిన పరమాత్మ అధోముఖమైన తామరమొగ్గలా వున్న హృదయంలో వున్నాడు. ఈ హృదయం కంఠానికి క్రింద, నాభికి పైన జానెడు దూరంలోవుంది. ఇందులో విశ్వానికిఅంతటికి మూలమైన పరమాత్మ దీపశిఖలవరుసతో సమానమైన జాజ్వల్యమానమైన తేజస్సుతో ప్రకాశించు చున్నాడు అని శృతి చెప్పింది. ఇక్కడ చెప్పిన హృదయం మనకు కనపడే గుండె కాదు. మనకు రెండు రకాల శరీరాలున్నాయి. ఒకటి భౌతిక శరీరం (physical body). రెండవది శక్తిశరీరం (energetic body). ఈ రెండవశరీరంలోనే శక్తిస్థానాలైన షట్చక్రాలూ, హృదయం మొదలైన ఆధ్యాత్మిక పరిభాషలో వివరింపబడే అంగాలూ వుంటాయి. ఈ ఆధ్యాత్మికమైన శరీరం భౌతికమైన అనుభవానికి రాదు. ఈ శరీరం అనుభవం లోనికి రావాలంటే ధ్యానం లేదా తపస్సు ద్వారా తగిన శక్తి (power) సంపాదించు కోవాలి. లేదా ఆశక్తి ఇవ్వగలిగిన వారు ఇవ్వాలి. ఇక్కడ మనకు రెండు గట్టి దృష్టాంతరములు వున్నాయి. భగవద్గీతలో, విశ్వరూపదర్శనయోగములో 8వ శ్లోకంలో కృష్ణపరమాత్మ "నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా| దివ్యం దదామి తేచక్షుః పశ్యమే యోగమైశ్వరం|| ప్రాకృత చక్షువులతో నా రూపమును నీవు నిజముగా చూడజాలవు. కనుక నీకుదివ్య(అలౌకిక)దృష్టినిప్రసాదించుచున్నాను. ఆదివ్యదృష్టితో నాఈశ్వరీయయోగరూపమును చూడుము అని అర్జునునికి చెప్పి దివ్యదృష్టిని ప్రాసాదించాడు. ఒకసారి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు షట్చక్రాలూ, వాటి స్థానాలనూ వివరిస్తున్నప్పుడు 'కక్కడు' అనే కాటికాపరి విని ఇంటికివెళ్లి, నిద్రపోతున్న తన భార్యని కత్తితో కోసి, షట్చక్రాల కోసం వెతుకుతాడు. అవి కనపడవు కాని, భార్య చనిపోతుంది. దాంతో పట్టరాని కోపంతో వీరబ్రహ్మేంద్రస్వాములవార్ని చంపడానికి వస్తాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వాములవారు కక్కడి అమాయ కత్వానికి జాలిపడి అతని భార్యని బ్రతికించి అతని తలపై చేయిపెట్టి, షట్చక్రాలను చూపిస్తారు. ఈ రెండు దృష్టాంత రములు కూడా మనకు ఏమిచెపుతున్నాయి? ఆధ్యాత్మిక పరిజ్ఞానములొనూ, యోగమార్గము లొనూ వివరింప బడే అంగములు, స్థానములు, ప్రదేశములు, లోకములు వగైరాలు భౌతికపరిజ్ఞానము వలనగాని శాస్త్రములవలన గాని, తెలియబడవు. కేవలము, ధ్యానము, తపస్సు వలన గాని, లేదా మహానుభావుల, సద్గురువుల అనుగ్రహము వలన గాని పొందగలిగే అనుభవముల వల్ల మాత్రమే తెలుస్తాయి.)
10. నిష్కళంకుడై, విరాజమానుడై, అవిద్యాదోషములు లేనివాడై, హిరణ్మయకోశమందున్న పరబ్రహ్మ పరిశుద్దుడు. సకల జ్యోతులకు జ్యోతి, అని ఆత్మ తత్త్వ వేత్తలు తెలుసుకొనియున్నారు.
ఐతరేయోపనిషత్:తృతీయాధ్యాయం:
2,3:ఈ హృదయము, మనస్సు, చేతనత్వము, ఈస్వరత్వము, సమస్త వివేకము, సద్ జ్ఞానము, శాస్త్ర జ్ఞానము, సకలము నెరింగెడి జ్ఞానము, ధైర్యము, మననము, మనోధార్ఢ్యము,మనోవేదన,స్మరణము, రూపాదులను వికల్పముగా గాంచుట, నిశ్చయము, ప్రాణవృత్తి, ఆశ, స్వాధీనత, అనువన్నియూ, ప్రజ్ఞానముయొక్క నామములే యగుచున్నవి. అతడే బ్ర్రహ్మ. అతడే ఇంద్రుడు. అతడే ప్రజాపతి. ఈదేవతలెల్లరూ అతడే. పంచభూతములు, అల్పములగు జంతువులూ, విత్తనములు, మిగతా స్థావరజంగమములు, అండజములు, జరాయుజములు, స్వేదజములు, ఉద్భిజములు, గుఱ్ఱము, ఆవు, ఏనుగు, మనుష్యులు, ఇంకనూ జంగమములైన ప్రాణులేవి కలవో అవి, పక్షులు, మిగత స్థావరములు, అన్నియూ ఆ ప్రజ్ఞానేత్రమే. ప్రజ్ఞానము నందే నిలకడ బడసినవి. లోకములు ప్రజ్ఞానేత్రముగనే యున్నవి. ప్రజ్ఞానమునే ఆధారముగా బడసినవి. ప్రజ్ఞానమే బ్రహ్మము. (ఇక్కడ "ప్రజ్ఞానం బ్రహ్మ" అనే మహావాక్యానికి చాలా గొప్ప వివరణ ఇచ్చారు.)
బృహదారణ్యకోపనిషత్:చతుర్థాధ్యాయం: పంచమ బ్రాహ్మణం:
(మధువిద్య) ఈ పృధివి సమస్త భూతముల(జీవుల)యొక్క మధుస్వరూపమైనది. పృథివ్యాదిలక్షణమైన ఈ జత్తన్తయూ, పరస్పరము కార్యకారణమగుటవలన అదే ప్రకారమగుటకు తగియున్నది. (ఈఅర్థమే ఈ బ్రాహ్మణము నందు ప్రకాశింపుచున్నది.) ఈప్రసిద్ధమగు భూమి, బ్రహ్మ మొదలుకొని స్తంబపర్యన్తముండెడి సమస్తప్రాణుల యొక్క కార్యమైయున్నది. సమస్తభూతములును, ఈభూమియొక్క కార్యము.ఈ భూమియందలి తేజస్వరూపు డును అమృతస్వరూపుడును నగు ఈపురుషుడు దేహేన్ద్రియ సముదాయకర్త యగుచున్నాడు. ఈశరీరమందలి తేజస్వరూపుడును అమృతస్వరూపుడును నగు జీవుడు ఆ ఆత్మస్వరూపమే. ఆ ఆత్మస్వరూపమే మైత్రేయి కొరకు చెప్పబడిన అమృతత్వసాధన, ఆత్మ విజ్ఞానము. ఇదియే పరబ్రహ్మ స్వరూపము.
ఈ సుప్రసిద్ధమగు జలములు సమస్త ప్రాణుల యొక్క కార్యభూత సారాంశము. ఈజలముల యందలి తేజో మయుండును అమృత స్వరూపుడునగు పురుషుడే ఈదేహేంద్రియ సముదాయకర్తయందున్న రేతస్సంబంధుడు, తేజోమయుండును, అమృతస్వరూపుడునగు పురుషుడు. ఇతడే ఆత్మస్వరూపుడు. ఈ ఆత్మ స్వరూపమేదియో ఇదియే అమృత స్వరూపము(మధు స్వరూపము). ఇదియే పరబ్రహ్మస్వరూపము. ఇదియే సర్వముగా నున్నది. ఈరీతిగానే, జలములలోనున్న విధముగానే, మిగిలిన అగ్ని, వాయువు, సూర్యుడు, దిక్కులు, చంద్రుడు, విద్యుత్తు, మేఘ గర్జనము, ఆకాశము, ధర్మము, సత్యము, ఆత్మ స్వరూపము, మానుష జాతిలోనూ సర్వముగా పరబ్రహ్మమును మధుస్వరూపముగా నెరుంగవలెను. ఈవిజ్ఞానాత్మ సమస్త భూతములకునధిపతియును రాజు అగుచున్నది. అట్టి ఆత్మస్వరూపమునందు సర్వప్రాణులును, సమస్త లోకములును, సర్వ దేవతలును, సర్వ భూతములును, ఈ సమస్తఆత్మలును ఇవి అన్నియును రథచక్రమునందున్న ఆకులు వలెనే మధ్యలో అమర్చ బడియున్నవి.
(ఇక్కడ పరబ్రహ్మ యొక్క మధుస్వరూపము గురించి చాలా చక్కగా వివరించారు. ఇక్కడ మధువు అంటే మత్తుపానీయము కాదు. క్షరముకాని శాశ్వతము లేదా అమృతస్వరూపము. ఇది పరబ్రహ్మయొక్క, చైతన్యము యొక్క ముఖ్యలక్షణము. జాగ్రత్తగా గమనిస్తే ఈ లక్షణం మనకు కనపడుతున్న, వినపడుతున్న, అనుభవం పొందుతున్న అన్నింటిలోను కనపడుతుంది. ఇటువంటి అనుభవాన్నే శ్రీవల్లభాచార్యులవారు శ్రీకృష్ణపరంగా పొందారు. శ్రీకృష్ణునిలోను, ఆయనతో సంబంధమున్న ప్రతివస్తువు, ప్రదేశములోను మధుస్వరూపాన్ని అంటే అమృతతత్వాన్ని దర్శించి, అనుభవించారు. ఆఅనుభవాన్ని ఆయన ఎంతో అందముగా 'మధురాష్టకం'గా రచించారు. అందులో ఆయన ప్రతి శ్లోకములోను 'మధురాధిపతేరఖిలం మధురం' అంటే మధురమునకు, అమృతతత్త్వానికి అధిపతియైన ఓకృష్ణా నీకు సంబంధించినదంతయు మధురమే అంటే అమృతమే అన్నారు. ఒక్కసారి ఈ భావనతో 'మధురాష్టకం' చదవండి. ఈభావన మీకుకూడా అనుభవానికి వస్తుంది. అలాగే ఈ సృష్టిలోని ప్రతీదీ ఆపరబ్రహ్మకు, ఇరుసుతో అనుసంధానించబడిన ఆకులవలె, అనుసంధానించబడి యున్నవని తెలియ జేశారు.
పంచమాధ్యాయం:అష్టమ బ్రాహ్మణం:(అక్షర పరబ్రహ్మ స్వరూపం):
యాజ్నవల్క్యమహర్షి గార్గితో చెప్పుచున్నాడు. బ్రహ్మజ్ఞానులు దానిని అక్షరమని చెప్పుదురు. నాశరహిత మైన దానియందు ఓతప్రోతమై యున్నదని పలికెదరు. (ఓతప్రోతమంటే వస్త్రములోని నిలువు అడ్డ దారములు. వస్త్రములో దారములు ఎలావున్నవో అలా పరబ్రహ్మ వ్యాపించివున్నాడు.) అది స్థూలము కాదు. సూక్ష్మము కాదు. అణువును కాదు. పొట్టిదియు కాదు. పొడుగైనది కాదు. అలోహితము (రక్తము లేనిది). అతమము (తమస్సు, అజ్ఞానము, చీకటిలేనిది). అవాయువు. అనాకాశము. అసంగము, అరసము, అగంధము, ఆచక్షువు, అశ్రోతము, అవాక్కు, అమనస్సు, అతేజస్కము, అప్రనము, ఆముఖము, ఆమాత్రము (పరిమాణము, పరి ణామము కూడా లేనిది). లోపల వెలుపల లేనిది, అదే వున్నది, భోక్త కాదు, భోజ్యము కాదు, ఈ అక్షరుని యొక్క ఆజ్ఞతో సూర్యచంద్రులు సంచరించుచున్నారు. ఈఅక్షరుని యొక్క ఆజ్ఞవలననే భూమ్యంతరిక్షములు శక్తిగలవిగా నున్నవి. ఈఅక్షరుని యొక్క ఆజ్ఞయందు నిమేషములును (కనురెప్పపాటు కాలము), ముహూర్తములును, అహోరాత్రములును, పక్షములును, మాసములును, ఋతువులును, సంవత్సరములును, అన్నియును ధరింప బడినవై, శక్తిగా నిండియున్నవి. ఈఅక్షరుని యొక్క శాసనముతో హిమవంతము మొదలైన పర్వతముల నుండి గంగాదినదులు ప్రాఙ్ముఖముగాను, ఇతరములైన సింధునది మొదలైన నదులు పశ్చిమాభిముఖములుగాను ప్రవహించుచున్నవి. (తూర్పుగా ప్రవహించే వాటిని నదులని, పడమరగా ప్రవహించే వాటిని నదములని అంటారు.) ఈఅక్షరుని యొక్క ఆజ్ఞతో దానార్హములైన బంగారము మొదలైన వాటిని మనుష్యులు శ్లాఘించుచున్నారు. ఈఅక్షరము తానెవ్వరికీ కనిపించక అన్దరినీ చూచుచూ, వినబడకుండి వినుచూ, ఆలోచనార్హము కాకపొయిననూ, విచారార్హమై యున్నది. తెలియబడదు, తెలిసికొనును. ఇదితప్ప మరెవ్వరూ చూచువారు లేరు. ఈసత్యవస్తువు తప్ప యింకెవ్వరూ వినువారులేరు.
షష్ఠాధ్యాయము:చతుర్థ బ్రాహ్మణం:
5.విజ్ఞానస్వరూపమగు ఈఆత్మ పరబ్రహ్మము, మనోస్వరూపుడు, ప్రాణస్వరూపుడు, శ్రోత్రస్వరూపుడు, భూ, ఉదక, వాయు, ఆకాశ, తేజో, తెజోరహిత, కామ, అకామ, క్రోధ, క్రోధరహిత, ధర్మ, అధర్మ, సర్వస్వరూపుడును అయివున్నాడు. ఆఆత్మ ప్రత్యక్షమగు ఇంద్రియగోచర శబ్దాదివిషయ స్వరూపమైనాడు. మరియు అప్రత్యక్షముగా అంతఃకరణము నందుండెడి శబ్దాదివిషయరూపమైనది. ఈఆత్మయే జీవరూపుడుగా నుండి పుణ్యకర్మము చేయు వాడై పుణ్యాత్ముడుగాను, పాపకర్మము చేయువాడై పాపాత్ముడు గాను అగుచున్నాడు. మరియు కొందరు ఈ జీవుడు ఆకారస్వరూపుడు యని చెప్పుచున్నారు. ఆకారరూపుడగు పురుషుడు తన వాంఛప్రకారము ఏకర్మ చేయునో, ఆకర్మ ఫలమును పొందుచున్నాడు.
20. ఈ బ్రహ్మమును ఏకముగా చూడవలెను. అది అప్రమేయమైనది. ధృవమైనది. నిత్యమైనది. మాలిన్య రహితమైనది. ఆకసము కంటె సూక్ష్మమైనది. జన్మము లేనిది. సర్వ శ్రేష్టమైనది. ఇది ధృవము.
మహోపనిషత్:ద్వితీయాధ్యాయము:
1-3.అనిర్వచమై యున్నందువలనను, అగమ్యముగా నున్నందువలనను, అణుమాత్రస్వరూపమగుట వలనను, చిన్మాత్రమగు నీపరమాత్మ అకాశాముకంటే అతిసూక్ష్మముగా నున్నది. పరమసూక్ష్మమగు నీచిద్వస్తువు నందు మాయాశక్తి యొక్క విషయగుణములతో అనంతకోటి బ్రహ్మాండరేణువులు ఉత్పత్తి, స్థితి, లయములను పొందు చుండును. బాహ్యముగా శూన్యమువలె కన్పించుచున్నందు వలన పరబ్రహ్మము ఆకాశమని చెప్పబడుచున్నది. చిత్ స్వరూపముగా నున్నందువలన, ఆబ్రహ్మము విలక్షణముగా నున్నది. ఆబ్రహ్మము ఆకాశము కాదు. ఆకాశము లేనిది. ఇట్టిదని నిర్దేశించుటకు వీలుకానిది. అదియే సత్తు, చిత్తు. ఈఆత్మవస్తువు ప్రకాశ స్వరూపము, చేతనము, విజ్ఞానఘనమై, శిలాసదృశమై యున్నది. ఆకాశామువలె స్వస్వరూపముతో తదధిష్ఠానముగా అను భూతమైయున్నది. చిత్రవిచిత్రముగా నున్న జగత్తుయొక్క వికాసమును భేదించుచున్నది. ఈవిశ్వము తత్పద లక్ష్యముగా నున్న పరమాత్మ యొక్క ప్రకాశమాత్రము. అందువలన ఈవిశ్వము ఆత్మకంటె ప్రత్యేకముగా సత్త కలది కాదు. జగత్తు యొక్క భేదభావము కూడా ఆత్మ యందె భాసమగు చున్నది. అందువలన ఈ భేదమంతయూ ఆత్మమయమై యున్నది. అధిష్ఠానరూపములో ఆయాత్మ సర్వముతో సంబంధముకలదై యున్నది. సర్వ వ్యాపకమై గమనక్రియ లేకున్నది. జాతి గుణ క్రియాదులు ఈ ఆత్మకు లేవు. త్రికాలాబాధ్యమై సత్యమై యున్నది.
అయ్యదియే విజ్ఞానానంద స్వరూపమగు పరబ్రహ్మము. త్యాగమూర్తులకు అది పరమగతిగా నున్నది. సర్వ సంకల్ప సన్యాసపూర్వకముగా శుద్ధమనస్సుతో ఆబ్రహ్మమును గ్రహిమ్పవలయును. అయ్యది భావాతీతము,భావ రహితము. జాగ్రదవస్థలో నున్నప్పుడు ఎవరికి దృశ్యమాన జ్ఞానము నశించునో వానియొక్క స్థితినే జ్ఞానమని పెద్దలు చెప్పెదరు. వృత్తిజ్ఞాన శూన్యజ్ఞానమే జ్ఞానమని బుధులు చెప్పుదురు. జగదుత్పత్తి ప్రళయములు వృత్తిజ్ఞానము యొక్క వికాససంకోచములు. "వాక్కులకు అగోచరమైన సచ్చిదానంద పరబ్రహ్మమే నేను. తదితరము నేనుగాను" అను సిద్ధాంతమే వేదాంతవచనముల పర్యవసానము. (ఇచ్చట "నేనేవరను?" అన్న ప్రశ్నకు నిజమైన జవాబు ప్రతిపాదించారు. ఈ ప్రశ్నకు వేరొక జవాబు లేదు. అద్వైత సిద్ధాంతసార మిదియే.)
యోగశిఖోపనిషత్:ద్వితీయాధ్యాయము:
3. బ్రహ్మ యొక్క శరీరము స్థూలము, సూక్ష్మము, పరము అని 3 రకములు. పంచబ్రహ్మమయమైన రూపము స్థూలము,వైరాజమనబడును.(ఇదిపంచతన్మాత్ర,పంచభూతాత్మకమైనది) బీజత్రయాత్మకము నాదము నైనది సూక్ష్మరూపము. (ఇది ఒకవైపు అకార, ఉకార, మకార సమ్మిళితమైన ఓంకారము, ఇంకొకవైపు ఈ మూడు అక్షరములు లయించిన పిమ్మట శేషించి యుండే అక్షర రహిత శబ్దము. అదే నాదము లేదా నాద బిందువు. దీని గురించి ఇంకొకసారి ముచ్చటించుకుందాము.) హిరణ్యగర్భుడు, పరమైన బ్రహ్మము పరము. సత్యము, సచ్చిదా నంద లక్షణము, అప్రమేయము, అనిర్దేశ్యము, అవాఙ్మానసగోచరము, శుద్ధము, సూక్ష్మము, నిరాకారము, నిర్వి కారము, నిరంజనము, అనంతము, అపరిచ్ఛేదము, అనుపమేయము, అనామయము. ఆత్మమంత్రము (సోహం)ను సదా అభ్యసించినందున పరతత్వము ప్రకాశించును. (ఇదే పరబ్రహ్మము యొక్క అసలైన స్వరూపము. ఇదే శాశ్వతమైనది. సృష్టికి ముందర, ప్రళయమునకు తర్వాత మిగిలిఉండేది ఇదొక్కటే.)
తృతీయాధ్యాయము:
4, 5: పరబ్రహ్మ అక్షరము, నిర్విశేషము, నిరంజనము, అలక్షణము, అలక్ష్యము, అప్రతర్క్యము, అనువమము, అపారపారము, అచ్ఛేద్యము, అచిన్త్యము, అతినిర్మలము,సర్వ భూతములకు నాధారము, అనాధారము, అనా మయము, అప్రమాణము, అనిర్దేశ్యము, అప్రమేయము, అతీన్ద్రియము, అస్తూలము, అనణుహ్రస్వము, అదీర్ఘము, అజము, అవ్యయము, అశబ్దస్పర్శరూపము, ఆచక్షుశ్రోతము, సర్వజ్ఞము, సర్వగము, శాంతము, అందరికినీ హృదయముగ నున్నది. గురువు కలవారికి సుసంవేద్యము, మనస్సు లేనివారికి సుదుర్బోధము, (దానియందు మనస్సు లేనివారికి, అనగా నాస్తికులకు సులువుగా తెలియరానిది), నిష్కళము, నిర్గుణము, శాంతము, నిర్వి కారము, నిరాశ్రయము, నిర్లేపకము, నిరాపాయము, కూటస్థము, అచలము, ధృవము, జ్యోతిస్సుల కన్నా జ్యోతిస్సు కలది, తమఃపారమున నున్నది, (చీకటి కవతలనున్నది. దీనినే పోతనగారు "పెంజీకటి కవ్వల నేవ్వండేకాకృతి వెలుగు నతని నేసేవింతున్" ప్రళయకాలములో అన్నీ సమసి పోయిన తర్వాత మిగిలియున్న పెను చీకటి కవతల నుండేవాడు అన్నారు. అతడు మనం కళ్ళు మూసుకోనగానే కనిపించే చీకటి కవతల చూడగలిగితే కనపడతాడు.) భావాభావములు లేనిది, భావనామాత్రముగానే గోచరమగునది, భక్తి గమ్యము, అన్తర్లీనముగా చైతన్యమున నుండు పరతత్త్వము.
వివేకచూడామణి :
127. అహం ప్రత్యయముచే తెలియబడుచూ, నిత్యమై, జాగ్రదాద్యవస్థలకు సాక్షియై, అన్నమయాది పంచకోశములకు విలక్షుణుడై, సర్వప్రకాశకుడగు పరమాత్మ యొకడు కలడు.
192. పరమాత్మ స్వయముగా సర్వాత్మకుడును, సర్వస్వరూపుడై యుండియు, మిధ్యాత్మబుద్ధి వలన గలిగిన తాదాత్మ్యదోషము వలన కారణదేహమందు జీవభావము పొంది, మృత్తు వేరు, ఘటము వేరు యనుకొనినట్లు, తాను వేరు, దృశ్యము వేరు యనుకొనుచున్నాడు. నిజాము విచారించగా (జ్ఞానదృష్టిచే) ఆత్మేతరమెద్దియూ లేదు.
239-242. పరబ్రహ్మస్వరూపము సద్రూపము. ద్వితీయరహితము. శుద్ధజ్ఞానస్వరూపము. నిరంజనము, ప్రశాంతము, ఉత్పత్తినాశరహితము, అక్రియము, అవిద్యారూపాంతరశూన్యము, ఆనందరస స్వరూపమునై మాయా కృత జీవేశ్వరాది భేదరహితము, త్రికాలాబాధ్యము, అచలము, నిష్కలము, అప్రమేయము, రూపశూన్యము, అవ్యక్తము, నామరహితము, నాశరహితమునై, స్వయం జ్యొతిఃస్వరూపమున సర్వదా తేజరిల్లుచున్నది. ఆ పర తత్త్వము, జ్ఞాతృజ్ఞానజ్ఞేయములనెడి త్రిపుటి లేనిది. అనంతము, నిర్వికల్పము, కేవలము అఖండ చిన్మాత్ర స్వరూప మైనదియును, హేయోపాదేయములు (గ్రహింపదగినది, విడువతగినది)లేనిది. మనస్సునకును, వాక్కునకును గోచరము కానిది. అప్రమేయము, ఆద్యంత శూన్యమును, అట్టి సర్వవ్యాపక పరిపూర్ణబ్రహ్మమును 'అహం మమః' అనగా 'ఆ జ్యోతి స్వరూపమే నేను' అని జ్ఞానులు తెలిసికొందురు.
465-471. సర్వవ్యాపకమైనది, ఆద్యన్తములు లేనిది, జననమరణాది వికారములు లేనిది, సర్వదా సద్రూపము, ఏకరసచైతన్యరూపము, త్రికాలాబాధ్యమగు అనంత స్వరూపము, క్రియారహితము, ప్రత్యగ్రూపము, ఏకరసము, అనంతము, సర్వపరిపూర్ణము, సర్వమునకు అధిష్ఠానము, అత్యాజ్యము, అవాచ్యము, అగ్రాహ్యము, తనకు తానే ఆశ్రయమగుటచే నితరాశ్రయము లేనిది, నిర్గుణము,నిరవయవము, ప్రత్యక్షాగోచరము, భావాభావకల్పనా రూప రహితము, మాయావలరహితము, ఇదిఇట్టిదని వాక్కుచే నిరూపించుటకును, మనస్సుచే తెలియుటకును శక్యము గాని స్వసత్తు స్ఫూర్తులచేత జడములగు మనోవాక్కులను ప్రకాశింపచేయునది, స్వతఃసిద్ధమైనది, సర్వకల్పనా రహితమగు జ్ఞాన స్వరూపము, ఉపమాన రహితమునునగు ఇట్టి బ్రహ్మము ఏకము, అద్వితీయము, పరిపూర్ణము, నానాభేదవిశిష్టమగు దృశ్యమాన ప్రపంచము బ్రాహ్మాభిన్నము. బ్రహ్మేతరము లేనేలేదు.
అష్టావక్రగీత:మొదటి ప్రకరణం:
12. ఆత్మ సాక్షి, వ్యాపకము, పూర్ణము, ఏకము, ముక్తము, చైతన్య రూపము, క్రియా రహితము, సంగ రహితము, ఇచ్ఛా రహితము, శాంతమునై యున్నది. భ్రాంతి వలన సంసారము కలదివలె తోచుచున్నది.
బ్రహ్మసూత్రములు:
2. జన్మాదస్యయతః - ఈజగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయాదులు ఎవనివలన కలుగుతున్నాయో అతడే పరబ్రహ్మ. "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" - సత్యజ్ఞానస్వరూపుడు, అనంతుడు, దేశకాలవస్తుకృతమైన పరిచ్ఛేధం లేనివాడు పరబ్రహ్మ. (సత్య, జ్ఞాన, అనంతములనే గుణాలు ఒక్కొక్కసారి ప్రాపంచిక సంభంధమైన వాటిలో కూడా కనపడతాయి. అందువల్ల అవి పరబ్రహ్మస్వరూపాలైపోవు. ఆగుణాలు దేశ, కాల, వస్తు రూపాలను అధిగమించి కూడా శాశ్వతమై దేనియందు నిలబడి యుంటాయో, అదే పరబ్రహ్మస్వరూపము. అందువల్ల ఈగుణాలు దేని యందు అన్నివిధములా శాశ్వతమై యుంటాయో విచారించి తెలుసుకుంటే, పరబ్రహ్మస్వరూపం తెలుస్తుంది.)
3. శాస్త్రయోనిత్వాత్ - శాస్త్రములకు కారణమైన వాడగుట వలన. శాసించేది శాస్త్రము. శాస్త్రములకు కారణమైనవాడు కాబట్టి సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు - పరబ్రహ్మ. (బృ.దా.ఉ.-2.4.10. అపరిచ్ఛిన్నమైన సద్రూపము వల్లనే పురుషుని నుండి అనాయాసంగా వెలువడే నిశ్వాసం లాగా ఆ సర్వజ్ఞాని నుండి ఈ వేదాలు శాస్త్రాలు వగైరా వెలువడ్డాయి.)
12. ఆనంద మయో-భ్యాసాత్ - ఆనందమయుడంటే పరమాత్మే తప్ప జీవుడు కాదు. ఆనందమయుడంటే ఆనందము ప్రచురంగా (విస్తారంగా) కలవాడు.
16. నేతరోను-నుపపత్తే - పరబ్రహ్మ తప్ప ఇతరుడు (సంసారియైన జీవుడు) ఆనందమయుడనే శబ్దానికి అర్థం కాదు. (శరీరి - జీవుడు అనుభవించే ఆనందం శాశ్వతమైన ఆనందం కాదు. పరబ్రహ్మ అనుభవపూర్వక సచ్చిదానందమే అసలైన, శాశ్వతమైన ఆనందము. అందువల్లనే శ్రీత్యాగరాజువారు "రమించు వారెవరురా రఘూత్తమా నినువినా" అని ఆనందమయ స్వరూపుడైన ఆ శ్రీరామచంద్రుడిని కీర్తించారు.)
యోగవాశిష్ఠము: ముముక్షువ్యవహార ప్రకరణము:
10 వ సర్గ: 1, 11: బ్రహ్మతత్వము స్వయంప్రకాశము. ఇది సచ్చిదానంద స్వరూపమున సర్వత్ర వెలయుచున్నది. దీని సత్తవలననే ఇతరములన్నియూ వెలుగొందుచున్నవి. ఇదియే భవిష్యత్కాల వ్యవహారమున 'నియతి' యనబడుచున్నది. కార్యకారణ స్వరూపము గూడనిదియే. అనంత మాయావిలాసమునకు కారణమును, సర్వాంతర్యామియును, సర్వాధారమును, చిదాకాశమును, ప్రత్యక్ చిద్రూపమును, అవినశ్వరమునకు ఆత్మతత్త్వ మొక్కటున్నది.
ఉత్పత్తి ప్రకరణము: పంచమసర్గ: మూలకారణ దేవస్వరూపము:
మహాప్రళయ సమయమున ద్రుశ్యసృష్టి అంతయూ లయమగును. అప్పుదు ప్రశాంత బ్రహ్మవస్తువు ఒక్కటియే మిగిలియుండును. దీనికి జన్మగాని, ప్రకాశముగాని, లయముగాని లేవు. ఇది నిత్యము సర్వస్వరూపము. సర్వ శక్తిమంతము, పరమాత్మ. ఈపరమవస్తువును వాక్యమువలన గ్రహింపజాలము. ముక్తపురుషులే దీని నెరుంగు దురు. ఆత్మ, బ్రహ్మ ఇత్యాదినామములు దీనియందు కల్పింపబడినవి.స్వాభావికములు కావు. ఇద్దానిని సాంఖ్యులు పురుషుడందురు. వేదాంతవాదులుబ్రహ్మమనుదురు.విజ్ఞానవాదులు సునిర్మల విజ్ఞాన మను చున్నారు. శూన్యవాదులు శూన్యమందురు. ఇది సూర్యుడు మొదలుగాగల తేజోపదార్థములనుగూడ ప్రకాశింప జేయుచున్నది. ఇదియే వక్త, భోక్త, ద్రష్ట, కర్తల రూపమున ప్రకాశించుచున్నది.ఇది సత్తు అయిననూ అసత్తు. దేహమధ్యవర్తి అయిననూ దూరస్థమునూ అగుచున్నది. చిత్ప్రకాశము. సూర్యునినుండి కిరణములు వెలువడి నట్లు దీనినుండియే బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు వెలువడుచున్నారు. సముద్రము నుండి బుడగలు వచ్చునట్లు జగత్తులు దీనినుండియే వచ్చుచున్నవి. నదులు సముద్రాభిముఖములైనట్లు, దృశ్యము లన్నియూ దీనివైపునకే వచ్చుచున్నవి. ఇది దీపము వలె తన్ను ఇతర పదార్థములను ప్రకాశింపజేయుచున్నది. ఇదియే ఆకాశమున, మన శరీరమున, శిలలయందు, పర్వతముల, వాయువున, పాతాళమున వెలయుచున్నది. ఇదియే కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను తమతమ పనుల నొనర్చునట్లు జేయుచున్నది. దీనివలననే మూఢులు మూగలగుచున్నారు. ఇదియే శిలలను నిశ్చలములుగను, ఆకాశమును శూన్యముగను, పర్వతములను కఠినముగను, జలములను పలుచగాను నొనర్చినది. దీప్తుడగు రవి దీనివలననే ప్రకాశింపుచున్నాడు.
నిండు మేఘముల నుండి ఎడతెగని వర్షము కురియునట్లు అక్షయసుఖముతో నిండిన ఈ పరమవస్తువు నుండియే, సంసారమను ఈఅపారవృష్టి కురియుచున్నది. మరుభూములందు మరీచికలవోలె, త్రిభువన తరంగ ములు దీనినుండియే వెలువడుచూ పోవుచున్నది. ఇదియే సర్వభూతముల మధ్యనుండి శాశ్వతమయ్యు, అశాశ్వ తమువలె గన్పట్టుచున్నది. మహత్తరమయ్యు, అందరియందున సమానభావమున వెలయుచున్నది. ఇదియే వాయువువలె చిదాకాశమున ఇంద్రియదళముల తోడను, బ్రహ్మఫలముల తోడను, చిత్ మూల్యముల తోడను, గూడియున్న ప్రకృతి యను లతను నాత్యమాడింప జేయుచున్నది. ఇదియే దేహమను పెట్టెలలో చిన్మయమగు మనస్సునుంచినది. చంద్రుని నుండి కిరణములు వెలువడినట్లు దీని నుండియే సృష్టులు వెలువడుచున్నవి. ఈ చిదాకాశముననే సృష్టియను విద్యుత్ ప్రకాశించుచున్నది. ప్రాణమను వర్షము కురియుచున్నది. దీని ప్రభావము వలననే వస్తువులన్నియూ బ్రకాశించుచున్నవి. ఇదియే అసద్వస్తువులను గమించినది. దీని వలననే సద్వస్తువు లకు సత్త ఏర్పడినది. దీని సన్నిధినుండుట వలననే జదమగు శరీరము చలించుచున్నది. నియతి దేశకాలములు, చలన స్పందనాది క్రియలును, అన్ని సత్తలును దాటిపోవు దానిసత్త వలననే జరుగుచున్నవి. శుద్ధ చిన్మయమగు ఈ పరమవస్తువే ఆకాశమును, పదార్ధములను చింతించి, ఆయా రూపములను దాల్చుచున్నది. ఆ పరమవస్తువే ఈ విశాల బ్రహ్మాండమును సృష్టించియూ, ఏమియూ ఒనర్పనట్లగపడుచున్నది. (పరబ్రహ్మయొక్క ఈ తత్వాన్నే మనము బాగా గమనించాలి. దీన్నే పరమాత్మ 'భగవద్గీత'లో 'నిష్కామకర్మ' అని బోధించారు. పరమాత్మ యొక్క ఈ గుణాన్నే మనంకూడా అనుసరిస్తే ఆయనను చేరుకొంటాము.) ఇది నిర్వికల్పము. ఉదయాస్తమయములు, స్థితిగతులు దీనికి లేవు. ఇది అప్పుడు నిర్వికార ఆద్వైత ఆత్మయందు నిలిచియుండును. ఇదిగాక వేరొక సమయమున వేరొక వస్తువు లేకుండెను.
7 వసర్గ:
4. నేజెప్పునాతడెటనో దూరమున లేడు. అతడు చైతన్యరూపమున మన శరీరముల నివసించియున్నాడు. (మనం పరమాత్మ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ వుంటాము. కాని ఆయనను సరిగ్గా వెతకాల్సిన చోటు మన శరీరములోపలే. ఆయన మనశరీరములో చైతన్యరూపములో వున్నాడు. ఈభావనతో వెతికితే తప్పక దొరుకు తాడు.) ఈవిశ్వమే యతడు. కాని యితడు విశ్వము కాదు. ఏలయన, ఉన్నది అతడొకడే! విశ్వమనే వేరొక వస్తువే లేదు. (ఇది ఆపరబ్రహ్మ యొక్క మరొకకోణం. మనకు కనపడే వాటన్నింటిలో పరబ్రహ్మ వున్నాడు. కాని కనపడేదంతా పరబ్రహ్మ కాదు. మళ్లీ సర్వమూ పరబ్రహ్మమే! దీని విశ్లేషణ ఎలా? సర్వమూ ఆ పరబ్రహ్మ లోంచే వచ్చాయి. కాని అవి అన్నీ పరబ్రహ్మస్వరూపాలు కాదు. వాటిలో పరబ్రహ్మ, పైన చెప్పిన విధంగా, చైతన్యరూపము లో చూడగలిగితే, అంటే అనుభవము పొందగలిగితే, వాటిలో పరబ్రహ్మ కనపడతాడు. మొదట మనశరీరములోనూ, ఆ పిదప ఇతరులలోనూ, ఇతర జీవరాసుల లొనూ, ఇతర పదార్థములలోను, వున్న చైతన్యాన్ని చూడటము, అంటే, అనుభవములోనికి తెచ్చుకోవాలి. ఇది కేవలము ధ్యానముతో మాత్రమే సాధ్యము. ఎప్పుడైతే ఈ విధమైన అనుభవము ప్రారంభమైందో, అప్పుడు ఏదైతే మనకు "దృశ్యతే శ్రూయతే పివా", కనపడుతూ, వినపడుతూ వున్న ఈ ప్రపంచము, విశ్వము, ప్రకృతి, కొత్తరూపములో, పరమాత్మరూపములో కనపడటం మొదలవుతుంది. అప్పుడు మనకు ఇతరుల, ఇతర ప్రకృతి మీద వున్న అభిప్రాయము, అనుభవము మారిపోతాయి. అన్నింటిలోను వున్న చైతన్య రూపాన్ని, అదే పరబ్రహ్మాన్ని చూడటమే "విశ్వరూప సందర్శనము". దీనినే కృష్ణపరమాత్మ అర్జనునిచే అనుభవింప చేసాడు. సరిగ్గా ఈ భావాన్నే ఒక ఉపనిషత్తులో "సర్వ శరీరేషు చైతన్యేకతా ధ్యానం" అన్నారు. అంటే అన్నింటిలోను వున్న చైతన్యాన్ని చూడగలగటమే ధ్యానము.) ఈ చిన్మయబ్రహ్మమే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడని గ్రహింపుము.
19. ఏ జ్ఞానస్వరూపము నిముషములో ఒక చోటనుండి మరొక చోటునకు చనుచున్నదో, ఆ జ్ఞానమే పరమాత్మ యొక్క స్వరూపము. (ఇది ఆ పరమాత్మ యొక్క మరొక లక్షణము. మనము ఒకచోటు నుండి వేరొక చోటునకు వెళ్ళినప్పుడు బయలుదేరిన చోటులోను, అట్లాగే చేరిన చోటులోను పరమాత్మ వుంటాడు. అంటే పరమాత్మ మనతో పాటు ఎక్కడపడితే అక్కడికి వస్తాడా? రాడు. ఆయన అన్ని ప్రదేశములలోను వున్నాడు. కాబట్టే మనము ఎక్కడకి వెడితే అక్కడ మనకంటా ముందర వచ్చినట్లు, కుమారస్వామికి వినాయకుడు కనిపించినట్లు, కనపడతాడు.)
20 - 25. ఏ భోధరూపమున త్రైకాలిక మిధ్యయగు జగత్తు తేలియాడుచున్నదో, అదియే పరమాత్మ స్వరూపము. ఎద్దాని యందు ద్రష్టృ, దృశ్య, దర్శనములు లేకుండియు, ఉన్నట్లు కనపడుచున్నవో, ఎయ్యది ఆకాశము గాకుండియు, విపులత్వమున ఆకాశముతో బోల్పపడుచున్నదో, అయ్యదియే పరమాత్మ యొక్క స్వరూపము. ఈ ప్రపంచము అసత్తయ్యూ, దేనియందు సద్రూపమున నున్నదో, సృష్టి ప్రవాహము అనాదియయ్యు దేనియందు మిధ్యారూపమున అవభాసించుచున్నదో, అదియే పరమాత్మయొక్క స్వరూపము. ఎయ్యది చిన్మాత్ర మయ్యు, పెద్దరాతిబండవలె నిశ్చేష్టితమై యున్నదో, ఎయ్యది జడమయ్యు, జడము కాదో, అయ్యదియే పరమాత్మ యొక్క స్వరూపము. ప్రకాశక పదార్ధములకు వెలుతురును, ఆకాశమునకు శూన్యత్వమును రూపములైనట్లు, ఇయ్యది దేనియందు యుండునో అదియే దీని రూపమని గ్రహింపుము. (ఇక్కడ పరమాత్మ యొక్క విలక్షణమైన లక్షణాలను, వివిధత్వాన్ని తెలియజేశారు. ప్రకృతి మానవుని దృష్టిలో అనాది అయినప్పటికీ, దాని సృష్టికర్త అయిన పరమాత్మకోణంలోంచి మిధ్య యని, ఈ రకమైన విలక్షణాలను బోధపరచుకుంటేగాని పరమాత్మ స్వరూపము మనకు అర్థం కాదని తెలియజేశారు.)
9వ సర్గ:76: ఈ బ్రహ్మమునకుత్పత్తి లేదు. క్షయము లేదు. మొదలు లేదు. ఇది శాశ్వతము. నిత్యము. మంగళస్వరూపము. పవిత్రము. అమోఘము. వన్దనీయము. అనిన్ద్యము. ఆగంతుక ధర్మరహితము. కారణ కారణము. అజ్ఞేయము. స్వానుభవ సంవేద్యము. ఏకమాత్రజ్ఞేయమునై వెలయుచున్నది.
10వ సర్గ:32-36: ఆ బ్రహ్మము అణువు కంటె అణువు. ఆకాశము కంటె గొప్పది. శుద్ధము. సూక్ష్మము. ఆకాశ మధ్య ప్రదేశము కంటె ప్రశాంతము. దీనికెట్టి రూపమును లేదు. దిక్కాలాదుల వలన బంధింపబడని దగుట వలన అతి విస్తృతము. అనాది. స్వప్రకాశము. ఈ చిద్రూపము లేనిచోట, వాసనలు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు, జీవమును లేవు. ఇట్లు అపూర్వ, అజర, నిరాకార, ప్రశాంత పరమపదము మనకు గోచరమగు చున్నది.
39. చిత్తవృత్తులను నిరోధించి, మనస్సును గూడ లయమొనర్చిన మిగిలియుండు అవర్ణనీయ సాక్షి చైతన్యమే అది. (ఇక్కడ చాలా నిగూఢమైన, అత్యంత నిశితమైన, రహస్యమైన విషయం చెప్పారు. మొదట ధ్యానములో నిమగ్నమైపోయి, అంతఃకరణలను (మనస్సు, బుధ్ది, చిత్తము, అహంకారము లను) పనిచేయకుండా ఆపివేసి, అటుపిమ్మట ఎటువంటి ఆలోచనలు, భావములు లేకుండా మనస్సును సంపూర్ణముగా లయమొనర్చి, అంటే, మనస్సును అమనస్కము చేసి, సమాధి అవస్థను పొంది, తురీయస్థితికి వెళ్ళినపుడు, మిగిలియుండే నిర్మల, ప్రశాంత, అఖండానందైకరసస్థితే చైతన్యస్థితి. అక్కడ ఆఆనందమనుభవించే మనలను మనమే చూస్తాము, తెలుసుకొంటాము. అందువలన అది సాక్షి చైతన్యము.)
41. జీవచైతన్యము యొక్క చేత్యభావము లోపించిపోయిన, మిగులు ప్రశాంతచిన్మాత్రమే ఆ పరమాత్మ స్వరూపము. (చైతన్యము మరలా రెండు రకములు. జీవ(ప్రాణ)చైతన్యము, పరాచైతన్యము. ఇందులో మనం జీవ చైతన్యాన్ని నిరోధించిన యెడల, పరాచైతన్యాన్ని అనుభవించ గలుగుతాము. దీనినే పైన విశదీకరించారు. ఆ పరా చైతన్యమే పరమాత్మ లేదా పరబ్రహ్మ స్వరూపము.)
44. ఆకాశము యొక్కయు, వాయువు యొక్కయు, శిల యొక్కయు హృదయముల భావములు, ఆ చిన్మయ బ్రహ్మముయొక్క స్వరూపము. (ఆకాశముయొక్క హృదయము శూన్యత్వము. వాయువుయొక్క హృదయము పూర్ణత్వము. శిలయొక్క హృదయము ఘనత్వము. కనుక బ్రహ్మము నిర్ధర్మకము, పూర్ణము, సర్వ వ్యాపి అని తేలుచున్నది.)
54. బ్రహ్మ, సూర్య, విష్ణు, హర, శక్ర, శివాది దేవతలు లయమైన, పరమశివమగు ఆసద్వస్తువొక్కటియే మిగిలి యుండును. అప్పుడద్దానికెట్టి ఉపాధియు ఉండనందు వలన, నది నిర్వికల్పస్వరూపమగును.విశ్వసంజ్ఞను బరి త్యజించి, చైతన్యమయ బ్రహ్మమగును. (ఇక్కడ మనం ఇంకొక విషయము తెలుసుకోవాలి. మనకు తెలిసిన సాకార దేవతలు పరబ్రహ్మము కారు. వాళ్ళుకూడా ఒకరకమైన పదవులు అనుభవిస్తున్నవారే. అంటే ఒకరకంగా ఉద్యోగ స్తులే. భాగవతం ప్రకారం కాబోయే ఇంద్రుడు బలిచక్రవర్తి. హనుమ భవిష్యత్ చతుర్ముఖ బ్రహ్మ. అశ్వద్ధామ కాబోయే వ్యాసుడు. అందువలన ఈ దేవతాపదములన్ని అశాశ్వతాలే. కాబట్టి వీరినన్దరినీ అధిగమిస్తే వారికి మూలమైన ఆ పరబ్రహ్మ ఒక్కటే మిగులుతుంది. అప్పుడు దానికి ఎటువంటి ఉపాధి, అంటే మూలము లేకుండా దానంతట అదే ఎటువంటి వికల్పములు లేకుండా, ఈ కనపడే, వినపడే, అనుభవింపబడే విశ్వము, ప్రకృతితో సంబంధము లేకుండా కేవల సాక్షిచైతన్యముగా భాసిస్తూ వుంటుంది.)
14వ సర్గ:(బ్రహ్మ ప్రతిపాదనలు):సంకల్పవృత్తులు చైతన్యమున ప్రతిబింబించి, సాకారములును, నిర్వికారము లును నగు పదార్థములుగా ఆవిర్భవించుచున్నవి. ఇవి ఆబ్రహ్మమునే కనంబడుచున్నవి. ఈ కల్పనావృత్తుల ప్రకాశము వికసించు పూలతొ గూడిన లత వంటిది. లత మొగ్గ తొడిగి వికసించు నట్లు జగత్కల్పనా కౌశలము గూడ చైతన్యము యొక్క సంసర్గమున వికసించు చున్నది. దీనిని గాంచునది గూడ బ్రహ్మమే. జీవుడు, బుద్ధి, క్రియ, స్పందనము, మనస్సు, ద్వైతభావము, బ్రహ్మసత్త ఇవియే జ్ఞానగమ్యములగుచున్నవి. అస్తిత్వమేకమాత్రబ్రహ్మము ననే నున్నది. అన్యపదార్ధముల కస్తిత్వము బ్రహ్మమువలన నేర్పడుచున్నది. బ్రహ్మసత్తను తత్త్వతః తెలిసికొనక పోవుట వలననే, అది అన్యసత్తవలె భాసితమగుచున్నది. తత్త్వతః గ్రహించిన అదిగాక వేరొకటి అగుపడదు. బ్రహ్మ సత్తను ఆవరించియుండు అజ్ఞానమును ఆత్మవిజ్ఞానము వినాశమొనర్చుచున్నది. కాని అజ్ఞానమెట్టిదో చెప్పజాలము. దీపపువెల్తురు వలన చీకటి నశించును గాని, చీకటియననేమో చెప్పజాలము. అట్లే జ్ఞానము వలన అజ్ఞానము నశించును గాని అజ్ఞానముయొక్క తత్త్వము నెరుంగజాలము. అందువలన తేలునదేమన, బ్రహ్మే జీవాత్మయని, ఇయ్యది అపరిచ్చిన్నము, అఖండము, సర్వశక్తిమంతము, అనాది, అనంతము, సత్యము, చైతన్య స్వరూపము. ఈ బ్రహ్మము సర్వస్వరూపము. దీనియన్దు భేదకల్పన లేదు. ఈజగత్కౌశలము కూడా అపరోక్షాను భూతియందు బ్రహ్మముననే పర్యవసించుచున్నది.
62వసర్గ:8-15:స్పందరూపిణియును(ప్రాణుల అదృష్టము), అవస్యంభావియును(వస్తుశక్తి), చైతన్యశక్తియును (ఈశ్వరసంకల్పము)నగు మహానియతి ఒక్కటి యున్నది. నియతియొక్క బలముననే, తత్త్వజ్ఞుల శరీరము నిలబడి, లౌకిక వ్యవహారయోగ్యమగుచున్నది. ఈనియతియే సృష్ట్యాదియందు "ఇయ్యది అగ్ని, ఇయ్యదిట్లు, ఊర్ధ్వజ్వలన స్వభావసంపన్నమై సర్వదా వెలయుగాక" అను రూపమున పరబ్రహ్మమున సంకల్ప వృత్తిగ నుదయిన్చును. ఈ మహానియతియే మహాసత్త, మహాచితి, మహాశక్తి, మహాక్రియ, మహోద్భవము, మహా స్పందము, మహాత్మరూపము, అను నామముల వ్యవహరింప బడు చున్నది. ఈ నియతి యొక్క బలము వలననే చతుర్ముఖ బ్రహ్మ జగత్సముహములను గడ్డిపరకల వలె పరివర్తనమొనర్చు చున్నాడు. రాక్షసులు, దైత్యులు, నాగులు మొదలగువారు కల్పాంతము వరకు వ్యవస్థాపించ బడుచున్నారు. (ఇక్కడ విశ్వములోను, ప్రకృతి లోనూ వుండే సకల జీవులు, పదార్దములు, వాటికాధారములైన పంచ భూతాలు, అధి దేవతలు, సృష్టి, స్థితి, లయ కారకులు, సర్వం సహా అన్నీ ఆమూలకారణమైన పరమాత్మలోనే సంకల్పమాత్రముగా ఏర్పడ్డాయి. వారివారి కర్తవ్యాలన్ని పరబ్రహ్మ చేతే నియమింపబడ్డాయి కాబట్టి దానిని "నియతి" అన్నారు.)
బ్రహ్మసత్తయందు వ్యభిచారము అనుమానింప బడిననూ, అకాశాఫలకమున చిత్రము గాంచబడిననూ, గాంచబడుగాక, కాని ఈ నియతి ఎన్నటికినీ మారజాలదు. బ్రహ్మమును, నియతియును, సృష్టియును, నొక్కటియే. తత్త్వజ్ఞులగు బ్రహ్మాదులీ తీరుగనే గాంచుచున్నారు. అజ్ఞులకు తెలియబర్చుటకే విరిమ్చ్యాదులు బ్రహ్మ రూపియగు ఈనియతిని సృష్టియను నామమున బేర్కొనిరి. ఈసృష్టి ఆకాశము నందలి వృక్షమువలె ఆది మధ్యాంతరహితమగు ఈబ్రహ్మమున నిలిచియున్నది. (పరా చైతన్యము దేనిమీద ఆధారపడి యుండదు. అలాగే ఆకాశములో బొమ్మలు కనపడవు. ఇవి అసంభవాలు. ఒకవేళ ఇవి జరిగిననూ నియతి [పరబ్రహ్మ తత్త్వము] ఎన్నటికి మారదు. చైతన్య భావన కలిగిన వారికి అన్నీ పరబ్రహ్మస్వరూపాలే. అంతా పరబ్రహ్మమే. కాని ఆభావన లేని సామాన్యులకు తెలియడానికి వాటికి వేరు వేరు పేర్లతో చెప్పారు.)
18. ఈ మహా నియతినే దైవమందురు. ఇయ్యదియే సర్వకాల వ్యాపియును, సకల వస్తువ్యాపియును, సర్వమును విశుద్ధ చైతన్యమగు ఈశ్వర సంకల్పమునై యున్నది.
నిర్వాణ ప్రకరణము:ఉత్తర భాగము:101వ సర్గ:
57. సాక్షియగు ఆత్మనే చైతన్యము యొక్క స్పందాస్పందముల యేకరూపత్వముగా భావించినచో, ఆత్మ రూపమగు నిర్మలమైన పరబ్రహ్మమే శేషించును.
యోగశిఖోపనిషత్:చతుర్ధాధ్యాయం:1-5:
చైతన్యము ఒకే రూపమగుటవలన ఎప్పుడునూ భేదము యుక్తము కాదు. జీవత్వము కూడ త్రాటియందు సర్పజ్ఞానమువలె తెలియదగినది. రజ్జువునందు, తాను రజ్జువను జ్ఞానము లేనందువలన, క్షణములో రజ్జువు సర్పముగా నగును. అట్లే విశ్వాకారము కేవలయైన చిత్ యొక్క భావనము జరుగుచున్నది. ప్రపంచమునకు బ్రహ్మము కన్నా అన్యమైన ఉపాదానము లేదు. కావున ఈప్రపంచమంతయు బ్రహ్మమే గాని, ఇతరము గాదు. (దేనికైనా దాని స్వస్వరూప భావన లేనప్పుడు భ్రమచే అది ఇంకొకలా కనపడుతుంది. అలాగే ఆత్మ అజ్ఞానముచే కప్పబడి జీవుడని పిలువబడుతోంది. గతంలో చెప్పుకొన్న విధంగా ఈవిశ్వంలో చైతన్యభావన లోపించినపుడు ఈ అశాశ్వతమైన విశ్వమే, ప్రకృతే, శాశ్వతంగా భ్రమపెడుతుంది. కాని ఈవిశ్వంలో, ప్రకృతిలో ఎప్పుడైతే చైతన్యభావన వచ్చిందో, అప్పుడు దానికి ఉపాదానకారణమైన,మూలకారణమైన పరబ్రహ్మస్వరూపముగా అనుభవానికివస్తుంది.)
పైంగలో పనిషత్:పంచామోధ్యాయం:పరమ పదము:
నీవు, నేను, తాను, ఇతరుడు అను వృత్తులు ఎక్కడలేవో, సంకల్పరూప జ్ఞానము కొంచెము కూడా ఎక్కడలేదో, ఉన్నది, లేదు అను వృత్తులకు అగోచరమో, దృశ్యము, అదృశ్యము గాని లేదో, సర్వము శాంతించి నట్టిది, నిరాలంబమైనది, అనాభాసమైనది, అనామకమైనది, కారణము లేనిది, అదే ముక్తి. అదే మోక్షము. సత్తు, అసత్తు కానిది, ఆదిమధ్యాంతరహితమైనది, సర్వము కానిది, సర్వమూ అయినది, పూర్ణము కంటెను, పూర్ణమైనది, సుఖము కంటెనూ, సుఖమైనది, అసంవేదనము, అశాన్తము, ఆత్మవేదనము, అతతము, సర్వ పదార్ధములకు సత్త అయినది, అదే తప్ప అన్యమేమియూ లేనిది, ద్రష్ట, దృశ్యము ఆ మధ్యలో నున్న దృష్టి దేని స్వరూపమో, అదియే ద్రష్ట, దర్శనము, దృశ్యము ఇత్యాదులులేని పరమపదము. (మనం ఒక దృశ్యాన్నిగాని వస్తువునిగాని చూడట మనే ప్రక్రియ మొదలైనప్పుడు, ఆదృశ్యము లేదా వస్తువుయొక్క దృశ్యజ్ఞానము మనకు లభించేలోపు, ఆదృశ్యము, లేదా వస్తువునకు, చూచేవారికి, చూడటమనే ప్రక్రియకు సంబంధము ఏర్పడుతుంది. ఆసంబధము ఏర్పడేలోపు, మధ్యలో వచ్చే ఎడము, జాగాలో, మనదృష్టి ఎక్కడైతే వుంటుందో, అదే త్రిపుటి, అంటే ద్రష్ట, దృశ్యము, దర్శనము ఇత్యాదులు లేని పరమపదము. ఆజాగాలో ఉన్నదానిని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ధ్యానంలో సమాధి అవస్థ యొక్క విషయం కొంచెంగా నైనా తెలుస్తుంది.) చిత్తము ఒకచోటనుండి మరియొక చోటకు పరుగిడుచుండగా, ఏతన్మధ్యమున నుండు చిత్తమునకు ఏది స్వరూపమో, జడముగా నుండుటగాని, గ్రహించుటగాని, భావించుట గాని లేనిదో, అదియే పరమపదము. (దీనినే మనం ఇంకో రకంగా చెప్పుకొందాము. మనం ఏపనిలో వున్నా, ఏపని చేయకున్నా, మన మనస్సులో ఆలోచనలు భావాలు నిరంతరంగా ఒకదాని వెంట ఒకటి వస్తూ వుంటాయి. అల్లా వచ్చే ఆలోచనల, భావాల మధ్యలో అంటే ఒక భావం వెళ్ళిపోతూ ఇంకొక భావము వచ్చే మధ్యలో ఏదైతే ఎటువంటి ఆలోచన, భావము లేని స్థితి వుంటుందో దానిని బాగా గమనించండి. ఇంకా బాగా చెప్పాలంటే, మూవీ ఫిల్ము లో ఒక సెకనుకి 24 ఫ్రేములు వుంటాయి. రెండు ఫ్రేముల మధ్యలో దృశ్యము లేని భాగము ఒక సన్నని గీతలాగా వుంటుంది. దాన్ని గమనించండి. ఇప్పుడు బాగా అర్థమైనదని తలుస్తాను. ఇప్పుడు ఆ దృశ్యము లేని భాగాన్ని, ఆలోచన, భావము లేని భాగాన్ని మనం ధ్యానం ద్వారా పెంచుకోవాలి. వెళ్ళిపోతున్న ఆలోచనని, భావాన్ని వెళ్ళిపోనిచ్చి, వచ్చే ఆలోచనని, భావాన్ని రాకుండా ఆపాలి. ఆ ఏమిలేని స్థితిని ఎంతవరకూ వీలైతే అంతవరకూ పొడిగించుకోవాలి. మనస్సు చేసే పని ఆలోచన. ఎప్పుడైతే పైనచెప్పిన విధానంతో మనం ఆలోచనలను ఆపు చేశామో అప్పుడు మనస్సు పనిచేయడం మానేస్తుంది. అప్పుడు మనస్సు అమనస్సు అవుతుంది. ఇదే అమనస్క యోగం. ఈవిధంగా నిరంతరంగా సమాధి అవస్థలో ఉండటమే పరమపదం.) నిరంతరము తద్రూపుదవగుము. జాగ్రత్స్వప్నసుషుప్తి అవస్థలు లేని నీయొక్క సనాతనమైనట్టిదియూ, జడచేతనములు కానట్టియు ఏపరమాత్మ రూపము కలదో, ఆ రూపమునందే సదా తన్మయుడవై యుండుము. జడమగు స్థితిని వీడిన శిలాహృదయమే అది. (ఆత్మస్థితి) అట్టి అమనస్కాత్మస్వరూపములో సదా తన్మయుడవై యుండుము. చిత్తమును దూరముగా పరిత్యజించి, ఏది నీవై యున్నావో, అట్టి ఆత్మస్వరూపమునందు స్థిరుడవై యుండుము.
మహావాక్య విచారము:
పైంగలోపనిషత్:తృతీయాధ్యాయం:
ఆ బ్రహ్మము నీవే అయి వున్నావు. నీవే ఆ బ్రహ్మముగా నున్నావు. నీవు ఆ బ్రహ్మమువై యున్నావు. నేను గూడ బ్రహ్మమునై ఉన్నాను. అని ఈరీతిగా అనుసంధానము చేయవలెను. ఆ మహావాక్యము నందు పరోక్షశబలుడై యున్నవాడును, సర్వజ్ఞత్వాది లక్షణయుక్తుడును, మాయ(అవ్యక్తము)యే ఉపాధిగా కలవాడును, సచ్చిదానంద లక్షణుడును అగు జగత్కర్త 'తత్' పదవాచ్యుడగుచున్నాడు. ఆ ఈశ్వరుడే అంతఃకరణసహితుడై 'నేను' అను జ్ఞానమునకు విషయమైనవాడై 'నీవు' (త్వం') అను పదమునకు లక్ష్యమైయున్న 'ప్రత్యగాత్మ' బ్రహ్మమే అగుచున్నది.
యోగ వాసిష్ఠము:నిర్వాణ ప్రకరణము:పూర్వభాగము:51వ సర్గ:
45. మహావాక్యము వలన కలుగు బ్రహ్మ సాక్షాత్కారము, బ్రహ్మభావములు వాసనామయములగు స్వప్నములు గావు. ఏలయన, ఈ చిత్బ్రహ్మము శివము, అద్వైతము, చతుర్ధము మున్నగు స్వాభిదాన వాక్యముల వలన ప్రభోదింప బడుచున్నది. జాగ్రత్స్వప్నసుషుప్తులు ఆయనకు లేవు. జాగ్రదావస్థ యందు అనుభవగమ్యుడు కాడు. ఆయన వాసనా రహితుడు అగుట వలన వాసనామయ స్వరూపుడు కాజాలడు. ఆయన నిర్మలమును, నిరంజనమును నగు చైతన్యము.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తుంటాము)
|
|