ఆత్మ సాక్షాత్కారము
యోగము గురించి తెలుసుకున్న తర్వాత వచ్చే స్థాయి ఆత్మదర్శనం. ఇది ఆయా వ్యక్తుల పరిస్థితిని బట్టి రకరకాలుగా వుంటుంది. సద్గురువులు పోడూరి కృష్ణవేణుమాతాజీగారు అనుభవ పూర్వకముగా చెప్పినదేమిటంటే, మనం కళ్ళు మూసుకొన్న తర్వాత కనిపించేది చీకటి. ఆచీకటిని చూస్తూనే, మనం ఏకాగ్రత కోసం ప్రయత్నించాలి. అందులోనే మనకు రకరకాల భావాలు, ఆలోచనలు, ఊహలు, కోరికలు మొదలైనవి కలుగుతూ వుంటాయి. కాని మనం ప్రయత్నపూర్వకముగా వాటిని ప్రక్కకు త్రోసివేసి మనస్సుని ఎటువంటి ఆలోచనలకూ లోనుగాకుండా ప్రయత్నంచెయ్యాలి. ఆప్రయత్నానికి ఉపయోగ పడేదే గురూపదేశమంత్రము. దాన్ని మననంచేసుకొంటూ మనస్సుని ఏకాగ్రతగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూవుండాలి. అలా కొంతకాలానికి మనస్సు ఎటువంటి ఆలొచనలూ లేకుండా నిలబడు తుంది. ఆసమయంలో ఆ చీకటిలొ ఒక్కసారి తళుక్కున మిణుగురుపురుగు వెలిగి ఆరిపోయినట్లు ఒక త్రసరేణువు లాంటి సూక్ష్మమైనకాంతి వెలిగిఆరిపోతుంది. ఇది సెకనులో లక్షోవంతులో జరుగుతుంది. ఇక్కడితో మనం ఆగిపోకూడదు. ఆధ్యాన్నాన్ని అలాగే పట్టుదలతో కొనసాగించాలి. అలా చేస్తూవుంటే, వెలిగిఆరిపోతున్న త్రసరేణువు చాలాసార్లు కనపడుతుంది. కొన్నాళ్ళకి అది ఆరిపోకుండా అలాగే నిల బడుతుంది. దాన్నే గమనిస్తూ, మనం ధ్యాన్నాన్ని కొనసాగిస్తూవుంటే, ఆ త్రసరేణువుయొక్క పరిమాణం పెరిగి పెద్దదై, పౌర్ణమి నాటి చంద్రుని అంతై, ఇంకాపెరిగి, మనదృష్టి ఎంతవరకూ వుంటుందో, అంతవరకూ పెరుగుతుంది. (180 degrees ఇంకా చూడగలిగితే 360 x 360 degrees) వారి వారి స్థాయీలను బట్టి దాని రంగులుకూడా మారుతూవుంటాయి. ఇక్కడ చెప్పుకోవలసిన గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇటువంటి అనుభవాల గురించి, ఏపురాణంలోను, ఉపనిషత్తులోను, ఇంకా ఏఆధ్యాత్మికగ్రంధంలొనూ ఉదహరించి యుండలేదు. ఇది కేవలం సద్గురువులదగ్గర, ఇటువంటి అనుభవం కలిగిన వారిశిష్యుల దగ్గర మాత్రమే వినటం, తెలుసుకోవడం జరిగింది. మేముదహరించిన పైవిషయములో ఏమైనాపొరపాట్లు వుంటే, శ్రీగురుమండలిని క్షమాపణ కోరుతున్నాము. కాని ఈస్థాయిగురించి, ఈ అనుభవంపొందిన వారిస్థితి గురించి కొంతసమాచారం లభ్యమైనది. వాటిని మీ ముందుంచుతున్నాము.
యోగవాసిష్ఠము:ఉత్పత్తి ప్రకరణము:111వ సర్గ:
4. ఆత్మ సాక్షాత్కారమను యత్నముచే చిత్తమను బాలుడు, మిథ్యయగు సాంసారికపదార్థ సముదాయము నుండి తొలగింపబడి, ఆత్మ స్వరూపమును సత్యవస్తువు యందు నియోజితుడై జ్ఞాన యుక్తుడు గావింపబడి రక్షింపబడుచున్నాడు.
7. ఉత్తమ ఫలదాయకమగు సమాధియను సత్కర్మ యందు మనస్సు నుపయోగించి, అట్టి సమాధి ద్వారా చిదాత్మ తోటి మనస్సు నైక్యపరచవలెను.
13. ఆత్మసాక్షాత్కార సాధ్యమగు మనోనాశముచే (మనోనాశమంటే, మనస్సును ఆలోచనలు లేకుండా చేయటం) కామాది శత్రురహితమై ఆద్యంతరహితమగు స్వరాజ్య సుఖము నీదేహముండగనే సంపాదింపుము.
16.ఆత్మసాక్షాత్కారముచే సంకల్పములను, అనర్థములను నిర్మూలన మొనర్చుటచే ప్రశాంత మగు జీవన్ముక్త స్థితి లభించును. మనుజదేహధారి, అధికారియగు జీవునకిద్దాని యందు క్లేశమేమి కలదు?
18-20.ప్రసిద్ధమగు ఉత్తమబ్రహ్మపదమును చిరకాలాభ్యాసముచే పొంది పిదప యంతిమ సాక్షాత్కార వృత్తిచే నావిర్భూతమగు చైతన్యముచే అవిద్యను సంపూర్ణముగ నశింపజేసి, చిత్తము నాత్మ యందు లయపరచి, చిత్తమునకుపరమైన పూర్ణాత్మస్వరూపమును బొందుము. ఇట్లొనర్చుటకై, ప్రధమ మున చిద్వస్తుభావనజేసి, పిదప యద్దానిని స్థిరపరచుటయందే మిక్కిలిసావధానముగా బుద్ధిని వినియో గింపుము. ఆపిమ్మట స్వస్థచిత్తుడవై, చిత్తమును గూడ గ్రసించునదియు, చిత్తమునకు పరమైనదియు నగు పరమాత్మయందు నిలకడ గల్గియుండుము. ఆత్మసాక్షాత్కార రూపమగు ఉత్తమ పురుష ప్రయత్నము నాశ్రయించి, చిత్తము నచిత్తము చేసి, ప్రసిద్ధమును, శాశ్వతమునగు బ్రహ్మపదమును పొందుము.
30-32. ఏ యుపేక్ష లేనిదియు, శక్తివంతమును, సాఆఆఆఅర్వహితమును, మాయాదోష రహితమును, శృతిప్రతిపాదితమును నగు పరమాత్మయందు చిత్తమును లయమొనర్చుట చేత తప్ప మరియే యుపాయముచేనైననూ, ముక్తి లభింపనేరదనుట, స్వర్గ, పాతాళ, ద్వీప, ద్వీపాంతరము లందున్న తత్త్వవేత్తలందరి యొక్క ధృఢసమ్మతమైనది. (ఇక్కడ ద్వీప, ద్వీపాంతరములనే మాటలను బట్టి దేశ, విదేశములలోనున్న తత్త్వవేత్తలతో సంబంధము లుండెడివి అనే విషయం రూఢి అవుతోంది). చిత్తోపశమనముచే కేవలచిన్మాత్రవస్తువు శేషించుటయే ముక్తి. చిత్తోపశమనము తప్ప ముక్తిబొందుటకు మరొక ఉపాయము లేదు. సత్యమును, త్రికాలాబాధ్యమును, వ్యాపకమును, అజ్ఞానమాలిన్యరహితము నగు ఆ ఆత్మసాక్షాత్కారరూపమైన ప్రభోధము హృదయమున నుత్పన్నముకాగా, జీవునకు పరమ శాంతి లభించును. అతి విస్తీర్ణమగు హృదయకాశామున అంతిమ బ్రహ్మకారవృత్తిచే ప్రకాశమానయగు చిద్రూపచక్రముచే ఛేధించివేయుము. అపుడు మానసికవ్యధలేమియూ నిన్ను బాధింపజాలవు.ఆత్మవేత్త లకు సమ్మతమును, పరమపవిత్రమును, అమనస్కమును, అహంకారవర్జితమును, దుఃఖరహిత మును , శాంతమును, జన్మవికారశూన్యము నగు ఆత్మ పదమును నీవు పొందెదవు గాక.
ఉపశమ ప్రకరణము: 8వ సర్గ: సిద్ధగీత (ఆత్మతత్త్వము):
9-13. నేత్రేంద్రియముల ద్వారా స్రక్చందనాది విషయసంయోగముచే నుద్భవించువిషయకార బుద్ధివృత్తియందే యానందరూపము నిశ్చయింపబడుచున్నదో, అట్టి నిరతిశయ భూమానందస్వరూప మైన ఆత్మను నిర్వికల్పసమాదిచేతను, బాహ్యాభ్యంతరేంద్రియ నిగ్రహము చేతను మేము నిరంతరము నుపాసించుచున్నాము. ద్రష్ట, దర్శనము, దృశ్యరూపమగు త్రిపుతిని వాసనలతోగూడ పరిత్యజించి, నేత్రాది ఇంద్రియముల (లేక మానసిక) వృత్తులను, సాక్షిరూపమై భాసిల్లు ఆత్మరూపమును, అనగా బీజసహిత త్రిపుటీపరిత్యాగముచే, తురీయమగు ఆత్మను నిరంతరముపాసించుచున్నాము. నేత్రేంద్రి యాదుల జ్ఞానమునకు పూర్వమే భాసించునట్టి సాక్షిరూప సత్తా విషయమై, 'ఇది కలదు', 'ఇది లేదని' వాదించు వారియొక్క అస్తిత్వనాస్తిత్వములు రెండునూ సాక్షిలేకయే సిద్ధింపజాలవు. కావున అస్తిత్వ నాస్తిత్వపక్షములు రెండింటియందును, మధ్యగతమై, సాక్షిరూపమున వెలుగొందుచూ, ప్రకాశ్య వస్తువులగూడ ప్రకాశింపజేయునట్టి ఆత్మను లెస్సగా నుపాసించుచున్నాము. లేక, అస్తిత్వనాస్తిత్వ ములు రెండునూ, ఏకకాలములోయసంభవమగుటచే, రెంటియందునూ యనుగతమై సన్మాత్రరూప మున సమస్త ప్రకాశ్య పదార్ధములను ప్రకాశింప జేయునట్టి ఆత్మ వస్తువును నిత్యమూ మేముపాసించు చున్నాము. (ఇది చాలా గమ్మత్తైన statement. ఉన్నది, లేదు అనిఏది భావింపబడుతోందో, ఆభావాల రెండింటికీ మధ్య అది, దేన్నీఅంటుకొనకుండా, వాటికి విడిగా సాక్షిభూతముగా ఏదైతే వుంటోందో, దాన్ని మేము ఉపాసిస్తున్నాము అని సిద్ధులు చెపుతున్నారు. దేన్నయితే లేదు అని అంటున్నామో, ఎక్కడో, నామమాత్రముగా దాని ఉనికివున్నట్లేగా! అదీ విషయం.) అకారమాదియందు హకారమంతమునను కల అహం పదమునకు మాన్యమును, సర్వవస్తుప్రకాశకమును, వేదశాస్త్రాదులందనుగతమై యున్న అకారాది హకారాంతము వరకూ గల సర్వాక్షర సముదాయ రూపమగు శబ్దజాలమందు అంతర్గతుడై యుండుటచే సర్వాకారుడునునగు నిర్గుణబ్రహ్మమునందు స్థితికల్గి 'సోహం' మంత్రమును శ్వాసో చ్చ్వాసములచే నిరంతరము జపించుచున్న యాత్మతత్త్వమును లెస్సగా నుపాసించెదము. ('సోహం' అనగా 'అదే నేను' అని అర్థం. 'అహం బ్రహ్మస్మి' అనే మహావాక్యానికి ఇది మంత్రరూపం. ఇది ప్రతీవ్యక్తి లోను వారికి తెలియకుండా ఉఛ్వాసంలో 'సో' అని, నిశ్వాసంలో 'హం' అని నిత్యజపం జరుగుతూ వుంటుంది. దీన్నే'అజపాగాయత్రి' అనిఅంటారు. అలా తెలియకుండా జరిగే దీనివల్ల ఏమాత్రంఉపయోగం లేదు. ఏదైనా పుస్తకంలో చూసి, లేదా దీన్ని చదివి జపం చేసేద్దాము అనుకుంటే అస్సలు ఉపయోగం లేదు. జ్ఞానపరంగా, ఆధ్యాత్మికముగా, మానసికముగా, పరిపక్వత సాధించిన శిష్యునికి, గురువు, దీన్నినియమిత పధ్ధతి ప్రకారం ఉపదేశించి, ఈమహామంత్రాన్ని శ్వాసకు ఎలా అనుసంధానించాలో, దృష్టిని, దానితోపాటు మనస్సును ఎక్కడ కేంద్రీకరించాలో, మొదట ధ్యానాన్ని, ఆతర్వాత సహజంగా మారే ఆయోగాన్ని ఎలా చెయ్యాలో, తన స్వంతపర్యవేక్షణలో, శిష్యునిచేత చేయిస్తాడు. అప్పుడు మాత్రమే, ఈసాధన ఫలిస్తుంది. దీన్నే మేము చేస్తున్నాము అని సిద్ధులు చెపుతున్నారు.)
18. బాహ్యాభ్యంతరేంద్రియ వ్యాపారముల నిరోధించి, తద్వారా విషయజనిత దుఃఖమును రహిత మొనర్చి, ఆత్మసుఖసంపాదన యెనర్పవలెను. అట్టి ఉపశమము(ఇంద్రియవ్యాపార నిరోధము) చే యింధనములేని అగ్నివలె చిత్తము పూర్ణముగా శమించును. చిత్తము శమించినవానికి పరమార్థ భూతమై సుఖరూపమైన ఆత్మయందు చిరకాలముత్తమస్థితి లభించును.
13వ సర్గ :85: వైరాగ్యము చేతను, ప్రాణాయామము చేతను, సమాధి చేతను, వ్యసనక్షయము చేతను, పరమార్థ బ్రహ్మజ్ఞానము చేతను, ప్రాణవాయువు నిరోధింపబడును.
14వ సర్గ: 53: జాగ్రత్స్వప్నసుషుప్తరహితమై, వాటన్నింటికినీ సాక్షీభూతమై వెలయునట్టి ఆత్మను భావించుచూ, స్వయముగ ఆత్మయందు స్థితుడవుగమ్ము.
16వ సర్గ:16,17: సమాధియందారూఢుడును, సమాధివ్యత్థానకాలమున వ్యవహరించు వాడును నగు వారిరువురూ(జీవన్ముక్త, విదేహముక్తులు) సుఖవిశ్రాంతిబడయువారై, అవిద్యావలయరహితులై, కేవలము బ్రహ్మపదమున స్థితులయ్యేవుందురు. కాని యందొకరు (జీవన్ముక్తుడు) దేహ సహితుడు గను, మరియొకడు (విదేహముక్తుడు) దేహరహితుడుగను యుండును. దేహముతోగూడి దుఃఖ రహితుడగును. దేహమును త్యజించి జ్ఞేయవాసనాత్యాగియై యొప్పును.
34వ సర్గ:16, 17: మహాత్త్వరహితమై, మనోవర్జితమై, శాంతమై, పంచేంద్రియభ్రమరహితమై, సంకల్ప వర్జితమైనట్టి శుద్ధచైతన్యరూపమగు ఆత్మమాత్రుడనేనేను. (ఇవన్నీ శుద్ధమైన ఆత్మయొక్క గుణములు. ఇటువంటి ఆత్మమాత్రమే 'నేను' అని పిలువబడుతోంది. భగవాన్ శ్రీరమణులవారు లేవనెత్తిన 'నేనెవడను?' అనే ప్రశ్నకు సరియైన సమాధానమిదియే!) విషయవర్జితమును, సర్వప్రకాశకమును, బాహ్యాభ్యంతరములందు వ్యాప్తమును, నిష్కళంకమును, నిర్మలమును, సద్రూపమును నగు చిన్మయమును నేనే.
50వ సర్గ: 36: కర్తృ, కర్మ, కరణసహితుడవై, విజ్ఞానమయమగు బుద్ధి, బాహ్యవిషయములు, ఇంద్రియములు, వీనితొగూడి నిన్ను స్పృశింపనేరని సంసారము, స్వాంతర్గతమున, ప్రతిబింబము మాడ్కి స్పృశించును. అనగా సాక్షిరూపమున సర్వవ్యవహారములు గాంచును. నిర్వికల్పమును, నిరాలంబమును, కేవల నిజరూపమునునగు చిన్మాత్రమందు నిష్ఠ గల్గియుండుము.
43. నిర్మలమును, నిరవయమునునగు నిజచైతన్యమున స్థితికలుగగనే, సంసారభ్రమ కారణమగు మహామోహము క్షయించును.
54వ సర్గ: 70: నిర్వికల్పసమాధి యందలి బ్రహ్మనాదసుఖమే పరమపదము. అదియే శాంత గతి. అదియే నిత్యశ్రేయము. అచ్చోట నిద్రించిన వానికి భ్రమ ఎన్నటికి బాధించదు.
62వ సర్గ: 6: నిత్యప్రబుద్ధ (జ్ఞాన సహిత) చిత్తులు ప్రపంచ క్రియల నొనర్చుచున్ననూ, సదా ఎకతత్వ (ఆత్మ)నిష్ఠులై ఉత్తమ సమాధియుతులై యుందురు. (జీవన్ముక్తుల జీవన విధానము ఇలా వుంటుంది. ఈ ప్రపంచంలో వుంటూనే, తమ మనస్సును నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు ఆపరమాత్మ మీద లగ్నంచేసి, ఇంకా జీవితంవుంది కాబట్టి, కాలం గడుపుతూ వుంటారు. అవుసరమయినంత మేరకు ఈప్రాపంచికసంభంధమైన పనులు చేస్తూవుంటారు.'బాబా' సినిమాలో రజనీకాంత్ పాడినట్లు తామరాకు మీద నీటిబొట్టులా వుండటమంటే ఇదే. శ్రీశుకులవారు, జనకమహారాజు, సంత్ జ్ఞానేశ్వర్, భక్త తుకారాం, భక్త నామదేవులు మొదలగు వారు దీనికి ఉదాహరణలు.)
8, 9: ఎకాగ్రమును, నిత్యతృప్తమును, సత్యవస్తువు నవలోకించునదియు, అబాధితమునగు ఆత్మతత్త్వమును దర్శించునదియునగు పరాప్రజ్ఞయే సమాధియని పెర్కొనబడును.(ఆత్మను సంపూ ర్ణముగా దర్శింపజేసేదే సమాధి. ఆస్థితిలో మొదట్లో చెప్పుకోన్నట్లు మనదృష్టి ఎంతవరకూ విస్తరించు తుందో అంతవరకూ, రాకాపున్నమి నాడు వచ్చే వెన్నెలరంగులో విస్తరించి ఆత్మదర్శనం కలుగుతుంది. సరిగ్గా ఈస్థితినే, "వేదాంత వీధులలొ విహరించు గిరిధారి" అనే పాటలో, ఒక చరణంలో "పండు వెన్నెల రేయి, నిండు పున్నమి హాయి" అని పాడతారు. ఆ పండువెన్నెల, నిండుపున్నమి, సమాధిస్థితిలో కలిగే ఆత్మదర్శనానుభూతితప్ప భౌతికమైనవికావు.) సమస్తఆశలను తృణమునకు అగ్నివంటిదగు ఆత్మతత్త్వబోధయే సమాధి యనబడును గాని, తూష్ణీం స్థితి గాదు. [సమాధి అంటే, ఆత్మచైతన్యము తొణికిసలాడే స్థితి తప్ప, మరచిపోయే మత్తు లాంటిది (neglected, drowsy state) కాదు.]
12. ఎప్పటినుండి మనస్సు సదా(పారమార్ధిక) జ్ఞానయుక్తమైయుండునో, అప్పటినుండియే, అమ్మహాత్మునకు నిరంతర సమాధి సిద్ధించినదగును.
అష్టావక్ర గీత: 17వ ప్రకరణము: తత్త్వజ్ఞ రూపవింశతికము: (ఆత్మజ్ఞాని లక్షణము):
1, 2 : ఎవడు ఎల్లప్పుడూ తృప్తుడై ఉంటున్నాడో, ఇంద్రియశుద్ధి కలవాడై, ఎట్టి సంగమము లేని వాడై ఆనందించుచున్నాడో, వానిచేత జ్ఞానఫలం, ఆప్రకారమే యోగాభ్యాసఫలం పొందబడుచున్నవి. తత్త్వజ్ఞాని ఈప్రపంచమందు ఎప్పుడూ కూడ ఖేదమును పొందడు. ఇది నిశ్చయము. ఎందువలననగా, ఒక్కడగు అతనిచేత ఈబ్రహ్మండమంతయూ నిండియున్నది. (ఆసమయములో అతను నేను పరబ్రహ్మ స్వరూపమును అనే నిశ్చయజ్ఞానము పొందివుంటాడు. అందువల్ల ప్రాపంచిక విషయములేమియూ అతనిపై ప్రభావము చూపలేవు.)
10. ఎంత ఆశ్చర్యము? మేల్కొనుట లేదు. నిద్రించుటలేదు. కంటిరెప్పలను తెరచుటలేదు. మూయుట లేదు. ముక్తచేతసుడగు జ్ఞానికి ఒకానొక ఉత్కృష్ఠ దశ వుంటున్నది. (ఇదే, ప్రపంచములో వుంటూనే ఆపరబ్రహ్మముతో అనుసంధానింపబడి జీవించడం. ఇదే జీవన్ముక్త దశ.)
17. ఎవడు విషయములను ద్వేషింపడో, వాటియందు లోలత్వమును కూడ చూడడో, ఎవని మనస్సు నిరంతరము అనాసక్తమై దేనినీ ఆశింపదో, ప్రారబ్దవశమున ప్రాప్తమగు దానిననుభవించుచూ, అప్రాప్తమగు దానిని కోరడో, అతడే జీవన్ముక్తుడగుచున్నాడు.
20. నశించిన మనస్సు గల జ్ఞాని మనఃప్రకాశమునుండియూ, చిత్తభ్రాంతినందియూ, జడత్వ రూప నిద్రనుండి విడివడినవాడై, అనిర్వాచ్యమైన ఒకానొక దశను పొందినవాడుగా నగును.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము)
యోగము గురించి తెలుసుకున్న తర్వాత వచ్చే స్థాయి ఆత్మదర్శనం. ఇది ఆయా వ్యక్తుల పరిస్థితిని బట్టి రకరకాలుగా వుంటుంది. సద్గురువులు పోడూరి కృష్ణవేణుమాతాజీగారు అనుభవ పూర్వకముగా చెప్పినదేమిటంటే, మనం కళ్ళు మూసుకొన్న తర్వాత కనిపించేది చీకటి. ఆచీకటిని చూస్తూనే, మనం ఏకాగ్రత కోసం ప్రయత్నించాలి. అందులోనే మనకు రకరకాల భావాలు, ఆలోచనలు, ఊహలు, కోరికలు మొదలైనవి కలుగుతూ వుంటాయి. కాని మనం ప్రయత్నపూర్వకముగా వాటిని ప్రక్కకు త్రోసివేసి మనస్సుని ఎటువంటి ఆలోచనలకూ లోనుగాకుండా ప్రయత్నంచెయ్యాలి. ఆప్రయత్నానికి ఉపయోగ పడేదే గురూపదేశమంత్రము. దాన్ని మననంచేసుకొంటూ మనస్సుని ఏకాగ్రతగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూవుండాలి. అలా కొంతకాలానికి మనస్సు ఎటువంటి ఆలొచనలూ లేకుండా నిలబడు తుంది. ఆసమయంలో ఆ చీకటిలొ ఒక్కసారి తళుక్కున మిణుగురుపురుగు వెలిగి ఆరిపోయినట్లు ఒక త్రసరేణువు లాంటి సూక్ష్మమైనకాంతి వెలిగిఆరిపోతుంది. ఇది సెకనులో లక్షోవంతులో జరుగుతుంది. ఇక్కడితో మనం ఆగిపోకూడదు. ఆధ్యాన్నాన్ని అలాగే పట్టుదలతో కొనసాగించాలి. అలా చేస్తూవుంటే, వెలిగిఆరిపోతున్న త్రసరేణువు చాలాసార్లు కనపడుతుంది. కొన్నాళ్ళకి అది ఆరిపోకుండా అలాగే నిల బడుతుంది. దాన్నే గమనిస్తూ, మనం ధ్యాన్నాన్ని కొనసాగిస్తూవుంటే, ఆ త్రసరేణువుయొక్క పరిమాణం పెరిగి పెద్దదై, పౌర్ణమి నాటి చంద్రుని అంతై, ఇంకాపెరిగి, మనదృష్టి ఎంతవరకూ వుంటుందో, అంతవరకూ పెరుగుతుంది. (180 degrees ఇంకా చూడగలిగితే 360 x 360 degrees) వారి వారి స్థాయీలను బట్టి దాని రంగులుకూడా మారుతూవుంటాయి. ఇక్కడ చెప్పుకోవలసిన గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇటువంటి అనుభవాల గురించి, ఏపురాణంలోను, ఉపనిషత్తులోను, ఇంకా ఏఆధ్యాత్మికగ్రంధంలొనూ ఉదహరించి యుండలేదు. ఇది కేవలం సద్గురువులదగ్గర, ఇటువంటి అనుభవం కలిగిన వారిశిష్యుల దగ్గర మాత్రమే వినటం, తెలుసుకోవడం జరిగింది. మేముదహరించిన పైవిషయములో ఏమైనాపొరపాట్లు వుంటే, శ్రీగురుమండలిని క్షమాపణ కోరుతున్నాము. కాని ఈస్థాయిగురించి, ఈ అనుభవంపొందిన వారిస్థితి గురించి కొంతసమాచారం లభ్యమైనది. వాటిని మీ ముందుంచుతున్నాము.
యోగవాసిష్ఠము:ఉత్పత్తి ప్రకరణము:111వ సర్గ:
4. ఆత్మ సాక్షాత్కారమను యత్నముచే చిత్తమను బాలుడు, మిథ్యయగు సాంసారికపదార్థ సముదాయము నుండి తొలగింపబడి, ఆత్మ స్వరూపమును సత్యవస్తువు యందు నియోజితుడై జ్ఞాన యుక్తుడు గావింపబడి రక్షింపబడుచున్నాడు.
7. ఉత్తమ ఫలదాయకమగు సమాధియను సత్కర్మ యందు మనస్సు నుపయోగించి, అట్టి సమాధి ద్వారా చిదాత్మ తోటి మనస్సు నైక్యపరచవలెను.
13. ఆత్మసాక్షాత్కార సాధ్యమగు మనోనాశముచే (మనోనాశమంటే, మనస్సును ఆలోచనలు లేకుండా చేయటం) కామాది శత్రురహితమై ఆద్యంతరహితమగు స్వరాజ్య సుఖము నీదేహముండగనే సంపాదింపుము.
16.ఆత్మసాక్షాత్కారముచే సంకల్పములను, అనర్థములను నిర్మూలన మొనర్చుటచే ప్రశాంత మగు జీవన్ముక్త స్థితి లభించును. మనుజదేహధారి, అధికారియగు జీవునకిద్దాని యందు క్లేశమేమి కలదు?
18-20.ప్రసిద్ధమగు ఉత్తమబ్రహ్మపదమును చిరకాలాభ్యాసముచే పొంది పిదప యంతిమ సాక్షాత్కార వృత్తిచే నావిర్భూతమగు చైతన్యముచే అవిద్యను సంపూర్ణముగ నశింపజేసి, చిత్తము నాత్మ యందు లయపరచి, చిత్తమునకుపరమైన పూర్ణాత్మస్వరూపమును బొందుము. ఇట్లొనర్చుటకై, ప్రధమ మున చిద్వస్తుభావనజేసి, పిదప యద్దానిని స్థిరపరచుటయందే మిక్కిలిసావధానముగా బుద్ధిని వినియో గింపుము. ఆపిమ్మట స్వస్థచిత్తుడవై, చిత్తమును గూడ గ్రసించునదియు, చిత్తమునకు పరమైనదియు నగు పరమాత్మయందు నిలకడ గల్గియుండుము. ఆత్మసాక్షాత్కార రూపమగు ఉత్తమ పురుష ప్రయత్నము నాశ్రయించి, చిత్తము నచిత్తము చేసి, ప్రసిద్ధమును, శాశ్వతమునగు బ్రహ్మపదమును పొందుము.
30-32. ఏ యుపేక్ష లేనిదియు, శక్తివంతమును, సాఆఆఆఅర్వహితమును, మాయాదోష రహితమును, శృతిప్రతిపాదితమును నగు పరమాత్మయందు చిత్తమును లయమొనర్చుట చేత తప్ప మరియే యుపాయముచేనైననూ, ముక్తి లభింపనేరదనుట, స్వర్గ, పాతాళ, ద్వీప, ద్వీపాంతరము లందున్న తత్త్వవేత్తలందరి యొక్క ధృఢసమ్మతమైనది. (ఇక్కడ ద్వీప, ద్వీపాంతరములనే మాటలను బట్టి దేశ, విదేశములలోనున్న తత్త్వవేత్తలతో సంబంధము లుండెడివి అనే విషయం రూఢి అవుతోంది). చిత్తోపశమనముచే కేవలచిన్మాత్రవస్తువు శేషించుటయే ముక్తి. చిత్తోపశమనము తప్ప ముక్తిబొందుటకు మరొక ఉపాయము లేదు. సత్యమును, త్రికాలాబాధ్యమును, వ్యాపకమును, అజ్ఞానమాలిన్యరహితము నగు ఆ ఆత్మసాక్షాత్కారరూపమైన ప్రభోధము హృదయమున నుత్పన్నముకాగా, జీవునకు పరమ శాంతి లభించును. అతి విస్తీర్ణమగు హృదయకాశామున అంతిమ బ్రహ్మకారవృత్తిచే ప్రకాశమానయగు చిద్రూపచక్రముచే ఛేధించివేయుము. అపుడు మానసికవ్యధలేమియూ నిన్ను బాధింపజాలవు.ఆత్మవేత్త లకు సమ్మతమును, పరమపవిత్రమును, అమనస్కమును, అహంకారవర్జితమును, దుఃఖరహిత మును , శాంతమును, జన్మవికారశూన్యము నగు ఆత్మ పదమును నీవు పొందెదవు గాక.
ఉపశమ ప్రకరణము: 8వ సర్గ: సిద్ధగీత (ఆత్మతత్త్వము):
9-13. నేత్రేంద్రియముల ద్వారా స్రక్చందనాది విషయసంయోగముచే నుద్భవించువిషయకార బుద్ధివృత్తియందే యానందరూపము నిశ్చయింపబడుచున్నదో, అట్టి నిరతిశయ భూమానందస్వరూప మైన ఆత్మను నిర్వికల్పసమాదిచేతను, బాహ్యాభ్యంతరేంద్రియ నిగ్రహము చేతను మేము నిరంతరము నుపాసించుచున్నాము. ద్రష్ట, దర్శనము, దృశ్యరూపమగు త్రిపుతిని వాసనలతోగూడ పరిత్యజించి, నేత్రాది ఇంద్రియముల (లేక మానసిక) వృత్తులను, సాక్షిరూపమై భాసిల్లు ఆత్మరూపమును, అనగా బీజసహిత త్రిపుటీపరిత్యాగముచే, తురీయమగు ఆత్మను నిరంతరముపాసించుచున్నాము. నేత్రేంద్రి యాదుల జ్ఞానమునకు పూర్వమే భాసించునట్టి సాక్షిరూప సత్తా విషయమై, 'ఇది కలదు', 'ఇది లేదని' వాదించు వారియొక్క అస్తిత్వనాస్తిత్వములు రెండునూ సాక్షిలేకయే సిద్ధింపజాలవు. కావున అస్తిత్వ నాస్తిత్వపక్షములు రెండింటియందును, మధ్యగతమై, సాక్షిరూపమున వెలుగొందుచూ, ప్రకాశ్య వస్తువులగూడ ప్రకాశింపజేయునట్టి ఆత్మను లెస్సగా నుపాసించుచున్నాము. లేక, అస్తిత్వనాస్తిత్వ ములు రెండునూ, ఏకకాలములోయసంభవమగుటచే, రెంటియందునూ యనుగతమై సన్మాత్రరూప మున సమస్త ప్రకాశ్య పదార్ధములను ప్రకాశింప జేయునట్టి ఆత్మ వస్తువును నిత్యమూ మేముపాసించు చున్నాము. (ఇది చాలా గమ్మత్తైన statement. ఉన్నది, లేదు అనిఏది భావింపబడుతోందో, ఆభావాల రెండింటికీ మధ్య అది, దేన్నీఅంటుకొనకుండా, వాటికి విడిగా సాక్షిభూతముగా ఏదైతే వుంటోందో, దాన్ని మేము ఉపాసిస్తున్నాము అని సిద్ధులు చెపుతున్నారు. దేన్నయితే లేదు అని అంటున్నామో, ఎక్కడో, నామమాత్రముగా దాని ఉనికివున్నట్లేగా! అదీ విషయం.) అకారమాదియందు హకారమంతమునను కల అహం పదమునకు మాన్యమును, సర్వవస్తుప్రకాశకమును, వేదశాస్త్రాదులందనుగతమై యున్న అకారాది హకారాంతము వరకూ గల సర్వాక్షర సముదాయ రూపమగు శబ్దజాలమందు అంతర్గతుడై యుండుటచే సర్వాకారుడునునగు నిర్గుణబ్రహ్మమునందు స్థితికల్గి 'సోహం' మంత్రమును శ్వాసో చ్చ్వాసములచే నిరంతరము జపించుచున్న యాత్మతత్త్వమును లెస్సగా నుపాసించెదము. ('సోహం' అనగా 'అదే నేను' అని అర్థం. 'అహం బ్రహ్మస్మి' అనే మహావాక్యానికి ఇది మంత్రరూపం. ఇది ప్రతీవ్యక్తి లోను వారికి తెలియకుండా ఉఛ్వాసంలో 'సో' అని, నిశ్వాసంలో 'హం' అని నిత్యజపం జరుగుతూ వుంటుంది. దీన్నే'అజపాగాయత్రి' అనిఅంటారు. అలా తెలియకుండా జరిగే దీనివల్ల ఏమాత్రంఉపయోగం లేదు. ఏదైనా పుస్తకంలో చూసి, లేదా దీన్ని చదివి జపం చేసేద్దాము అనుకుంటే అస్సలు ఉపయోగం లేదు. జ్ఞానపరంగా, ఆధ్యాత్మికముగా, మానసికముగా, పరిపక్వత సాధించిన శిష్యునికి, గురువు, దీన్నినియమిత పధ్ధతి ప్రకారం ఉపదేశించి, ఈమహామంత్రాన్ని శ్వాసకు ఎలా అనుసంధానించాలో, దృష్టిని, దానితోపాటు మనస్సును ఎక్కడ కేంద్రీకరించాలో, మొదట ధ్యానాన్ని, ఆతర్వాత సహజంగా మారే ఆయోగాన్ని ఎలా చెయ్యాలో, తన స్వంతపర్యవేక్షణలో, శిష్యునిచేత చేయిస్తాడు. అప్పుడు మాత్రమే, ఈసాధన ఫలిస్తుంది. దీన్నే మేము చేస్తున్నాము అని సిద్ధులు చెపుతున్నారు.)
18. బాహ్యాభ్యంతరేంద్రియ వ్యాపారముల నిరోధించి, తద్వారా విషయజనిత దుఃఖమును రహిత మొనర్చి, ఆత్మసుఖసంపాదన యెనర్పవలెను. అట్టి ఉపశమము(ఇంద్రియవ్యాపార నిరోధము) చే యింధనములేని అగ్నివలె చిత్తము పూర్ణముగా శమించును. చిత్తము శమించినవానికి పరమార్థ భూతమై సుఖరూపమైన ఆత్మయందు చిరకాలముత్తమస్థితి లభించును.
13వ సర్గ :85: వైరాగ్యము చేతను, ప్రాణాయామము చేతను, సమాధి చేతను, వ్యసనక్షయము చేతను, పరమార్థ బ్రహ్మజ్ఞానము చేతను, ప్రాణవాయువు నిరోధింపబడును.
14వ సర్గ: 53: జాగ్రత్స్వప్నసుషుప్తరహితమై, వాటన్నింటికినీ సాక్షీభూతమై వెలయునట్టి ఆత్మను భావించుచూ, స్వయముగ ఆత్మయందు స్థితుడవుగమ్ము.
16వ సర్గ:16,17: సమాధియందారూఢుడును, సమాధివ్యత్థానకాలమున వ్యవహరించు వాడును నగు వారిరువురూ(జీవన్ముక్త, విదేహముక్తులు) సుఖవిశ్రాంతిబడయువారై, అవిద్యావలయరహితులై, కేవలము బ్రహ్మపదమున స్థితులయ్యేవుందురు. కాని యందొకరు (జీవన్ముక్తుడు) దేహ సహితుడు గను, మరియొకడు (విదేహముక్తుడు) దేహరహితుడుగను యుండును. దేహముతోగూడి దుఃఖ రహితుడగును. దేహమును త్యజించి జ్ఞేయవాసనాత్యాగియై యొప్పును.
34వ సర్గ:16, 17: మహాత్త్వరహితమై, మనోవర్జితమై, శాంతమై, పంచేంద్రియభ్రమరహితమై, సంకల్ప వర్జితమైనట్టి శుద్ధచైతన్యరూపమగు ఆత్మమాత్రుడనేనేను. (ఇవన్నీ శుద్ధమైన ఆత్మయొక్క గుణములు. ఇటువంటి ఆత్మమాత్రమే 'నేను' అని పిలువబడుతోంది. భగవాన్ శ్రీరమణులవారు లేవనెత్తిన 'నేనెవడను?' అనే ప్రశ్నకు సరియైన సమాధానమిదియే!) విషయవర్జితమును, సర్వప్రకాశకమును, బాహ్యాభ్యంతరములందు వ్యాప్తమును, నిష్కళంకమును, నిర్మలమును, సద్రూపమును నగు చిన్మయమును నేనే.
50వ సర్గ: 36: కర్తృ, కర్మ, కరణసహితుడవై, విజ్ఞానమయమగు బుద్ధి, బాహ్యవిషయములు, ఇంద్రియములు, వీనితొగూడి నిన్ను స్పృశింపనేరని సంసారము, స్వాంతర్గతమున, ప్రతిబింబము మాడ్కి స్పృశించును. అనగా సాక్షిరూపమున సర్వవ్యవహారములు గాంచును. నిర్వికల్పమును, నిరాలంబమును, కేవల నిజరూపమునునగు చిన్మాత్రమందు నిష్ఠ గల్గియుండుము.
43. నిర్మలమును, నిరవయమునునగు నిజచైతన్యమున స్థితికలుగగనే, సంసారభ్రమ కారణమగు మహామోహము క్షయించును.
54వ సర్గ: 70: నిర్వికల్పసమాధి యందలి బ్రహ్మనాదసుఖమే పరమపదము. అదియే శాంత గతి. అదియే నిత్యశ్రేయము. అచ్చోట నిద్రించిన వానికి భ్రమ ఎన్నటికి బాధించదు.
62వ సర్గ: 6: నిత్యప్రబుద్ధ (జ్ఞాన సహిత) చిత్తులు ప్రపంచ క్రియల నొనర్చుచున్ననూ, సదా ఎకతత్వ (ఆత్మ)నిష్ఠులై ఉత్తమ సమాధియుతులై యుందురు. (జీవన్ముక్తుల జీవన విధానము ఇలా వుంటుంది. ఈ ప్రపంచంలో వుంటూనే, తమ మనస్సును నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు ఆపరమాత్మ మీద లగ్నంచేసి, ఇంకా జీవితంవుంది కాబట్టి, కాలం గడుపుతూ వుంటారు. అవుసరమయినంత మేరకు ఈప్రాపంచికసంభంధమైన పనులు చేస్తూవుంటారు.'బాబా' సినిమాలో రజనీకాంత్ పాడినట్లు తామరాకు మీద నీటిబొట్టులా వుండటమంటే ఇదే. శ్రీశుకులవారు, జనకమహారాజు, సంత్ జ్ఞానేశ్వర్, భక్త తుకారాం, భక్త నామదేవులు మొదలగు వారు దీనికి ఉదాహరణలు.)
8, 9: ఎకాగ్రమును, నిత్యతృప్తమును, సత్యవస్తువు నవలోకించునదియు, అబాధితమునగు ఆత్మతత్త్వమును దర్శించునదియునగు పరాప్రజ్ఞయే సమాధియని పెర్కొనబడును.(ఆత్మను సంపూ ర్ణముగా దర్శింపజేసేదే సమాధి. ఆస్థితిలో మొదట్లో చెప్పుకోన్నట్లు మనదృష్టి ఎంతవరకూ విస్తరించు తుందో అంతవరకూ, రాకాపున్నమి నాడు వచ్చే వెన్నెలరంగులో విస్తరించి ఆత్మదర్శనం కలుగుతుంది. సరిగ్గా ఈస్థితినే, "వేదాంత వీధులలొ విహరించు గిరిధారి" అనే పాటలో, ఒక చరణంలో "పండు వెన్నెల రేయి, నిండు పున్నమి హాయి" అని పాడతారు. ఆ పండువెన్నెల, నిండుపున్నమి, సమాధిస్థితిలో కలిగే ఆత్మదర్శనానుభూతితప్ప భౌతికమైనవికావు.) సమస్తఆశలను తృణమునకు అగ్నివంటిదగు ఆత్మతత్త్వబోధయే సమాధి యనబడును గాని, తూష్ణీం స్థితి గాదు. [సమాధి అంటే, ఆత్మచైతన్యము తొణికిసలాడే స్థితి తప్ప, మరచిపోయే మత్తు లాంటిది (neglected, drowsy state) కాదు.]
12. ఎప్పటినుండి మనస్సు సదా(పారమార్ధిక) జ్ఞానయుక్తమైయుండునో, అప్పటినుండియే, అమ్మహాత్మునకు నిరంతర సమాధి సిద్ధించినదగును.
అష్టావక్ర గీత: 17వ ప్రకరణము: తత్త్వజ్ఞ రూపవింశతికము: (ఆత్మజ్ఞాని లక్షణము):
1, 2 : ఎవడు ఎల్లప్పుడూ తృప్తుడై ఉంటున్నాడో, ఇంద్రియశుద్ధి కలవాడై, ఎట్టి సంగమము లేని వాడై ఆనందించుచున్నాడో, వానిచేత జ్ఞానఫలం, ఆప్రకారమే యోగాభ్యాసఫలం పొందబడుచున్నవి. తత్త్వజ్ఞాని ఈప్రపంచమందు ఎప్పుడూ కూడ ఖేదమును పొందడు. ఇది నిశ్చయము. ఎందువలననగా, ఒక్కడగు అతనిచేత ఈబ్రహ్మండమంతయూ నిండియున్నది. (ఆసమయములో అతను నేను పరబ్రహ్మ స్వరూపమును అనే నిశ్చయజ్ఞానము పొందివుంటాడు. అందువల్ల ప్రాపంచిక విషయములేమియూ అతనిపై ప్రభావము చూపలేవు.)
10. ఎంత ఆశ్చర్యము? మేల్కొనుట లేదు. నిద్రించుటలేదు. కంటిరెప్పలను తెరచుటలేదు. మూయుట లేదు. ముక్తచేతసుడగు జ్ఞానికి ఒకానొక ఉత్కృష్ఠ దశ వుంటున్నది. (ఇదే, ప్రపంచములో వుంటూనే ఆపరబ్రహ్మముతో అనుసంధానింపబడి జీవించడం. ఇదే జీవన్ముక్త దశ.)
17. ఎవడు విషయములను ద్వేషింపడో, వాటియందు లోలత్వమును కూడ చూడడో, ఎవని మనస్సు నిరంతరము అనాసక్తమై దేనినీ ఆశింపదో, ప్రారబ్దవశమున ప్రాప్తమగు దానిననుభవించుచూ, అప్రాప్తమగు దానిని కోరడో, అతడే జీవన్ముక్తుడగుచున్నాడు.
20. నశించిన మనస్సు గల జ్ఞాని మనఃప్రకాశమునుండియూ, చిత్తభ్రాంతినందియూ, జడత్వ రూప నిద్రనుండి విడివడినవాడై, అనిర్వాచ్యమైన ఒకానొక దశను పొందినవాడుగా నగును.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము)