విశ్వరచన
పరబ్రహ్మస్వరూపమేమిటో తెలుసుకొన్న పిదప, ఆపరబ్రహ్మస్వరూపం ఏమిచేసింది? ఎలా విశ్వాలను, సృష్టిని, ప్రకృతిని రచించింది? అనే విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే, పరమాత్మనుండి, ఈవిశ్వమునుండి, సృష్టినుండి, ప్రకృతి నుండి, మనంకూడా వచ్చాము కాబట్టి. ఇంకొక విషయం ఏమిటంటే, మనం ఎలా వచ్చామో తెలుసుకొంటే, ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. అలా తెలుసుకొంటే, అర్థజ్ఞానంతో పద్మవ్యూహంలోకి జొరబడ్డ అభిమన్యుడి గది మనకు పట్టకుండా వుంటుంది.
ఇక్కడ ఇంకొకవిషయాన్ని మనం గమనించాలి. ఈఅధ్యాయంలో చెప్పబడిన విశ్వసృష్టి రచనను, ఉపనిషద్రష్టలు, మహాత్ములు, ఋషులు సమాధిస్థితిలో అంతర్నేత్రంతో అనుభవించి మనకు చెప్పారు. వారు గమనించిన ప్రక్రియ అంతా భౌతికసృష్టి ఏర్పడటానికి ముందు జరిగిన అధ్యాత్మిక తత్త్వమహాకారణం. ఎందుకంటే, కారణంలేని కార్యముండదు. 'భౌతికసృష్టి' అనేకార్యానికి ముందరజరిగిన ఒక ఆధ్యాత్మిక తత్త్వమహాకారణమే, ఉపనిషత్తులలోను, ఇంకా ఇతర గ్రంథాలలోను విశదీకరించిన విశ్వసృష్టిరచన, పంచీకరణ, భౌతికతత్త్వావిష్కరణ మున్నగునవి. దానిని తత్త్వదృష్టితోనే చూడాలి తప్ప, మన సైన్సులోచెప్పే భౌతికపరిణామక్రమంతో దీనిని పోల్చరాదు. ఎందుకంటే, భౌతిక పరిణామక్రమానికి ఈతత్త్వవిభజన మూల కారణం. ఈవిషయమై సనాతనులు మనకు అందించిన విషయాలను పరిశీలిద్దాం.
ఐతరేయోపనిషత్:ప్రధమాధ్యాయం:ప్రధమఖండం:
1. ఈఅనంతసృష్టికి పూర్వమందు నిత్యసత్య శుద్ధబుద్ధస్వరూపుడు పరమాత్మయే ప్రకాశించుచుండెను. ఆత్మతప్ప మరియొక్కటిలేదు. ఈపరిణామజగత్తు అప్పుడు లేదు. ఈ పరమాత్మయే అన్నిలోకములను సృష్టిచేయుటకు సంకల్పించెను.
బ్రహ్మసూత్రదర్శనం:
ఈజగత్తుకు కారణమైన బ్రహ్మానికి వ్యాప్తిత్వము, నిత్యత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వము, సర్వాత్మకము అనేవి ధర్మాలు. ప్రజాపతి 'ఏతే' అనే శబ్దాన్ని స్మరించి దేవతలను, 'అసృగ్రమ్' అనే పదాన్ని స్మరించి మనుష్యుల్నీ, 'ఇందవః' అనే శబ్దాన్ని స్మరించి పితృదేవతల్నీ సృష్టించాడు. బ్రహ్మ ఈజగత్తుకు ఉపాదానకారణం, నిమిత్తకారణం కూడా!
యోగవాసిష్ఠం:ఉత్పత్తిప్రకరణం:12వ సర్గ(జగదుత్పత్తి వర్ణనము):
వసిష్ఠుడు శ్రీరామచంద్రునితో చెప్పుచున్నాడు. పరమపవిత్రము, పరమశాంతము నగు బ్రహ్మపదమునుండి యీదృశ్యజగత్తు ఉత్పన్నమైన విధమును చెప్పు చున్నాను. సుషుప్తియే స్వప్నావస్థగా కనపడునట్లు సర్వస్వరూపమగు బ్రహ్మము గూడ సృష్టితోగూడి ప్రతిభాసించు విధానము చెప్పుచున్నాను.
ఈవిశ్వము అనంతప్రకాశస్వరూపమును, అనంతచిన్మయమునునగు పరమాత్మ యొక్క స్వాభావికసత్తకాక వేరొకటికాదు. ఈపరమాత్మ ఆకాశముకంటె సూక్ష్మము, నిర్మలము, చేత్యభావమువలె ప్రకాశించు చేత్యజ్ఞానము. ప్రధమమున దీనియందు 'అమల' జ్ఞానముతోకూడుకొనియుండును. దీనినుండియే జ్ఞానసంస్కారములన్ని యూ లేచుచున్నవి. ఇవియే సంస్కారములతోగూడికొని, మనచిత్తము నుద్బోధించు చున్నవి. అనంతరము ఆ పరమవస్తువు అనాదికాలమునుండి అనుస రించి, అరుదెంచివచ్చుచున్న ఈక్షణసంవేదనమువలన జ్ఞానఘనుడై ఆత్మభావమును విస్మరించి, పరమపదమును త్యజించి, మరల సంసారోపాధి కల్గిన జీవభావమును బొందును. జీవభావమునందిననూ, అద్దాని బ్రహ్మభావము తొలగిపోదు. కారణ మేమన, బ్రహ్మసత్తయే విశేషభావనవలన జీవునివలె మారినది. వికారము నందలేదు. ఈజీవసత్త ప్రకాశించిన పిమ్మట శూన్యస్వరూపమగు ఆకాశసత్త ఆవిర్భవించును. ఇదియే శబ్దగుణమునగు, ఆకశమను భవిష్యద్వ్యవహారమునకు అస్పదమగుచున్నది. పిమ్మట కాలసత్తయనుదానితోగూడ జీవుని అహంకారాది అభిమానములును జన్మించుచున్నవి. ఇవియే భావిసృష్టికిని, జగత్ స్థితికిని మూలకములు. ఆకాశఅహంకారకాలరూపమగు ఈసృష్టి హిరణ్యగర్బుని సత్తవలన నిలచియుండుటలేదు. పరమాత్మయొక్క సత్తవలననే నిలిచియున్నది. పరమాత్మ నుండియే ఆత్మసంవేద్యమగు ఈఅసద్రూప జగత్తు ఉత్పన్నమై సద్రూపమున బ్రకాశింపుచున్నది. అహంకారాదితత్త్వముల గూడుకొనిన సంవిత్తే సంకల్పమను వృక్షమునకు బీజము. దీనిఅంశమువలననే స్పందనదర్శియగు వాయువు ఉత్పన్న మగుచున్నది. అహంభావముతో గూడుకొనిన ఆకాశరూపమగు సత్తను శబ్దతన్మాత్ర యందురు. దీనినుండియే క్రమముగా ఆకాశతన్మాత్ర ఉదయించును. శబ్దతన్మాత్రకు కారణభూతమైనదీ శబ్దతన్మాత్రయే. ఈవృక్షమునుండియే పదవాక్యప్రమాణములతో గూడిన వేదములు వికసించినవి. అర్థములతోగూడిన శబ్దములుగ పరిణమించిన వేదస్వరూపబ్రహ్మము నుండియే ఈజగల్లక్ష్మి ఉదయించినది.
భావిజీవుడని చెప్పబడిన ప్రాణతత్త్వమే ఇంద్రియగ్రాహ్యములగు రూపాదులకు కారణము. ఈమహావాయువునుండియే చతుర్దశభువనములు, జరాయుజాది చతు ర్విధప్రాణిసమూహములును జన్మించినవి. ఈప్రాణతత్త్వాభిమానియొక్క చిత్స్ఫురణ వలన దేహముత్పన్నమగుచున్నది. దీనినే స్పర్శతన్మాత్రయందురు. ఈస్పర్శ తన్మాత్రయను వృక్షమునుండియే నలుబదితొమ్మిది వాయుశాఖలు వెలువడు చున్నవి. సర్వభూతముల స్పందనకార్యము నిర్వహింపబడుచున్నది. ప్రకాశాత్మక భావనవల దీనినుండియే తేజోతన్మాత్ర ఉత్పన్నమగుచున్నది. ఈతేజోవృక్షము నుండియే సూర్యుడు, అగ్ని, విద్యుత్తు మొదలుగాగల తేజోపదార్థములు ఉత్పన్న మగుచున్నవి. రూపవిభజనజరిగి, సంసారము విస్తరిల్లుచున్నది. ఈపరమవస్తువే సంకల్పమాత్రమున జలమయశరీఅరమును గ్రహించును. దీనిఆస్వాదననే రస తన్మాత్ర యందురు. ఇదియే ద్రవపదార్థములనింటికిని గారణము. ఈరసవృక్షము ఇంద్రియగ్రాహ్యమై సంసారవిస్తృతికి దోడ్పడుచున్నది. కల్పనామయమగు ఆత్మయే తనకల్పనాప్రభావమున గంధతన్మాత్రను వీక్షించును. మనుష్యాదియాకృతి వృక్షము ను, అన్నింటికినీ ఆధారమును, గంధతన్మాత్రమయమును, భవిష్యద్భూగోళ సంజ్ఞకమునగు పృథివినుండి సంసారము విస్తరిల్లుచున్నది.
చిచ్ఛక్తియొక్క భావనవలన గల్గిన తన్మాత్రలే ఒండొంటితోకలసి, బుడగలు నీరుగ మారునట్లు బ్రహ్మాండమగుచున్నది. ఇవి కొంతకాలము కూడియుండును. మరల విడిపోవును. మహాప్రళయమై ఇవిఅన్నియూ నశింపనంతవరకు వీటిని విశుద్ధ చిచ్ఛక్తి సంపన్నములని తెలియజాలము. చిన్నమర్రిగింజయందు చాలచెట్లు ఇమిడి యున్నట్లు, ఈతన్మాత్రలన్నియూ ఆకాశముననే వెలయుచున్నవి. మరల వీటి నుండియే ఆకాశాదులుప్రకాశించుచున్నవి. అంకురమునుండి వెలువడుట, శతశాఖ లతో బ్రకాశించుట, క్షణములో ఫలమునొసంగుట, ఇయ్యవి సూక్ష్మపరమాణువున గన్పడుచున్ననూ, మాయయని గ్రహింపవలెను. స్వప్నమున అతిసూక్ష్మమగు నాడి యందుగూడి పెద్దపెద్దవస్తువులు కన్పడుటలేదా? ఇవివాస్తవములుకావు. ఈస్థూల భావము లన్నియూ ఒకప్పుడు వివర్తములగుచున్నవి. మరొక్కప్పుడు వివర్త శూన్యములగుచున్నవి. సంకల్పాత్మకమగు చిచ్ఛక్తి వలననే తన్మాత్రలై త్రసరేణువు లగుచున్నవి. ఇంకొకప్పుడాకారరహితములగుచున్నవి. పంచతన్మాత్రలే యీదృశ్య జగత్తునకు కారణములు. వీటికి పరమాత్మతో నిత్యసంబంధమున్నది. మాయాశక్తి యే యీపంచతన్మాత్రలకు సాక్షాత్కారణమును, పరబ్రహ్మము పరమకారణము లగుచున్నవి.(మహాకారణము). అనుభూతిగ్రాహ్యమును, ఆదిభావమును, అజము ను, చిత్స్వరూపమునగు పరమాత్మయే యీ ఆదిశక్తికి అనగా మాయాశక్తికి గారణము. ఈకారణములజేసి జగల్లక్ష్మి క్రమముగ వికసించుచున్నది.
13వసర్గ:8-12:
కేవలచిద్రూపమగు పరమవస్తువు స్వప్నసృష్టివలె పృథ్వాదులను సృష్టించు చున్నది. ఈవిశుద్ధచైతన్యమెటనుండిననూ, జగదంకురాతిరిక్తమేయని గ్రహింప నగును. ఇయ్యది అసంగస్వభావము. స్థూలజగత్తుయొక్క బీజము పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలబీజము అక్షయమును, అవ్యయమునునగు చైతన్యము. ఇట్లు జగత్తంతయూ బ్రహ్మమయమగుచున్నవి. సృష్టికి పూర్వమున మహాకాశమున తన్మాత్రపంచకములుండును. చైతన్యమే స్వసామర్థ్యమున పంచతన్మాత్రలను గల్పించుచున్నది. ఇవి వాస్తవములుకావు. ఈపంచతన్మాత్రలు వర్థిల్లి స్థూలజగత్తుగా మారుచున్నవి. కనున సత్తాను, కల్పనాధిష్టానమునకు దానియందు స్వప్నకల్పన వలె ఈజగత్తు అవస్థితమైయున్నదని తేలుచున్నది. అందువలన ఈసమస్తము తత్త్వరూపమనియు, తదతిరిక్తముగాదనియు స్పష్టమగుచున్నది.
నిర్వాణప్రకరణము:34వసర్గ:6-25:
పూర్ణమును, నిరుపమునునగు బ్రహ్మమే మొదట ఆకాశమువలె వికాసము పొంది, జాగ్రత్స్వప్నసుషుప్తువులతోగూడిన సంసారమును ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక మార్గముగల జగత్తును తనశక్తివలన వికసింపజేయుచున్నది. తన యింద్రియములలో నొకటియగు మనస్సువలన మనస్సును ఖండింప సత్యము ప్రకాశించి, జగజ్జాలములవిలోపమొనర్చును. అప్పుడుకల్పనమగు ఈక్షుద్ర సంసారము భంగింపబడుచున్నది. ఇట్టిస్థితిని బడసిన జీవుని ఉని9కి 'ఇతి' అను శబ్దమున (ఉపనిషత్తులచెప్పబడినట్లు) నిర్దేశింపబడును. ఈజీవుడు మరల జన్మను బొందకపోవుటవలన ఇతని సత్త, వేయింపబడి అంకురోత్పాదక శక్తిని గోలుపోయిన బీజముతో బోల్పబడుచున్నది. దృశ్యపదార్థములన్నియు బాధింపబడుటవలన, ఈసత్త అప్పుడు కేవలము దృక్స్వరూపముగ మారుచున్నది. అందువలన నియ్యది 'పశ్యన్తి' (ద్రష్ట) అను పేరిటగూడ పేర్కొననబడును. ఆజీవుడు చేత్య విషయముల (చిత్తవిషయముల) స్మరించుటగూడమాని, మనోమేఘము నుండి విడివడి, శరత్కాల ఆకాశమువలె నిర్మలమై విరాజిల్లును.
తైత్తిరీయోపనిషత్:బ్రహ్మానందవల్లి:ద్వితీయాధ్యాయం:షష్ఠానువాకం:
ఆపరమాత్మ అనేకవిధములుగా పుట్టవలయునని కోరెను. ఆపరమాత్మ తపస్సు (ఆలోచన)చేసెను. ఆపరమాత్మ తపస్సు నుచేసి, ఈసమస్తమైన జగత్తును సృజిం చెను. సృజించిన యాజగత్తునే అనుసరించి ప్రవేశించెను. ఆవిధముగ ప్రవేశించి మూర్త స్వరూపముగాను, అమూర్తస్వరూపముగాను (సాకార, నిరాకారములు) తానేఆయెను.నిష్కృష్టమైనదియును,ఆశ్రయమైనదియును, చేతనరూపమైనదియును, సత్యస్వరూపమైనదియును,చేతనరూపము కానిదియును ఈసమస్తమున్ను
పరమార్థ సత్యములు. సత్యజ్ఞానానందాత్మకమునైన పరమార్థసత్యమగు పర బ్రహ్మము ఈచెప్పబడిన సమస్తమే. బ్రహ్మవేత్తలు పరమార్థ సత్య స్వరూపమగు ఆపరబ్రహ్మమును చెప్పుచున్నారు.
సప్తమానువాకము:
పూర్వమునందు పరబ్రహ్మస్వరూపముగా చెప్పబడిన ఈప్రపంచము సృష్టికి పూర్వము వ్యాకృతమై నామరూపవిశేషములకు విపరీతమగు అవ్యాకృతమైన పర బ్రహ్మముగానే యుండెను. అట్టి అవ్యాకృతపరబ్రహ్మమునుం డియే ప్రవివిక్తమగు నామరూప విశేషముగల జగత్తుపుట్టెను. ఏకారణమువలన ఆపరబ్రహ్మము ఈ ప్రకారము తన్నుతాను చేసికొనెనో, ఆకారణమునుండియే పరబ్రహ్మము సర్వకర్తృక మైనదని చెప్పబడుచున్నది. ఇట్టి రసస్వరూపమును జీవిపొంది సుఖవంతుడగు చున్నాడు. ఈసుఖస్వరూపమైనపరమాత్మ హృదయాకాశమందులేనియెడల ఎవడు ప్రాణాపానాది వ్యాపారమునుచేయును? ఈపరమాత్మయే లోకమును సుఖపెట్టు చున్నాడు. సాధకుడగు ఈజీవుడు, కనపడనిదియును, శరీరములేనిదియును, చెప్పశక్యము కానిదియును, నిరాధారమునైనదియునునగు ఈపరబ్రహ్మమునందు, భయరహితమైన ఆత్మభావమును ఎప్పుడుపొందునో, అప్పుడే భయరహితమగు పరబ్రహ్మమును పొందినవాడగుచున్నాడు. ఈజీవుడు ఎప్పుడు పరబ్రహ్మమునందు బేధమును జేసికొను చున్నాడో, ఆజీవునకు భయమేకలుగుచున్నది.
యోగశిఖోపనిషత్:(జీవోత్పత్తి):
సర్వభావపదాతీతమైనది, జ్ఞానరూపమైనది, నిరంజనమైనది బ్రహ్మ. అక్కడ దాని యందు వాయువువలె అహంకారము బయలుదేరినది. ఆపిండము ధాతుబద్ధమై గుణాత్మకమైనది. పంచభూతాత్మకమైనది. సుఖదుఃఖములతో కూడినదై, జీవభావన కలిగియున్నది. దానితో విశుద్ధమైనపరమాత్మకు జీవుడని పేరుకలిగినది. కామము, క్రోధము, భయము, మోహము,లోభము, మదము, రజస్సు, జన్మ, మృత్యువు, కార్పణ్యము, శోకము, అలసత్వము, ఆకలి, దప్పిక, తృష్ణ, లజ్జ, దుఃఖము, విషాదము, హర్షము, ఈదోషములచే విడువబడిన ఆజీవుడే శివుడనబడును.
యోగవాశిష్టము:ఉత్పత్తిప్రకరణము:10వసర్గ:28, 29:
పూర్ణబ్రహ్మమునుండివెలువడు ఔపాధికభేదములన్నియూ అసలునకు నిరాకారములు. పూర్ణబ్రహ్మమునుండి వెలువడిన యీజగత్తుకూడ అధికారి శరీరప్రాప్తికలిగించి, స్వస్వరూప లాభప్రయోజనసిద్ధికొరకే ఉపయోగపడుచున్న దన్పించబడుచున్నది. పూర్ణమునుండి వెలువడునదికూడ పూర్ణమే. అందువలన విశ్వముత్పన్నయ్యి, అనుత్పన్నమేయగుచున్నది.
పైంగలోపనిషత్:
యాజ్ఞవల్క్యముని పైంగలునికి ఉపదేశించుచున్నాడు. ఈఅనంతసృష్టికి పూర్వము పరమాత్మ ఒక్కడేయుండెను. ఆసద్వస్తువు (ఆత్మ) నిత్యముక్తమైనది. వికారములు లేనిది. సత్యజ్ఞానానందమైనది. పరిపూర్ణమైనది. సనాతనముగానున్నది. ఏకముగా నున్నది. అద్వితీయమునైనది. అయ్యదియే పరబ్రహ్మము. ఆబ్రహ్మమునందు, మరుభూములందు జలమువలెను, ముత్యపుజిప్పయందు వెండివలెను, స్థాణువు నందు చెట్టు(మ్రోడు)నందు దొంగవానివలెను, స్ఫటికాదులయందు రేఖలుమున్నగు వానివలెను తోచుచూ, ఎరుపు, తెలుపు, నలుపురంగుల సమానత్రిగుణములు గలిగి, అనిర్వాచ్యమగు మూలప్రకృతి యుండెను. ఆప్రకృతియందు ప్రతిబింబించిన పరబ్రహ్మమే సాక్షిచైతన్యముగనుండెను. ఆయావరణశక్తియందు ప్రతిబింబించిన పరబ్రహ్మము ఈశ్వరచైతన్యమైనుండెను. అవ్యక్తమాయను స్వాధీనములో నుంచు కొనినవాడును,సర్వజ్ఞుడునునగునాఈశ్వరుడు,సృష్టిస్థితిలయలకు ఆదికర్త యగుచు జగదంకురరూపుడుగనున్నాడు. ఆఈశ్వరుడు తనయందే విలీనమైయున్న సకల జగత్తులో అంతటతానే ఆవిర్భవింపజేసియున్నాడు. ఈయీశ్వరుడే ప్రాణులకు సబంధించిన సంస్కారరూపకర్మలు క్షీణించి నపుడు, ఆప్రాణులను మరల తిరోభవింప జేయుచున్నాడు. ఆఈశ్వరునిలోనే అఖిలవిశ్వమును సంకుచితవస్త్రమువలె దాగి యున్నవి. ఈశ్వరుడే అధిష్టానముగానున్న ఆపరాశక్తినుండి రజోగుణముతో నుద్రిక్తమైన మహత్తుయనుపేరుగల విక్షేపశక్తి ఏర్పడెను. ఆమహత్తునందు ప్రతిఫలించిన బ్రహ్మము హిరణ్యగర్భచైతన్యముగ నుండెను. ఆహిరణ్యగర్భుడు మహత్తత్వము నందభిమానము గలవాడై, స్పష్టమైనదియూ, అస్పష్టమైనదియు నగు శరీరమును ధరించియున్నాడు.
హిరణ్యగర్భునిచే అధిష్టింపబడిన మహత్తు(విక్షేపశక్తి)నుండి, తమోగుణాద్రిక్తమగు అహంకారము(స్థూలశక్తి) పుట్టెను. అట్టిఅహంకారమునందు ప్రతిబింబించిన పరబ్రహ్మము 'విరాట్' అనుచైతన్యముగ నుండెను. ఆవిరాట్ దానియందభిమానము గలవాడై, సమస్తస్థూలదేహములను పరిపాలించువాడుగను, ప్రధానపురుషుడగు శ్రీమహావిష్ణువుగానున్నాడు. ఆయాత్మ (విష్ణువు) నుండి సూక్ష్మాకాశభూతము పుట్టెను. ఆయాకాశమునుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి పృథ్విపుట్టెను. సూక్ష్మభూతములుగానున్న ఈపంచతన్మాత్ర లు గుణసహితములుగానున్నవి. సృష్టి సంకల్పము కలిగియున్న ఆజగత్కర్త తమోగుణమునధిష్టించి, సూక్ష్మతన్మాత్రసహిత సూక్ష్మ(పంచ)భూతములను, స్థూల భూతములుగా చేయవలెనని సంకల్పించెను. సృష్టికి పరిమితములైన సూక్ష్మపంచ భూతములలో ఒక్కొక్కభూతమును రెండు భాగములు చేసెను. ప్రతిభూతము లోనున్న ప్రధమభాగమును విభజనచేయక, రెండవభాగమును 4 భాగములుగా విభజించెను. ఆరీతిగా నాలుగుగావిభజించిన భూతభాగములలో నొక్కొక్కభాగమును ఆభూతముయొక్క మొదటిఅర్థభాగములో చేర్చక, వేరుగానున్న 4 భూతముల యొక్క(విభాగముకాని)మొదటిభాగముతోకలిపి ప్రతిభూతమును ఐదేసి భాగములుగా పంచీకరించెను.
పంచీకరణపద్ధతి:
పృధివిని 2 భాగములుగాజేసి, అందుమొదటిభాగమును విభజింపక, రెండవ భాగమును 4 భాగములగునట్లు విభజింప వలయును. ఈరీతిగా మిగిలిన నాలుగు భూతములనుగూడ విభాగింపవలయును. విభాగింపని భూమియొక్క అర్థభాగము నందు, భూమియొక్క ద్వితీయాంశభాగములను జేర్చక, జలతేజోవాయ్వాకాశముల (1/8) భాగములను జేర్చవలెను. ఇట్లు పంచీకృతమగు భూమిస్థూలభూతమగును. ఇట్లే మిగిలిన భూతములను గూడ పంచీకరింపపవలెను.
భూమివిభాగము 1/2
జలవిభాగము 1/8
తేజోవిభాగము 1/8
వాయువిభాగము 1/8
ఆకాశవిభాగము 1/8
భూమిభూతము మొత్తము 1
ఇది పృథ్వీభూతపంచీకరణము. ఇదేరీతిగా జల, తేజో, వాయ్వాకాశ పంచీకరణము లను తెలియవలెను.
ఈవిధముగా పంచీకరింపబడిన భూతములతో, అనంతకోటి బ్రహ్మాండములను, అయాబ్రహ్మాండములకు దగిన గోళక స్థూలశరీరములను సృష్టిచేసెను. ఆఈశ్వరుడు పంచమహాభూతములయొక్క రజోగుణభాగములను 4 భాగములుగజేసి,ఆభాగము లలో 3 భాగములనుండి ప్రాణశక్తిని సృష్టినిచేసెను. ఆపిమ్మట ఆఈశ్వరుడు అపంచ భూతములయొక్క సత్త్వాంశములను 4 భాగములుగజేసి, 3 భాగములవలన పంచ వృత్త్యాత్మకమగు అంతఃకరణమును సృష్టిచేసెను. అపిమ్మట ఈశ్వరుడు ఆపంచ భూతములయొక్క నాలుగవసత్త్వభాగములో జ్ఞానేంద్రియములను సృష్టిచేసెను. సత్వసమిష్టివలన ఇంద్రియపాలకులైన దేవతలను సృష్టిచేసెను. ఆరీతిగా సృష్టింపబడిన యింద్రియాదులను అండములోపల వ్యాపింపజేసెను. ఆఈశ్వరుని ఆజ్ఞతో సృష్టింపబడినవన్ని అండమునందంతటనూ పూర్తిగా వ్యాపించియున్నవి. ఆఈశ్వరుని ఆజ్ఞతో అహంకారసహిత విరాట్టు సమస్థ స్థూలములను సృష్టిచేసెను. ఆఈశ్వరుని ఆజ్ఞతో హిరణ్యగర్భుడు సూక్ష్మభూతములను పరిపాలించెను.
అండస్థితములైన దేహేంద్రియాదులు చైతన్యమూర్తియగు నీశ్వరుడులేకుండ స్పందనకలిగియుండుటకు, పనిచేయుటకు సమర్థతలేనిదిగాయుండెను. ఈశ్వరుడు ఆదేహదులను చేతనవంతములుగా చేయుటకు సంకల్పించెను. బ్రహ్మాండములను, బ్రహ్మరంధ్రములను, సమస్తవ్యష్టిశరీరములయొక్క మస్తకములను బ్రద్దలుచేసి, వాటన్నిటియందు చైతన్యరూపములో ప్రవేశించెను. (ఇదే సహస్రారచక్రము. శరీరము లోనికి పరమాత్మవచ్చినద్వారము. కావున పరమాత్మను చేరుకొనవలెనంటే, ఆ మార్గము,అనగాబ్రహ్మరంధ్రముద్వారానే ప్రయాణించవలెను.) ఆశరీరములు మొదట జడములుగా నున్ననూ, ఈశ్వరచైతన్యము ప్రవేశింపగనే చైతన్యవంతములైనవి. ఆ పిమ్మట తమకార్యములను చేయుటకు పూనుకున్నవి. సర్వజ్ఞుడైన ఈశ్వరుడు మాయాలేశ సమన్వితుడై, మోహపెట్టబడి, జీవత్వముపొందెను. దేహత్రయ తాదాత్మ్యమువలన కర్తృత్వమును, భోక్తృత్వమును కలవాడయ్యెను. జీవుడుగా నున్న ఈశ్వరుడు స్థూల, సూక్ష్మ, కారణ దేహములను (దేహమేతానను భ్రాంతిలో) తానుగా భావించుటవలన, మేలుకొనుట, స్వప్నములను గాంచుట, నిద్రపోవుట, మూర్చిల్లుట, మరణముపొందుట అను ధర్మములను కలిగినవాడై, కులాలచక్రము (కుమ్మరిసారె) రీతిగా పరిభ్రమించుచున్నాడు.
ఈశ్వరుడు పంచీకృతమహాభూతములను స్వీకరించి, వ్యష్టిరూపములోను, సమష్టి రూపములోను, స్థూలదేహములను యథాప్రకారముగా సృష్టిచేసెను. వానిలో కపాలము, చర్మము, నరములు, ఎముకలు, మాంసము, నఖములు, మున్నగు నవి పృథివియొక్క అంశములుగానున్నవి. రక్తము, మలము, మూత్రము, లాలా జలము, స్వేదము మున్నగునవి జలములయొక్క అంశములుగానున్నవి. నడచుట, దాటుట, శ్వాసవిడచుట, పీల్చుట మున్నగునవి వాయువుయొక్క అంశములుగా నున్నవి. కామక్రోధాదులు ఆకాశాంశములు. కర్మసంచితమును, చర్మాదులతో కూడియున్నదియు, బాల్యాదిఅవస్థలను అభిమానించు నిలయము ను బహుదోషాశ్రయమునునగు మొత్తము స్థూలదేహముగా నున్నది.
(సూక్ష్మశరీరముగురించి) తదుపరి అపంచేకృతములగు పంచమహాభూతముల యొక్క రజోగుణాంశముల మూడింటియొక్క సమిష్టిభాగముతో ప్రాణమును సృష్టి చేసెను. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, ఈఅయిదు ప్రాణముయొక్క వృత్తులు. నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము ఈఅయిదు ఉపప్రాణములు. హృదయము, గుదము, నాభి, కంఠము, సర్వాంగము అనునవి ప్రాణముయొక్క స్థానములు. ఆకాశాది పంచభూతముల యొక్క రజోగుణ చతుర్థభాగముతో కర్మేంద్రియములను సృష్టిచేసెను. వాక్కు, పాణి, పాదము, గుదము, ఉపస్థ యనునవి కర్మేంద్రియముయొక్క విషయములు. ఈపంచభూతములయొక్క సత్వగుణాంశముల మూడింట మొత్తముతో అంతః కరణముసృష్టిచేసెను. మనోబుద్ధిచిత్తహంకారములు అంతఃకరణవృత్తులు. ఆలోచించుట, నిశ్చయముచేయుట, స్మరించుట, అభిమానించుట, అనుసంధానించుట అనునవి అంతఃకరణవిషయములు. గళము, వనము, నాభి, హృదయము, భ్రూమధ్యము అనునవి అంతఃకరణస్థానములు. పంచభూతములయొక్క సత్వ గుణాంశ సంబంధమగు నాల్గవభాగములో జ్ఞానేంద్రియములను సృష్టిచేసెను. శ్రోత్రము, త్వక్కు, చక్షుస్సు, జిహ్వ, ఘ్రాణము అనునవి ఆయా వృత్తులవలన నామభేదములతోనేర్పడిన జ్ఞానేంద్రియముల శబ్దసర్శరూపరసగంధములు ఈజ్ఞానేం ద్రియములకు విషయములు. దిక్కులు, వాయువు, భానుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు జ్ఞానేంద్రియములకు అధిష్ఠానదేవతలు. అగ్ని, దేవేంద్రుడు, ఉపేంద్రుడు, మృత్యువు, ప్రజాపతి, కర్మేంద్రియములకు దేవతలు. చంద్రుడు, విష్ణువు, చతుర్ముఖబ్రహ్మ, శంభుడు అంతఃకరణమునకు క్రమముగా అధిదేవతలు.
(పంచకోశాత్మక దేహత్రయము) ఆపిమ్మట అన్నమయ, ఫ్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములను పంచకోశములు కలవు. అన్నరసముచే జన్మించి, అన్నరసముచే అభివృద్ధినిపొంది, అన్నరసమగు పృథ్విలోనే విలీనమగునది అన్నమయకోశము. ఇదియే స్థూలదేహము. కర్మేంద్రియసహిత మనస్సు మనోమయకోశము. జ్ఞానేంద్రియ సహితబుద్ధి విజ్ఞాన మయకోశము. ఈ 3 కోశముల సమూహమును (సూక్ష్మ) లింగదేహమని చెప్పెదరు. స్వస్వరూపముయొక్క అజ్ఞానము ఆనందమయకోశము. ఈఆనందమయకోశమే కారణదేహమని చెప్పెదరు.
1. జ్ఞానేంద్రియపంచకము, 2. కర్మేంద్రియపంచకము, 3. ప్రాణాదిపంచకము, 4. ఆకాశాదిపంచకము, 5. అంతఃకరణ చతుష్టయము, 6. కామము, 7. కర్మలు, 8. తమస్సు(అవిద్య) ఈ యెనిమిది కలదేహము అష్టపురమని చెప్పబడును. (దీనినే పుర్యష్టకమని కూడ అంటారు). ఈశ్వరాజ్ఞచేత విరాట్పురుషుడు ఒక్కొక్క (వ్యష్టి) శరీరమునందు ప్రవేశించి, బుద్ధి నధిష్టించి, విశ్వుడుగానాయెను. విజ్ఞానాత్ముడని, చిదాభాసుడనియు, విరాట్టునకు నామములు కలవు. ఈశ్వరాజ్ఞతో ఒక్కొక్క (వ్యష్టి) సూక్ష్మదేహమందు ప్రవేశించిన సూత్రాత్మ, మనస్సు నధిష్టించి, తైజసుడుగా నయ్యెను. తైజసునకు, తైజసుడు, ప్రాతిభాసితుడు, స్వప్నకలితుడు అనిగూడ నామములుకలవు. ఈశ్వరాజ్ఞతో మాయోపాధికుడగు నా ఈశ్వరుడే అవ్యక్తసహితుడై ఒక్కొక్క (వ్యష్టి) కారణదేహమందు ప్రవేశించి, ప్రాజ్ఞత్వమును పొందెను. (ప్రాజ్ఞుడయ్యెను). అతనికి అవిచ్ఛిన్నుడు, పారమార్థికుడు, సుషుప్త్యభిమాని అనునవి పర్యాయనామములు.
లయము:
పంచీకృతమైన మహాభూతములను ఈశ్వరుడు అపంచీకరణము (లయము) చేయుటకు భావించెను. కార్యరూపములోనున్న బ్రహ్మాండములలో నంతర్గతములు గా నున్న లోకములను, కారణత్వమును పొందించి, ఆపిమ్మట సూక్ష్మాంగములైన కర్మేంద్రియములను, ప్రాణములను, జ్ఞానేంద్రియములను, అంతఃకరణ చతుష్టయ మును, ఏకముగాజేసి, పృథ్విని జలమందును, జలములగ్నియందును, అగ్నిని వాయువునందును, వాయువునాకాశమునందును, ఆకాశమును అహంకారమందు ను, అహంకారమును మహత్తత్వమునందును, మహత్తత్వమును అవ్యక్తమునందు ను, అవ్యక్తమును పురుషుని(పరమాత్మ) యందును క్రమముగా విలీనముచేయు చున్నాడు. విరాట్టు, హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు ఉపాధులు లయమైపోయునందున పరమాత్మలో విలీనమగుచున్నారు.
పంచీకృత స్థూలమహాభూతములవలన సంభవించిన కర్మచేత సంపాదింపబడిన స్థూలదేహము కర్మక్షయమువలననూ, సత్కర్మపరిపాకమువలననూ, అపంచీ కరణమును పొంది (సూక్ష్మశరీరమును ధరించి) సూక్ష్మతత్త్వములో ఐక్యముచెంది, ఆపిమ్మట కారణరూపత్వమును పొందును. (కారణములో విలీనమగును). ఆపిమ్మట ఆకారణతత్త్వము కూటస్థమగు ప్రత్యగాత్మయందు విలీనమగును. విశ్వ తైజసప్రాజ్ఞులుకూడ తమ ఉపాధులు లయమగుటచే, ఆపరమాత్మయందు లయ మగుచున్నారు. జ్ఞానాగ్నితో బ్రహ్మాండము దహింపబడునప్పుడు ఆబ్రహ్మాండము సూక్ష్మకారణతత్త్వ సహితముగా పరమాత్మయందు విలీనమగుచున్నది. అందు వలన బ్రాహ్మణుడు(బ్రహ్మజ్ఞాని) సమాహితుడయి, సర్వదా ''తత్,త్వం'' పదార్థముల విజ్ఞానమును అనుసంధానము చేయుచుండవలెను. అప్పుడు మేఘములు తొలగి నప్పుడున్న సూర్యునివలె అజ్ఞానముతొలగిపోగా, ఆత్మ ఆవిర్భవించును. (పరమాత్మ తత్త్వము బోధపడును.)
ముండకోపనిషత్:ద్వితీయముండకం:ప్రధమఖండం:
4-6: ఆవిరాట్పురుషునకు ఆకాశమే శిరస్సు. సూర్యచంద్రులు నేత్రములు. దిక్కులు శ్రోత్రములు. వాగ్వివరములు వేదములు. వాయువే ప్రాణము. ఈవిశ్వమే మనస్సు. ఆపురుషుని పాదములనుండి భూమిపుట్టెను. అతడే సర్వాంతరాత్మగా వెలుగుచున్నాడు. ఆపరబ్రహ్మమునుండి ఆకాశము(ప్రథమాగ్ని), ఆయగ్నినుండి దానికి సమిధయైన సూర్యుడు పుట్టెను. చంద్రునినుండి పర్జన్యుడు(ద్వితీయాగ్ని), ఆ పర్జన్యునినుండి ఓషధులు(తృతీయాగ్ని)ఉద్భవించెను. ఓషధులనుండి మనుష్యులు (చతుర్థాగ్ని)జన్మించెను. ఆమానవుడు తన బీజమును(పంచమాగ్ని) స్త్రీయందుం చెను. ఈరీతిగా సమస్త ప్రజలున్ను ఆపరమపురుషునినుండి జన్మించియుండిరి. ఆపురుషునినుండి ఋక్కులు, సామములు, యజస్సులు, దీక్ష, సమస్తములైన యజ్ఞములు, క్రతువులు, దక్షిణలు, సంవత్సరములు, యజమాని జన్మించి యున్నారు. ఎచట చంద్రుడు పవిత్రముచేయుచున్నాడో, ఎచట సూర్యుడు పవిత్రము చేయుచున్నాడో, అట్టిలోకములును పుట్టుచున్నవి.
పరబ్రహ్మస్వరూపమేమిటో తెలుసుకొన్న పిదప, ఆపరబ్రహ్మస్వరూపం ఏమిచేసింది? ఎలా విశ్వాలను, సృష్టిని, ప్రకృతిని రచించింది? అనే విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే, పరమాత్మనుండి, ఈవిశ్వమునుండి, సృష్టినుండి, ప్రకృతి నుండి, మనంకూడా వచ్చాము కాబట్టి. ఇంకొక విషయం ఏమిటంటే, మనం ఎలా వచ్చామో తెలుసుకొంటే, ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. అలా తెలుసుకొంటే, అర్థజ్ఞానంతో పద్మవ్యూహంలోకి జొరబడ్డ అభిమన్యుడి గది మనకు పట్టకుండా వుంటుంది.
ఇక్కడ ఇంకొకవిషయాన్ని మనం గమనించాలి. ఈఅధ్యాయంలో చెప్పబడిన విశ్వసృష్టి రచనను, ఉపనిషద్రష్టలు, మహాత్ములు, ఋషులు సమాధిస్థితిలో అంతర్నేత్రంతో అనుభవించి మనకు చెప్పారు. వారు గమనించిన ప్రక్రియ అంతా భౌతికసృష్టి ఏర్పడటానికి ముందు జరిగిన అధ్యాత్మిక తత్త్వమహాకారణం. ఎందుకంటే, కారణంలేని కార్యముండదు. 'భౌతికసృష్టి' అనేకార్యానికి ముందరజరిగిన ఒక ఆధ్యాత్మిక తత్త్వమహాకారణమే, ఉపనిషత్తులలోను, ఇంకా ఇతర గ్రంథాలలోను విశదీకరించిన విశ్వసృష్టిరచన, పంచీకరణ, భౌతికతత్త్వావిష్కరణ మున్నగునవి. దానిని తత్త్వదృష్టితోనే చూడాలి తప్ప, మన సైన్సులోచెప్పే భౌతికపరిణామక్రమంతో దీనిని పోల్చరాదు. ఎందుకంటే, భౌతిక పరిణామక్రమానికి ఈతత్త్వవిభజన మూల కారణం. ఈవిషయమై సనాతనులు మనకు అందించిన విషయాలను పరిశీలిద్దాం.
ఐతరేయోపనిషత్:ప్రధమాధ్యాయం:ప్రధమఖండం:
1. ఈఅనంతసృష్టికి పూర్వమందు నిత్యసత్య శుద్ధబుద్ధస్వరూపుడు పరమాత్మయే ప్రకాశించుచుండెను. ఆత్మతప్ప మరియొక్కటిలేదు. ఈపరిణామజగత్తు అప్పుడు లేదు. ఈ పరమాత్మయే అన్నిలోకములను సృష్టిచేయుటకు సంకల్పించెను.
బ్రహ్మసూత్రదర్శనం:
ఈజగత్తుకు కారణమైన బ్రహ్మానికి వ్యాప్తిత్వము, నిత్యత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వము, సర్వాత్మకము అనేవి ధర్మాలు. ప్రజాపతి 'ఏతే' అనే శబ్దాన్ని స్మరించి దేవతలను, 'అసృగ్రమ్' అనే పదాన్ని స్మరించి మనుష్యుల్నీ, 'ఇందవః' అనే శబ్దాన్ని స్మరించి పితృదేవతల్నీ సృష్టించాడు. బ్రహ్మ ఈజగత్తుకు ఉపాదానకారణం, నిమిత్తకారణం కూడా!
యోగవాసిష్ఠం:ఉత్పత్తిప్రకరణం:12వ సర్గ(జగదుత్పత్తి వర్ణనము):
వసిష్ఠుడు శ్రీరామచంద్రునితో చెప్పుచున్నాడు. పరమపవిత్రము, పరమశాంతము నగు బ్రహ్మపదమునుండి యీదృశ్యజగత్తు ఉత్పన్నమైన విధమును చెప్పు చున్నాను. సుషుప్తియే స్వప్నావస్థగా కనపడునట్లు సర్వస్వరూపమగు బ్రహ్మము గూడ సృష్టితోగూడి ప్రతిభాసించు విధానము చెప్పుచున్నాను.
ఈవిశ్వము అనంతప్రకాశస్వరూపమును, అనంతచిన్మయమునునగు పరమాత్మ యొక్క స్వాభావికసత్తకాక వేరొకటికాదు. ఈపరమాత్మ ఆకాశముకంటె సూక్ష్మము, నిర్మలము, చేత్యభావమువలె ప్రకాశించు చేత్యజ్ఞానము. ప్రధమమున దీనియందు 'అమల' జ్ఞానముతోకూడుకొనియుండును. దీనినుండియే జ్ఞానసంస్కారములన్ని యూ లేచుచున్నవి. ఇవియే సంస్కారములతోగూడికొని, మనచిత్తము నుద్బోధించు చున్నవి. అనంతరము ఆ పరమవస్తువు అనాదికాలమునుండి అనుస రించి, అరుదెంచివచ్చుచున్న ఈక్షణసంవేదనమువలన జ్ఞానఘనుడై ఆత్మభావమును విస్మరించి, పరమపదమును త్యజించి, మరల సంసారోపాధి కల్గిన జీవభావమును బొందును. జీవభావమునందిననూ, అద్దాని బ్రహ్మభావము తొలగిపోదు. కారణ మేమన, బ్రహ్మసత్తయే విశేషభావనవలన జీవునివలె మారినది. వికారము నందలేదు. ఈజీవసత్త ప్రకాశించిన పిమ్మట శూన్యస్వరూపమగు ఆకాశసత్త ఆవిర్భవించును. ఇదియే శబ్దగుణమునగు, ఆకశమను భవిష్యద్వ్యవహారమునకు అస్పదమగుచున్నది. పిమ్మట కాలసత్తయనుదానితోగూడ జీవుని అహంకారాది అభిమానములును జన్మించుచున్నవి. ఇవియే భావిసృష్టికిని, జగత్ స్థితికిని మూలకములు. ఆకాశఅహంకారకాలరూపమగు ఈసృష్టి హిరణ్యగర్బుని సత్తవలన నిలచియుండుటలేదు. పరమాత్మయొక్క సత్తవలననే నిలిచియున్నది. పరమాత్మ నుండియే ఆత్మసంవేద్యమగు ఈఅసద్రూప జగత్తు ఉత్పన్నమై సద్రూపమున బ్రకాశింపుచున్నది. అహంకారాదితత్త్వముల గూడుకొనిన సంవిత్తే సంకల్పమను వృక్షమునకు బీజము. దీనిఅంశమువలననే స్పందనదర్శియగు వాయువు ఉత్పన్న మగుచున్నది. అహంభావముతో గూడుకొనిన ఆకాశరూపమగు సత్తను శబ్దతన్మాత్ర యందురు. దీనినుండియే క్రమముగా ఆకాశతన్మాత్ర ఉదయించును. శబ్దతన్మాత్రకు కారణభూతమైనదీ శబ్దతన్మాత్రయే. ఈవృక్షమునుండియే పదవాక్యప్రమాణములతో గూడిన వేదములు వికసించినవి. అర్థములతోగూడిన శబ్దములుగ పరిణమించిన వేదస్వరూపబ్రహ్మము నుండియే ఈజగల్లక్ష్మి ఉదయించినది.
భావిజీవుడని చెప్పబడిన ప్రాణతత్త్వమే ఇంద్రియగ్రాహ్యములగు రూపాదులకు కారణము. ఈమహావాయువునుండియే చతుర్దశభువనములు, జరాయుజాది చతు ర్విధప్రాణిసమూహములును జన్మించినవి. ఈప్రాణతత్త్వాభిమానియొక్క చిత్స్ఫురణ వలన దేహముత్పన్నమగుచున్నది. దీనినే స్పర్శతన్మాత్రయందురు. ఈస్పర్శ తన్మాత్రయను వృక్షమునుండియే నలుబదితొమ్మిది వాయుశాఖలు వెలువడు చున్నవి. సర్వభూతముల స్పందనకార్యము నిర్వహింపబడుచున్నది. ప్రకాశాత్మక భావనవల దీనినుండియే తేజోతన్మాత్ర ఉత్పన్నమగుచున్నది. ఈతేజోవృక్షము నుండియే సూర్యుడు, అగ్ని, విద్యుత్తు మొదలుగాగల తేజోపదార్థములు ఉత్పన్న మగుచున్నవి. రూపవిభజనజరిగి, సంసారము విస్తరిల్లుచున్నది. ఈపరమవస్తువే సంకల్పమాత్రమున జలమయశరీఅరమును గ్రహించును. దీనిఆస్వాదననే రస తన్మాత్ర యందురు. ఇదియే ద్రవపదార్థములనింటికిని గారణము. ఈరసవృక్షము ఇంద్రియగ్రాహ్యమై సంసారవిస్తృతికి దోడ్పడుచున్నది. కల్పనామయమగు ఆత్మయే తనకల్పనాప్రభావమున గంధతన్మాత్రను వీక్షించును. మనుష్యాదియాకృతి వృక్షము ను, అన్నింటికినీ ఆధారమును, గంధతన్మాత్రమయమును, భవిష్యద్భూగోళ సంజ్ఞకమునగు పృథివినుండి సంసారము విస్తరిల్లుచున్నది.
చిచ్ఛక్తియొక్క భావనవలన గల్గిన తన్మాత్రలే ఒండొంటితోకలసి, బుడగలు నీరుగ మారునట్లు బ్రహ్మాండమగుచున్నది. ఇవి కొంతకాలము కూడియుండును. మరల విడిపోవును. మహాప్రళయమై ఇవిఅన్నియూ నశింపనంతవరకు వీటిని విశుద్ధ చిచ్ఛక్తి సంపన్నములని తెలియజాలము. చిన్నమర్రిగింజయందు చాలచెట్లు ఇమిడి యున్నట్లు, ఈతన్మాత్రలన్నియూ ఆకాశముననే వెలయుచున్నవి. మరల వీటి నుండియే ఆకాశాదులుప్రకాశించుచున్నవి. అంకురమునుండి వెలువడుట, శతశాఖ లతో బ్రకాశించుట, క్షణములో ఫలమునొసంగుట, ఇయ్యవి సూక్ష్మపరమాణువున గన్పడుచున్ననూ, మాయయని గ్రహింపవలెను. స్వప్నమున అతిసూక్ష్మమగు నాడి యందుగూడి పెద్దపెద్దవస్తువులు కన్పడుటలేదా? ఇవివాస్తవములుకావు. ఈస్థూల భావము లన్నియూ ఒకప్పుడు వివర్తములగుచున్నవి. మరొక్కప్పుడు వివర్త శూన్యములగుచున్నవి. సంకల్పాత్మకమగు చిచ్ఛక్తి వలననే తన్మాత్రలై త్రసరేణువు లగుచున్నవి. ఇంకొకప్పుడాకారరహితములగుచున్నవి. పంచతన్మాత్రలే యీదృశ్య జగత్తునకు కారణములు. వీటికి పరమాత్మతో నిత్యసంబంధమున్నది. మాయాశక్తి యే యీపంచతన్మాత్రలకు సాక్షాత్కారణమును, పరబ్రహ్మము పరమకారణము లగుచున్నవి.(మహాకారణము). అనుభూతిగ్రాహ్యమును, ఆదిభావమును, అజము ను, చిత్స్వరూపమునగు పరమాత్మయే యీ ఆదిశక్తికి అనగా మాయాశక్తికి గారణము. ఈకారణములజేసి జగల్లక్ష్మి క్రమముగ వికసించుచున్నది.
13వసర్గ:8-12:
కేవలచిద్రూపమగు పరమవస్తువు స్వప్నసృష్టివలె పృథ్వాదులను సృష్టించు చున్నది. ఈవిశుద్ధచైతన్యమెటనుండిననూ, జగదంకురాతిరిక్తమేయని గ్రహింప నగును. ఇయ్యది అసంగస్వభావము. స్థూలజగత్తుయొక్క బీజము పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలబీజము అక్షయమును, అవ్యయమునునగు చైతన్యము. ఇట్లు జగత్తంతయూ బ్రహ్మమయమగుచున్నవి. సృష్టికి పూర్వమున మహాకాశమున తన్మాత్రపంచకములుండును. చైతన్యమే స్వసామర్థ్యమున పంచతన్మాత్రలను గల్పించుచున్నది. ఇవి వాస్తవములుకావు. ఈపంచతన్మాత్రలు వర్థిల్లి స్థూలజగత్తుగా మారుచున్నవి. కనున సత్తాను, కల్పనాధిష్టానమునకు దానియందు స్వప్నకల్పన వలె ఈజగత్తు అవస్థితమైయున్నదని తేలుచున్నది. అందువలన ఈసమస్తము తత్త్వరూపమనియు, తదతిరిక్తముగాదనియు స్పష్టమగుచున్నది.
నిర్వాణప్రకరణము:34వసర్గ:6-25:
పూర్ణమును, నిరుపమునునగు బ్రహ్మమే మొదట ఆకాశమువలె వికాసము పొంది, జాగ్రత్స్వప్నసుషుప్తువులతోగూడిన సంసారమును ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక మార్గముగల జగత్తును తనశక్తివలన వికసింపజేయుచున్నది. తన యింద్రియములలో నొకటియగు మనస్సువలన మనస్సును ఖండింప సత్యము ప్రకాశించి, జగజ్జాలములవిలోపమొనర్చును. అప్పుడుకల్పనమగు ఈక్షుద్ర సంసారము భంగింపబడుచున్నది. ఇట్టిస్థితిని బడసిన జీవుని ఉని9కి 'ఇతి' అను శబ్దమున (ఉపనిషత్తులచెప్పబడినట్లు) నిర్దేశింపబడును. ఈజీవుడు మరల జన్మను బొందకపోవుటవలన ఇతని సత్త, వేయింపబడి అంకురోత్పాదక శక్తిని గోలుపోయిన బీజముతో బోల్పబడుచున్నది. దృశ్యపదార్థములన్నియు బాధింపబడుటవలన, ఈసత్త అప్పుడు కేవలము దృక్స్వరూపముగ మారుచున్నది. అందువలన నియ్యది 'పశ్యన్తి' (ద్రష్ట) అను పేరిటగూడ పేర్కొననబడును. ఆజీవుడు చేత్య విషయముల (చిత్తవిషయముల) స్మరించుటగూడమాని, మనోమేఘము నుండి విడివడి, శరత్కాల ఆకాశమువలె నిర్మలమై విరాజిల్లును.
తైత్తిరీయోపనిషత్:బ్రహ్మానందవల్లి:ద్వితీయాధ్యాయం:షష్ఠానువాకం:
ఆపరమాత్మ అనేకవిధములుగా పుట్టవలయునని కోరెను. ఆపరమాత్మ తపస్సు (ఆలోచన)చేసెను. ఆపరమాత్మ తపస్సు నుచేసి, ఈసమస్తమైన జగత్తును సృజిం చెను. సృజించిన యాజగత్తునే అనుసరించి ప్రవేశించెను. ఆవిధముగ ప్రవేశించి మూర్త స్వరూపముగాను, అమూర్తస్వరూపముగాను (సాకార, నిరాకారములు) తానేఆయెను.నిష్కృష్టమైనదియును,ఆశ్రయమైనదియును, చేతనరూపమైనదియును, సత్యస్వరూపమైనదియును,చేతనరూపము కానిదియును ఈసమస్తమున్ను
పరమార్థ సత్యములు. సత్యజ్ఞానానందాత్మకమునైన పరమార్థసత్యమగు పర బ్రహ్మము ఈచెప్పబడిన సమస్తమే. బ్రహ్మవేత్తలు పరమార్థ సత్య స్వరూపమగు ఆపరబ్రహ్మమును చెప్పుచున్నారు.
సప్తమానువాకము:
పూర్వమునందు పరబ్రహ్మస్వరూపముగా చెప్పబడిన ఈప్రపంచము సృష్టికి పూర్వము వ్యాకృతమై నామరూపవిశేషములకు విపరీతమగు అవ్యాకృతమైన పర బ్రహ్మముగానే యుండెను. అట్టి అవ్యాకృతపరబ్రహ్మమునుం డియే ప్రవివిక్తమగు నామరూప విశేషముగల జగత్తుపుట్టెను. ఏకారణమువలన ఆపరబ్రహ్మము ఈ ప్రకారము తన్నుతాను చేసికొనెనో, ఆకారణమునుండియే పరబ్రహ్మము సర్వకర్తృక మైనదని చెప్పబడుచున్నది. ఇట్టి రసస్వరూపమును జీవిపొంది సుఖవంతుడగు చున్నాడు. ఈసుఖస్వరూపమైనపరమాత్మ హృదయాకాశమందులేనియెడల ఎవడు ప్రాణాపానాది వ్యాపారమునుచేయును? ఈపరమాత్మయే లోకమును సుఖపెట్టు చున్నాడు. సాధకుడగు ఈజీవుడు, కనపడనిదియును, శరీరములేనిదియును, చెప్పశక్యము కానిదియును, నిరాధారమునైనదియునునగు ఈపరబ్రహ్మమునందు, భయరహితమైన ఆత్మభావమును ఎప్పుడుపొందునో, అప్పుడే భయరహితమగు పరబ్రహ్మమును పొందినవాడగుచున్నాడు. ఈజీవుడు ఎప్పుడు పరబ్రహ్మమునందు బేధమును జేసికొను చున్నాడో, ఆజీవునకు భయమేకలుగుచున్నది.
యోగశిఖోపనిషత్:(జీవోత్పత్తి):
సర్వభావపదాతీతమైనది, జ్ఞానరూపమైనది, నిరంజనమైనది బ్రహ్మ. అక్కడ దాని యందు వాయువువలె అహంకారము బయలుదేరినది. ఆపిండము ధాతుబద్ధమై గుణాత్మకమైనది. పంచభూతాత్మకమైనది. సుఖదుఃఖములతో కూడినదై, జీవభావన కలిగియున్నది. దానితో విశుద్ధమైనపరమాత్మకు జీవుడని పేరుకలిగినది. కామము, క్రోధము, భయము, మోహము,లోభము, మదము, రజస్సు, జన్మ, మృత్యువు, కార్పణ్యము, శోకము, అలసత్వము, ఆకలి, దప్పిక, తృష్ణ, లజ్జ, దుఃఖము, విషాదము, హర్షము, ఈదోషములచే విడువబడిన ఆజీవుడే శివుడనబడును.
యోగవాశిష్టము:ఉత్పత్తిప్రకరణము:10వసర్గ:28, 29:
పూర్ణబ్రహ్మమునుండివెలువడు ఔపాధికభేదములన్నియూ అసలునకు నిరాకారములు. పూర్ణబ్రహ్మమునుండి వెలువడిన యీజగత్తుకూడ అధికారి శరీరప్రాప్తికలిగించి, స్వస్వరూప లాభప్రయోజనసిద్ధికొరకే ఉపయోగపడుచున్న దన్పించబడుచున్నది. పూర్ణమునుండి వెలువడునదికూడ పూర్ణమే. అందువలన విశ్వముత్పన్నయ్యి, అనుత్పన్నమేయగుచున్నది.
పైంగలోపనిషత్:
యాజ్ఞవల్క్యముని పైంగలునికి ఉపదేశించుచున్నాడు. ఈఅనంతసృష్టికి పూర్వము పరమాత్మ ఒక్కడేయుండెను. ఆసద్వస్తువు (ఆత్మ) నిత్యముక్తమైనది. వికారములు లేనిది. సత్యజ్ఞానానందమైనది. పరిపూర్ణమైనది. సనాతనముగానున్నది. ఏకముగా నున్నది. అద్వితీయమునైనది. అయ్యదియే పరబ్రహ్మము. ఆబ్రహ్మమునందు, మరుభూములందు జలమువలెను, ముత్యపుజిప్పయందు వెండివలెను, స్థాణువు నందు చెట్టు(మ్రోడు)నందు దొంగవానివలెను, స్ఫటికాదులయందు రేఖలుమున్నగు వానివలెను తోచుచూ, ఎరుపు, తెలుపు, నలుపురంగుల సమానత్రిగుణములు గలిగి, అనిర్వాచ్యమగు మూలప్రకృతి యుండెను. ఆప్రకృతియందు ప్రతిబింబించిన పరబ్రహ్మమే సాక్షిచైతన్యముగనుండెను. ఆయావరణశక్తియందు ప్రతిబింబించిన పరబ్రహ్మము ఈశ్వరచైతన్యమైనుండెను. అవ్యక్తమాయను స్వాధీనములో నుంచు కొనినవాడును,సర్వజ్ఞుడునునగునాఈశ్వరుడు,సృష్టిస్థితిలయలకు ఆదికర్త యగుచు జగదంకురరూపుడుగనున్నాడు. ఆఈశ్వరుడు తనయందే విలీనమైయున్న సకల జగత్తులో అంతటతానే ఆవిర్భవింపజేసియున్నాడు. ఈయీశ్వరుడే ప్రాణులకు సబంధించిన సంస్కారరూపకర్మలు క్షీణించి నపుడు, ఆప్రాణులను మరల తిరోభవింప జేయుచున్నాడు. ఆఈశ్వరునిలోనే అఖిలవిశ్వమును సంకుచితవస్త్రమువలె దాగి యున్నవి. ఈశ్వరుడే అధిష్టానముగానున్న ఆపరాశక్తినుండి రజోగుణముతో నుద్రిక్తమైన మహత్తుయనుపేరుగల విక్షేపశక్తి ఏర్పడెను. ఆమహత్తునందు ప్రతిఫలించిన బ్రహ్మము హిరణ్యగర్భచైతన్యముగ నుండెను. ఆహిరణ్యగర్భుడు మహత్తత్వము నందభిమానము గలవాడై, స్పష్టమైనదియూ, అస్పష్టమైనదియు నగు శరీరమును ధరించియున్నాడు.
హిరణ్యగర్భునిచే అధిష్టింపబడిన మహత్తు(విక్షేపశక్తి)నుండి, తమోగుణాద్రిక్తమగు అహంకారము(స్థూలశక్తి) పుట్టెను. అట్టిఅహంకారమునందు ప్రతిబింబించిన పరబ్రహ్మము 'విరాట్' అనుచైతన్యముగ నుండెను. ఆవిరాట్ దానియందభిమానము గలవాడై, సమస్తస్థూలదేహములను పరిపాలించువాడుగను, ప్రధానపురుషుడగు శ్రీమహావిష్ణువుగానున్నాడు. ఆయాత్మ (విష్ణువు) నుండి సూక్ష్మాకాశభూతము పుట్టెను. ఆయాకాశమునుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి పృథ్విపుట్టెను. సూక్ష్మభూతములుగానున్న ఈపంచతన్మాత్ర లు గుణసహితములుగానున్నవి. సృష్టి సంకల్పము కలిగియున్న ఆజగత్కర్త తమోగుణమునధిష్టించి, సూక్ష్మతన్మాత్రసహిత సూక్ష్మ(పంచ)భూతములను, స్థూల భూతములుగా చేయవలెనని సంకల్పించెను. సృష్టికి పరిమితములైన సూక్ష్మపంచ భూతములలో ఒక్కొక్కభూతమును రెండు భాగములు చేసెను. ప్రతిభూతము లోనున్న ప్రధమభాగమును విభజనచేయక, రెండవభాగమును 4 భాగములుగా విభజించెను. ఆరీతిగా నాలుగుగావిభజించిన భూతభాగములలో నొక్కొక్కభాగమును ఆభూతముయొక్క మొదటిఅర్థభాగములో చేర్చక, వేరుగానున్న 4 భూతముల యొక్క(విభాగముకాని)మొదటిభాగముతోకలిపి ప్రతిభూతమును ఐదేసి భాగములుగా పంచీకరించెను.
పంచీకరణపద్ధతి:
పృధివిని 2 భాగములుగాజేసి, అందుమొదటిభాగమును విభజింపక, రెండవ భాగమును 4 భాగములగునట్లు విభజింప వలయును. ఈరీతిగా మిగిలిన నాలుగు భూతములనుగూడ విభాగింపవలయును. విభాగింపని భూమియొక్క అర్థభాగము నందు, భూమియొక్క ద్వితీయాంశభాగములను జేర్చక, జలతేజోవాయ్వాకాశముల (1/8) భాగములను జేర్చవలెను. ఇట్లు పంచీకృతమగు భూమిస్థూలభూతమగును. ఇట్లే మిగిలిన భూతములను గూడ పంచీకరింపపవలెను.
భూమివిభాగము 1/2
జలవిభాగము 1/8
తేజోవిభాగము 1/8
వాయువిభాగము 1/8
ఆకాశవిభాగము 1/8
భూమిభూతము మొత్తము 1
ఇది పృథ్వీభూతపంచీకరణము. ఇదేరీతిగా జల, తేజో, వాయ్వాకాశ పంచీకరణము లను తెలియవలెను.
ఈవిధముగా పంచీకరింపబడిన భూతములతో, అనంతకోటి బ్రహ్మాండములను, అయాబ్రహ్మాండములకు దగిన గోళక స్థూలశరీరములను సృష్టిచేసెను. ఆఈశ్వరుడు పంచమహాభూతములయొక్క రజోగుణభాగములను 4 భాగములుగజేసి,ఆభాగము లలో 3 భాగములనుండి ప్రాణశక్తిని సృష్టినిచేసెను. ఆపిమ్మట ఆఈశ్వరుడు అపంచ భూతములయొక్క సత్త్వాంశములను 4 భాగములుగజేసి, 3 భాగములవలన పంచ వృత్త్యాత్మకమగు అంతఃకరణమును సృష్టిచేసెను. అపిమ్మట ఈశ్వరుడు ఆపంచ భూతములయొక్క నాలుగవసత్త్వభాగములో జ్ఞానేంద్రియములను సృష్టిచేసెను. సత్వసమిష్టివలన ఇంద్రియపాలకులైన దేవతలను సృష్టిచేసెను. ఆరీతిగా సృష్టింపబడిన యింద్రియాదులను అండములోపల వ్యాపింపజేసెను. ఆఈశ్వరుని ఆజ్ఞతో సృష్టింపబడినవన్ని అండమునందంతటనూ పూర్తిగా వ్యాపించియున్నవి. ఆఈశ్వరుని ఆజ్ఞతో అహంకారసహిత విరాట్టు సమస్థ స్థూలములను సృష్టిచేసెను. ఆఈశ్వరుని ఆజ్ఞతో హిరణ్యగర్భుడు సూక్ష్మభూతములను పరిపాలించెను.
అండస్థితములైన దేహేంద్రియాదులు చైతన్యమూర్తియగు నీశ్వరుడులేకుండ స్పందనకలిగియుండుటకు, పనిచేయుటకు సమర్థతలేనిదిగాయుండెను. ఈశ్వరుడు ఆదేహదులను చేతనవంతములుగా చేయుటకు సంకల్పించెను. బ్రహ్మాండములను, బ్రహ్మరంధ్రములను, సమస్తవ్యష్టిశరీరములయొక్క మస్తకములను బ్రద్దలుచేసి, వాటన్నిటియందు చైతన్యరూపములో ప్రవేశించెను. (ఇదే సహస్రారచక్రము. శరీరము లోనికి పరమాత్మవచ్చినద్వారము. కావున పరమాత్మను చేరుకొనవలెనంటే, ఆ మార్గము,అనగాబ్రహ్మరంధ్రముద్వారానే ప్రయాణించవలెను.) ఆశరీరములు మొదట జడములుగా నున్ననూ, ఈశ్వరచైతన్యము ప్రవేశింపగనే చైతన్యవంతములైనవి. ఆ పిమ్మట తమకార్యములను చేయుటకు పూనుకున్నవి. సర్వజ్ఞుడైన ఈశ్వరుడు మాయాలేశ సమన్వితుడై, మోహపెట్టబడి, జీవత్వముపొందెను. దేహత్రయ తాదాత్మ్యమువలన కర్తృత్వమును, భోక్తృత్వమును కలవాడయ్యెను. జీవుడుగా నున్న ఈశ్వరుడు స్థూల, సూక్ష్మ, కారణ దేహములను (దేహమేతానను భ్రాంతిలో) తానుగా భావించుటవలన, మేలుకొనుట, స్వప్నములను గాంచుట, నిద్రపోవుట, మూర్చిల్లుట, మరణముపొందుట అను ధర్మములను కలిగినవాడై, కులాలచక్రము (కుమ్మరిసారె) రీతిగా పరిభ్రమించుచున్నాడు.
ఈశ్వరుడు పంచీకృతమహాభూతములను స్వీకరించి, వ్యష్టిరూపములోను, సమష్టి రూపములోను, స్థూలదేహములను యథాప్రకారముగా సృష్టిచేసెను. వానిలో కపాలము, చర్మము, నరములు, ఎముకలు, మాంసము, నఖములు, మున్నగు నవి పృథివియొక్క అంశములుగానున్నవి. రక్తము, మలము, మూత్రము, లాలా జలము, స్వేదము మున్నగునవి జలములయొక్క అంశములుగానున్నవి. నడచుట, దాటుట, శ్వాసవిడచుట, పీల్చుట మున్నగునవి వాయువుయొక్క అంశములుగా నున్నవి. కామక్రోధాదులు ఆకాశాంశములు. కర్మసంచితమును, చర్మాదులతో కూడియున్నదియు, బాల్యాదిఅవస్థలను అభిమానించు నిలయము ను బహుదోషాశ్రయమునునగు మొత్తము స్థూలదేహముగా నున్నది.
(సూక్ష్మశరీరముగురించి) తదుపరి అపంచేకృతములగు పంచమహాభూతముల యొక్క రజోగుణాంశముల మూడింటియొక్క సమిష్టిభాగముతో ప్రాణమును సృష్టి చేసెను. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, ఈఅయిదు ప్రాణముయొక్క వృత్తులు. నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము ఈఅయిదు ఉపప్రాణములు. హృదయము, గుదము, నాభి, కంఠము, సర్వాంగము అనునవి ప్రాణముయొక్క స్థానములు. ఆకాశాది పంచభూతముల యొక్క రజోగుణ చతుర్థభాగముతో కర్మేంద్రియములను సృష్టిచేసెను. వాక్కు, పాణి, పాదము, గుదము, ఉపస్థ యనునవి కర్మేంద్రియముయొక్క విషయములు. ఈపంచభూతములయొక్క సత్వగుణాంశముల మూడింట మొత్తముతో అంతః కరణముసృష్టిచేసెను. మనోబుద్ధిచిత్తహంకారములు అంతఃకరణవృత్తులు. ఆలోచించుట, నిశ్చయముచేయుట, స్మరించుట, అభిమానించుట, అనుసంధానించుట అనునవి అంతఃకరణవిషయములు. గళము, వనము, నాభి, హృదయము, భ్రూమధ్యము అనునవి అంతఃకరణస్థానములు. పంచభూతములయొక్క సత్వ గుణాంశ సంబంధమగు నాల్గవభాగములో జ్ఞానేంద్రియములను సృష్టిచేసెను. శ్రోత్రము, త్వక్కు, చక్షుస్సు, జిహ్వ, ఘ్రాణము అనునవి ఆయా వృత్తులవలన నామభేదములతోనేర్పడిన జ్ఞానేంద్రియముల శబ్దసర్శరూపరసగంధములు ఈజ్ఞానేం ద్రియములకు విషయములు. దిక్కులు, వాయువు, భానుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు జ్ఞానేంద్రియములకు అధిష్ఠానదేవతలు. అగ్ని, దేవేంద్రుడు, ఉపేంద్రుడు, మృత్యువు, ప్రజాపతి, కర్మేంద్రియములకు దేవతలు. చంద్రుడు, విష్ణువు, చతుర్ముఖబ్రహ్మ, శంభుడు అంతఃకరణమునకు క్రమముగా అధిదేవతలు.
(పంచకోశాత్మక దేహత్రయము) ఆపిమ్మట అన్నమయ, ఫ్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములను పంచకోశములు కలవు. అన్నరసముచే జన్మించి, అన్నరసముచే అభివృద్ధినిపొంది, అన్నరసమగు పృథ్విలోనే విలీనమగునది అన్నమయకోశము. ఇదియే స్థూలదేహము. కర్మేంద్రియసహిత మనస్సు మనోమయకోశము. జ్ఞానేంద్రియ సహితబుద్ధి విజ్ఞాన మయకోశము. ఈ 3 కోశముల సమూహమును (సూక్ష్మ) లింగదేహమని చెప్పెదరు. స్వస్వరూపముయొక్క అజ్ఞానము ఆనందమయకోశము. ఈఆనందమయకోశమే కారణదేహమని చెప్పెదరు.
1. జ్ఞానేంద్రియపంచకము, 2. కర్మేంద్రియపంచకము, 3. ప్రాణాదిపంచకము, 4. ఆకాశాదిపంచకము, 5. అంతఃకరణ చతుష్టయము, 6. కామము, 7. కర్మలు, 8. తమస్సు(అవిద్య) ఈ యెనిమిది కలదేహము అష్టపురమని చెప్పబడును. (దీనినే పుర్యష్టకమని కూడ అంటారు). ఈశ్వరాజ్ఞచేత విరాట్పురుషుడు ఒక్కొక్క (వ్యష్టి) శరీరమునందు ప్రవేశించి, బుద్ధి నధిష్టించి, విశ్వుడుగానాయెను. విజ్ఞానాత్ముడని, చిదాభాసుడనియు, విరాట్టునకు నామములు కలవు. ఈశ్వరాజ్ఞతో ఒక్కొక్క (వ్యష్టి) సూక్ష్మదేహమందు ప్రవేశించిన సూత్రాత్మ, మనస్సు నధిష్టించి, తైజసుడుగా నయ్యెను. తైజసునకు, తైజసుడు, ప్రాతిభాసితుడు, స్వప్నకలితుడు అనిగూడ నామములుకలవు. ఈశ్వరాజ్ఞతో మాయోపాధికుడగు నా ఈశ్వరుడే అవ్యక్తసహితుడై ఒక్కొక్క (వ్యష్టి) కారణదేహమందు ప్రవేశించి, ప్రాజ్ఞత్వమును పొందెను. (ప్రాజ్ఞుడయ్యెను). అతనికి అవిచ్ఛిన్నుడు, పారమార్థికుడు, సుషుప్త్యభిమాని అనునవి పర్యాయనామములు.
లయము:
పంచీకృతమైన మహాభూతములను ఈశ్వరుడు అపంచీకరణము (లయము) చేయుటకు భావించెను. కార్యరూపములోనున్న బ్రహ్మాండములలో నంతర్గతములు గా నున్న లోకములను, కారణత్వమును పొందించి, ఆపిమ్మట సూక్ష్మాంగములైన కర్మేంద్రియములను, ప్రాణములను, జ్ఞానేంద్రియములను, అంతఃకరణ చతుష్టయ మును, ఏకముగాజేసి, పృథ్విని జలమందును, జలములగ్నియందును, అగ్నిని వాయువునందును, వాయువునాకాశమునందును, ఆకాశమును అహంకారమందు ను, అహంకారమును మహత్తత్వమునందును, మహత్తత్వమును అవ్యక్తమునందు ను, అవ్యక్తమును పురుషుని(పరమాత్మ) యందును క్రమముగా విలీనముచేయు చున్నాడు. విరాట్టు, హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు ఉపాధులు లయమైపోయునందున పరమాత్మలో విలీనమగుచున్నారు.
పంచీకృత స్థూలమహాభూతములవలన సంభవించిన కర్మచేత సంపాదింపబడిన స్థూలదేహము కర్మక్షయమువలననూ, సత్కర్మపరిపాకమువలననూ, అపంచీ కరణమును పొంది (సూక్ష్మశరీరమును ధరించి) సూక్ష్మతత్త్వములో ఐక్యముచెంది, ఆపిమ్మట కారణరూపత్వమును పొందును. (కారణములో విలీనమగును). ఆపిమ్మట ఆకారణతత్త్వము కూటస్థమగు ప్రత్యగాత్మయందు విలీనమగును. విశ్వ తైజసప్రాజ్ఞులుకూడ తమ ఉపాధులు లయమగుటచే, ఆపరమాత్మయందు లయ మగుచున్నారు. జ్ఞానాగ్నితో బ్రహ్మాండము దహింపబడునప్పుడు ఆబ్రహ్మాండము సూక్ష్మకారణతత్త్వ సహితముగా పరమాత్మయందు విలీనమగుచున్నది. అందు వలన బ్రాహ్మణుడు(బ్రహ్మజ్ఞాని) సమాహితుడయి, సర్వదా ''తత్,త్వం'' పదార్థముల విజ్ఞానమును అనుసంధానము చేయుచుండవలెను. అప్పుడు మేఘములు తొలగి నప్పుడున్న సూర్యునివలె అజ్ఞానముతొలగిపోగా, ఆత్మ ఆవిర్భవించును. (పరమాత్మ తత్త్వము బోధపడును.)
ముండకోపనిషత్:ద్వితీయముండకం:ప్రధమఖండం:
4-6: ఆవిరాట్పురుషునకు ఆకాశమే శిరస్సు. సూర్యచంద్రులు నేత్రములు. దిక్కులు శ్రోత్రములు. వాగ్వివరములు వేదములు. వాయువే ప్రాణము. ఈవిశ్వమే మనస్సు. ఆపురుషుని పాదములనుండి భూమిపుట్టెను. అతడే సర్వాంతరాత్మగా వెలుగుచున్నాడు. ఆపరబ్రహ్మమునుండి ఆకాశము(ప్రథమాగ్ని), ఆయగ్నినుండి దానికి సమిధయైన సూర్యుడు పుట్టెను. చంద్రునినుండి పర్జన్యుడు(ద్వితీయాగ్ని), ఆ పర్జన్యునినుండి ఓషధులు(తృతీయాగ్ని)ఉద్భవించెను. ఓషధులనుండి మనుష్యులు (చతుర్థాగ్ని)జన్మించెను. ఆమానవుడు తన బీజమును(పంచమాగ్ని) స్త్రీయందుం చెను. ఈరీతిగా సమస్త ప్రజలున్ను ఆపరమపురుషునినుండి జన్మించియుండిరి. ఆపురుషునినుండి ఋక్కులు, సామములు, యజస్సులు, దీక్ష, సమస్తములైన యజ్ఞములు, క్రతువులు, దక్షిణలు, సంవత్సరములు, యజమాని జన్మించి యున్నారు. ఎచట చంద్రుడు పవిత్రముచేయుచున్నాడో, ఎచట సూర్యుడు పవిత్రము చేయుచున్నాడో, అట్టిలోకములును పుట్టుచున్నవి.
|
|